Skip to main content

Posts

Showing posts from January, 2024

*మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి*

  *మహిళా శక్తి కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయండి*  నల్లగొండ పట్టణంలో రేపు ఆదివారం 28వ తేదీన జరిగేటటువంటి మహిళా శక్తి సమ్మేళనం కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కార్యదర్శి dr. సింధూర కోరారు. మహిళల్లో చైతన్యం కలిగించడం కోసం, సాంస్కృతి, కుటుంబ విలువలు పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళలని భాగస్వామ్యం పెంచడం, మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం అనే ఉద్దేశంతో మహిళా శక్తి సమ్మేళనం ఏర్పాటు చేయడం జరుగుతుందని పత్రిక ప్రకటన ద్వారా నిర్వాహకురాలు నన్నూరి లత తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ ఎస్పీ చందనా దీప్తి పాల్గొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి, విద్య ,వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామికవేదలు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలు పాల్గొన గలరని కోరారు. రేపు జరిగే ఈ కార్యక్రమం నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి జిఎం గార్డెన్స్ (గుండెగోని మైసయ్య కన్వెన్షన్ ఫంక్షన్ హాల్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుందని తెలియజేశారు.

HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ

  HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించిన ఏసీబీ 45పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ సంచలన విషయాలు శివ బాలకృష్ణ ఇల్లు సహా 18చోట్ల హి ఏసీబీ సోదాలు  భారీగా ఆస్తుల గుర్తింపు, 50ప్రాపర్టీస్ డాక్యుమెంట్లు సేకరించిన ఏసీబీ ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం ఐదు కోట్లు బహిరంగ మార్కెట్ లో 10రెట్లు 99లక్షల నగదు, నాలుగు కార్ల విలువ 51లక్షలు,బ్యాంకు బాలెన్స్ 58లక్షలు గోల్డ్ , సిల్వర్, వాచ్ లు,ఫోన్స్ , గృహోపకరణాలు మొత్తం వాల్యూ8కోట్ల 26లక్షలు  పలు ఇన్ఫ్రా కంపెనీ లపై సైతం ఏసీబీ సోదాలు 155డాక్యుమెంట్ షీట్స్, 4పాస్బుక్స్ స్వాధీనం Lic పాలసీ బాండ్స్ 20 ఐటీ రిటర్నస్ డాక్యుమెంట్లు స్వాదనం నాలుగు బ్యాంకు పాస్బుక్స్ భినామీలను విచారించాల్సి ఉంది ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది  పలువురు భినామీలను గుర్తించిన ఏసీబీ ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్ లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18చోట్ల  ఏసీబీ సోదాలు!

స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు

 స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో విమలా దేవి చిత్రాలు స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ హైద్రాబాద్ 20వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ ఆఫ్ జాయ్ గ్రూప్ ఆర్ట్ ఎగ్జిబిషన్ శుక్రవారం 26 జనవరి 2024 న ప్రారంభమైంది. ఈ 31 జనవరి వరకు జరగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ప్రముఖ చిత్రకారిని శ్రీమతి మారోజు విమలా దేవి చిత్రించిన చిత్రాలు ప్రదర్శింప బడ్డాయి..

చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం

  చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం నల్లగొండ జిల్లాలో చిన్న పత్రిక విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం సమర్పించారు శుక్రవారం నాడు మంత్రి స్థానికంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా చిన్నపత్రికల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మెమోరాండం సమర్పించడం జరిగింది .జిల్లా కేంద్రంలో సుమారు 50 మందికి పైగా చిన్న దినపత్రికలతో పాటు మాస పక్ష వారపత్రికలు నడుపుతున్నారని వారు తెలిపారు గత కొన్ని దశాబ్దాలుగా చిన్న పత్రికలు నిర్వహిస్తూ ఆర్థిక భారంతో సతమగుతమవుతున్నారని సొంత గూడు లేక అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్నారని చెప్పారు ఒక వైపు పత్రిక నిర్వహణ మరొకవైపు తన కుటుంబ పోషణ భారాన్ని భరించలేక ఆర్థికంగా నలిగిపోతున్నారని అన్నారు పాత్రికేయుల పట్ల పక్షపాతిగా పేరున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో చిన్నపత్రిల వారందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించి పత్రిక బాంధవుడుగా పేరు తెచ్చుకోవాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ జర్నల

జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు

  75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా  నల్గొండ జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తేనేటి విందు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ 200 సంవత్సరాల పోరాటం,ఎందరో మహనీయులు త్యాగం పలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తెలిపారు. భారత దేశం రాజ్యాంగ విలువలు కాపాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు,జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బాలూ మాస్టర్ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లా అధికారులు డి.యం.హెచ్. ఓ డా.కొండల్ రావు తన పాటలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.ఆయన పాటలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్ లను జిల్లా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమానికి ఎస్.పి.చందన దీప్తి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లాక్ష్మా రెడ్డి,అర్ డి. ఓ రవి,రిటైర్డ్ ఐ. ఏ ఎస్.అధికారి చోల్లెటి ప్రభాకర్,డి.సి.సి.అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా అధికారులు హాజరు అయ్యారు.

6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను ఆన్లైన్ లో నమోదు - జిల్లా కలెక్టర్ హరుచందన దాసరి

6 గ్యారంటీలు అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను  ఆన్లైన్ లో నమోదు - జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి నల్గొండ :  6 గ్యారంటీలలో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందరమ్మ ఇల్లు మరియు చేయుత పథకాల అమలు కొరకు 5 లక్షల 27వేల 492 దరఖాస్తులను స్వీకరించి ఆన్లైన్ లో నమోదు చేశామని నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి తెలిపారు. గణతంత్ర దిన్నాన్ని పురస్కరించుకొని నల్గొండ పోలీస్  హెడ్ క్వార్టర్స్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నల్గొండ జిల్లా  కలెక్టర్ హరుచందన దాసరి జాతీయ  జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ 75వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరుపుకుంటున్న వేడుకలనీ, జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, అధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థినీ విద్యార్థుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు మనందరికి పండుగ రోజని, ప్రపంచంలోనే గొప్ప సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రదేశంగా భారతదేశమును నిలుపుకునేందుకు భారతరత్న డా.బి.ఆర్ . అంబేడ్కర్ గారి సారథ్యంలో భారత రాజ్యాంగం1950, జనవరి 26న అమలులోకి తెచ్చుకున్నామని, భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరా

ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ

  ACB అదుపులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ  బాలకృష్ణ ఆదాయానికి మించి నుంచి ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణలకే సోదాలు చేసి బాలకృష్ణను  అదుపులోకి తీసుకున్నామని,  కోర్టులో హాజరు పరుస్తామని ACB అధికారులు తెలిపారు. సోదాల్లో  భారీగా ఆస్తులు,  మార్కెట్ వేల్యూ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తింపు. నగలు నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనపరచుకున్న అధికారులు. నానక్ రామ్ గూడ లోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల నగదు స్వాధీనం.  హైదరాబాదులో విల్లా లు..ఫ్లాట్లు తో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్ది ల్యాండ్. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలు స్వాధీనం. మొత్తం 20 చోట్ల సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు. బాలకృష్ణ ఇంటి తోపాటు బంధువులు మిత్రులు కంపెనీలో సోదాలు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం. 80 కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు కూడా స్వాధీనం. పెద్ద మొత్తంలో ఐఫోన్లను సీజ్ చేసిన అధికారులు. 90 ఎకరాలకు సంబంధించిన భూమి పత్రాలు స్వాధీనపరచుకున్న అధికారులు కొడకండ్లలో 17 ఎకరాలు.. కల్వకుర్తిలో 26 ఎకరాలు.. యాదాద్రి లో 23 ఎకరాల ..జనగామలో 24 ఎకరా

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు

 హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ప్రస్తుత RERA సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ బృందాలు ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన శోధన ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్నాయి. 👇👇👇👇 HMDA పై ACB కన్ను అనే ఆర్టికల్ ను గూఢచారి ప్రచురించిన కొన్ని రోజుల్లోనే మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో ACB బృందాలు సోదాలు చేయడం గమనార్హం. వార్త లింక్  ఓపెన్ చేసి చదవ వచ్చు  https://www.gudachari.page/2024/01/hmda-acb_19.html హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ప్రస్తుత రెర సెక్రటరీ, మెట్రో రైల్ డైరెక్టర్ శివ బాలకృష్ణ తో సంబంధం ఉన్న ఇళ్లు, కార్యాలయాలు, ఇతర సంస్థలపై అవినీతి నిరోధక శాఖ బృందాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బుదవారం ఉదయం నుంచి భారీ సోదాలు నిర్వహిస్తున్నాయి.  అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. శివ బాలకృష్ణ ఇళ్లు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. శివ బాలకృష్ణ తన ప

*KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*

  *KVPS మహనీయుల స్ఫూర్తి క్యాలండర్ ఆవిష్కరించిన  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*    సమాజంలో వేలునుకున్న అసమానతలు కుల వివక్షకు వ్యతిరేకంగా తమ జీవితాంతం పోరాడిన మహనీయులు సామాజిక తత్వవేత్తలు మనందరికీ మార్గదర్శకులని, ఆ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ ముందుకు సాగుతూ సామాజిక ఉద్యమాలు చేయడం అభినందనీయమని రోడ్లు భవనాలు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభినందించారు.     సోమవారం రోజున నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  చేతుల మీదుగా కెవిపిఎస్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను కెవిపిఎస్ జిల్లా నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేవిపియస్ నల్లగొండ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తితో కేవీపీఎస్ నిర్వహిస్తున్న సామాజిక ఉద్యమాలు ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని, ప్రతిఘటన శక్తిని పెంపొందిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కోసం కెవిపిఎస్ పోరాటాలు నిర్వహించి అనేక చట్టాలను సాధించిందని అన్నారు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ద్వారా రావలసిన నిధులు పక్కదారి పడుతున్నాయని దళిత గిరిజన

ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం.

  ఈ నెల 28 న నల్గొండ లో మహిళా శక్తి సమ్మేళనం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అంటూ మహిళలలో చైతన్యం కలిగించటం ద్వారా భారతీయ సంస్కృతి కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్నిపెంచడం వివిధ రంగాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను కనుగొనడం మహిళలలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంఅనే ఉద్ధేశముతో ' మహిళాశక్తి సమ్మేళనం ' ఏర్పాటు చేయడమైనదని మహిళాశక్తి సమ్మేళన నిర్వహులు తెలిపారు. మహిళాశక్తి, సమ్మేళనంలో పాల్గోందాం – వైభవోపేతమైన సమాజాన్ని నిర్మిద్దాం మని మహిళ లోకానికి పిలుపు నిచ్చారు. విద్య, వైద్య సామాజిక, ధార్మిక, ఉద్యోగ, సేవ, వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక, రాజకీయ, పత్రికారంగాలలో పనిచేస్తున్న మహిళలు, కళాశాల విద్యార్థినీలు, కళాకారులు, క్రీడాకారులు, మరియు పొదుపు సంఘాల మహిళలు అందరూ ఆహ్వానితులే నని వారు తెలిపారు. తేది. 28 - 01- 2024, ఆదివారం సమయం : ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం 4-00 గంటలకు వరకు వేదిక : గుండగోని మైసయ్య కన్వెన్షన్, గంధంవారి గూడెం రోడ్, నల్లగొండ.

బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి

 బిజెపి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఈరోజు జిల్లా కార్యాలయం లో బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సదర్భంగా అయన మాట్లాడరు.   అయన కామెంట్స్ బీజేపీ పార్టీ లో కస్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండ అవకాశాలు వస్తాయి అనడటానికి నేను ఉదాహరణ.. నాపై ఏంతో నమ్మకం తో చిన్న వయసులో నాకు ఈ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన మా రాష్ట పార్టీ కీ ముఖ్యం గా బీజేపీ రాష్ట అధ్యక్షులు కేంద్ర మంత్రి గౌరవనీయులు జి. కిషన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదములు.. నాకు ఈ జిల్లా అధ్యక్షులు పదవిని నేను పార్టీ నాపై పెట్టిన బాధ్యత గా భావిస్తున్నాను... నల్లగొండ జిల్లా లో జిల్లా నుండి.. బూత్ స్థాయి కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటు అందరిని కలుపుకొని జాతీయ, రాష్ట్ర పార్టీ లు ఇచ్చినా అన్ని కార్యక్రమలను విజవంతం చేస్తూ జిల్లా లో పార్టీ ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతాని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు ..ప్రజాసమస్యలపై ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కారం దొరికేవరకు పార్టీ పెద్దలను కార్యకర్తల ను కలుపుకొని

ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు

 *ప్రభుత్వ సలహాదారుల నియామక ఉత్తర్వులు* 1.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం 2. ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ 3. రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డా. మల్లు రవి 4. ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు నియామకం. *నలుగురికి స్టేట్ మినిస్టర్ ర్యాంకు తో కూడిన ప్రోటోకాల్* సంబంధిత ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి

సీఎం అభీష్టం మేరకే జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సోసైటీ కమిటీ రద్దు

