Posts

తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్

Image
  తెలంగాణ , ఏపీల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్. మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది.

ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌

Image
ఇందిర‌మ్మ ఇళ్ళ నిర్మాణంలో 2004-14 వ‌ర‌కు జ‌రిగిన అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించండి - ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వర్నెన్స్‌ లేఖ యధాతధంగా గౌ// ముఖ్య‌మంత్రి గారు తెలంగాణ రాష్ట్రం హైద‌రాబాదు అయ్యా ! పేద‌ల‌కు ఇళ్ళు క‌ట్టించి ఇవ్వ‌డానికి 2004 సంవ‌త్స‌ర‌ములో పెద్ద ఎత్తున ఇందిర‌మ్మ ఇళ్ళు కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం జ‌రిగింది. అందులో భాగంగా 2004 నుంచి 2014 వ‌ర‌కు 33.4 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను మంజూరు చేసినారు. అయితే ఈ కార్య‌క్ర‌మం మంచి ఉద్ద్యేశ్యంతో చేప‌ట్టిన అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు చివ‌ర‌కు ల‌బ్ధిదారులు కుమ్మ‌క్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. మొత్త‌ము 33.4 ల‌క్ష‌ల ఇళ్ళు మంజూరు అవ్వ‌గా దానిలో 20.49 ల‌క్ష‌లు పూర్తి అయిన‌ట్లు చూపించినారు, కాని అందులో కూడ‌ కొన్ని ప‌నులు మొద‌లుపెట్ట‌లేదు. ఇంకా కొన్ని స‌గ‌ము వ‌ర‌కు ప‌ని జ‌రిగి ఆగిపోయినాయి. ఇంకా కొన్ని ఇళ్ళు నిర్మాణ‌ము జ‌ర‌గ‌కున్నానిర్మాణ‌ము జ‌రిగిన‌ట్లు, కొన్ని సంద‌ర్భాల‌లో ఎప్పుడో క‌ట్టిన ఇల్లు కూడ కొత్త‌గా క‌ట్టిన‌ట్లు చూపించి డబ్బులు చెల్లించినారు. దీనికి స్థానిక రాజ‌కీయ‌నాయ‌కులు స‌హాయ స‌హ‌కారాలు ఇవ్వ‌డం జ‌రిగింది. ఈవి...

తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల

Image
 తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిచే PCB ఉద్యోగుల సంఘం డైరీ విడుదల   హైద్రాబాద్:  ఈ రోజు 28.01.2025 (మంగళవారం) తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీమతి A. శాంతి కుమారి, తన కార్యాలయంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు (TGPCB) ఉద్యోగుల సంఘం డైరీ 2025 ను అధికారికంగా విడుదల చేశారు.  TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 ఉద్యోగులకు ముఖ్యమైన వనరు గా పనిచేస్తుంది, ఇందులో ముఖ్యమైన తేదీలు, అంతర్గత సంఘటనలు, విధాన నవీకరణలు మరియు రాష్ట్ర పర్యావరణ రక్షణ మరియు కాలుష్య నియంత్రణ చర్యలలో వారి పాత్రలకు సంబంధించి కీలక సమాచారం ఉన్నాయి. TGPCB ఉద్యోగుల సంఘం డైరీ 2025 సంస్థ యొక్క విజయాలను, ముఖ్యమైన మైలురాళ్లను మరియు తెలంగాణలో కాలుష్య సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉద్యోగులను మార్గనిర్దేశం చేసే కొనసాగుతున్న కార్యక్రమాలను హైలైట్ చేస్తుంది. సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్ TGPCB సంఘం డైరీని విడుదల చేసినందుకు ముఖ్య కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సంఘం అధ్యక్షుడు శ్రీవత్సవ్, ప్రధాన కార్యదర్శి డి.కృపానంద్, సంయుక్త కార్యదర్శి కుమారి సుమతి జగన్నాధ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీమతి స్వప్న, సాంస్కృ...

మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ

Image
 మందకృష్ణ ధర్మ పోరాటానికి KRPS సంపూర్ణ మద్దతు : బింగి స్వామి కురుమ  కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు  కురుమలు అధిక సంఖ్యలో ఉన్న సమాజంలో నష్టపోయాం  కురుమల పోరాటానికి కే ఆర్ పి ఎస్ మద్దతు కావాలి  కురుమ ఎమ్మెల్యే కురుమ ఎమ్మెల్సీ కూడా గొల్ల కురుమనే అంటున్నారు ఇంకా గుర్తింపు రాకపోతే భవిష్యత్ తరాలు నష్టపోతాయి స్వయంకృతాభిరాధం జర్నలిస్టులు కళాకారులు రాజకీయ నాయకులు గొల్ల కురుమ అనడం వల్లనే నష్టాన్ని పూడ్చలేకపోతున్నామని  ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు కార్యక్రమానికి కురుమ డొల్ల గొంతుల మద్దతు ఉంటుందని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసా జహంగీర్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి గొంగడితో సన్మానం చేసి డోల్ల చప్పుడుతో మద్దతు తెలిపారు. మాదిగలకు జరిగిన అన్యాయమే తిరుమలకు జరుగుతుందని గొల్ల కురుమల మధ్య ఇలాంటి వివాదం నడుస్తుందన్నారు రాజకీయాలకు చెందుతున్నది కురుమల పేరు చెప్పుకొని గొల్లలు నడుపుతున్నరన్నారు. మందకృష్ణ చేస్తున్న పోరాటానికి మద్దతుడుతున్నట్టు సమాజ హితం క...

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై , కానిస్టేబుల్

Image
  లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై , కానిస్టేబుల్ SI, constable caught by ACB while taking bribe అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుకున్న తిరుమలగిరి పోలీసులు లక్ష రూపాయల లంచం ఇస్తే వదిలేస్తానన్న ఎస్సై.. ఈ క్రమంలో పీఎస్ పై ఏసీబీ రైడ్ లంచం తీసుకుండగా పట్టుబడ్డ ఎస్సై సురేష్ , కానిస్టేబుల్ నాగరాజు

ACB వలలో ఇద్దరు

Image
  ACB వలలో ఇద్దరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి టౌన్ 32వ వార్డు అధికారి నల్లంటి వినోద్, తెలంగాణ ఏసీబీ అధికారులకు "రేషన్ కార్డు మరియు ఇందిరమ్మ ఇంటి మంజూరు దరఖాస్తులు ప్రాసెస్ చేయాలని" ఫిర్యాదుదారుడి వద్ద నుండి రూ.2,500/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించిన తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. Ch. కృష్ణ, అసిస్టెంట్ ఇంజనీర్, కాళ్లకల్ సర్కిల్ మరియు గ్రామం, మనోహరాబాద్ మండలం, మెదక్ జిల్లా, "63KVA 3-ఫేస్ DTR అండర్ LT కేటగిరీ III" ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా విడుదల చేయాడానికి  ఫిర్యాదుదారుడి నుండి 20,000/- లంచం మొత్తాన్ని డిమాండ్ చేసి స్వీకరించినందుకు తెలంగాణ ACB అధికారులకు పట్టుబడ్డాడు. అసిస్టెంట్ ఇంజినీర్ మొదట్లో ఫిర్యాదిదారుని నుండి రూ..30,000/- లంచం డిమాండ్ చేశాడు, అందులో అతను ఇప్పటికే రూ.10,000/- తీసుకున్నాడు.. “అవినీతిని నివేదించడం కొరకు 1064కు డయల్ చేయండి” 

జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై నిరసనలకు పిలుపు నిచ్చిన సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ

Image
  జనవరి 28న దేశవ్యాప్తంగా యుపిఎస్ పై  నిరసనలకు పిలుపు -కేరళ క్విట్ ఎం పి ఎస్ మహా ర్యాలీలో ఎన్ఓపిఎస్ సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ పిలుపు ఈరోజు కేరళ రాష్ట్రంలో  కోజికోడ్ జిల్లా కేంద్రంలో ఎన్. ఎం.ఓ.పి.యెస్ సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ గారి ఆధ్వర్యంలో స్టేట్ ఎన్. పి.యెస్.ఎంప్లాయిస్ కలెక్టివ్  సమక్షంలో క్విట్ ఎన్. పి.ఎస్- నో యూ.పి.ఎస్ మహా ర్యాలీ జరిగింది.అనంతరం  స్టేడియం కార్నర్ నందు క్విట్ ఎన్. పి.యెస్. బహిరంగ సభ జరిగింది. ఈ సభకు కేరళ ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ , జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన యూనిఫైడ్ పెన్షన్ విధానం నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జనవరి 28న ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాలయాల్లో  యుపిఎస్ ప్రతుల దగ్ధం చేయాలని , దేశ వ్యాప్తంగా నిరసనలు వివిధ రూపాల్లో  తెలియజేయాలని పిలుపునిచ్చారు. కేరళ  లో మొదలైన నిరసనలు, ఫిబ్రవరి 7న కర్ణాటక బెంగళూరు కేంద్రంగా ఫ్రీడం పార్కు నందు యుపిఎస్ వద్దని ధర్నా చేపడుతున్నామని , మార్చి 2న తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నందు చలో ధర్నా చౌక...