Skip to main content

Posts

Showing posts from November, 2023

ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  ఓటర్ స్లిప్ అందలేదా? కంగారు పడకుండా ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ: ఓటు వేసేందుకు ఓటర్ స్లిప్ అవసరం. ఈ నెల 25తో ఓటర్ స్లిప్పుల పంపిణీ ముగిసింది. వివిధ కారణాల వల్ల కొందరికి స్లిప్పులు అందలేదు.  అయితే వాటిని ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది.  ఈ క్రింది లింక్ ను Touch చేసి / Open చేసి తెలుసుకోవచ్చు. https://electoralsearch.eci.gov.in/ వివరాలు లేదా EPICనంబర్ లేదా  మొబైల్ నంబర్ Mobile Number ఎంటర్  చేసి వివరాలుతె లుసుకోవచ్చు

Article by కందుకూరి రమేష్ బాబు విను తెలంగాణ - 22 ఇది ‘కామా’కాదు, ఫుల్ స్టాప్ పెట్టే నియోజకవర్గం!

  Article by కందుకూరి రమేష్ బాబు విను తెలంగాణ - 22 ఇది ‘కామా’కాదు, ఫుల్ స్టాప్ పెట్టే నియోజకవర్గం!  కామారెడ్డి రాష్ట ఎన్నికల చరిత్రలో కీలకం కాబోతున్నది. అది ముఖ్యమంత్రి, బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ గారి గెలుపు కు ‘కామా’ పెట్టడమే కాదు, ఏకంగా వారి రాజకీయ భవితకు ఈ దఫా ‘ఫుల్ స్టాఫ్’ పెట్టేలా ఉన్నదీ అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చుగానీ రేపు అదే జరిగేలా ఉన్నది.  కందుకూరి రమేష్ బాబు  మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్న కెసిఆర్ గారు ఏనాడైతే గజ్వేల్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారో అప్పుడే ఆయన నైతికంగా ఓడిపోయారని చెప్పాలి. ఇక భౌతికంగా కూడా ఆయన పరిస్థితి ఇక్కడ కష్టంగా ఉంది. ఓడిపోయే స్థితే ఉన్నది. కామారెడ్డిలో స్థానికులైన బిజెపి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారు ఇక్కడ ప్రజాదరణ విషయంలో మంచి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన గనుక కెసిఆర్ గారిని ఓడించారూ అంటే అది కెసిఆర్ గారి రాజకీయ భవితకు తాత్కాలికంగానైనా పెద్ద ఫుల్ స్టాప్ పెడుతుంది. ఆ పరిస్థితి ఉందనే ఈ వ్యాసకర్త క్షేత్ర పర్యటన స్పష్టం చేస్తోంది. ఈ మాటకు మరో ఆధారమూ ఉన్నది. అది రేవంత్ రెడ్డి గారి తాజా ఊపు.  కెసిఆర్

చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రచారం నిర్వహించిన NRI గుండా షణ్ముఖ

 చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు ప్రచారం నిర్వహించిన NRI గుండా షణ్ముఖ నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా చికోటి ప్రవీణ్ కుమార్ తో పాటు NRI గుండా షణ్ముఖ ప్రచారం నిర్వహించారు. భాస్కర్ టాకీస్ అంబేడ్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర బీజేపి నాయకులు చికోటి ప్రవీణ్ కుమార్ కు స్వాగతం పలికిన NRI గుండా షణ్ముఖ. అక్కడ నుండి చీకొటి ప్రవీణ్ వెంట ప్రకాశం బజార్ లో డోర్ డోర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం NRI గుండా షణ్ముఖ అధ్వర్యంలో స్టే ఇన్ హోటల్ లో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో అధిక సంఖ్యలో వైశ్యులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.  నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కు మద్దతుగా పలువురు NRI లు ప్రచారం నిర్వహించారు.

అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం - కేంద్ర సహాయ మంత్రి శోభా కరం

 తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి   అభివృద్ది పేరుతో కమీషన్లు దండుకున్న కేసీఆర్ కుటుంబం - కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే నల్లగొండ నవంబర్ 28 తెలంగాణ రాష్ర్టంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు అర్భన్కాలనీతో పాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మందికి కేంద్ర ప్రభుత్వం ఆసరగా నిలిచిందని, అన్ని రంగాల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని, ప్రజలు ఉపయోగ పడే పథకాలను తెలంగాణ ప్రజలకు చేరవేడంలోరాష్ర్టం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రం నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ

*తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి* - కేంద్రమంత్రి శోభా కరంద్లాజే-

 *తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ను అధికారంలోకి తేవాలి* *ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కేసీఆర్ విఫలం* *- కేంద్రమంత్రి శోభా కరంద్లాజే* *నల్లగొండ నవంబర్​ 27* తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేసి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తెలంగాణలో డబ్బులు ఇంజన్ సర్కార్ను అధికారంలోకి తీసుకురావాలని కేంద్రమంత్రి శోభా కరంద్లాజే కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించిన బిజెపి ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆమె పాల్గొని ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, యువకులంతా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి చెంద లేదని, సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని, కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలను సైతం తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలోని పల్లెలు, మునిసిపాలిటీలలో హరితహారం, గ్రామ పంచాయతీల అభివృద్ధి

శాలివాహన సంఘము మద్దతు బీజేపీ అభ్యర్థి మాధగాని శ్రీనివాస్ గౌడ్ కే

 నల్లగొండ పట్టణం పాతబస్తీ శాలివాహన సంఘ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన సమావేశం లో ఈరోజు బీజేపీ అభ్యర్థి మాధగాని శ్రీనివాస్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు తెలియ చేశారు. ఈసందర్బంగా BC కుటుంబాలు బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది, ఈ కార్యక్రమం లో బొడ్డుపల్లి మల్లయ్య బొడ్డుపల్లి ప్రసాద్ రాచకొండ చందు ఊట్కూరి శ్రీనివాస్ ప్రొద్దుటూరు శ్రీహరి ఊట్కూరు మల్లేష్ బొడ్డుపల్లి గిరి బొడ్డుపల్లి మహేష్ బొడ్డుపల్లి జనార్ధన్ బొడ్డుపల్లి రాజు, ఖమ్మంపాటి నాగరాజు బొడ్డుపల్లి కనకయ్య బొడ్డుపల్లి ఎల్ఐసి యాదగిరి ఊట్కూరు సత్తయ్య బొద్దుపల్లి చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి - బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్*-

*బిఆర్ఎస్, కాంగ్రెస్ లో బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం*   *నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి. *బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్* *నల్గొండ నవంబర్ 25* *గత 70లుగా బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీసీలకు సీట్ల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అన్నారు.*  *శనివారం నల్గొండలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలో ఓబిసి కమిషన్ పెట్టి బీసీలకు పెద్దపీట వేశారని, ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీ బిల్లు కోసం చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా గత మూడు నెలల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డతోపాటు బిజెపి అగ్ర నేతలను కలిసి R. కృష్ణయ్య బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తానని స్వయంగా బిజెపి అగ్రనేతలు ప్రకటించడం హర్షనీయమన్నారు. అ

*నల్గొండలో బిజెపి గెలుపే ధ్యేయంగా పని చేయాలి*

 *నల్గొండలో బిజెపి గెలుపే ధ్యేయంగా పని చేయాలి*  *బిజెపి నల్గొండ అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్* *బిజెపి ప్రచారానికి అపూర్వ స్పందన* *నల్లగొండ నవంబర్ 23* నల్గొండ నియోజకవర్గంలో బిజెపి గెలిపిహంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కోరారు. గురువారం నల్గొండ పట్టణంలోని 42, 38 వార్డులతో పాటు నల్గొండ మండలంలోని దొనకల్, కోదండపురం, చెన్నుగూడెం, పాత నర్సింగ్ భట్ల, నారబోయిన గూడెం, దోమలపల్లి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి నల్గొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని, ప్రజలంతా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ మద్దతు తెలుపుతున్నారన్నారు. నల్గొండ నియోజకవర్గంలో అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు కాషా జండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఇప్పటికే బీసీ సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు, ఎంఆర్పిఎస్ కూడా మద్దతు తెలపడం జరిగిందని, వారందరూ ఈ ఎన్నికల్లో బిజెపిని గెలిపించేందుకు శాయా శక్తుల పని చేయాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి

బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి- బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్

బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుల్లా పనిచేయాలి-  బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ నల్గొండలో బిజెపి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని నల్గొండ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ కోరారు. బుధవారం నల్గొండ మున్సిపాలిటీ పరిధి 18,19 వార్డులో పానగల్ ఎల్లమ్మ టెంపుల్ మరియు SPT మార్కెట్లో గడపగడపకు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బీజేపీని ఆదరించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్, టిడిపి, కమ్యూనిస్టు, బీఆర్ఎస్ కు అవకాశం కల్పించారని, ప్రజలంతా ఈ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఒక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరారు. గడపగడపకు వెళ్తున్న తరుణంలో ప్రజలంతా తమకు మద్దతిస్తున్నారని, నల్గొండ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పాలించిన పార్టీలు నల్గొండ అభివృద్ధిని పట్టించుకోలేదని, ఈ ఎన్నికల్లో అసెంబ్లీకి పంపితే నల్గొండను ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుతానన్నారు. నల్గొండ మున్సిపాలిటీ తో పాటు నల్గొండ, తిప్పర్తి, కనగల్ మండలాల్లో కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన

భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో పేద ప్రజలకు ,అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే విధంగా ఉందన్న నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్

  భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టో పేద ప్రజలకు ,అన్ని వర్గాల ప్రజలకు ఆదుకునే విధంగా ఉందని నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మిగతా పార్టీల మేనిఫెస్టోలు ఆచరణ సాధ్యం కాని విధంగా ఉన్నాయన్నారు. ఆదివారం భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గ బిజెపి అభ్యర్థి మాదగాని శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల ఏజెంటు నూకల నరసింహ రెడ్డి లు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలను ఆదుకొని వారిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా ఉందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ట్యాగులైన సబ్కకా సత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ లను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం తెలిపారు. తెలంగాణ రాష్టంలో సుపరిపాలన సమర్థవంతమైన పాలనపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి అనగారిక వర్గాల సాధికారిక సామాజిక న్యాయం జరిగే విధంగా కృషి చేయడమే బిజెపి లక్ష్యం అని తెలియజేశారు. ఇప్పటికే కేంద్రంలో మోడీ ప్రభుత్వం నారిశక్తి ద్వారా మహిళల అభివృద్ధి శ్రీకారం చుట్టడంతో పాటు రైతుల ప్రయోజనమే భారతీయ జనతా పార్టీ ముఖ్య

ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిగారిని అత్యధిక ఓట్లతో గెలిపించండి - పాలడుగు

  *ప్రజా పోరాటాల వారధి సిపిఎం కు మద్దతు ఇవ్వండి*         *ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిగారిని అత్యధిక ఓట్లతో గెలిపించండి*     ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ప్రజల వెన్నంటి ఉండే సిపిఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు. అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఈరోజు నల్లగొండ మండలం, దండంపల్లి అన్యపర్తి అప్పాజీపేట దోమలపల్లి నర్సింగ్ పట్ల దొనకల్లు కంచనపల్లి అనంతారం కొత్తపల్లి గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ఓట్లు లేవు గెలవరని అన్న రాజగోపాలరెడ్డి ఎర్ర జెండా మెడలో వేసుకుని తిరగడం సిగ్గుమాలిన చర్య అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సంగారెడ్డిలో సిపిఎం ఆఫీస్ కి వెళ్లి ఓట్లు వేయమని అడగడం ఏమిటని ప్రశ్నించారు. కమ్యూనిస్టులకు అధికారం ఇస్తే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తారని అన్నారు. రైతులు కార్మికులు వ్యవసాయ కూలీల హక్కుల కొరకు పోరాడింది కమ్యూనిస్టులేనని గ్రామీణ ఉపాధి హామీ చట్టం తెచ్చింది కమ్యూని