Skip to main content

Posts

Showing posts from February, 2023

సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం

 సమాచార భారతి ఆధ్వర్యంలో వైభవోపేతంగా సోషల్ మీడియా సంగమం  హైదరాబాద్: సమాచార భారతి ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబద్ లోని కేశవ మెమోరియల్ విద్యాసంస్ధల ఆవరణంలో సర్దార్ పటేల్ హాల్ లో సోషల్ మీడియా సంగమం 5వ సంచిక వైభవోపేతంగా జరిగింది. సమాచార భారతి అధ్యక్షులు గోపాల్ రెడ్డి స్వాగతోపన్యాసంలో భారతీయ మూలాలు వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సోషల్ మీడియా సంగమం ద్వారా ఏ ఫలితాలు ఆశించామో ఆ దిశగానే ఈ సంచిక కూడా జరుగుతోందని తెలిపారు. మూడు అంశాలు ప్రాతిపదికగా సదస్సులు నిర్వహించారు. ఆత్మ నిర్భరత అంశంపై జి .ఎన్ . రావు, శ్రీమతి కాశీనాథుని శిరీష విలువైన విషయాలు తెలియజేశారు . ప్రాధాన్యత రంగాల్లో ఆత్మ నిర్భరత యొక్క ఆవశ్యకతని  జి .ఎన్ . రావు వివరిస్తూ .. భారతదేశం రక్షణ రంగంలో సాధించిన విషయాలను వివరంగా తెలియజేశారు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిశోధన చేసిన శ్రీమతి కాశీనాథుని శిరీష మాట్లాడుతూ సోషల్ మీడియాను అవసరమైన అంశాలలో ఎలా ఉపయోగించుకోవాలో , అనవసరమైన సమాచారాన్ని ఎలా నిరసించాలో వివరించారు. నారేటివ్ సదస్సులో  దేవగిరి ప్రాంతంలోని బంజారా కుంభమేళా నిర్వహణ ఏ విధంగా బంజారాలను ఐక్యం చేసిందో భారతీయ 

బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్

 బిజెపి నాయకులపై దాడులకు పాల్పడ్డ గూండాలను అరెస్టు చేయాలి - బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల డిమాండ్ నల్లగొండ పట్టణంలో గురువారం సాయంత్రం ప్రజా గోస బీజేపీ బరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ విజయవంతం అవడంతో బీజేపీ నాయకుల పై అధికార పార్టీ భౌతికంగా దాడులకు పాల్పడ్డా గూండాలను అరెస్టు చేయాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. న పట్టణంలోని బొట్టుగుడ ప్రాంతంలో కార్నర్ మీటింగ్ జరుగుతున్న సమయంలో కొంత మంది గుండాలు బీజేపీ సమావేశంలో పాల్గొంటున్న డాక్టర్ నాగం వర్షిత రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలపై,నాయకుల పై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్యం పై దాడిగా భావిస్తున్నామనీ, ఇంతవరకు పట్టణంలో కనీసం ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని అధికార పార్టీ నాయకులు బీజేపీ సభ లపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే బీజేపీ నాయకుల పై దాడి చేసిన గూండాలను పోలీస్ శాఖ అరెస్ట్. చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తుందని తెలిపారు .తాటాకు చప్పుళ్లకు బీజేపీ బెదరదని, నక్సలైట్ లకు ,ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ పార్టీకి వీధి గూండాలు ఒక

ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి

  ఇండ్లూరు బిజెపి కార్నర్ మీటింగు లో వీరెల్లి ఈరోజు నల్గొండ జిల్లా నల్లగొండ అసెంబ్లీ తిప్పర్తి మండలం ఇండ్లురూ గ్రామంలో శక్తి కేంద్రం 271 272 గల బూతులలో కార్నర్ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. చాలా మంది రైతులకు రైతుబంధు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారి, రైతుల రైతుల ఖాతాలను ఎన్ పి ఏ లుగా మార్చడం, అదేవిధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తానని మరొక్కసారి రైతులను మోసం చేసాడు కేసీఆర్ అని పేర్కొన్నారు. అమలు కాని హామీలు ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందడని, దళిత బందు పేరా మరొక్కసా

హైదరాబాద్ మేయర్ ఇంట్లోకి 5000 కుక్కలను తోలాలి

రాంగోపాల్ వర్మ కామెంట్ చూడండి👇  

కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి

 కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల  ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు - వీరెల్లి  నల్గొండ జిల్లా నకిరేకల్ అసెంబ్లీ కట్టంగూరు మండలం కట్టంగూరు గ్రామంలో శక్తి కేంద్రం 192 193 194 గల బూతులలో జరిగిన కార్నర్ మీటింగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారనీ, అదేవిధంగా యువకులకు ఉద్యోగాలు కల్పించడంలో నిరుద్యోగ భృతి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేకపోయిందనీ, పేదవారికి రేషన్ కార్డులు అర్హులకు పెన్షన్లు అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అందని ద్రాక్ష పండుగ మిగిలిందనీ, రుణమాఫీ పేరుమీద రైతులను మోసం చేసి ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాడని విమర్శించారు. ఎన్నికల ముందు కేసీఆర్ హామీలను నమ్మొద్దని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని బిజెపిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు శక్తి కేంద్రం ఇన్చార్జి కోమటి భాస్కర్ , బూత్ అ

Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు

    Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు *టిఎస్ హైకోర్టు.....* అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి కేసు సుమోటో గా  స్వీకరించిన హైకోర్టు.. Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు.  మీ నిర్లక్ష్యం తో పసి బాలుడు చనిపోయాడన్నా హైకోర్టు.  ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎం చర్యలు తీసుకుంటున్నారన్న హైకోర్టు.  తెలంగాణ చీఫ్ సెక్రటరీ, Ghmc, హైదరాబాద్ కలెక్టర్,తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ,అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు.. బాలుడు మృతి బాధాకరమన్న హైకోర్టు.  బాలుడు మృతి కి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.  పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు. తదుపరి విచారణ మార్చ్ 16 వాయిదా వేసిన హైకోర్టు.

కుక్కల దాడి ఘటనపై సుమోటోగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు

 సుమోటోగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు పేపర్ న్యూస్ ఆధారంగా విచారణ కు స్వీకరించిన హైకోర్టు మూడురోజుల క్రితం అంబర్ పేట్ లో కుక్కల దాడిలో ప్రదీప్ అనే నాలుగేండ్ల బాలుడు మృతి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన కుక్కల దాడి ఘటన రేపు కుక్కల దాడి ఘటనపై హైకోర్టు లో విచారణ

పర్భని వద్ద షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం.

 మహారాష్ట్ర : పర్భని వద్ద షిర్డీ – కాకినాడ ఎక్స్‌ప్రెస్‌ లో దొంగల బీభత్సం. 30 మంది మహిళల మెడలోంచి బంగారం చోరీ. మహారాష్ట్రలోని పర్భణి స్టేషన్‌ శివారులో సిగ్నల్ కోసం ఆగగా. ఇదే అదనుగా భావించిన దుండగులు బోగీలోకి ప్రవేశించారు. ప్రయాణికులను బెదిరించి, మహిళ మెడలోని గొలుసులు కొట్టేశారు. S2 నుంచి S11 వరకు మహిళలే టార్గెట్‌గా దోపిడీ చేశారు. 30 మంది ప్రయాణికుల నుంచి బంగారం దోచుకెళ్లారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పర్భణి స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌కు ఫిర్యాదు చేశారు. దొంగలను పట్టుకోవాలని కోరారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ

నల్గొండ పట్టణం లో డబుల్ బెడ్ రూం లకు దరఖాస్తుల స్వీకరణ. 21 ఫిబ్రవరి నుంచి ప్రారంభం. శనివారం (26 ఫిబ్రవరి) సాయంత్రం 5 గంటల వరకు గడువు.  * నల్గొండ శాసన సభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి ఆదేశాలతో ధరఖాస్తు స్వీకరణ కు 12 కేంద్రాల ను ఏర్పాటు చేయనున్న మున్సిపల్ కమిషనర్.  * వార్డుల వారీగా ధరఖాస్తు ల స్వీకరణ.  * 3, 4 వార్డులకు కలిపి ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు.  * వెనువెంటనే ధరఖాస్తు ల విచారణ ప్రారంభం. మరియు అర్హుల లైన లబ్ధిదారుల ఎంపిక. కలెక్టర్ ఆదేశాల తో 12 ఎంక్వైరీ టీమ్ లను ఏర్పాటు చేసిన నల్గొండ ఆర్డీవో .  * గృహ నిర్మణా శాఖ వారు రూపొందించిన ధరఖాస్తు ఫారం ల ను మాత్రమే ఉపయోగించి ధరఖాస్తు చేయాలని, అన్ని జిరాక్స్ కేంద్రాల వద్ద ధరఖాస్తు ఫారాలను అందుబాటు లో ఉంచవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించిన  శాసన సభ్యలు కంచర్ల భూపాల్ రెడ్డి

హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ

హిందూ వాహిని అధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీ ఈరోజు అదివారం మన నల్లగొండ పట్టణంలో జరిగే చత్రపతి శివాజీ జయంతి బైక్ ర్యాలీలో హిందూ బంధువులందరూ మరియు హిందూ వాహిని కార్యకర్తలు వివిధ క్షేత్ర ప్రముఖులు అందరూ పాల్గొనవలసిందిగా హిందూ వాహిని కోరింది. సాయంత్రం నాలుగు గంటలకు రామగిరి రామాలయం నుండి ప్రారంభం అవుతుందని తెలిపారు.

పిసిబి AEE కి 6000 జరిమానా విధించిన రాష్ట్ర సమాచార కమీషన్

పిసిబి AEE కి 6000  జరిమానా విధించిన  రాష్ట్ర  సమాచార కమీషన్ నల్గొండ: గతంలో   కొత్తగూడెంలోనీ కాలుష్య నియంత్రణ మండలి  నందు  సమాచార హక్కు చట్టం  ప్రజా సమాచార అధికారిగా  విధులు  నిర్వర్తించిన  అసిస్టెంట్ ఎన్విరాన్మంటల్ ఇంజనీర్ కు తెలంగాణ రాష్ట్ర  సమాచార కమీషన్. 6000  రూపాయల జరిమానా విధించింది.  ఓ ధరకాస్తు దారుడు సమాచారం కోరుతూ సదరు  అధికారి కి దరఖాస్తు చేశాడు. ఆ దరఖాస్తుకు పూర్తి  సమాచారం ఇవ్వకపోవడం తో   దరఖాస్తు దారుడు  తెలంగాణ రాష్ట్ర సమాచార కమీషన్ ఫిర్యాదు చేశాడు.  దీనితో రాష్ట్ర  సమాచార  కమీషన్  సదరు అధికారికి  రెండు సార్లు షో కాజ్ నోటీసు ఇచ్చింది. కేసు విచారణకు వ్యక్తి గతంగా హాజరు కమ్మని  నోటీసు పంపింది. షో కాజ నోటీసు లకు స్పందించకుండా,  కేసు హియరింగ్ కూడ హాజరు కాక పోవడం తో తిరిగి మరో షో కాజు నోటీసు ఇస్తు సెక్షన్ 20 (1) ప్రకారంగా  చర్యలు ఎందుకు తీసుకోకూడదని వ్యక్తి గతంగా హాజరై వ్రాత పూర్వకంగా  సంజాయిషీ  ఇవ్వమని కోరింది.  సదరు అధికారి హాజరై వ్రాతపూర్వకంగా సంజాయిషి ఇచ్చాడు. అయన ఇచ్చిన సంజయిషి కి సంతృప్తి చెందని రాష్ట్ర సమాచార కమీషన్ 6000 రూపాయల జరిమానా విధిస్తూ ఆర్డర్ ఇచ్చింది.   ప్రత

మహాశివరాత్రి ఉత్సవంలో ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలి - నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

  మహాశివరాత్రి ఉత్సవంలో ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలి - నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ: పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సందర్భంగా ఛాయా సోమేశ్వరాలయంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో.. వివిధ శాఖలకు చెందిన అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఛాయా సోమేశ్వరాలయం రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతుందని అందుకు తగ్గ ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, ముఖ్యంగా బార్కేడింగ్ సానిటరింగ్, ట్రాఫిక్ అదుపు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై ఎవరికి వారి బాధ్యతలు అప్పగించి నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. 123 కోట్ల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభం కాబోతున్న ఉదయ సముద్రం ట్యాంక్ బండ్, పచ్చల చాయా వెంకటేశ్వర ఆలయాల అభివృద్ధి శిల్పారామం, తీగల వంతెన, లతో ఈ ప్రాంతమంతా అత్యద్భుతంగా రూపుదిద్దుకోబోతుందని.. రానున్న రోజుల్లో ఛాయా సోమేశ్వరాలయం పూర్వ వైభవం సంతరించుకొన ఉందని కంచర్ల తెలియజేశారు...  ఈ సంవత్సరం నుండి..

మునుగోడ్ లో శక్తీ కేంద్ర కార్నర్ మీటింగులో వీరెల్లి

  మునుగోడ్ లో శక్తీ కేంద్ర కార్నర్ మీటింగులో వీరెల్లి నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో మునుగోడు పట్టణ కేంద్రంలో(పోలింగ్ బూత్ నంబర్స్ : 152,153,154 )శక్తి కేంద్ర ఇంచార్జ్ సాగర్ల లింగస్వామి యాదవ్ అధ్యక్షతన జరిగిన ప్రజాగోస- బీజేపీ భరోసా శక్తీ కేంద్ర కార్నర్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రభారి వీరెల్లి చంద్రశేఖర్ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్,నాయకులు బూడిద లింగయ్య యాదవ్, బొడిగే అశోక్,పందుల నర్సింహ,పందుల భాస్కర్,జిట్టగొని యాదయ్య,పాల్వాయి జితేందర్ రెడ్డి,సింగం గిరి,మాదగోని రాజేష్ గౌడ్, ఎండి అన్వర్,తదితరులు ఉన్నారు.

ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు గ్రహీత కౌటికె విఠల్ కు అభినందన

 ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డు గ్రహీత కౌటికె విఠల్ కు అభినందన  శృతి-లయ ఆర్ట్స్ అకాడమి, సీల్వేల్ కార్పోరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ శ్రమశక్తి బిరుదు” మరియు “సిల్వర్ క్రౌన్" ప్రధానం చేసిన సందర్భంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్స్ ఫోరం వారు అభినందన సత్కారం చేశారు. సామాజి గూడ ప్రెస్స్ క్లబ్ లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు తంగుటూరి రామకృష్ణ గార్లు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో గల జీవిత బీమా ఏజంట్ల అందరిలో నెం. 1 స్థానాన్ని గత రెండు సంవత్సరాలుగా పొందుతున్న భారతీయ జీవిత బీమా సంస్థ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ కు శృతి-లయ ఆర్ట్స్అకాడెమీ, సీల్వెల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో కౌటికె విఠల్ కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ శ్రమశక్తి" బిరుదును, వెండి కిరీటాన్ని ప్రధానం చేశారని అన్నారు. విఠల్ తన జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని 23 వ యేట

మంత్రి గారు నాకో ప్లాట్ ఇప్పించరా! నగరంలోని ఒక (మజా) మంత్రి కి..... ఫోన్

  మంత్రి గారు నాకో ప్లాట్ ఇప్పించరా! నగరంలోని ఒక (మజా) మంత్రి కి..... ఫోన్ హైదరాబాద్:  ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ ఎడిటోరియల్ లో పని చేసే వ్యక్తి నుండి వచ్చిన ఫోన్ కాల్ స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సహజంగా ఆ మంత్రి ఎవరి ఫోన్ అయిన లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడటం అలవాటు. ప్రముఖ ఛానల్ వ్యక్తి ఫోన్ కూడా లౌడ్ స్పీకర్ లో మాట్లాడటం అందులో ఛానల్ లో పని చేసే వ్యక్తి తనకు 400 గజాల ప్లాట్ యిప్పించలని మంత్రి కోరడం తో మంత్రి తో పాటు మంత్రి పక్కనున్న brs నేతలు అవాక్కయ్యారు. ఇలా కూడా ఉంటుందా అని brs నేతల్లో చర్చ మొదలైంది. ఇది విన్న brs నేతలు మీడియా వారు ఎవ్వరూ కనపడినా విషయన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. దీనితో స్థానికంగా ఇది తీవ్ర చర్చని మామింది.

60 కోట్ల దోమ తెర, బెడ్ షీట్ల.. సరఫరా కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు

 హైదరాబాద్.... అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రూ 60 కోట్ల దోమ తెర, బెడ్ షీట్ల.. సరఫరా కాంట్రాక్టును ఇప్పిస్తానంటూ మోసం చేసిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నారాయణ ద్వారా పరిచయమైన వ్యక్తుల మాటల నమ్మి రూ. 20 లక్షల ఇచ్చిన  రహ్మత్ నగర్ కు చెందిన  నర్సింహా రెడ్డి అనే వ్యక్తి .... మోసపోయానని గ్రహించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాదితుడు ... బాధితుడి ఫిర్యాదు మేరకు వినయ్, మనోహర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు...

విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలి - వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ

  విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలి - వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ నల్గొండ:  పుల్వామా అమర వీరులకు నివాళులు అర్పిస్తున్న వాసవి క్లబ్ గవర్నర్ కోటగిరి రామకృష్ణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటినుంచి జాతీయ భావం దేశభక్తి ఉండాలని అన్నారు.

అవార్డు గ్రహీత విఠల్ కు అభినందన సత్కారం

 అవార్డు గ్రహీత విఠల్ కు అభినందన సత్కారం హైదరాబాద్:   అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డును అభిమానుల మధ్య రవీంద్రభారతిలో జరిగినస మావేశంలో అందుకున్న కౌటికె విఠల్ కు సీనియర్సి సిటీజన్స్ ఫోరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యములో నేడు 14వ ఫిబ్రవరి రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అభినందన సభ ఏర్పాటుచేశారు. జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ఇన్సూరెన్స్ అడ్వయిజరుగా వ్యవహరిస్తూ వేలాదిమందికి బీమాతో పాటు వందలాదిమందికి ఉపాధిని కల్పించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభతో పాటు పలువురు ప్రముఖులు హాజరుఅవుతారని నిర్వాహకులు తెలిపారు.. 

NAGAM XI పేరుతో క్రికెట్ టీమ్

  NAGAM XI పేరుతో క్రికెట్ టీమ్ నల్లగొండ పట్టణం కు చెందిన ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టీమ్ సభ్యులు డా"నాగం వర్షిత్ రెడ్డి పై అభిమానం తో వారి టీమ్ పేరు *NAGAM XI* పేరు పెట్టుకున్న వారికి *టి షర్ట్స్* స్పాన్సర్ చేసిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు డా"నాగం వర్షిత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత ఆటల్లో చురుగ్గా ఎక్కువగా పాల్గొనాలి ఆటలు ఆడటం వల్ల మానసికంగా ఆరోగ్యంగ ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉంటారు యువత తప్పుదోవ పడకుండా ఆటల పై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో శివ,శరత్,అఖిల్,శంకర్,దాదా,క్రికెట్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాగోష బిజెపి భరోసా దేవరకొండ కార్నర్ మీటింగులో వీరెల్లి

