Skip to main content

Posts

Showing posts from December, 2023

వేతన ఒప్పందం లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నిర్లక్ష్యం

  *వేతన ఒప్పందం లో విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ గౌరవాధ్యక్షులు ఎరగాని నాగన్న తెలిపారు*. నాగన్న ఆదేశానుసారం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నూతన వేతన ఒప్పందం చేయాలని నల్గొండ డీ,సీ,ఎల్ ,గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది, విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యాజమాన్యం నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఐ .ఎన్ .టి .యు .సి ., జిల్లా కార్యవర్గం విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అద్వర్యం లో కార్మిక శాఖా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు , యాజమాన్యం 2020 లో వేతన ఒప్పందం చేసుకుందని , ఆ ఒప్పందం 2023 తో ముగిసిందని , ఆతర్వాత నూతన ఒప్పందం చేయాలని ఎన్ని సార్లు విన్నవించుకున్నా యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు . తక్షణమే నూతన వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు . లేకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు . ఈ కార్యక్రమం లో జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంట్ జమాలుద్దీన్ జిలాని కోటగిరి శేఖర్ విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్

దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే - సామాజిక ప్రజాసంఘాల నేతలు

      . ఈ దేశంలో అసమానతలకు కారణం మనుస్మృతే. మనువాదం ఆశాస్త్రీయమైనది . ఆర్ఎస్ఎస్,సంఘ్ పరివారితోనే దేశానికి ప్రమాదం. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. సామాజిక ప్రజాసంఘాల నేతలు నల్గొండ:  ప్రపంచంలో ఎక్కడా లేనంతగా భారత దేశంలో సామాజిక అసమానతలను సృష్టించి, వివక్షతలకు కారణమైనది మనుధర్మ శాస్త్రమేనని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున ఆశాస్త్రీయమైన మనుస్మృతిపై మండిపడ్డారు. ఆశాస్త్రీయమైన మనుధర్మ శాస్త్రాన్ని నిషేధించాలని, ఈ దేశ బహజన సామాజిక వాదులంతా మనువాదాన్ని ఈ దేశ మట్టిలోనే పాతరేయాలని పిలుపునిస్తూ 1927 డిసెంబర్ 25న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మను ధర్మ శాస్త్రాన్ని మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో వేలాది మంది దళిత బహుజనలతో కలిసి దగ్ధం చేయడం జరిగింది. అదే సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం రోజున నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సామాజిక ప్రజా సంఘాల(కెవిపిఎస్, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఎంఎస్పీ,తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం,ప్రగతిశీల యువజన సంఘం,మాల మహనాడు)ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రానికి సంబంధించిన ప్రతులను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగ

*క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి*

  *క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి* నల్లగొండ: విశ్వమానవాళికి తన ప్రేమ తత్వంతో వెలుగులు పంచిన కరుణామయుడు,ప్రేమమూర్తి క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా నల్గొండ నియోజకవర్గ, తెలంగాణ రాష్ట్రంలోని క్రైస్తవులందరికీ రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవ, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అత్యుత్తమ జీవన మార్గాలను మానవ సమాజానికి అందించి.. ఇతరుల కోసం జీవించడం అన్న కొత్త పలుకులను నేర్పిన క్రీస్తు జన్మదినం ఎంతో పవిత్రమైనది అన్నారు.ఏసుక్రీస్తు తన జీవితమే ఒక సందేశంగా జీవించిన కరుణామయుడని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు.ఈ క్రిస్మస్ పండుగ క్రైస్తవులందరి జీవితాలలో వెలుగులు నింపాలని, క్రైస్తవులంతా క్రిస్మస్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

*ప్రజా పాలన* నిర్వహణకు *మంత్రులకు జిల్లా ఇంచార్జ్ ల నియమిస్తూ ఉత్వర్వులు జారి*

 *ప్రజా పాలన* నిర్వహణకు *మంత్రులకు జిల్లా ఇంచార్జ్ ల నియమిస్తూ ఉత్వర్వులు జారి* 1) ఉత్తమ్ కుమార్ రెడ్డికి -కరీంనగర్  2) దామోదర రాజనరసింహ- మహబుబ్ నగర్  3)కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి-ఖమ్మం 4)దుద్దిళ్ల శ్రీధర్ బాబు- రంగారెడ్డి 5)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- వరంగల్ 6)పొన్నం ప్రభాకర్- హైదరాబాద్ 7)కొండ సురేఖ-మెదక్ 8) సీతక్క- అధిలాబాద్ 9) తుమ్మల నాగేశ్వర్ రావు-నల్గొండ 10) జూపల్లి కృష్టారావు -నిజామాబాద్

జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

  జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశంనకు హాజరైన ఇంచార్జి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ప్రారంభమైన జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్.పి ల సమావేశం. హాజరైన ఇంచార్జి  నల్గొండజిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్  *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాయింట్స్* *ఈనెల 28 నుండి 6 వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నిర్వహిస్తున్నాం. * రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో సభల నిర్వహణ. *ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం.2 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సా.5 గంటల వరకు నిర్వహణ

*ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ*

 *ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ* *నల్లగొండ*: రాష్ట్ర రోడ్లు, భవనాలు, సీనిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతిక్ రెడ్డి 12వ వర్ధంతిని గురువారం నల్గొండ మండలం పెద్దసురారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతీక్ రెడ్డి ఫ్లెక్సీ కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పెద్దలు ఏడుదొడ్ల కొండల్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి ఆర్థిక సహకారంతో 9, 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, నోటు బుక్స్ పంపిణీ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిక్ ఫౌండేషన్ సీఈఓ మారం గొనరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. పేద విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో తిప్పర్తి మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్స్ నాయకులు పిల్లి యాదగిరి, ఎంపీటీసీ పెండం రత్నమాల పాండు, ప్రధానోపాధ్యాయులు రాధకృష్ణ, ఉపాధ్యాయులు విజయకుమార్ ,సత్య బాబు, రమేష్, వనజాత,సైదులు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది - పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

  పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది - పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండ : జిల్లాలోని రెడ్డి కాలనీకి చెందిన మహమ్మద్ నసీమ్ హైమద్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. చిన్న అబ్బాయి ఎండీ ఆదిల్ హైమాద్ కు కొంత కాలంగా బొన్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.. లక్షలలో వైద్యం చేయించలేక పేదరికంతో బాధపడుతున్న ఆకుటుంబం మంత్రి కొండ సురేఖ కు కలిసి వారి భాదను విన్నవించారు.. చలించిపోయిన మంత్రి కొండ సురేఖ వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి సమస్య తీవ్రతను తెలియజేశారు.. వెనువెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులకు చెప్పి వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది అని హామీ ఇచ్చారు.. పేద ప్రజల వైద్యానికి మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపదలో ఉన్న రోగులను ఆదుకునేందుకు అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి అన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మన ప్రభుత్వం పని చేస్తుందని ఆర్ధిక స్థోమత కారణంగా ఎవరు దిగులుపడవద్దు వారికి మన ప్రజా ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి అండగా వున్నారు అని మంత్రి సురేఖ అన్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్

A petition has been filed in the High Court to arrest Hero Nagarjuna, who is the host of the Bigg Boss show.

 హైదరాబాద్ *బిగ్ బాస్ షో  హోస్ట్గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున అరెస్టు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు....* అక్రమంగా వంద రోజులు నిర్బంధించడం పై అభ్యంతర వ్యక్తం చేస్తూ అడ్వకేట్ అరుణ్ పిటిషన్ దాఖలు.... బిగ్బాస్ లో పాల్గొన్న వారిని సైతం విచారించాలని పేర్కొన్న పిటిషనర్ ఆర్టీసీ సహా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేయడం యొక్క కుట్టను కూడా బయటకు తీయాలని డిమాండ్ నాగార్జును తక్షణమే అరెస్టు చేయాలని పెరుగుతున్న డిమాండ్..* బిగ్బాస్ 7 సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను దుమ్మెత్తి పోస్తున్న సామాన్య ప్రజానీకం ఇది కూడా చదవండి శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు https://www.gudachari.page/2023/12/blog-post_62.html

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు

  *శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు* 44 పేజీల పూర్తి వివరాలు క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/17gwZf1kVLC1lRFNPfGPXfNd4_u5NuHRa/view?usp=drivesdk తెలంగాణ బడ్జెట్కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది 2014- 15 లో అప్పు 72,658 కోట్లు  ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు  అప్పు పెరిగింది అది పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగింది రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది. దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది. రోజువారి ఖర్చులకు కూడా ఆర్బిఐ పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం. తాము 6 గ్యారంటీలను అ

2024 లో ఫ్యాక్టరీ ల కు మరియు షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు

2024 లో  ఫ్యాక్టరీ ల కు మరియు  షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు ప్రకటించిన లేబర్ డిపార్ట్మెంట్ 2 024 ఫ్యాక్టరీ ల కు సెలవులు 1 5-1-2024 సంక్రాంతి 26-1-2024 గణతంత్ర దినం 0 9-4-2024 ఉగాది 11-4-2023 రంజాన్ 01-5-2024 మే డే 15-8-2024 స్వాతంత్ర దినం 0 2-10-2024 గాంధీ జయంతి 12-10-2024 విజయ దశమి షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్స్ కు సెలవులు 15-1-2024 సంక్రాంతి 26-1-2024 గణతంత్ర దినం 09-3- 2024  శివ రాత్రి మరుసటి దిన 11-4-2023 రంజాన్ 01-5-2024 మే డే 02-6-2024  తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం 15-8-2024 స్వాతంత్ర దినం 02-10-2024 గాంధీ జయంతి 12-10-2024 విజయ దశమి  

ప్రతి పేదవాని కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది - మంత్రి కోమటిరెడ్డి

  *నల్గొండ పర్యటన లో రోడ్ల, భవనాలు, సినిమాటోగ్రాఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యంశాలు* *నల్గొండ ప్రజలకి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు* * ప్రతి పేదవాని కన్నీరు తుడిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది* *20యేండ్లు ఒక లెక్కా.. ఇప్పుడు ఒక లెక్కా.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం* *మాట తప్పం.. మడమ తిప్పం* *నల్గొండ లో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తా* *24/7 నల్గొండ ప్రజలకి అందుబాటులో ఉంటా* *మీరు ఎప్పుడైనా మినిస్టర్స్ క్వార్టర్స్ లోని నా 4 నెంబర్ క్వార్టర్ కి, సెక్రెటరేట్ లో 5వ ఫ్లోర్ లోని నా ఆఫీస్ కి రావొచ్చు* *రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి నిరుపేద కి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తాం* *నల్గొండలో ప్రతీ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతాం* *జిల్లాలో ప్రతీ సాగునీటి ప్రాజెక్టు ను పూర్తి చేస్తాం* *గత పదేళ్లలో గజ్వేల్, సిద్దిపేట్, సిరిసిల్ల తప్ప.. ఎక్కడ అభివృద్ధి జరగలేదు* *కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకి న్యాయం చేస్తాం* *బెల్ట్ షాపులను ముయిస్తాం* *గంజాయి గ్యాంగుల ఆట కట్టిస్తాం* *6గ్యారంటీలను 100 రోజుల్లో ఖచ్చితంగా అమలు చేస్తం* *ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసాం, ఈ న

'లై" డిటెక్టర్ పరీక్ష నేను సిద్ధం - మాజీ MLA క్రాంతి కిరణ్

  దళిత బంధు లో కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చిందని, నిగ్గుతేల్చడానికి 'లై" డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి నేను సిద్ధం అని  మాజీ MLA క్రాంతి కిరణ్  స్టేట్మెంట్ యధాతధంగా చదవండి. దళిత బంధు లో  కమీషన్లు తీసుకున్నానంటూ తనపై ఒక వ్యక్తి పోలీస్ లకు ఫిర్యాదు చేసినట్టు నిన్న నే నా దృష్టికి వచ్చింది. ఈ ఫిర్యాదు రాజకీయ కుట్ర, అయినప్పటికీ ఆరోపణలపై విచారణకు నేను సిద్ధంగా వున్నాను. అయితే నిజాలు నిగ్గుతేల్చడానికి 'లై" డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని దానికి నేను సిద్దాంగా ఉన్నానని కూడా తీయజేస్తున్నాను.  తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తి కి కూడా లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి ఫిర్యాదులోని వాస్తవాన్ని ఫిర్యాదు వెనకాల ఉన్న కుట్ర ను ఛేదించాలని పోలీస్ లను కోరుతున్నాను.  ఆందోల్ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ చేస్తున్న అరాచకాలకు ఈ ఫిర్యాదు పరాకాష్ట. తప్పుడు కేసు లతో మా కార్యకర్తలను వేధిస్తున్నాడు. మా కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయిస్తున్నాడు. బి ఆర్ ఎస్ మహిళ కార్యకర్తల ఇళ్లలోకి జోరబడి వారిపై కోడి గుడ్లతో దాడి చేయిస్తున్నరు

సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం

  సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్:  నేడు నేషనల్‌ పెన్షనర్స్ డే సందర్భంగా మన సమాచార, పౌర సంబంధాల శాఖ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమము తెలంగాణ  టూరిజం ప్లాజా, హైదరాబాద్‍ నందు జరుగగా, ఇట్టి కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా  విశ్రాంత మాజీ కమీషనర్‌ B. P. ఆచార్య IAS , విశ్రాంత మాజీ డైరెక్టర్  కిస్మత్‌ కుమారు , శ్రీ ప్రమోద రావు, సుభాష్ గౌడ్,  సత్యా రావు, మాజీ CIE శ్రీ రమేశ్‌ కుమార్‌  పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, 75 సంవత్సరాలు పూర్తి చేసిన విశ్రాంత ఉద్యోగులను ఘనంగా సన్మానించినారు. ఇట్టి కార్యక్రమమును మాజీ CIE  రమేశ్‌ కుమార్‌ USA  పూర్తిగా ఆర్థిక సహాయ సహకారాలు అందించినారు. ఈ కార్యక్రమమునకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగులు  అందరు పాల్గొని ద్విగ్విజయం చేసినారు.  మరియు  లాల్కోట వీరప్ప వ్రాసిన అమృతవాక్కులు - నిత్య సత్యాలు కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగినది. ఈ కార్యక్రమ అద్యక్షత కిస్మత్‌ కుమారు నిర్వాహకులు విశ్రాంత CIE  విజయ భాస్కర్‌ రెడ్డి, విశ్రాంత DD శ్రీ రషీద్ లు సంయుక్తముగా నిర్వహించారు.

రేపు నల్గొండ జిల్లాకు రానున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి

రేపు నల్గొండ జిల్లాకు రానున్న రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి • *నల్గొండ పట్టణంలోని మంత్రి నివాసంలో జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలను కలుసుకోనున్న మంత్రివర్యులు* • *గత యేడాదిగా కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్ల తీరు.. భవిష్యత్ లో అనుసరించాల్సిన విధానం జిల్లాలోని మున్సిపాలిటీలలో తాగునీటి కల్పనలో  మరియు జిల్లాలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరాలో ఎదరవుతున్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే మార్గాలు నిరంతర విద్యుత్ సరఫరాలో ఎదరవుతున్న సమస్యలు.. ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై కలెక్టర్ ఆఫీసులో జిల్లా కలెక్టర్ ఇతర విభాగాల అధికారులతో రివ్యూ మీటింగ్* • *అనంతరం జిల్లా అధికారులతో ఇష్టాగోష్టి.*

*గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం*

*గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం* *అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత* *"విముక్తి", "అణచివేత", "నియంతృత్వ పాలన", "వ్యవస్థల విధ్వంసం", "వివక్ష" వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన* *గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన*  

పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల పౌండేషన్ అండగా ఉంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా

  పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఉప్పల పౌండేషన్ అండగా ఉంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా హైదరాబాద్ నాగోల్:  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటకు చెందిన పేదింటి అమ్మాయికి పూస్తే మట్టెలు చీర గాజులు పండ్లు మరియు పెళ్లి కోసం 100 కిలోల బియ్యాన్ని అందించడం జరిగిందని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. పెళ్లికూతురు పేరు బుడిగే భవాని సిద్దిపేటకు చెందిన ఈ అమ్మాయి బీసీ గౌడ కులమునకు చెందినది గరీబోళ్లకు అండగా ఎల్లప్పుడూ తెలంగాణ వ్యాప్తంగా కులాలకు అతీతంగా మతాలకతీతంగా పేదింటి ఆడబిడ్డల వివాహం కోసం ఉప్పల పౌండేషన్ ఎల్లప్పుడు చేదోడుగా ఉంటుంది అని ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో రజిత టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మరియు పెళ్లికూతురు పాల్గొన్నారు .

*శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*

 *శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*          ఎల్బీనగర్ నియోజకవర్గం సాయి నగర్ నాగోల్ డివిజన్ లో జరిగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. స్వామి దీవెనలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిండుగా ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అయ్యప్పను కోరుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా.  ఈ కార్యక్రమంలో ఇలాయిపల్లి కిరణ్ మరియు పిల్లాయిపల్లి నర్సింగరావు మరియు దళిత సంఘం నాయకులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు .

ఘనంగా వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు

  ఘనంగా వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు  చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ వెలిశాల రవి ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ఇట్టి కార్యక్రమంలో yrp ట్రస్ట్ ఇంఛార్జి యమ దయాకర్ పిల్లలకు షర్ట్స్ ఫ్రూట్స్ సాప్ట్ డ్రింక్స్ అందజేసారు. కార్యక్రమం లో మునిసిపల్ కౌన్సిలర్ యమా కవిత, బొమ్మ పాల గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ వై ఆర్ పీ ఫౌండేషన్ ఫౌండర్ ఎలిశాల రవి ప్రసాద్ పుట్టిన రోజు సందర్బంగా నల్గొండ జిల్లా వై ఆర్ పీ ఫౌండేషన్ కన్వీనర్ యామ దయాకర్ మరియు వార్డు కౌన్సిలర్ కవిత గారు నల్గొండ వై ఆర్ పీ యూత్ అందరు కలిసి కేక్ కటింగ్ చెయ్యడం జరిగింది. అల్పాహారం పంపిణీ  ఈరోజు వై ఆర్ పి ఫౌండేషన్ ఫౌండర్ ఎలీషాల రవి ప్రసాద్ బర్త్ డే సందర్భంగా లైన్స్ క్లబ్ తో వై ఆర్ పి ఫౌండేషన్ కన్వీనర్ యామ దయాకర్ గొల్లగూడ హాస్పిటల్ లో సుమారు 400 మంది పేషెంట్ అటెండర్లకు అల్పాహారం పంపిణీ చేశారు.  

పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు డిసెంబర్ 27వ తేదీ లోగా సమర్పించాలి

 రాష్ట్ర శాసన సభ సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చుల వివరాలు డిసెంబర్ 27వ తేదీ లోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ రిటర్నింగ్ అధికారులను,సహయ వ్యయ పర్యవేక్షణ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, సహయ వ్యయ పర్యవేక్షణ అధికారుల తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోటీ చేసిన అభ్యర్థుల ప్రతి రోజూ నిర్వహించిన అకౌంట్స్ రిజిస్టర్లు, క్యాష్ రిజిస్టర్లు, బ్యాంక్ రిజిస్టర్లు,సమగ్ర వివరాలను నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. సి 13 రిపోర్ట్స్, అనెక్సర్ లను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రొఫార్మాలలో నింపే విధానాన్ని రిటర్నింగ్ అధికారులు,సహయ వ్యయ పర్యవేక్షణ అధికారులు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎన్కోర్ ద్వారా సంబంధిత డాటాను నమోదు చేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి అర్. కిరణ్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్లు రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

పదవీ భాద్యతలు స్వీకరించిన తుమ్మల

 పదవీ భాద్యతలు స్వీకరించిన తుమ్మల          హైదరాబాద్, డిసెంబర్ 15 :: రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రిగా తుమ్మల నాగేశ్వర రావు నేడు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు. ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ కమీషనర్ హనుమంత రావు, సత్య శారద లతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రి కి శుభాకాంక్షలందచేశారు.

ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్

  ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ హైదరాబాద్:  రాష్ట్ర  శాసనసభ, శాసనమండలి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్ర శాసన సభకు నేడు ఉదయం విచ్చేసిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర్ రాజన్ కు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు. జాతీయ గీతాలాపన అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  

IAS అధికారుల ట్రాన్స్ఫర్ లు

IAS  అధికారుల ట్రాన్స్ఫర్ లు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి కాటా మెడికల్ అండ్ హెల్త్  కమీషనర్ గా శైలజా రామయ్యర్ * ఎనర్జీ సెక్రటరీ, ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ గా హెల్త్ సెక్రటరీ ముర్తజా రిజ్వీ * ట్రాన్స్ కో, జెన్ కో జాయింట్ ఎండీ గా సందీప్ కుమార్ ఝా * సీఎం ఓఎస్డీ గా కృష్ణ భాస్కర్ * టీఎస్ ఎన్పీ డీసీఎల్  సీఎండీ గా వరుణ్ రెడ్ది టీఎస్ఎస్పీడీసీఎల్  సీఎండీ గా  ముషారఫ్ అలి ఫారుకీ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి. గోపి  

కేసీఆర్ ని పరామర్శించిన అక్కినేని నాగార్జున.

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించిన  ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున. కేసీఆర్ గారిని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీ.ఎం. రేవంత్ రెడ్డి ఫోన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి సీ.ఎం. రేవంత్ రెడ్డి ఫోన్ హైదరాబాద్, డిసెంబర్ 13 :: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేడు ఫోన్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలందించాలని సి.ఎం. కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పరస్పర సహకారం ఉండేలా సమావేశం ఏర్పాటు చేసేలా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరారు.  

ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేయండి - అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్

ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ ప్రకారం డిసెంబర్ 31 లోగా వానాకాలం 2022-23 సీజన్ సి.ఎం.ఆర్ డెలివరీ పూర్తి చేసి ఎఫ్.సి.ఐ కి వెంటనే అప్పగించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె. శ్రీనివాస్ కోరారు.  బుధవారం అదనపు కలెక్టర్ తన చాంబర్లో పౌరసరఫరాల అధికారులు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం 2022-23 సీజన్లో 2.98 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డెలివరీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2.78లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్(93 శాతం) మిల్లర్ లు డెలివరీ చేశారని,మిగిలిన 20 వేల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్ డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు   వానాకాలం పూర్తి చేసిన మిల్లర్ లు యాసంగి 2022-23 సి ఎం.అర్.డెలివరీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.యాసంగి 2022-23 సీజన్ కు సంబందించి 4.66 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.కు గాను ఇప్పటి వరకు 1.04 లక్షల మెట్రిక్ టన్నుల సి.ఎం.అర్.డెలివరీ చేశారని తెలిపారు. ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లర్లను అప్రమత్తం చేస్తూ పౌరసరఫరాల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా రైస్ మిల్లర్ల వారిగా ఎన్ఫోర్స్మెం

*అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా*

 *అయ్యప్ప స్వామి మహా పడిపూజ లో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా* రామంతపూర్ లోని సాయి స్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ జరిగింది ఈ మహా పడిపూజ లో తెలంగాణ టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  పాల్గొన్నారు తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు సుభిక్షంగా ఉండాలని అయ్యప్ప స్వామిని దండం పెట్టుకోవడం జరిగిందని అయన అన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి స్వామి గౌతమ్ కన్నె స్వామి తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ప్రశాంత్ గౌడ్ మరియు చాలామంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు .

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

 సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కలసిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఆయన భార్య, ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి, ఈరోజు 10, జన్‌పథ్‌లో గౌరవనీయులైన శ్రీమతి సోనియా గాంధీ ని మరియు శ రాహుల్ గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మరియు ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లి లోక్ సభ స్పీకర్,  ఓం బిర్లాకు లోక్‌సభకు ఉత్తమ్ కుమార్ రెడ్డ రాజీనామా సమర్పించారు.

*మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత*

 *మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పరామర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత* హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.  వెంకట్ రెడ్డి  ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి  త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత  ఆకాంక్షించారు.

మల్లు భట్టి విక్రమార్క కు ప్రజా భవన్

డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు ప్రజా భవన్ ను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు.. రేపు మధ్యాహ్నం ప్రజా భవన్ లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  

వచ్చే ఏడాది 2024 సెలవులు ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి చూడొచ్చు

  వ చ్చే ఏడాది 2024 సెలవులు ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1tGwcnBVCCw0s7Ptkj9YDmgIkD-m-qj5-/view?usp=drivesdk

భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి

  భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించు కుంటు రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధి పనులు గుర్తుచేసుకుని, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని వీడుతున్నందుకు..ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా *భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటా* అంటూ  ఫేస్ బుక్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయన పోస్ట్ యధాతధంగా చదవండి. భువనగిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఎంతో బరువైన హృదయం తో మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేయునది.... 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బం.. నాటి ముఖ్యమంత్రి కేసిఆర్ వచ్చి టీఆర్ఎస్ ను గెలిపిస్తే నల్గొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా అని ప్రకటించారు. దీంతో ఆయన మాటలు నమ్మారు. మొట్టమొదటిసారిగా నేను ఓటమి చెందాను. నాకు రాజకీయంగా అది ఒక సంధి దశ.  2019 లో లోక్ సభ ఎన్నికలొచ్చాయి. భువనగిరి ఎంపి స్థానానికి పోటీ చేయమని కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలోకి ఆమ్రపాలి

 ''తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలోకి ఆమ్రపాలి ఆంధ్రప్రదేశ్ కు చెందిన IAS ఆమ్రపాలి తిరిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు. 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన ఆమె, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కలెక్టర్ గా పని చేశారు. తన పని తీరుతో డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఆమెకు ఢిల్లీలోని PM కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. అక్కడ డిప్యూటీ సెక్రటరీ చేరారు. ఇప్పుడు మళ్లీ TS ప్రభుత్వంలోకి వచ్చారు. ఈ మేరకు ఇక్కడ రిపోర్ట్ చేసి CM ను కలిశారు.

పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ కలసిన ప్రకృతి వ్యవసాయ రైతు అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్

పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్ కలసిన ప్రకృతి వ్యవసాయ రైతు అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ హైదరాబాద్ : భారతదేశంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు, పద్మశ్రీ శ్రీ సుభాష్ పాలేకర్  హైదరాబాద్ వచ్చిన సందర్భంగా  శ్రీ రామచంద్ర మిషన్ లో సమావేశం ఏర్పాటు  చేశారు.  ప్రకృతి వ్యవసాయ  రైతు  అంజిరెడ్డి, పర్యావరణ ప్రేమికుడు మిట్టపల్లి సురేష్ లు సుభాష్ పాలేకర్ ను కలిసి ఆశీర్వాదములు తీసుకున్నారు. ఈ సందర్భంగా  ప్రకృతి వ్యవసాయము చేస్తున్న కృషికి  అంజిరెడ్డి ని పాలేకర్ అభినందించారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి*

*ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి* *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.*  ప్రజావాణి కార్యక్రమం లో ప్రజల నుండి అందిన దరఖాస్తులు  సోమవారం  నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా అధికారులను సమావేశ పరచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు,  రెవెన్యూ, పశు సంవర్థక శాఖ,సర్వే ఆండ్ ల్యాండ్ రికార్డ్స్, డి.అర్.డి. ఓ, వివిధ శాఖలకుదరఖాస్తులు అంద చేశారు.

రవాణా శాఖ లో తోలుమందం అధికారి ఓ అక్రమ .... రావు!!

 రవాణా శాఖ లో తోలుమందం అధికారి అక్రమ .... రావు!!  STA కార్యాలయం లో Ao గా పని చేస్తున్న అధికారిపై  తన అధికార మదం తో బూతులు తిట్టిన మోనార్క్.  ........ కొడకా అంటూ ఎదురుగా వస్తుంటే కూడా విష్ చేయవారా…..అంత బలిసిపోయిందా అంటూ రెచ్చిపోయిన ఓ ...రావు. వెంటనే అతని పై ఫయర్ అయి…..ట్రిబునల్ కు ట్రాన్స్ఫర్.  మరో ఘటన లో తన చాంబర్ కు వచ్చి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిందని ఓ మహిళ ఉద్యోగి పై చిందులు. వెంటనే సస్పెండ్ చేయాలని పట్టుబట్టిన ప్ర బుద్దుడు. ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ పై ఒత్తిడి. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం మని చెప్పిన కమీషనర్. సార్ నేను ఏమి తప్పు చేయలేదు నన్ను క్షమించండి అంటూ కాళ్లు పట్టుకోని బోరున ఏడ్చిన మహిళా ఉద్యోగి. నేను ఏ రికార్డులు చేయలేదు నన్ను వదలి పెట్టండి అంటూ ప్రాధేయపడ్డ బాధితురాలు.  కొంచం కూడా కనికరం చూపని ఓ....రావు అనుచరులు. దౌర్జన్యంగా తన మొబైల్ ఫోన్ సీజ్ చేసి సస్పెండ్ చేసే దాకా కదలని ఆ...రావు అనుచరులు. ఇప్పటికి తన మొబైల్ ఇవ్వని అధికారి.  సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన విషయాన్ని బయట పెట్టని అధికారులు.  మరో మహిళా అధికారిని కి బెదిరింపులు. తన మాట వినలేదని  అధికారిని ట్రిబునల్ కు ట్ర

నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన

నేడు ఢిల్లీలో తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన మంత్రిగా ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ కానున్న వెంకటరెడ్డి తెలంగాణలో రహదారులకు సంబంధించిన, జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై నితిన్ గడ్కరీ తో చర్చించుకున్న వెంకటరెడ్డి అధికారుల బృందం తోటి కలిసి కేంద్రమంత్రిని కలవనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి  తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి  

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023

  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 *ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యములో తేదీ 22 డిసెంబర్ 23 న హైదరాబాద్ లో ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ కన్వెన్షన్-2023 నిర్వహిస్తున్నామని గ్లోబల్ అధ్యక్షుడు టంగుటూరి రామకృష్ణ తెలిపారు. వైశ్యుల మధ్య పరిచయము, ఉభయ సహకారము, WAM అందించే సేవలు తెలియచేయడం మొదలగు విషయాలపై కన్వెన్షన్ నిర్వహించబడునని అయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమములో ప్రముఖుల సందేశాలు, ప్రమాణ స్వీకరాళ్ళు, సాంస్కృతిక కార్యక్రమములు వుండగలవని, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ సభ్యులందరు పాల్గొనగలరని , కార్యస్థలము త్వరలో తెలుపబడునని, 17 జులై 2022 న అందరూ పాల్గొని విజయవంతం చేసినట్టే ఈ కన్వెన్షన్ కూడా సభ్యులందరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.

ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనబోజనాల కార్యక్రమం లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా.

ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక  వనబోజనాల కార్యక్రమం లో ఉప్పల  శ్రీనివాస్  గుప్తా. హైదరాబాద్  ట్యాంకబండ్  లోని  సంజీవని  పార్క్,  వద్ద  ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యంలో నిర్వహించిన కార్తీక  వనబోజనాలకు , మియాపూర్ Naren Garden లో ఆర్య vyshya ఐక్య వేదిక ,మనికొండ ఆర్య vyshya సంఘం ఆధ్వ్యంలో జరిగిన కార్తీక వనభోజనాలు కార్యక్రమంలో హాజరైన మాజీ టూరిజం ఛైర్మెన్ ఇంటర్నేషనల్ వైశ్  ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఉప్పల  శ్రీనివాస్  గుప్తా .