 నిజాంపేట సొసైటీ కార్యాలయానికి నోటీసు అంటించిన సహకార శాఖ అధికారులు శ్రీమతి రమాదేవి , వెంకటరెడ్డి ల దృశ్యం సీఎం అభీష్టం మేరకే జెఎన్‌జే కమిటీ రద్దు ఫిబ్రవరి 4న అడ్‌హక్‌ బోర్డు ఎన్నిక నోటీస్‌ జారీ చేసిన సహకార శాఖ హైదరాబాద్‌, జనవరి 20 - జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సోసైటీ డైరెక్టర్‌ పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హక్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. ఈమేరకు జిల్లా సహకార అధికారి(రిజిస్ట్రార్‌) డి.రమాదేవి శనివారం నోటీసు జారీ చేశారు. రమాదేవితో పాటు డిఫ్యూటీ రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డి... నిజాంపేట్‌లోని జేఎన్‌జే కార్యాలయానికి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే నోటీసు జారీ చేశారు. 2024 ఫిబ్రవరి 4న జేఎన్‌జే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రమాదేవి నోటీసులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4న ఉదయం 11.30 గంటలకు నిజాంపేట్‌లోని జేఎన్‌జే స్థలంలోనే సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడ్‌హక్‌ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ఈ సమావేశానికి సహకార శాఖ డిఫ్యూటీ రిజిస్ట్రార్‌ సికింద్రాబాద్‌ను కన్వీనర్‌ గా వ్యవహరిస్తారు. ఈ బోర్డు జేఎన

500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి

  *500 సంవత్సరాల సాకరమైతుంది - నూకల నరసింహ రెడ్డి* నల్గొండ, 20 జనవరి,2024, నల్లగొండ పట్టణం పానగల్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రధాన మంత్రి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్ద క్షేత్ర అభియాన్ లో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమమానికి ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అయోధ్య లో భవ్య రామమందిరం నిర్మాణ కల సాకారం ఐతున్న సందర్బంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. సుమారు 500 సంవత్సరాలనుండి అయోధ్య లో రామమందిరం నిర్మాణం కోసం పోరాటం నడుస్తుంది చివరికి సుప్రీం కోర్టు చారిత్రక తీర్పుతో రామమందిరం నిర్మాణనానికి అడ్డంకులు తొలిగిపోయి ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగింది, జనవరి 22 న భవ్య మందిరంలో బాల రామయ్య విగ్రహ ప్రతిష్ట జగనుంది, ఈసందర్బంగా ప్రజలఅందరూ ఆరోజు మన ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పూజాకార్యమాలు చేసుకో ప్రతి ఒక్కరు మీ దగ్గరలో ఉన్న దేవాలయనికి చేరుకొని భక్తులందరు కలిసి సామూహిక శ్రీరామ సంకిర్తినాలు,భజనలు, పూజలు, చేస్తూ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమం స్థానికoగా ఆలయ ల్లో ఏర్పాటు చేసి

ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం - కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే

  ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కి కృషి వికసిత్ భారత్ తో ప్రతి గ్రామానికి కేంద్ర పథకాలు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే పులిచర్లలో పర్యటన జనవరి,19 : భారత దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందిన దేశంగా నిలబెట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యం అని కేంద్ర భారీ పరశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందించడం వికసిత్ భారత్ లక్ష్యం అని తెలిపారు. దేశంలో 2.7 లక్షల గ్రామాలలో వికసిత భారత్ వెళ్తుంది అని చెప్పారు. మోడీ హయాంలో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కోట్ల ఖర్చుతో అఖిల భారత వైద్య విద్య సంస్థ( ఏయిమ్స్) నిర్మించింది అని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులు 2500 కిలోమీటరు నుంచి 5000

ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్?

  ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్? జనవరి 19:  తెలంగాణ శాసన సభ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 45 రోజులు అయినప్పటికీ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ Websiteలో మాత్రమే ఇప్పటికీ ఇంకా ముఖ్యమంత్రి గా కేసీఆర్ విద్యా శాఖ మంత్రి గా సబితా ఇంద్ర రెడ్డి తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా రావుల శ్రీధర్ రెడ్డి గానే తెలుపుతుంది. ఇది అధికారుల పనితనానికి మచ్చు తునక గా చెప్పవచ్చు.  ఈ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో పలు అవకవతలు జరిగినట్లు గతం లో మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. వారికి జాస మొత్తం టెండర్ల మీదనే తప్ప పరిపాలన పై లేనట్లు ఉంది అనుకుంటున్నారు ప్రజలు. ఈ క్రింది లింక్ ను ఓపెన్. చేసి మీరు కూడా చూడవచ్చు. https://www.tsewidc.in/ ఈ వార్త ను చదవండి HMDA పై ఏసీబీ కన్ను? Below link open and read https://www.gudachari.page/2024/01/hmda-acb_19.html

Hmda పై ACB కన్ను?