 ప్రజాగోష బిజెపి భరోసా  దేవరకొండ కార్నర్ మీటింగులో వీరెల్లి  ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ దేవరకొండ పట్టణంలో శివాజీ నగర్ లో పోలింగ్ బూత్ నెంబర్స్ 70,80,90లో శక్తి కేంద్ర ఇన్చార్జి చిలక రాజు శ్రీను ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి మహబూబ్ నగర్ పార్లమెంట్ ప్రబారి వీరెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమోని రాములు జిల్లా ఉపాధ్యక్షులు అంకురి నరసింహ దేవరకొండ బిజెపి ఫ్లోర్ లీడర్ గాజుల మురళి అసెంబ్లీ కన్వీనర్ At.కృష్ణ పట్టణ అధ్యక్షులు గుండాల అంజయ్య రాష్ట్ర నాయకులు కళ్యాణ నాయక్ ,లాలు నాయక్ మరియు బిజెపి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు బిజెపి పట్టణ నాయకులు మూడు బూత్ కమిటీ సభ్యులు కార్యకర్తలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

సభలో లేని ప్రధానిపై ఆరోపణలు చేస్తారా? - బండి సంజయ్

  సభలో లేని ప్రధానిపై ఆరోపణలు చేస్తారా? - బండి సంజయ్ అభివ్రుద్ది, హామీలపై మాట్లాడకుండా మోదీని తిట్టడానికే అసెంబ్లీని వేదికగా చేసుకుంటారా? ప్రధాని గౌరవాన్ని మంటకలుపుతుంటే స్పీకర్ ఏం చేస్తున్నారు? తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కేసీఆర్ కుట్ర తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి? నిరుద్యోగ భ్రుతి, ఫ్రీ యూరియా సహా ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు?  ఏసీడీ ఛార్జీల విషయంలో తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం? పాతబస్తీకి మరో న్యాయమా? పాతబస్తీలో ఏటా వెయ్యి కోట్ల కరెంట్ చౌర్యాన్ని నిరూపించేందుకు నేను సిద్ధం? చేతనైతే విద్యుత్ శాఖ లెక్కలు తెప్పించుకుని చూడండి సచివాలయాన్ని ధ్వంసం చేసినోళ్లు కూల్చే సంస్క్రుతి గురించి మాట్లాడటమా? నిజాం వారసత్వ మరకలను సమూలంగా తుడిచి వేస్తాం బరాబర్ సచివాలయ డోమ్ లను కూల్చివేస్తాం రూల్స్ కు విరుద్ధంగా మీ తాబేదార్లకు కలెక్టర్లుగా పదోన్నతి ప్రతిపాదనలు పంపుతారా? ఉద్యోగుల్లారా.... వాస్తవాలు ఆలోచించండి కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టండి..   బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం పేదలందరికీ ఇండ్లు కట్టి

ఖరీదైన న్యాయవాదులను నియమించి ప్రజాధనాన్ని వృదా చేయవద్దు - ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

 ఖరీదైన న్యాయవాదులను నియమించి ప్రజాధనాన్ని వృదా చేయవద్దు - ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైదరాబాద్: హైకోర్టులో గాని సుప్రీమ్ కోర్టులో గాని ప్రైవేటు న్యాయవాదుల సేవలను ఉపయోగించకుండా, ఏ.జి.సేవలు వాడుకోవాలని, బేషజాలకు పోయి ప్రజాధనాన్ని వృధా చేయవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి వినతి పత్రం ఇచ్చింది. హైకోర్టు జడ్జికి కావలసిన అర్హతలు ఉన్న వ్యక్తిని రాష్ట్ర గవర్నర్ గారు అడ్వకేట్ జనరల్ (ఏ.జి) గా నియమించాలని రాజ్యాంగం అనుకరణ 165 నిర్దేశిస్తుందని, అలాగే ప్రభుత్వానికి కావలసిన న్యాయ సహాయాన్ని సలహాలను అడ్వకేట్ జనరల్ అందించాలని రాజ్యాంగం నిర్దేశిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో ఏ.జి.కి సహకారంగా అడిషనల్ ఏ.జి. కూడ నియమితులైనారని వినతి పత్రం లో పేర్కొన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. వీరికి కావలసిన సిబ్బంది, కార్యాలయం ఇతర సదుపాయాలు ఉన్నాయిని, ఏ.జి. కి ప్రతికేసులో హాజరుకు రూ// 10 వేలు చెల్లిస్తారని (ఒకరోజు 7 కేసులకు మించకుండా), ఈవిధంగా ఏ.జి. కి నెలకు 15 లక్షల వరకు చెల్లింపులు జరుగుతాయిని, అదేవిధంగా అడిషనల్ ఏ.జి. కి ప్రతి కేసు హాజరుకు రూ// 8500 (రోజుకు 7 కేసులకు మించకుండా) చెల్లిస

కెసిఆర్ పాలనలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యం - గంగిడి మనోహర్ రెడ్డి

 *కెసిఆర్ పాలనలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యం బడ్జెట్లో కేటాయింపులు తప్ప నిధుల విడుదల, అభివృద్ధి లేదు-బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి* నల్గొండ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కెసిఆర్ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో అప్పు కొండంత అభివృద్ధి శూన్యంగా మారిందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని చర్లపల్లిలో బిజెపి కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అందరం ఉద్యమంలో పాల్గొన్నామని వచ్చిన తెలంగాణ లో మాత్రం ప్రజలను నిరుద్యోగులను ఉద్యోగులను యువకులను విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల హామీల అమలులో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని, మాస్టర్ ప్లాన్ రూపొందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. జిల్లా కేంద్రంలో 700 కోట్లతో ఐటి హబ్, రోడ్ల విస్తరణ అని చెప్పి కమిషన్లు తీసుకొని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలో హడావిడి శిలాఫలకాలతో రాజుల సొమ్ము రాళ్లపాళ్ల మాదిరిగా అధికారులు పనిచేస్తున్నారు. విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి కల్పనలో రాష్

నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

 నటుడు అర్జున్ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కవిత ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్జున్ దంపతులు కల్వకుంట్ల కవితకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ... చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని తెలిపారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని, అక్కడి ప్రజలు స్ఫూర్తిదాయకంగా ఉంటారని అన్నారు. తమిళనాడు ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని, ప్రతి ఒక్కరికి ఆ గౌరవభావం ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందని తెలిపారు. దేశంలోని అతిపెద్ద హనుమాన్ దేవాలయాన్ని నిర్మించినందుకు అర్జున్ కు కవిత అభినందనలు తెలిపారు

*ప్రజాగోస- బిజెపి భరోసా* మీటింగులో మనోహర్ రెడ్డి కి స్వాగతం పలికిన నాగం వర్షిత్ రెడ్డి

  *ప్రజాగోస- బిజెపి భరోసా* మీటింగులో మనోహర్ రెడ్డి కి స్వాగతం పలికిన నాగం వర్షిత్ రెడ్డి  నల్లగొండ పట్టణంలో ని *చర్లపల్లి సెంటర్ నందు* *ప్రజాగోస- బిజెపి భరోసా*కార్నర్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.గంగిడి మనోహర్ రెడ్డి ని శాలువత స్వాగతం పలుకుతున్న బీజేపీ నాయకులు డా"నాగం వర్షిత్ రెడ్డి.

బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్

  బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం - పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్  నల్గొండ: ప్రజాగోస- బిజెపి భరోసా శక్తి కేంద్రం కార్నర్ సమావేశం రేపు శుక్రవారం ఉదయం చర్లపల్లి సెంటర్ లో నిర్వహిస్తున్నట్లు నల్గొండ పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి విచ్చేయుచున్నారనీ, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ కమిటీ సభ్యులు వివిధ మోర్చా నాయకులు శక్తి కేంద్రం ఇంచార్జ్ లు బూత్ కమిటీలు సభ్యులు నల్గొండ పట్టణ బిజెపి కార్యకర్తలు, శ్రేయోభిలాషులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ విస్తృతంగా పాల్గొనగలరని అయన కోరారు.

బి ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్ట్రీట్ కార్నర్ మీటింగులు - బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి

   బి ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి స్ట్రీట్ కార్నర్ మీటింగులు - బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి                  నల్గొండ: భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల శక్తి కేంద్రాల పరిధిలో స్ట్రీట్ కార్నర్ సభలు నిర్వహిస్తున్నామని నల్గొండ బిజెపి జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీదర్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ సెంటిమెంటుతో అధికారంలోకి వచ్చిన బీ ఆర్ యస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది ఆని తెలిపారు. తెలంగాణ సాధించుకుంటే బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి నేడు అప్పుల తెలంగాణ గా మార్చారు అని అయన ఎద్దేవ చేశారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని శక్తి కేంద్రాల పరిధిలో వీదిసభలు నిర్వహించి బీ ఆర్ యస్ పార్టీ వైఫల్యాలను ఎండగడ్తమన్నారు. మోసపూరితమైన కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మేలా లేరని చెప్పారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పారు..

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

 చాంద్రాయణ గుట్టలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్. గ్యాంగ్ రేప్ ఒక పాల్పడ్డ నలుగురు యువకులు అరెస్ట్. బాలికకి మద్యం తాగించి సామూహిక అత్యాచారాన్ని పాల్పడ్డ నిందితులు.. మందుల కోసం మెడికల్ షాప్ కు వెళ్లిన బాలిక..  తక్కువ ధరకు మందులు ఇప్పిస్తానంటూ బాలికని ట్రాప్ చేసిన మహిళ..  బాలికను కందికల్ గేటు వద్దకు తీసుకువెళ్లిన మహిళ..  గంజాయి మత్తులో ఉన్న యువకులకు అప్పగించిన మహిళ..  బాలికను రూములో బంధించి  music సిస్టం పెట్టి సామూహిక అత్యాచారం.  చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు

కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలి - రైస్ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

 కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ త్వరగా పూర్తి చేయాలి - రైస్ అదనపు కలెక్టర్ భాస్కర్ రావు నల్గొండ, ఫిబ్రవరి 7.యాసంగి 2022 - 23 కస్టమ్ మిల్లింగ్ రైస్ డెలివరీ (సి.యం.అర్) త్వరగా పూర్తి చేయాలని రైస్ మిల్లర్ లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశించారు. మంగళ వారం నల్గొండ పట్టణం లోని రైస్ మిల్లు లను అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.వచ్చే పంట సీజన్ కు నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేసేలా వానాకాలం సి.యం.అర్ వేగవంతం చేయాలని సూచించారు. యాసంగి సీజన్ మిగిలిన 25 శాతం సి.యం అర్ వెంటనే పూర్తి చేయాలని మిల్లర్ లను ఆదేశించారు.పౌర సరఫరాల డి.టి.లు సి.యం.అర్ పెండింగ్ మిల్లు లను ప్రతి రోజు సందర్శించాలని ఆదేశించారు.పోర్టిపైడ్ కర్నల్(బలవర్ధకమైన పోషకాలు కలిగిన పదార్థం) డిమాండ్ కనుగుణంగా సరఫరా చేయాలని పౌర సరఫరాల డి.యం.కు సూచించారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు ఉన్నారు

ACB వలలో.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు VRA

ACB వలలో.రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు VRA,   మెదక్ జిల్లా, శంకరంపేట మండలం తహశీల్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మరియు VRA చందంపేట్ గ్రామం vra గూడూరి తలారి సురేష్ బాబు లు 1,00,000/ లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. 6-02-2023న సుమారు 141.0 గంటలకు మెదక్ జిల్లా, శంకరంపేట మండల తహశీల్దార్ కార్యాలయ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ నెల్లి శ్రీహరి, మెదక్ జిల్లా, శంకరంపేట మండలం, చందంపేట్ గ్రామం vra గూడూరి తలారి సురేష్ బాబు ద్వారా ఫిర్యాదుదారు పాపన్నపేట శ్రీనివాస్ నుండి రూ.1,00,000/ లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. పట్టా పాస్‌బుక్‌లో ప్రాసెస్ చేసి, దిద్దుబాటు పని చేసినందుకు లంచం తీసుకున్నారు. లంచం మొత్తాన్ని vra గూడూరి తలారి సురేష్ బాబు నుండి స్వాధీనం చేసుకున్నారు. అయన యొక్క రెండు చేతుల వేళ్లు రసాయన పరీక్షలో సానుకూల ఫలితాన్ని ఇచ్చాయి. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నెల్లి శ్రీహరి, VRA గూడూరి తలారి సురేష్ బాబు లను అరెస్టు చేసి హైదరాబాద్ I Addl. SPE మరియు ACB కోర్టు కేసులకు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు విచారణలో ఉందనీ ఎసిబి అ

నల్లగొండలొ రజకుల సమావేశం

  నల్లగొండలొ రజకుల సమావేశం నల్లగొండ: ఆదివారం నాడు  పట్టణం సాగర్ రోడ్డులో కలిగిన రజక సంఘం భవనంలో చిక్కల్ల రాములు గారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిక్కల్ల రాములు మాట్లాడుతూ ఈ నెల 19/02/2023 రోజున రజక సంఘం భవన నిర్మాణ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామని,19వ తేదీన నల్లగొండ పట్టణంలోని ప్రతీ ఒక్క రజక బిడ్డ సంఘం భవనం దగ్గరకు వచ్చి మీ మద్దతు తెలపాలని కోరారు. ఈ నిర్ణయాన్ని రజక సంఘం సభ్యులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో యడవల్లి రాములు, నాగిల్ల యాదయ్య, ఎలిజాల శంకర్, జంజిరాల శేఖర్, దామనూరి శ్రీను, ఆకునూరి స్టాలిన్, చిక్కల్ల శ్రీను, సట్టు బుచ్చిరాములు, బాసాని యాదగిరి, జంజిరాల పుల్లయ్య, ఇస్తారి, కమ్మంపాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

