Posts

జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం

Image
 *జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం*  నల్గొండ, గూఢచారి:: పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ దేశాయ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లు వెంటనే ఇచ్చే విధివిధానాలను ప్రకటించి అర్హులైన వారందరికీ ఇవ్వాలని అన్నారు... జర్నలిస్టులు సంక్షేమంలో భాగంగా అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఆసుపత్రులలో ఉచిత చికిత్స, తదితర అంశాలతో పాటు పాత్రికేయుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. తమ వృత్తిలో భాగంగా జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందనీ, వారు   దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ...

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి

Image
 శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి  హైద్రాబాద్, గూఢచారి:  2024ఆగస్టు నెలలో దేవాదాయశాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ జరిగాయి. అయినప్పటికీ పెద్దల అండదండల తో కదలని ఈవో మనోహర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఉజ్జయిని అమ్మవారి గోశాలలో ఉండవలసిన మూడు గోవులను నల్లగొండ జిల్లా ఉరుముడ్ల లొని సొంత పొలం కు తరలించిన అడిగే నాధుడు లేరు.  పదిమంది(ముగ్గురు సన్నాయి వాళ్ళు, ఇద్దరు పురోహితులు, మరో ఐదుగురు )ఉద్యోగులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది.అయినా గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, వేదిస్తున్నారు, ఏప్రిల్ నెలలో రెగ్యులరైజేషన్ అయినప్పటికీ సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే జీతాలు ఇచ్చారు. ఐదు నెలల జీతం రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు..బకాయి పడ్డ జీతం... పెండింగ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అంటే రెండు నెలల జీతం సమర్పించుకోవాలి అంటూ ఈవో డిమాండ్ చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఇటీవల కొందరు ఉద్యోగులు తమ అవసరాల కోసం సరెండర్ లీవ్ క్లెయిమ్ చేస్తే Secure stop దగ్గర  8 శాతం Religious staff దగ్గర 10 శాతంతీసుక...

*సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*

Image
 *సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త* పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. సాయి రామ్ నగర్ BN Reddy Nagar కి (ఆర్య వైశ్య సామాజిక వర్గం ) కి చెందిన శ్రవణ్ కుమార్  కుమార్తె హన్యశ్రీ కి మంజూరు ఐన 3,50,000/- (Three Lakhs Fifty thousand )రూపాయల CMRF చెక్కు నీ ఉప్పల శ్రీనివాస్ గుప్త  క్యాంపు కార్యాలయంలో  ఆయన అందజేశారు .  ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం పేద ప్రజలకు వరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో Boggarapu Varun ,Dr Rajayya Guptha ,Congress Leaders ,ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు

Image
 ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ మలి దశ ఉద్యమ నాయకులు ,స్నేహ శీలి, మృదు స్వభావి ,సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు  జన్మదిన వేడుకలు గుత్తా అమిత్ కుమార్ స నివాసంలో కేక్ కోసి ఘనoగా నిర్వహించి అనంతరం గ్రామ ప్రజలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమమం లో చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి,మర్రి రమేష్, పాకాల దినేష్, రూపని యాదయ్య,మర్రి శ్రీకాంత్ ,ఉయ్యాల నరేష్, గుత్తా రవీందర్ రెడ్డి, మేడబోయున శ్రీను ,బోయ స్వామి, అనంతుల శంకర్,పాకాల మధు,రూపని ఎల్లయ్య,జహంగీర్, ఉయ్యాల నర్సింహ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

*500 గ్రాములు గంజాయి పట్టివేత*..

Image
 *500 గ్రాములు గంజాయి పట్టివేత*.. *ఐదుగురు నిందితులు అరెస్టు డిమాండ్*... ఐదుగురు వ్యక్తుల నుంచి  500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపిన సంఘటన  సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలో జరిగింది.డిఎస్పి వి.ప్రసన్నకుమార్ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం...శనివారం ఉదయం 9 గంటల సమయంలో  అనంతారం క్రాస్ రోడ్డు వద్ద  పెన్ పహాడ్ ఎస్ఐ  గోపికృష్ణ  తన పోలీసు సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా  ఐదు బైకులపై ఐదుగురు వ్యక్తులు  అతివేగంగా అనుమానాస్పదంగా  దురాజ్ పల్లి వైపు వెళ్తున్నారు. ఎస్సై గోపికృష్ణ తన పోలీస్ సిబ్బందితో వారిని వెంటాడి చాలా చాకచక్యంతో వారిని పట్టుకున్నారు.దొరికినవారు పెన్ పహాడ్ మండలం మాచారం గ్రామంకు చెందిన బొమ్మకంటి గోపి,  పేరం శ్రీకాంత్,పేరం శివ,పెన్ పహాడ్ కు చెందిన ఇంద్రవెల్లి జీవన్ కుమార్,నారాయణ గూడెం గ్రామానికి చెందిన పర్సనబోయిన రమేష్ లు ఉన్నారు. ప్రతి వ్యక్తి దగ్గర 100 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని అరెస్ట్ చేసి 500 గ్రాముల గంజాయిని 5 బైకులు,3 సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకొని విచ...

అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా? - డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ

Image
 అక్రిడేషన్ పాలసీకి ఇంత జాప్యమా? * వెంటనే ప్రకటించి అర్హులందరికీ వెంటనే కార్డులివ్వాలి * డబ్ల్యూజేఐ జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ * జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలుస్తాం * పాత చట్టాలను సవరించాలి హైదరాబాద్: తెలంగాణలో  జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధివిధానాలను వెంటనే ప్రకటించి , అర్హులైన అందరికీ వీలైనంత త్వరగా కార్డులు ఇవ్వాలని వర్కింగ్ జర్నలిస్ఠ్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. అక్రిడేషన్ పాలసీని సరళీకృతం చేయాలని సూచించారు. ఏడాది నుంచి ఈ అంశాన్ని తేల్చకపోవడం సమంజసం కాదన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పటిష్ఠమైన ఇన్సూరెన్స్ , ఆసుపత్రులలో ఉచిత చికిత్స, ఆరోగ్య కార్డులు తదితర అంశాలతో పాటు తెలంగాణ పాత్రికేయుల సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి త్వరలో వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబరులో ...

TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల

Image
 *TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల* Hydrabad:  TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో TPCC అధ్యక్షుడు , MLC మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భగా మహేష్ కుమార్ బొమ్మ  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా,పార్టీ పటిష్ఠతకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. TPCC ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కు ఉప్పల శ్రీనివాస్ గుప్త  కృతజ్ఞతలు తెలిపారు.