ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్
*మల్టీ జోన్ 1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసిన మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి రంగనాథ్*
అలసత్వంతో పోలీస్ విధులు నిర్వహిస్తున్న ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 జోన్ ఐ జీ ఎ. వి రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారిచేశారు. సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లు, ఇద్దరు సబ్ - ఇన్స్ స్పెక్టర్లు- ఒకరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ వున్నారు.
ఈ సస్పెండ్ల కు సంబందించి మల్టీజోన్ ఐ. జీ వివరాలు తెలియజేస్తూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన బోధన్ మాజీ ఏం. ఎల్. ఎ షకీల్ కుమారుడు రాహిల్ ను తప్పించెందుకే పంజాగుట్ట ఇన్స్ స్పెక్టర్ తో సంప్రదింపులు జరిపినట్లుగా హైదరాబాద్ సిపి విచారణలో నిజ నిర్ధారణ కావడంతో బోధన్ ఇన్స్ స్పెక్టర్ బి. డి. ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేయగా, అలాగే యం. రమేష్ నిజామాబాద్ జిల్లా సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ మద్యం సేవించి పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేషన్ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసినట్లుగా అధికారుల దృష్టికి రావడంతో ఏసీపీ నిర్వహించిన విచారణ లో ఇన్స్ స్పెక్టర్ రమేష్ మద్యం సేవించి స్టేషన్ వచ్చి స్టేషన్ ఇబ్బందికరంగా వ్యవహారించినట్లు నిర్ధారణ కావడంతో సిసి ఎస్ ఇన్స్ స్పెక్టర్ యం. రమేష్ ను సస్పెండ్ చేయగా, మరో సంఘటనలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారించినట్లుగా ఎస్పీ జగిత్యాల అందజేసిన విచారణ నివేదిక ఆధారంగా ఎస్. ఐ జి. మనోహర్ రావు, ఎస్. ఐ ఎ. తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి. నరేందర్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Post a Comment