పట్టణంలోని 40శాఖలు, 40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో

దేశ రక్షణ, ధర్మపరిరక్షణ కోసం ప్రతి ఒక్క స్వయం సేవకుడు   సైనికునిలా పనిచేయాలని రాష్ట్రీయస్వయం సేవక్ ఉమ్మడి నల్లగొండ జిల్లాప్రచారక్. ప్రాంత బౌద్దక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు.... ప్రతి స్వయంసేవక్ ప్రత్యక్షంగా శాఖలో పాల్గొనే విధంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా "ఉపస్థితిదిన్" కార్యక్రమం నిర్వహిస్తున్నారు... ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఉపస్ధిత్ దివస్ కార్యక్రమంలో పట్టణంలోని 40శాఖలు,  40 ధ్వజాలతో ఒకే మైదానంలో ఏకకాలంలో కలుసుకునే అద్భుతమైన సన్నివేశం ఆవిష్కృతం అయ్యింది...   వెయ్యి మందికి పైగా స్వయంసేవకులు పాల్గొన్న  ఈ కార్యక్రమంలో రోజువారి శాఖా కార్యక్రమాలు, ఆసనాలు  నిర్వహించారు... అనంతరం జరిగిన  కార్యక్రమంలో వెంకటశివకుమార్ మాట్లాడుతూ.... 2025లో నాటికి ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాఅలు జరుగతున్నాయని అప్పటి లోగా దేశంలో లక్ష గ్రామల్లో శాఖలు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్వణయించుకుని ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు... రాష్ట్రానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నైజాం విముక్త అమ్రుతోత్సవాలు జరుపుకుంటున్న

వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

 వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నల్లగొండ, ఫిబ్రవరి 3 , జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామి వారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి,అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యావాచనం, కంకణ ధారణ రక్షాబంధన్ ,పాదపక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య వేద పండితులు పవన్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాలు ఘట్టం నిర్వహించారు. కళ్యాణ పీటల మీద భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. చుట్టుపక్కల కాలనీలో చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా భక్తుల సందడి కిటకిటలాడింది. విద్యుత్ దీపాలతో మనోహరంగా వెలిగింది. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అన్నదాన ప్రసాద వితరణ చేశారు.

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

 *తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం* ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది.   సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్‌ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

HACA చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్

 HACA చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్ *హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (HACA) చైర్మన్ గా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బుర్హానపురం సర్పంచ్, ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్యవైశ్య ప్రముఖులు మచ్చ శ్రీనివాస్.. నియామక ఉత్తర్వులు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం.

15వందల లంచం తీసుకున్న పాపానికి 4 ఏండ్ల జైలు శిక్ష

15వందల లంచం తీసుకున్న పాపానికి 4 ఏండ్ల జైలు శిక్ష కరీంనగర్ జిల్లా, ఎల్కతుర్తి మండలం, బావ్‌పేట్ గ్రామ రెవెన్యూ అధికారి పామరాజ్ మధుసూధన్ రావు గతం లో టైటిల్ డీడ్ ఇవ్వడానికి 1500 లంచం తీసుకున్న ఎసిబి కేసులో జనవరి 31న కరీంనగర్‌లోని SPE & ACB కేసుల కోర్టు జడ్జి ఆయనను దోషిగా తీర్పు ను వెల్లడించారని ఎసిబి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు U/s 7 క్రింద మూడు (3) సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష విధించబడిందని మరియు శిక్షార్హమైన నేరానికి రూ.5,000/- జరిమానా చెల్లించాలిినీ  అవినీతి నిరోధక చట్టం, 1988, జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు మరో మూడు (3) నెలల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాాలనీ, సెక్షన్ 13(1) (d) r/w 13(2) o క్రింద నాలుగు (4) సంవత్సరాలు జైలు శిక్ష మరియు శిక్షార్హమైన నేరానికి రూ.7,000/- జరిమానా కూడా చెల్లించాలనీ జరిమాన చెల్లించని పక్షం లో మరో నాలుగు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.

ఒకే రోజు రెండు ACB రైడ్స్

   ఒకే రోజు రెండు ACB రైడ్స్ మొదటిది అదిలాబాద్ జిల్లాలో: అదిలాబాద్ లో రెండు లక్షల 25 వేల లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు  ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, రిమ్స్  . ఎన్.తేజ ,  మరియు జూనియర్ ఉపాధి అధికారి  విజయలక్ష్మి లు మంగళవారం ఫిర్యాదుదారు దుర్గం SC లేబర్ కాంట్రాక్టర్ దుర్గం శేఖర్   కు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసిందుకు  లంచం డిమాండ్ చేశరు.  జూనియర్ అసిస్టెంట్, రిమ్స్  . ఎన్.తేజ ,  మరియు జూనియర్ ఉపాధి అధికారి  విజయలక్ష్మి ల ద్వారా జిల్లా ఉపాధి అధికారి, బాషబోయిన కిరణ్ కుమార్ లంచం తీసుకున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. ముగ్గురు అధికారులను అరెస్టు చేసి కరీంనగర్ ఎసిబి ప్రత్యేక కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు విచారణ లో ఉన్నదని అధికారులు తెలిపారు. @@@@@@@@@@@@@@@@@@@@@@@@ రెండవది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా రూరల్ మండలంఎదులాపురం, గ్రామపంచాయతీ పంచాయత్ సెక్రటరీ సయ్యద్ మహబూబ్ పాషా ఫిర్యాదు దారుడు దాసబోయిన నాగేశ్వరరావు కు ఇంటి నంబర్ అలాట్ చేయుటకు  మంగళవారం రోజు మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల కు  6 వే