Hmda  పై ACB కన్ను? హైదరాబాద్: Hmda అధికారుల పై ACB దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని జోన్ల లో విధులు నిర్వహిస్తున్న PO ల, APO ల మరియు ఇతర టెక్నికల్ సిబ్బంది  ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు వినికిడి. వివరాలు కావాలని పది  రోజుల కేంద్ర ఓ acb అధికారి ఒకరు hmda సెక్రటరీ ని కలవడం తో   వివరలు ఇవ్వమని అధికారులు ను సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.   

MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

 MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామం లో ఉన్న MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణకొరకు జనవరి 19న జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి ఎనివిరామెంటల్ ఇంజనీర్ పి. సురేష్  బాబు తెలిపారు. అనివార్య కారణంగా వాయిదా పడిందనీ, తదుపరి విచారణ తేదీ తర్వాత తెలియజేయబడుతుందనీ అయన తెలిపారు.  వెలిమినేదు గ్రామ ప్రజలు, వివిధ సంఘాలు గత రెండు రోజులుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపవద్దని, MPL స్టీల్ ఇండస్ట్రీ విస్తరణ చేపడితే కాలుష్యం పెరిగి గ్రామాల్లో నివసించడానికి ఇబ్బందులు ఎదురు అవుతాయని పెద్ద యెత్తున ఉద్యమం, ధర్నాలు చేపట్టి ప్రజాభిప్రాయ సేకరణ కొరకు ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర ఏర్పాట్లు ను తొలగించడం తో ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేశారు.  ఈ విషయం పై ఆ ఇండస్ట్రీ మేనేజర్   మాట్లాడుతూ ప్రజల కొరకు ఉద్యమం కాదు. ఈ ఉద్యమం వెనుక ఇతర కారణాలు ఉండొచ్చని అని అన్నారు.  ఈ పరిశ్రమ విస్తరణ కొరకు ఇచ్చిన పేపర్ ప్రకటన లో కన్సల్టెంట్ గా వ్యవహరించిన పాయినర్ ఎన్విరో కన్సల్టెంట్ వారు యొక్క ఫోన్ నంబర్ లాండ

నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడుగా డా. నాగం వర్షిత్ రెడ్డి

  12 మంది జిల్లా అధ్యక్షులను మార్చిన బీజేపీ  *కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులు* నిజామాబాద్ - దినేష్ కుమార్ పెద్దపల్లి - చందుపట్ల సునీల్  సంగారెడ్డి - గోదావరి అంజిరెడ్డి సిద్దిపేట - మోహన్ రెడ్డి  యాదాద్రి - పాశం భాస్కర్ వనపర్తి - డి నారాయణ వికారాబాద్ - మాధవరెడ్డి నోల్గొండ - డాక్టర్ వర్షిత్ రెడ్డి ములుగు - బలరాం మహబూబ్ నగర్ - పీ శ్రీనివాస్ రెడ్డి వరంగల్ - గంట రవి  నారాయణపేట - జలంధర్ రెడ్డి *కొత్తగా నియమితులైన బీజేపీ 6 మోర్చాల అధ్యక్షులు* ఎస్టీ మోర్చా - కల్యాణ్ నాయక్  ఎస్సీ మోర్చా - కొండేటి శ్రీధర్ యువ మొర్చా - మహేందర్ OBC మోర్చా - ఆనంద్ గౌడ్ మహిళ మోర్చా - డాక్టర్ శిల్పా కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డి

అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె* *నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరెను పరిశీలించిన బండి సంజయ్*

 *అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీరె* *నేతన్న హరిప్రసాద్ తయారు చేసిన చీరెను పరిశీలించిన బండి సంజయ్* *చీరెలోనే రామాయణ ఇతివ్రుత్తానికి సంబంధించిన చిత్రాలు పొందుపర్చిన హరిప్రసాద్* *26న ప్రధానికి అందించనున్నట్లు హరిప్రసాద్ వెల్లడి* *హరిప్రసాద్ ను అభినందించిన బండి సంజయ్* అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీరెను ఈనెల 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరెను ఉంచనున్నారు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం సిరిసిల్లలోని హరిప్రసాద్ నివాసానికి వెళ్లారు. హరి ప్రసాద్ స్వయాన తయారు చేసిన బంగారు చీరెను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివ్రుత్తాన్ని తెలియజేసే చిత్రాలను సైతం ఆ చీరెలో పొందుపర్చడం విశేషం. 8 గ్రాాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ అబ్బురపరిచేలా ఉంది. అద్బుతంగా చీరెను తయారు చేసిన హరిప్రసాద్ ను ఈ సందర్భంగా బండి సంజయ్ అభినందించారు. శాలువాతో సత్కరించారు.  అనంతరం

ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్ హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం

  ఆర్యవైశ్యులకు గుడ్ న్యూస్ హామీ నిలుపుకున్న మంత్రి - సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం నల్గొండ:- మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ  మంత్రి గౌరవనీయులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఇటీవల శాసన సభ ఎన్నికల సందర్బంగా వైశ్యులకు ఇచ్చిన హామీలలో ఒక దానిని నిలుపుకున్నారని సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదీనం  అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని వైష్యుల మనోభిప్రాయాలు దెబ్బతినే విధంగా బీట్ మార్కెట్లో మన కులదైవం వాసవి మాత ఆలయానికి వ్యతిరేకంగా మాంసం మార్కెట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు సాగారు. వైష్యులంతా మూకుమ్మడిగా వెళ్లి మాంసం మార్కెట్ వద్దని రెండు మూడు సార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్డ్ అభ్యర్థి వెంకటరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా తాను గెలిచిన వెంటనే నాన్ వెజ్ మార్కెట్ తొలగిస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా నేడు అనగా బుధవారం నాడు నల్గొండ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మొట్టమొదట నేరుగా మార్కెటును సందర్శించి ఇక్కడ నుండి నాన్ వెజ్ మార్కెటును తొలగించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించా

వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం - ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  నల్గొండ వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి లో క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి భూమి పూజ చేసిన అనంతరం మెడికల్ కళాశాలలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిం డెంట్,విద్యుత్ శాఖ అధికారులతో వైద్య కళాశాలలో సౌకర్యాలు,సమస్యల పై  సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం పనులపై సమీక్షించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెడికల్ కళాశాలకు కావలసిన వైద్య పరికరాలు,మౌలిక సదుపాయాలు ఫిబ్రవరి నెలాఖరు లోగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు . మెడికల్ కళాశాలలో ఈ లైబ్రరీ కోసం 40 కంప్యూటర్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. డెల్ కంప్యూటర్స్ ఏర్పాటుకు నిధులు చెల్లించి వారంరోజుల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్టు, అదే విధంగా సర్జరీ చేసిన తర్వాత స్టర్లిలైజ్ చేసే ఆటో క్లేవ్,బ్లడ్ బ్యాంక్ అభివృద్ది కి తన స్వంత నిధులు మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.మెడికల్ కళాశాల కు

జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో 23కోట్ల 75 లక్షల రూ.ల వ్యయం తో నిర్మించ నున్న50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ కు భూమి పూజ

  నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి లో 23కోట్ల 75 లక్షల రూ.ల వ్యయం తో  నిర్మించ నున్న50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవనం కు భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి,జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి,ఎస్.పి.చందన దీప్తి,రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ డి. ఈ.అజీజ్,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా రాజ కుమారి,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,ఇంఛార్జి మున్సిపల్ చైర్మన్ అబ్బ గోని రమేష్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

  గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టీవి   క్యాలెండర్ ఆవిష్కరణ  గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు, మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ప్రముఖ పారిశ్రామిక వేత్త, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) గ్లోబల్ అడ్వైసర్ బండారు సుబ్బారావు, వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ (WAM) నేషనల్ అడ్వైసర్ కోటిక్ విఠల్. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు. ఈ క్రింది క్లిక్ చేసి 12 నెలల క్యాలెండర్ డౌన్లోడ్ / వీక్షించ వచ్చు . https://drive.google.com/file/d/1J_ChiimxByhlO191kwp9UwfDKa24wuvR/view?usp=drivesdk

రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు

 రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిజిపి రవిగుప్త, అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐ జి పీ లు స్టీఫెన్ రవీంద్ర, ఎం. రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. ఇంటెలిజెన్స్ కార్యాలయంలో.... ప్రభుత్వ సూచనల మేరకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఇంటెలిజెన్స్ శాఖ కార్యాలయంలోనూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, ఓఎస్డీ శివకుమార్, ఎస్పీలు శ్రీధర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు.