Skip to main content

Posts

Showing posts from November, 2019

**బయటికి వెళ్లాలంటే భయం అవుతోంది. ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇప్పించండి**

*వరంగల్ జిల్లా* *బయటికి వెళ్లాలంటే భయం అవుతోంది. ఆత్మరక్షణకు గన్ లైసెన్స్ ఇప్పించండి.. వరంగల్ పోలీస్ కమిషనర్ కు ఓ మహిళా లెక్చరర్  దరఖాస్తు.*

**ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం కావడంపై పోలీస్ అధికారులు సస్పెన్షన్**

   ఈ  నెల  27 / 28.11.2019 మధ్య రాత్రి షంషాబాద్ పోలీస్ స్టేషన్కు తప్పిపోయిన మహిళకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యం కావడంపై విధి నిర్వహణపై వివరణాత్మక విచారణ జరిపామని  సైబరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు.  ఫలితాల ఆధారంగా, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కింది అధికారులను సస్పెన్షన్‌లో ఉంచామని తెలిపారు. .  అధికారుల పేర్లు: -  1) ఎం. రవి కుమార్, ఎస్ఐ ఆఫ్ పోలీస్, శంషాబాద్ పి.ఎస్.  2) పి.వేణు గోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్, ఆర్జీఐఏ విమానాశ్రయం పి.ఎస్  3) ఎ. సత్యనారాయణ గౌడ్, హెడ్ కానిస్టేబుల్, ఆర్జీఐఏ విమానాశ్రయం పి.ఎస్.  సైబరాబాద్ పోలీసుల అధికారులందరికీ  అధికార పరిధితో సంబంధం లేకుండా పోలీసు స్టేషన్‌లో అభిజ్ఞాత్మక నేరానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినప్పుడల్లా  కేసులను నమోదు చేయాలని ఆదేశించారు,   

**పాకిస్థాన్ పై తీవ్రంగా ధ్వజమెత్తిన కేంద్ర రక్షణ మంత్రి**

పూణే :  కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.  సంప్రదాయ యుద్ధంలో గెలవలేకే, పాక్ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపుతోందని తీవ్రంగా ఆరోపించారు.  ప్రచ్ఛన్న యుద్ధం చివరికి పాక్ ఓటమికే దారి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.  పూణేలో శనివారం జరిగిన 137 బ్యాచ్ అవుట్ పాసింగ్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1965, 1971 మరియు 1999 లో జరిగిన సంప్రదాయిక, లేదా పరిమిత యుద్ధాల్లో పాక్ ఓడిపోయిందని, భారత్‌పై గెలవలేమని పాక్‌కు అప్పుడే కనువిప్పు కలిగిందని అన్నారు. తీవ్రవాద మాధ్యమం ద్వారా పాక్ ప్రచ్చన్న యుద్ధానికి పాల్పడాలన్న మార్గాన్ని ఎంచుకుందని, దీని ద్వారా ఓటమి తప్ప పాక్‌కు ఏమీ రాదని ఘంటాపథంగా చెబుతున్నానని ఆయన అన్నారు.  ఇరుగు పొరుగు దేశాలతో భారత్ ఎప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఆయన ప్రకటించారు.  ఇతర దేశాలపై దాడులు దిగడం కానీ, ఆక్రమించడానికి కానీ ప్రయత్నం చేయదని, కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు.  భారతదేశ ప్రజల సార్వభౌమత్వానికి, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని, కానీ ఎవరైనా దేశంలో ఉగ్రవాద శిబిరానలు నడుపు

ఉల్లి కిలో 100

పాట్నా :  దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలకు భారీగా డిమాండ్ పెరిగింది. కిలో ఉల్లిపాయలను రూ. 100కు అమ్ముతున్నారు.  కొన్ని రాష్ర్టాల్లో అయితే ఆయా ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లిపాయలను విక్రయిస్తున్నారు.  బీహార్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉల్లిపాయ కౌంటర్లను తెరిచారు.  ఈ కౌంటర్ల వద్ద గృహిణులు బారులు తీరారు. కిలో ఉల్లిపాయలను రూ. 35కు అమ్ముతున్నారు.  అయితే కొందరు దుండగులు ఉల్లిపాయలను విక్రయించే వారిపై రాళ్లు విసిరి దాడులు చేస్తున్నారు.  వారి నుంచి రక్షణ పొందేందుకు తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయలను విక్రయిస్తున్నామని అధికారులు తెలిపారు.  తమకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదు.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

**కరడుకట్టిన నేరస్థుడికి మహిళా ఎస్ఐ షాక్**

కరడుకట్టిన నేరస్థుడికి మహిళా ఎస్ఐ షాక్ ఇచ్చిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్రాపూర్ పట్టణంలో సంచలనం రేపింది. ఓ కరడుకట్టిన నేరస్థుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి... వలపన్ని అతన్ని ఆలయానికి పిలిపించి... అరెస్ట్ చేసిన మహిళా ఎస్ఐ ఉదంతం చత్రాపూర్ పట్టణంలో వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లా బిజౌరీ గ్రామానికి చెందిన బాలకిషన్ చౌబే హత్య కేసుతోపాటు 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడు. కరడుకట్టిన ఈ నేరస్థుడి ఆచూకీ చెబితే పదివేల రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు కూడా ప్రకటించారు. పోలీసులు బాలకిషన్ ను పట్టుకునేందుకు పలుసార్లు యత్నించినా అతను తప్పించుకు తిరుగుతున్నాడు..బుందేల్‌ఖండ్‌లోని ఓ మహిళా కార్మికురాలి పేరిట సిమ్ కార్డును నిందితుడికి పోలీసులే పంపించారు. నిందితుడు పెళ్లి చేసుకునేందుకు మహిళ కోసం చూస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళా ఎస్ఐ కొత్త నాటకానికి తెర లేపింది. అనంతరం ఓ మహిళా ఎస్ఐ కరడుకట్టిన నేరస్థుడిని పట్టుకునేందుకు ఉత్తుత్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి వలపన్నింది. బాలకిషన్ చౌబేకు పొరపాటున రాంగ్ నంబరుకు ఫోన్ చేశానని చెప్పి మహిళా ఎస్ఐ కాల్ చేసింది. అనం

**ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరమార్శించిన గవర్నర్ తమిళిసై**

*ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను పరమార్శించిన గవర్నర్ తమిళిసై*     దారుణ అత్యాచారం, హత్యకు గురైన ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని గవర్నర్ తమిళ సై పరామర్శించి ఓదార్చారు. మధ్యహ్నాం గవర్నర్ ప్రియాంక ఇంటికి వెళ్లిన గవర్నర్ హంతకులకు శిక్షించే విదంగా తోడ్పడతానని గవర్నర్ తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిందితులను వెంటనే ఉరి తీయాలని కోరుతూ ప్రజలు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. నిందితులను తమకు అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు రోడ్ల పైకి వస్తుండడంతో రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. పలువురు రాజకీయ నాయకులు ప్రియాంకు కుటుంబసభ్యులకు పూర్తి సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నర్ తమిళసై ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుాభుాతి తెలియజేశారు....

**నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ ల దగ్ధం**

నల్గొండ జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోతులపటి అరుణ  ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా నిందితుల దిష్టిబొమ్మ లను బస్టాండ్ వద్ద గల సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద తగలబెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ఉపాదక్షురాలు నీరజ , ఉపాదక్షురాలు కాశమ్మ , టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు పోట్లపల్లి జయలత ,జిల్లా కార్యదర్శి వెనపల్లి రమాదేవి,అరువపల్లి నవ్య , మరియు మహిళలు పాల్గొన్నారు..

**పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య**

* అనంతపురం నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణహత్య * సప్తగిరి సర్కిల్లోని పల్లవి టవర్స్ లో ఎమ్మార్పీఎస్ నాయకుడు జగ్గుల ప్రకాష్ను దారుణంగా హత్య చేసిన  బుక్కరాయ సముద్రం రమణ. * అందరూ చూస్తుండగానే కత్తిరితో పొడిచి పొడిచి చంపి దారుణ హత్య చేసిన రమణ.. * హత్య అనంతరం అక్కడే కూర్చుని పోలీస్ లు వచ్చే వరకు ఉండగా  అదుపులోకి తీసుకున్న ఒన్ టౌన్ పోలీసులు గతం లో తన భార్య కు తనకు గొడవ విషయం లో న్యాయం చేయలేదని డబ్బులు తీసుకుని మోసం చేశాడని అందువల్లే రమణ  ప్రకాష్ ను చంపినట్టు సమాచారం.....

**బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌**

*బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్‌ సర్కార్‌* ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కీలకమైన బలపరీక్షలో విజయం సాధించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్‌ దిలీప్‌ శనివారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బలపరీక్ష సమయంలో ప్రతిపక్ష బీజేపీ సభ నుంచి వాకౌట్‌ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వానికి 169 మంది సభ్యుల మద్దతు ఉందని, విశ్వాస పరీక్షలో ఉద్ధవ్‌ ప్రభుత్వం నెగ్గిందని ప్రొటెం స్పీకర్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుతీరింది.

విద్యార్థి  ఆత్మహత్య

కడప జిల్లా..  ఇడుపులపాయ.. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో విషాదం చోటు చేసుకుంది..  మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న  మంజునాథరెడ్డి అనే విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్నాడు.. తన హాస్టల్ గది లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు... విద్యార్థి స్వగ్రామం మైదుకూరు.. హాజరు తక్కువ కావడంతో ఎగ్జామ్స్ కు అనుమతించలేదని.. మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది..

**డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!**

*షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ప్రజల ఆందోళన!!* *డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఊరి తీయాలని డిమాండ్!!* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోజరిగినా డాక్టర్ ప్రియాంక రెడ్డిహత్య కేసులో నిందితులను షాద్ నగర్ కోర్టుకు హాజరు పరిచేందుకు పోలీసులు స్టేషన్కు తీసుకువచ్చారు అయితే నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు..   షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ : ప్రియాంక నిందితులకు ఎలాంటి సహాయం ఉండదని షాద్నగర్ జిల్లా బార్ అసోసియేషన్ తీ ర్మానం చేసింది.

ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా మౌన దీక్ష.

ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా ఇందిరా పార్కు దగ్గర ఉదయం 11 గంటల  కు మౌన దీక్ష. ఈ రోజు మధ్యాహ్నం 12.30 లకు ప్రియాంక తల్లిదండ్రులను వారి ఇంట్లో పరామర్శించనున్న  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.  కిషన్ రెడ్డి.

**ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!**

*ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీ రావు అరెస్ట్..!         హత్య  కేసు విచారణలో అనుకూలంగా వ్యవహ రించాలని బెదిరించారని  అమృత  పోలీసులకు పిర్యాదు చేయడం తో మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేశారు.  ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

**అర్థరాత్రి  పోలీసులను  హైరానా కు గురిచేసిన  ఆటోడ్రైవర్...**

అర్థరాత్రి  పోలీసులను  హైరానా కు గురిచేసిన  ఆటోడ్రైవర్... డయల్ 100 కు కాల్ చేసి ఆరాంఘర్ చౌరస్తా వద్ద కొందరు వ్యక్తులు మహిళను బలవంతంగా ఓమ్ని వాహనంలో తీసుకెళ్లడం చూశానని చెప్పాడు....శంషాబాద్ వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేసిన policelu ఆటోడ్రైవర్ చెప్పిన ఓమ్ని వాహనాన్ని గుర్తించి పట్టుకున్న మైలార్దేవులపల్లి పోలీసులు వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నారు... వాహనంలో మహిళ ఎవరు లేదని, ఆటోడ్రైవర్ పొరబడి ఉంటాడని అంటున్న  పోలీసులు....

**ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు**

ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  మొత్తం 13 స్థానాల్లో 189 మంది బరిలో నిలిచారు.  37,83,055 మంది ఓటర్లు... 189 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.  ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సహా.. ఇతర ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు.  3,906 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్​ అధికారులు తెలిపారు.  పోలింగ్​ ఉదయం 7 గంటలకే ప్రారంభమై.. మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.

**బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న మునిసిపల్ ఆఫీస్ ముట్టడి**

బీజేపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 2న మునిసిపల్ ఆఫీస్ ముట్టడి నల్గొండ మున్సిపాలిటీలోని  సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 2న మునిసిపల్  ఆఫీస్ ను ముట్టడి చేయనున్నట్లు బీజేపీ తెలిపింది.  

**ఇవాళ బల పరీక్ష**

ముంబై మహారాష్ట్ర అసెంబ్లీ నేటి నుంచి రెండు రోజుల పాటు సమావేశం కానుంది.  'మహా వికాస్​ అఘాడీ' కూటమి నేతృత్వంలో ఏర్పడిన ఉద్ధవ్​ సర్కార్​.. ఇవాళ బల పరీక్ష ఎదుర్కోనుంది.  అంతకుముందే నూతన మంత్రులను సభకు పరిచయం చేస్తారు. రెండో రోజు శాసనసభ సభాపతి​ని ఎన్నుకుంటారు.  తర్వాత.. గవర్నర్​ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేస్తారు.  కొత్తగా నియమితులైన స్పీకర్​... అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పేరును ప్రకటిస్తారు.

**ఈ సారి చలి కాలమ్ వెచ్చగా**

న్యూఢిల్లీ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సగటు కంటే అధికంగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.  డిసెంబర్​-ఫిబ్రవరి మధ్యలో.. ఈ ఏడాది చలికాలం కాస్త వెచ్చగా ఉండే అవకాశముందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం కారణంగానే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.  2016 నుంచి కాలానుగుణ సూచనలు తెలియజేస్తోంది ఐఎండీ. ప్రతి ఏడాదీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తోంది.  2018 సంవత్సరం అంతర్జాతీయంగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా నిలిచింది. కోర్​ కోల్డ్​ వేవ్​​ ప్రాంతం.. ఈ శీతాకాలంలో కోర్ కోల్డ్ వేవ్ (సీడబ్ల్యూ) ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఓ వాతావరణ అధికారి తెలిపారు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దిల్లీ, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్​ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్​, బిహార్, ఝార్ఖండ్, బంగాల్​, ఒడిశా, తెలంగాణ, జమ్మూలోని వాతావరణ ఉపవిభాగాలు, జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్, మరాఠావాడ, విదర్భ, సౌరాష్ట్ర (గుజరాత్), మధ్య మహారాష్ట్రలు కోర్ కోల్డ్ వేవ్ ప్రాంతాల కిందకు వస్తాయి.

**రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయండి- నిందితుడి తల్లి**

  పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా నారాయణ పేట మక్తల్ మండలంలోని జిక్లేరుకు చెందిన మహ్మద్ పాషా ఉన్నాడు.  అతడి తల్లి ఈ రోజు మీడియాతో మాట్లాడి పలు వివరాలు తెలిపింది. జిక్లేరులోని తమ ఇంటి నుంచే మహ్మద్ పాషాను పోలీసులు తీసుకెళ్లినట్లు అతడి తల్లి వెల్లడించింది. ఐదేళ్ల నుంచి తన కుమారుడు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని వివరించింది.  అతడు అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికొచ్చాడని, ఆ తర్వాత 3 గంటలకు పోలీసులు వచ్చి తీసుకెళ్లారని తెలిపింది. అయితే తమ కుమారుడు ప్రియాంకను రేప్ చేసినట్లు నిరూపితం అయితే వెంటనే ఉరి తీయాలంటూ నిందితుడి తల్లి పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే సీసీటీవీ పుటేజ్ ఆధారంగా ఈ కేసును చేధించినట్లు తెలుస్తోంది. 

**డిసెంబ‌రు రెండో వారం నుండి అందుబాటులోకి తితిదే డైరీలు, క్యాలెండ‌ర్లు **

డిసెంబ‌రు రెండో వారం నుండి అందుబాటులోకి తితిదే డైరీలు, క్యాలెండ‌ర్లు  * తితిదే స‌మాచార కేంద్రాలు, క‌ల్యాణ‌మండ‌పాల్లో విక్ర‌యాలు తిరుప‌తి: టిటిడి రూపొందించిన 2020 క్యాలెండ‌ర్ల‌ను టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షుడు వైవి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ శుక్ర‌వారం తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.100 విలువ‌గ‌ల 12 పేజీల క్యాలెండర్లు 12 లక్షలు, రూ.15 విలువ‌గ‌ల శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.50 లక్షలు, రూ.15 విలువ‌గ‌ల శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, రూ.10 విలువ‌గ‌ల శ్రీవారు మ‌రియు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, అదేవిధంగా రూ.20 విలువ‌గ‌ల తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2 లక్షలు, రూ.60 విలువ‌గ‌ల టేబుల్ టాప్ క్యాలెండ‌ర్లు 75 వేలు ముద్రించామ‌ని వివ‌రించారు. వీటితో పాటు రూ.130 విలువ‌గ‌ల పెద్ద‌ డైరీలు 6 లక్షలు, రూ.100 విలువ గ‌ల చిన్నడైరీలు 1.50 లక్షలు ఉన్నాయ‌ని తెలిపారు. డిసెంబరు మొదటి వారం నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్త‌క విక్ర‌య‌శాల‌లు, హైదరాబాద్‌, చెన్నై, బ

***ప్రియాంక మర్డర్ కేసు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోస్***

*ప్రియాంక మర్డర్ కేసు.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ వీడియోస్* ప్రియాంక రెడ్డి మర్డర్ కేసు.. నగరంలోనే కాకుండా దేశమంతా అందరిని షాక్ కి గురి చేసింది. ఘటనపై సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల వరకు అందరు స్పందిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో #RIPPriyankaReddy అనే హ్యాష్‌ట్యాగ్‌ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చాలా మంది సినీ తారలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలకు సంబందించిన కొన్ని సీన్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో క్లయిమ్యాక్స్ లో చెప్పిన కోర్టు సీన్స్ తో పాటు రాఖీ సినిమాలో చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలతో అభిమానులు ఘటనపై నిరసనలు తెలుపుతున్నారు. రాఖీ సినిమా అప్పట్లోనే చాలా మందిలో సరికొత్త ఆలోచన రేకెత్తించింది. ఇక టెంపర్ సినిమాలో మానవ చట్టాలను ప్రశ్నిస్తూ పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఎవ్వరు మరచిపోలేరు. ఎంత మంచి ఆడవాళ్ళ మరణఘోష వినబడుతున్నా దారుణాలు మాత్రం ఆగడం లేదని అన్నిటికి ఒకే సమాధానంగా అత్యాచారం చేసిన వాళ్ళని నడి రోడ్డున శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. 

శంషాబాద్ లో మరో దారుణం

*శంషాబాద్‌లో మరో దారుణం: పెట్రోల్ పోసి యువతిని చంపిన దుండగులు* దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రియాంక రెడ్డి హత్యాచారం ఘటన మరువక ముందే శంషాబాద్ పరిధిలోనే అదే తరహాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 20ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తు తెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే సిద్దులగుట్ట రోడ్డులోని బంగారు మైసమ్మ ఆలయం పక్కన ఘటన జరిగింది.  అత్యంత దారుణంగా యువతిని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు దుండగులు. పూర్తిగా డెడ్ బాడీ కాలిపోయినట్లు తెలుస్తుంది. మహిళను హత్య చేసి కాల్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంకను చంపి 24గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మహిళ హత్య కావడంతో ఈ హత్య సంచలనంగా మారింది. నిత్యం పూజలు జరిగే స్థలంలోనే ఈ ఘటన జరిగింది.  వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  క్లూస్ సేకరిస్తున్నారు. చట్టుపక్కల ప్రాంతాల్లో అణువు అణువు గాలిస్తున్నారు. టెంపుల్ పరిసర ప్రాంతంలోనే రోడ్ పక్కనే ఘటన జరిగింది. ప్రైమరీ ఎవిడెన్స్  సేకరించారు పోలీసులు. గోడ పక్కనే అమ్మాయి హత్య జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. గంటా రెండు గంటల క్రితమే ఘటన జరిగి ఉండవచ్చునని అంట

**ఘనంగా సుధా బాంక్ ఆత్మీయ సమ్మేళనం**

ఘనంగా సుధా బాంక్ ఆత్మీయ సమ్మేళనం సుధా బాంక్ నల్గొండ 6వ వార్షికోత్సవ సందర్బంగా ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా బాంక్ చైర్మెన్ మీలా మహాదేవ్ బాంక్ బ్రోచర్ను విడుదల చేసి ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలిపారు. బాంక్  మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్  బాంక్ పథకాలు, ప్రణాళికలు వివరించారు. వైస్ చైర్మన్ పొరెడ్డి మధుసూదన్ రెడ్డి, భోనగిరి భాస్కర్, చామల అశోక్ కుమార్, దంతాల శ్రీనివాసులు నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో కాళోజీ పురస్కారం  అందుకున్న ప్రముఖ కవి వేణు సంకోజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది గోలి అమరేందర్ రెడ్డి, ఏచూరి శైలజ, శ్రవణ్ కుమార్, కాసోజు సీతా రాములు, గుండమ రాజు శ్రవణ్ కుమార్, ఆడిటర్ చక్రపాణి, తదితరులు పాల్గొని ప్రసంగించారు. బాంక్ మేనేజర్  భీష్మా చారి వందన సమర్పణ చేశారు.

**బ్లాంకెట్‌లో మృతదేహాన్ని చుట్టి నిప్పు పెట్టి తగలబెట్టారన్నారు సీపీ సజ్జనార్**

హైదరాబాద్:  వైద్యురాలి హత్యకేసులో  ఏ1 లారీ డ్రైవర్‌ ఆరిఫ్‌ (26), ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. లారీలో ఇనుము అన్‌లోడ్ చేయకపోవడంతో టోల్‌గేట్ దగ్గరే లారీ పార్క్ చేశారన్నారు. తొండుపల్లి దగ్గర యువతి స్కూటీ పార్క్ చేయడం లారీ వాళ్లు చూసినట్లు చెప్పారు. మళ్లీ ఆమె వస్తుందని నిందితులు మాట్లాడుకుని కుట్ర పన్నినట్లు వెల్లడించారు. నవీన్‌ స్కేటీ బ్యాక్ టైర్‌లో గాలి తీసేయాలని ప్లాన్‌ చేశాడన్నారు. రా. 9.13కి గచ్చిబౌలి నుంచి ప్రియాంక రిటర్న్ వచ్చిందన్నారు. ఆమె రాగానే పంక్చర్‌ అయిందని వారు చెప్పారని తెలిపారు. పంక్చర్‌ చేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసిందన్నారు. పంక్చర్‌ వేయిస్తామని ఇద్దరూ స్కూటీ తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్కూటీకి గాలి కొట్టించి వాపస్ వచ్చేశారన్నారు.   అత్యాచారం సమయంలో యువతి నోరు మూసేసినట్లు సీపీ పేర్కొన్నారు. ఆ సమయంలోనే ప్రియాంక చనిపోయిందన్నారు. శివ, నవీన్‌ టూవీలర్‌ నడిపినట్లు చెప్పారు. మిగతా ఇద్దరూ లారీ నడిపించారని వివరించారు. ఇండియన్‌ ఆయిల్‌ బంకులో పెట్రోల్ తీసుకున్నార

**ఇంటర్మీడియట్  వార్షిక పరీక్ష తేదీలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు**

ఇంటర్మీడియట్  వార్షిక పరీక్ష తేదీలను విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఇంటర్ మొదటి తరగతి వార్షిక పరీక్షలు 2020 మార్చి 4 నుండి 21 వరకు ఇంటర్ రెండవ తరగతి పరీక్షలు 2020 మార్చి 5 నుండి 23 వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు పత్రిక ప్రకటన విడుదల చేశారు.

**ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కెటిఆర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే బిగాల.**

  ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారిని కలిసి ఉప్పల్ బగాయత్ లో ఆర్యవైశ్యులకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలానికి త్వరలో రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు. ఉప్పల్ బగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలాన్ని ఈరోజు ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారు అధికారులతో కలిసి పరిశీలించారు.స్థలం యొక్క స్థితి గతులను మరియు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఘనంగా కేసీఆర్ దీక్షా దివస్

 నేడు కెసిఆర్ “దీక్షా దివస్ “ ను నల్లగొండ నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు ఘనంగా నల్లగొండలో నిర్వహించారు. ఈ సందర్బముగా మొదట నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయములో కెసిఆర్ చిత్ర పటానికి “ క్షీరాభిషేకం” చేశారు. తరువాత ఎన్ జి కళాశాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు  సమర్పించినారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బముగా నాయకులు మాట్లాడుతూ నాడు కెసిఆర్ ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడి కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తీసుకొనివచ్చి  ప్రత్యేక రాష్ట్రాన్ని  సాదించిన తెలంగాణ జాతి పిత కెసిఆర్ అని తెలంగాణ రాష్ట్రాన్ని అన్నీ విధాలుగా అభివృద్ధి చేస్తూ సంబండ వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ దేశంలేనే రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతున్నారని, కాళేశ్వరం, యాదగిరి క్షేత్రం, రాష్ట్రానికి తలమానికం కాబోతున్నాయని అన్నారు. ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు కోసం కెసిఆర్ ప్రకటించిన విధానం వారిని సంతృప్తి పరిచయన్నారు.   ఈ కార్యక్రమాలలో నల్లగొండ సూర్యాపేట జిల్లాల స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మాలె శరణ్యా రెడ్డి , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక

ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్డు 1 న ప్రగతి భవన్ లో సీఎం సమావేశం

రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని  ఆర్టీసీ ఎండిని సిఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని,  అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు. డిసెంబర్ 1న మద్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్ లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. మద్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.

**ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ .**

Imp breaking ప్రియాంక హత్య పై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ .  హైదరాబాద్ కు ఒక టీం ను పంపిస్తున్న జాతీయ మహిళా కమిషన్ .. ఈ రోజు సాయంత్రం లోగా హైదరాబాద్ చేరుకున్న జాతీయ మహిళా కమిషన్ సభ్యులు.. ప్రియాంక రెడ్డి హత్య పై పూర్తిస్థాయిలో విచారణ జారపన్న  జాతీయ మహిళా కమిషన్.. ప్రియాంక రెడ్డి హత్య కేసును సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

**ఉప్పల్ డిపో వద్ద TRS నాయకులకు చేదు అనుభవం....**

*ఉప్పల్ డిపో వద్ద TRS నాయకులకు చేదు అనుభవం....*  **CM కి పాలాభిషేకానికి ప్రయత్నం.... స్పందించని కార్మికులు....*  **ఆర్టీసీ అధికారులు, పోలీసుల ముందు నవ్వుల పాలైన TRS నాయకులు* **52 రోజులుగా సమ్మె చేస్తున్న పలకిరించని మీరు ఇప్పుడు వస్తారా అని కార్మికుల ఆగ్రహం.** **చేసేది ఏమిలేక తోకముడిచిన వెళ్లిన TRS నాలుగురు నాయకులే CM కు డిపో ముందు పాలాభిషేకం చేసి మామా అనిపించారు...*

**తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. ***

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్. 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేసిన హైకోర్టు జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన హైకోర్టు.. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశం.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్‌కు కోర్టు ఆదేశం.. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలన్న హైకోర్టు

ఉల్లి చోరీ

దేశంలో ఉల్లి ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.  పలు ప్రాంతాల్లో ధర వంద రూపాయలకు పైగా పలుకుతోంది.  ఫలితంగా దొంగల దృష్టి ఇప్పుడు ఉల్లిపై పడింది. తాజాగా గుజరాత్​లో దాదాపు రూ.25,000 విలువైన ఉల్లిని చోరీ చేశారు.  కూరగాయల దుకాణం ముందు ఉంచిన సంచులను అపహరించి పారిపోయారు.

**పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్  **

  పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్   అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధి లోని నూలుబండ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి బెంచ్ కు తాడుతో కట్టి బంధించడంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి ఆగ్రహం వెలిబుచ్చారు.    చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి వారి భవితవ్యాన్ని తీర్చి దిద్దాల్సిన చోట ఉపాధ్యాయుల అవగాహనా రాహిత్యం, కోపావేశాల వలన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.  జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్ తో మాట్లాడారు.   ఎంక్వయిరీ జరిపించి బాలల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై  విచారణ జరిపించి తక్షణమే బాధ్యులపై క్రిమినల్ మరియు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని తెలియచేసారు.    బాలల న్యాయ చట్టం సెక్షన్ 82 , ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం 2009  సెక్షన్ 17  ప్రకారం పాఠశాలల్లో శారీరిక, మానసిక దండన చట్

**మాదాపూర్లోని ప్రవేట్ కాలేజ్ క్యాంపస్ లో విషాదం . **

మాదాపూర్లోని ప్రవేట్ కాలేజ్ క్యాంపస్ లో విషాదం .  గోడదూకి బయటికి వెళ్ళిన ఆరుగురు విద్యార్థులు.   ఫ్రెండ్ బర్త్ డే కోసం రాజేంద్రనగర్ వెళ్లిన ఆరుగురు విద్యార్థులు .  బర్త్డే పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా ఆరాంగఢ్ వద్ద  రోడ్డు ప్రమాదం .. అరంగల్ చౌరస్తా లో సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పిన కారు .. కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి నలుగురికి గాయాలు .. మాదాపూర్లోని నారాయణ కాలేజ్ iit క్యాంపస్ నుంచి గోడ దూకి వెళ్లిన విద్యార్   నారాయణ కాలేజీలో లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న తరుణ్, ఉదయ్ లుగా గుర్తింపు.

ప్రియాంక రెడ్డి పై అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసిన సంఘటన నీ నిరసిస్తూ మౌన ప్రదర్శన

ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసిన సంఘటన నీ నిరసిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన  నిందితులను కఠినంగా శిక్షించడం తో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.కార్యక్రమం లో బార్ అసోసియేషన్ కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్,ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం , దేవేందర్, మాజీ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజి రెడ్డి , కొండారెడ్డి ,న్యాయవాదులు హనీఫ్ ఖాన్ , రాజకుమార్ , అమర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

**నల్గొండ పిసిబికి  ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు!**

  నల్గొండ పిసిబికి  ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు! వారు లాభం పొందుతారో, భాదితులకు న్యాయం చేస్తారో?   జిన్నింగ్ మిల్లుల నుండి వెలువడిన దుమ్ము, ధూళి తో నిండిన భూమి జిన్నింగ్ మిల్లుల నుండి వెలువడిన దుమ్ము, ధూళి తో నిండిన బావి ఫిర్యాదు వచ్చిందంటే ఎగిరి గంతే స్తున్నారు. ఫిర్యాదు వస్తే లబ్ది పొందవచ్చని ఎదురుచూస్తున్నారు  సదరు ఆఫీస్ వారు.  గత రెండు ఏండ్లుగా ఓ మహిళ రైతు కాలుష్యం తో ఇబ్బందులు పడుతున్నామని పంటలు పండుటలేదని, తీవ్రంగా నష్ట పోతున్నామని మోర పెట్టుకున్న కనికరించడంలేదు ఈ  అధికారులు.  మిర్యాలగూడ సమీపంలోని కొత్తగూడెం శివారులో 3 ఎకరాల భూమి ఉన్నదని  దాని వెనుక  ఉన్న  2 జిన్నింగ్ మిల్లు ల నుండి  దుమ్ము,  దూళి, శబ్ద కాలుష్యం వస్తున్నదని దానితో  పంటలు పండక ఆర్థికంగా నష్టపోతున్నామని, మాకు అరోగ్య సమస్యలు వస్తున్నాయని  గత రెండు ఏండ్ల నుండి 2 సార్లు ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని వాపోయారు.   ఇప్పటికైనా చర్యలు తూసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు 29 నవంబర్ న మరో ఫిర్యాదు చేశారు ఆ రైతు.  మరి ఈ అధికారులు షరా  మాములు లాగా స్వంత లాభం పొందుతారో   లేక బాధితులకు న్యాయం చేస

**మైనర్ బాలిక పై ఓ పూజారి అఘాయిత్యం.....**

కడప జిల్లా..... మైనర్ బాలిక పై ఓ పూజారి అఘాయిత్యం..... కామంతో కళ్ళుమూసుకుపోయిన ఓ కీచక పూజారి 14 ఏళ్ల ఓ మైనర్ బాలికను బలాత్కారించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది..... సుండుపల్లి మండలంలోని రాయవరం గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన రవి అనే పూజారి అదే మండలానికి చెందిన వాయులువడ్డీ బిడికి కు చెందిన మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడని సుండుపల్లి పోలీసులకు ఆశ్రయించిన బాధ్యతురాలు.... నిందితుడు పరారీ.....నిందితుడు కోసం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టిన సుండుపల్లి పోలీసులు....

**భాజపాలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి,**

ఢిల్లీ: భాజపాలో చేరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే , రాయలసీమ పరిరక్షణ సమితి  అధ్యక్షులు,మరియు ఓ.వి.రమణ,మాజీ టిటిడి మెంబెర్,ప్రధాన కార్యదర్శి థర్డ్ ఫ్రంట్, కౌశల్, సినీ ఆర్టిస్ట్,బిగ్ బొస్స్ 2 విన్నర్, ఆయన భార్య నీలిమ, మరియు డా.సభారి .ఎం.డి,ప్రముఖ రేడియోలాజిస్ట్. బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమార్తె, మరియు గోపాగాని సులోచన యాదవ్ అనగాని, రైల్వే కోడూరు వైఎస్సార్‌సీపీ ఇంచార్జి వీరు ఆంధ్రప్రదేశ్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వ‌ర్యంలో భాజపా ప్రధాన కార్యాలయం ఢిల్లీలో భాజపాలో చేరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో రాష్ట్ర సహా ఇంచార్జి సునీల్ దేమోదర్, జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ మరియు రాష్ట్ర ముఖ్య నేతలు తురగా నాగభూషణం, రాష్ట్ర కార్యదర్సులు అడపా శివంగేంద్రరావు, తాళ్ల వెంకటేష్ యాదవ్, ఐ హబ్ కన్వీనర్ కానూరి బాలకృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మోడీ సంక్షేమ పథకాలు పట్ల మరియు దేశ భద్రతా ప్రపంచంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపిన ఎలా అనేక విషయాల్లో పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అ

**ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు**

అమరావతి:  • ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కిట్లు • స్కూలు బ్యాగు, నోట్‌బుక్స్, టెక్ట్స్‌ బుక్స్, 3 జతల యూనిఫారమ్స్, జత షూస్, సాక్సులు ఇవ్వనున్న ప్రభుత్వం • గతంలో ప్రకటించిన దానికన్నా స్కూలు బ్యాగు, నోట్‌ బుక్స్‌ అదనంగా ఇవ్వనున్న ప్రభుత్వం • యూనిఫారమ్స్‌ కుట్టించుకునేందుకు డబ్బులు, ఒక జతషూస్,సాక్సుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్న ప్రభుత్వం • మిగిలిన వాటిని కిట్ల రూపంలో అందించనున్న ప్రభుత్వం • పాఠశాలలు తెరిచే నాటికి అందించాలని సీఎం ఆదేశం • ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళికను తయారుచేయడంపై సీఎం చర్చ వచ్చే ఏడాది 1 నుంచి ఆరో తగరతి వరకూ ఇంగ్లిషు మీడియం • పిల్లలను సన్నద్ధం చేసేందుకు బ్రిడ్జి కోర్సులను నిర్వహిస్తామన్న అధికారులు • బ్రిడ్జి కోర్సుల నిర్వహణపై ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు • విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి నెలరోజులు పిల్లలకు బ్రిడ్జికోర్సులు చేపట్టాలని అధికారుల ప్రతిపాదన • పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆదేశం • టీచర్లకు శిక్షణ, పిల్లలకు బ్రిడ్జి కోర్సులపై పూర్తిస్థాయి వివరాలతో ప్రజంటేషన్‌ ఇవ్వాలన్న సీఎం • పటిష్టమైన పాఠ్యప్రణాళిక, అంతర్జాతీయ విద్యాసంస్థల భా

**CRPF జవాన్ మృతి ....**

CRPF జవాన్ మృతి ...... రంగారెడ్డి జిల్లా ,చేవెళ్ల మండలం , అంతారం గ్రామానికి సంబందించిన ఆవుల శ్రీనివాస్ (40), ఇతను ఢిల్లి లో CRPF జవాన్ గా విదులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది లో కండ్ల పాస్కలు రావడం తో అక్కడే ఆర్మీ ఆసుపత్రి లో రెండు రోజులు వైద్యులు పరిశీలించారు (ట్రిక్మెంట్ )చేశారు. తరువాత తగ్గకపోవడంతో గత ఏడాద డిసెంబర్ 6 నా వీరు హైదరాబాద్ కి వచ్చి ఆసుపత్రి కి చూపించారు. నిన్న మధ్యాహ్నం కేర్ఆసుపత్రి లో మృతి చెందడం జరిగింది. ఇతనికి భార్య  ప్రియాంక (32). పిల్లలు  ప్రజ్వల్(6), చార్వి (3) ఉన్నారు . శ్రీనివాస్ అంత్యక్రియలు తన స్వగ్రమం అంతారం లో పోలీస్ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరిగింది .

**హెడ్‌మాస్టర్ దాష్టీకం...  విద్యార్థుల కాళ్లు కట్టేసి..**

అనంతపురం:  హెడ్‌మాస్టర్ దాష్టీకం...  విద్యార్థుల కాళ్లు కట్టేసి.. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్‌రూమ్‌లో బెంచీలకు కట్టేశాడు. అనంతపురంలో ఓ స్కూల్ హెడ్ మాస్టర్ రెచ్చిపోయాడు. విద్యార్థుల కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలు పెట్టాడు. కదిరి పట్టణలోని మశానంపేట స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్లో అల్లరి చేస్తున్నారన్న కారణంతో ఇద్దరు చిన్నారుల పట్ల హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నారులను క్లాస్‌రూమ్‌లో బెంచీలకు కట్టేశాడు. మళ్లీ అల్లరి చేయబోమని.. వదిలేయమని వేడుకున్నా ఆ టీచర్ వినలేదు. తోటి విద్యార్థుల ద్వారా విషయం బయటకు తెలియడంతో తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి హెడ్‌మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. అతడి తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహ వ్యక్తం చేశాయి. ఆయన్ను విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

**సీఎం కేసీఆర్ మీడియా సమావేశం@ప్రగతి భవన్**

*సీఎం కేసీఆర్ మీడియా సమావేశం@ప్రగతి భవన్* ఇవ్వాళ రెండు ,మూడు విషయాల్లో ప్రధాన చర్చ జరిగింది. వర్షాల వల్ల రోడ్ లు డ్యామేజ్ అయ్యాయి,ఆర్&బి అధికారులను పిలిపించి చర్చ జరిగింది నేషనల్ హై వే లో రోడ్ లు చాలా డ్యామేజ్ అయ్యాయి వాటిని వాళ్ళు పూర్తిగా పట్టించుకోవడం లేదు అందుకని ఇవ్వాళ దానిపై చర్చ జరిగింది . నేను కామారెడ్డి వెళ్తున్నప్పుడు చూశా చాలా డ్యామేజ్ అయింది అప్పుడే కేంద్ర రోడ్ రవాణా శాఖ మంత్రి తో మాట్లాడను. వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన రోడ్ లను తక్షణమే మరమ్మతులు చెయ్యాలని 575 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది 3 నెలలోపు రోడ్ లు యధావిధి స్థితికి రావాలి అని చెప్పాము ధాన్యం కొనుగోలు పై కూడా చర్చ జరిగింది, ఒక్క సీజనల్ లో కాకుండా అన్ని సీజన్ లలో ధాన్యం కొనుగోలు పై చర్చ జరిగింది మన దగ్గర ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది దీనితో పంటల దిగుబడి పెరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా విజయవంతం గా పూర్తి చేశాం రాజరాజేశ్వర రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చింది ప్రాజెక్టులను నింపేటప్పుడు ప్రోటో కాల్ పాటించాలి కొన్ని పార్టీ లవారు అవగాహన లేకుండా ఆరోపణలు చేశారు. 20.9 టీఎంసీ ల నీటిని నింపామ్ ఎల్లంప

**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న *తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?*

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న *తెలంగాణ ఆర్టీసీ కేంద్రం చేతుల్లోకి…?*  సీఎం కేసీఆర్ ఎత్తులకు కేంద్రం పై ఎత్తులు వేసిందా…? తెలంగాణ ఆర్టీసీ కేంద్రం పరం కాబోతుందా…? ప్రైవేటు ఆలోచనలో ఉన్న కేసీఆర్‌కు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా…? కోర్టులు చేతులెత్తేయటంతో బీజేపీ ఇటు నుండి గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందా…? ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో…  కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 31శాతం వాటాదారుగా ఉన్న కేంద్రం, మరో 25శాతం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఆర్టీసీ పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్లబోతుందని, ఇటు ఉద్యోగులను కాపాడటమే కాకుండా… కేసీఆర్‌కు చెక్‌పెట్టవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది. ఆర్టీసీలో సీఎం కేసీఆర్ బంధువులు దూరిపోయారని… దాదాపు 45 పెట్రోల్‌ బంకులు అత్యధిక లాభాలు వచ్చే వాటిని సీఎం కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యునికి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.  ఇక టీఆర్ఎస్ మాజీ ఎంపీ, సీఎం బంధువు.. అత్యంత సన్నిహితుడైన మరొకరికి చెందిన NETXCELL అనే సంస్థకు కట్టబెట్టేశారు. 2015

**నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి**

RTC కార్మికులకు మద్దతుగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి  నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జుాలకంటి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి తుమ్మల వీరారెడ్డి నాగార్జున లక్ష్మీనారాయణ సలీం,  ఐద్వా జిల్లా ప్రదాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి,  సహాయ కార్యదర్శి కొండ అనురాధ   తదితరులు నల్గొండ జిల్లా నాయకులు  

**వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదు : అదనపు ఎస్పీ నర్మద**

*వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదు : అదనపు ఎస్పీ నర్మద* - - లేజర్ స్పీడ్ గన్లతో చలనాల  ద్వారా వేగ నియంత్రణ - - స్పీడ్ గన్ల వినియోగంతో తగ్గనున్న ప్రమాదాల సంఖ్య నల్గొండ : రహదారులపై వాహనాల వేగం హద్దు మీరితే జరిమానా తప్పదని జిల్లా అదనపు ఎస్పీ సి. నర్మద తెలిపారు. బుధవారం నల్గొండ పట్టణంలోని నార్కట్ పల్లి - అద్దంకి రహదారి పై లెప్రసి కాలనీ వద్ద స్పీడ్ గన్ పనితీరు, చాలన్స్ విధిస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ వాహనదారులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకునే క్రమంలో అతి వేగంతో వెళ్లకుండా వారికి హెచ్చరికలు చేయడం, రోడ్డు ప్రమాదాలకు గురి కాకుండా వారిని రక్షించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని చెప్పారు. జిల్లాకు కేటాయించిన రెండు స్పీడ్ గన్స్ ద్వారా నిత్యం వాహనాల వేగానికి కళ్లెం వేసే విధంగా స్పీడ్ గన్స్ ద్వారా చాలన్లు విధిస్తున్నామని ఆమె వివరించారు. జులై నెల నుండి నేటి వరకు జిల్లాలో స్పీడ్ గన్స్ ద్వారా కోటి యాభై లక్షల జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు. రోడ్ ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులలో స్పీడ్ గన్స్ వినియోగించడంత

జీవవైవిధ్య ఫ్లైఓవర్ కారు ప్రమాద స్థలాన్ని సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి జీవవైవిధ్య ఫ్లైఓవర్ కారు ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ ప్లై ఓవర్ ను మొత్తం కూల్చి కొత్తగా నిర్మించాలని అన్నారు.

**పత్తి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్**

*పత్తి జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోళ్లు తనిఖీ చేసిన ఇంఛార్జి కలెక్టర్* అయిటి పాముల లో శ్రీ నాథ్ పత్తి జిన్నింగ్ మిల్లును బుధవారం ఇంఛార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్ తనిఖీ చేసి పత్తి కొనుగోళ్లు పరిశీలించారు రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి కొనుగోళ్లు చేయాలని ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించి 8 నుండి 12 తేమ శాతం వుండేలా పత్తి తీసుకు వచ్చి సి.సి. ఐ.కొనుగోలు కేంద్రం లో మద్దతు దర పొందాలని ఆయన రైతులకు సూచించారు.ఇప్పటి వరకు జిల్లాలో సి.సి. ఐ.కొనుగోలు కేంద్రాల ద్వారా రెండు లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ నెల 21 వరకు కొనుగోలు చేసిన రైతులకు రైతులకు చెల్లింపు కూడా చేసినట్లు వివరించారు.ఇంఛార్జి కలెక్టర్ వెంట మార్కెటింగ్ ఏ. డి. అబ్దుల్ అలీం, డి.సి.ఓ.అర్.శ్రీనివాస మూర్తి తదితరులు ఉన్నారు.

**ఉప్పల ఫౌండేషన్ నుండి పేద కుటుంబానికి మంగళసూత్రం విరాళం ఇచ్చిన దృశ్యం**

ఉప్పల  ఫౌండేషన్ నుండి పేద కుటుంబానికి మంగళసూత్రం విరాళం ఇచ్చిన దృశ్యం

** గుండెపోటు రావడంతో డ్రైవర్ మృతి **

ఇరవై రోజుల క్రితం శ్వసకోశ సమస్యతో కాచిగూడలోని ప్రతిమ హాస్పిటల్ లో చేరిన మెహిదీపట్నం డిపో  డ్రైవర్ వెంకటరాజం  గుండెపోటు రావడంతో ఈరోజు ఉదయం ఏడు గంటలకు మృతి చెందాడు అయితే కెసిఆర్ చివరి హెచ్చరిక తర్వాత నుండి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రాజాం నవంబర్ 8 న కుప్పకూలిపోవడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశామని నాటి నుండే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు  

**mro ఆఫీసులో ఏసీబీ దాడులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు..

మేడ్చల్ జిల్లా షామిర్ పేట్ mro ఆఫీసులో ఏసీబీ దాడులు. ఎం.మల్లేష్ అనే వెక్తికి passbook లు ఇవ్వడానికి 20 వేలు డిమాండ్ చేసిన vro వెంకటేష్ ను redhanded గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

**సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  *ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ**

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  *ఆర్టీసీ కండక్టర్... ఆవేదన తో రాజీనామ లేఖ* *సూర్యాపేట డిపోకు చెందిన ఉద్యోగి* *అర్వపల్లి మండలం, సూర్యానాయక్ తండా కు చెందిన లూనావత్ కృష్ణ*  గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి....   తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్న ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ  మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను  రా నాయనా అనే విధంగా గా తీవ్ర  మానసిక వేదనకు గురై నేను ఈ నిర్ణయం తీస్కుంటున్నాను..... మీకు మాట తప్పడం, మాయమాటలు చెప్పి మోసం చెయ్యడం తెలుసు అని మా కార్మికలోకం లేట్ గా తెలుసుకుంది మీరు ఉద్యోగం లో నుండి తీసేయడం కాదు నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దానికి కారణం లేకపోలేదు సర్ మా తెలంగాణ లో నియంతృత్వ0 చూస్తా అని అనుకోలేదు.1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సర్ ఉన్నారు ఆంధ్ర పాలకులు నిజంగా మోసం చేశారేమో, మనల్ని బాగా  చూసుకుంటారు అనుకున్న.కానీ సర్ మా 30 మంది కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సర్ అప్పుడు అనిపించింది సర్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణా కేవలం మీ లాంటి నాయకుల

***హీరో సంపూర్ణేష్ బాబుకు యాక్సిడెంట్..***

బ్రేకింగ్ . సిద్దిపేట జిల్లా : హీరో సంపూర్ణేష్ బాబుకు యాక్సిడెంట్.. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద  సంపూర్ణేష్ బాబు కారును వెనక నుంచి డి కొట్టిన ఆర్టీసీ బస్సు.. సంపూ కు స్వల్ప గాయాలయ్యాయి.

**ఇద్దరు దొంగలు పట్టివేత**

కాగజ్ నగర్ రైల్వే ప్లాట్ ఫామ్ పై ఇద్దరు దొంగలు పట్టివేత 16000 నగదు.. రెండు లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం... grp పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన దొంగలు..మధ్యప్రదేశ్ కు చెందిన ఆశిష్ గుప్తా వినోద్ గోస్వామి రిమాండ్కు తరలింపు...

***కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు**

*కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు* హైదరాబాద్:- ఎల్బీనగర్ లో  రోడ్డు ప్రమాదం...! వెంకటమ్మ , సత్తెమ్మ అనే ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు..! వెంకటమ్మ పరిస్థితి విషయం. దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా దూసుకవచ్చిన *కార్*. రోడ్డు దాటుతున్న ఇద్దరిని *డీ* కొట్టి , పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ ను *డీ* కొట్టిన *కారు*. పోలీసుల అదుపులో డ్రైవర్..

** ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం '**

 ' రాజ్యాంగ దినోత్సవం ' & ' వరకట్న నిషేద దినోత్సవం ' సందర్బముగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, నల్లగొండ మరియు విధ్యాశాఖ ఆద్వర్యములో    1. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో  మంగళవారం ఉ. 9.00 గం.లకు  న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమంలొ ఉమ్మడి నల్లగొండ  జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.వేణు మాట్లాడుతూ    రాజ్యాంగ బద్దుడే నిజమైన పౌరుడని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అనుభవించటమే కాదు, విధులు పాటించాలని, లౌకిక రాజ్యంలొ రాజ్యాంగం ఆపాదించిన హక్కులతొ భారతదేశం స్వేచ్చా, సౌభాతృత్వముతొ వెలుగుందుతుందని, చట్టం ముందు అందరం సమానులమేనని తెలిపారు. నేటి సమాజంలొ అందరూ అక్షరాస్యతతొ, ఆధునిక విజ్ఞానాన్ని ఆపాదించుకొని సంఘ పరిస్థితులను తెలుసుకుంటూ జీవనం సాగిస్తున్న మానవజీవితంలొ ఇంకా వరకట్నం కోసం ఆశ పడుతున్న  జనాలు  సభ్య సమాజంలొ ఉన్నారని , చట్టాలున్నా మనుషులు మారటం లేదని తెలుపుతూ రాజ్యాంగ ప్రవేశిక విధ్యార్థులతో చదివించారు. నల్లగొండ అదనపు ఎస్.పి. నర్మద మాట్లాడుతూ విధ్యార్థినులు రాజ్యాంగాన్ని చదివి అవగతం చేసుకోవాలని , ప్రాధమిక విధులు నిర్వర్తించాలని

**జింకను వేటాడి.. మాంసం విక్రయించే గ్యాంగ్ అరెస్ట్......**

జింకను వేటాడి.. మాంసం విక్రయించే గ్యాంగ్ అరెస్ట్...... హైదరాబాద్: కృష్ణజింకను వేటాడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్. నల్లమల అడవుల్లో జీవించే కృష్ణజింకలను కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా వేటాడి ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. రాత్రి సమయంలో సీక్రెట్ గా ఈ టీమ్ కృష్ణజింకలను వేటాడుతున్నాయని తెలిపారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అన్వర్(58), మహ్మద్ జావేద్(20)ను అదేవిధంగా వనపర్తికి చెందిన చాపల సైదయ్య(32) అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వనపర్తి జిల్లా పేబ్బేరుకు చెందిన మత్స్యకారుడు సైదయ్యతో వీరికి పరిచయం ఏర్పడింది. ఇతను కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వేటకు వెళ్లి రకరకాల పక్షులను పట్టుకొచ్చేవాడు. వాటిని విక్రయించే నిమిత్తం నగరంలోని ముర్గీ చౌక్‌కి తీసుకువచ్చి అన్వర్, జావేద్‌లకు విక్రయించేవాడు.  కొన్ని రోజులక్రితం సైదయ్య వేటకు వెళ్లి కృష్ణ జింకను పట్టుకున్నాడు. దీన్ని అమ్మేందుకు అన్వర్, జావేద్‌లకు ఇచ్చాడు. అవసరమైన వినియోగదారులకు కిలో రూ. 3 వేల చొప్పున వీరు జింక మాంసం అమ్ముతుండేవారు. జింక సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి నిందితులను పట్ట

**ఫడణవీస్‌  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా **

ఫడణవీస్‌  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా  ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్‌ పవార్‌ రాజీనామా చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫడణవీస్‌ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడణవీస్‌ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలపరీక్షకు ముందే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. కుటుంబసభ్యులతో అజిత్ పవార్‌పై ఒత్తిడి తేవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉపముఖ్యమంత్రికి రాజీనామా చేశారు. దీంతో భాజపా పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ కారణంగా దేవేంద్ర ఫడణవీస్‌ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.  తాజా పరిణామాల నేపథ్యంలో ఫడణవీస్‌ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. '

**ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మహిళా మృతి**

బంజారాహిల్స్ లోని రోడ్డు no 1 వద్ద  ద్విచక్ర వాహనాని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు మహిళా మృతి, భారీ గా ట్రాఫిక్ జామ్. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక ద్రైవర్ నీ చితక బాదిన స్థానికులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

RTI పై నిర్లక్ష్యంగా, భాద్యతరహితంగా వ్యవహరించిన PCB అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

సమాచార హక్కు చట్టం పై పీసీబీ అధికారుల నిర్లక్ష్యం, భాద్యతరహితం అంటూ ఆరోపిస్తున్నా ఆర్టీఐ ధరకాస్తూ దారుడు. నిర్లక్షంగా, బాధ్యత రహితంగా వ్యవహరించిన అధికారి పై చట్టపరంగా, విధుల్లో విఫలం చెందినందున క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ *గడువులోగా సమాచారం ఇవ్వకుండా, గడువు తీరిన తరువాత ఓ లేఖ తయారు చేసి 63 రోజుల తరువాత పోస్టు చేసిన అధికారులు.  రామచంద్రపురం లోని పీసీబీ రీజనల్ ఆఫీసు ప్రజా సమాచార అధికారికి 2019 సెప్టెంబర్ 20వ తేదీన మా ప్రతినిధి 2 అంశములకు సమాచారం కోరుతూ సమాచార హక్కు చట్టం క్రింద 10 రూపాయల ధరకాస్తూ రుసుము నగదు గా చెల్లించి దరఖాస్తు చేశాడు.  చట్టాన్ని అమలు పరుచాలిసిన ప్రజా సమాచార అధికారి  గడువులోపాల ఏలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్షంతో వ్యవహరించారు.   ఈ నిర్వకాని కప్పి పుచ్చుకోవడానికి తెలివిగా మరో  ఎత్తు వేశారు.   గడువు తీరిన తరువాత మేలుకొని  2019  అక్టోబర్ 16వ తేదితో  ఒకలేఖ  తయారు చేశారు.   దరఖాస్తుదారు కోరిన సమాచారం చాలా సమగ్రమైనది మరియు భారీగా ఉంటుందని  మరియు అభ్యర్థించిన సమాచారాన్ని  ఇవ్వడానికి, చూపడానికి  తేదీలు నిర్ణయించడం కష్టం   అవుతుందని పేర్కొంటూ, కార్యాలయం వారు ధరకాస్తూ

**మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు**

మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించిన సుప్రీమ్ కోర్టు దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దుమారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో నవంబరు 27న బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరగాలని, బహిరంగ బ్యాలెట్‌ విధానంలో ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం బలపరీక్షను ప్రొటెం స్పీకర్‌ నిర్వహించాలని ఆదేశించింది అంతేగాక.. బలపరీక్ష మొత్తం వీడియో తీయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.  

**అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య**

  అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య నవంబర్ 22 న యువతి హత్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ అత్యాచారం చేసి. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారణ యూనివ‌ర్సిటీ గ్యారేజీలో  రూత్ జార్జ్ మృత‌దేహాం  రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్

**నురగలు కక్కుకుని కిందపడిపోయిన ఆర్టీసీ కార్మికుడు భీమ్లా... **

సంగారెడ్డి :  బ్రేకింగ్  ... సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ పోలీసు స్టేషన్ లో నురగలు కక్కుకుని కిందపడిపోయిన ఆర్టీసీ కార్మికుడు భీమ్లా...  సంగారెడ్డి డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న భీమ్లా..  ఉదయం విధులలో చేరేందుకు సంగారెడ్డి డిపోకు వచ్చిన భీమ్లా , అరెస్టు చేసిన పోలీసులు ... భీమ్లాను ఆసుపత్రికి తరలించిన కార్మికులు...  ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో భీమ్లాకు గుండెపోటు వచ్చిందంటున్న తోటి కార్మికులు  ...

**పోలీసుల అదుపులోకి లెక్చరర్**

వరంగల్‌అర్బన్‌   ఖిలా వరంగల్ మండలం మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఓ కీచక ఉపాధ్యాయుడు కెమిస్ట్రీ  బోధించే లెక్చరర్  పసర రామ్మూర్తి గత మూడు నెలలుగా ఇంటర్ మీడియట్  చదువుతున్న విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న లెక్చరర్ ప్రిన్సిపల్‌ పూర్ణిమ దృష్టికి తీసుకుని వెళ్లిన విద్యార్థులు  పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్‌ పోలీసుల అదుపులోకి లెక్చరర్

**మీడియా పై పోలీస్ జూలూమ్**

మీడియా పై పోలీస్ జూలూమ్ బర్కత్ పుర డిపో వద్ద పోలిసుల ఓవర్ యాక్షన్....తోపులాటలో క్రిందపడిపోయి స్పృహ కోల్పోయిన కార్మికురాలు పద్మావతి (కండక్టర్)  మీడియా పై ఎసిపి జులుం... ఫొటోస్ వీడియోస్ తీయకుండా అడ్డుకున్న సిటీసీ ఎసిపి..

**ఇకపై తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా  *అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను* సమర్పించాలి**

*తిరుమల*   ఇకపై తిరుమలలో పెళ్లి చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా  *అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను* కూడా పొందుపరచాలంటూ టీటీడీ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.  ఈ సర్టిఫికెట్‌ను వధూవరులు ఎమ్మార్వో ఆఫీస్ నుంచి పొందవచ్చు. అయితే టీటీడీ ఇటువంటి నిబంధనను విధించడానికి కారణం లేకపోలేదు. కొందరు మహిళలు, పురుషులు గతంలో పెళ్లి చేసుకుని విడిపోయి.. తిరుమలకు వచ్చి మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడంతో మొదటి భర్త/భార్య నుంచి ఇబ్బందులు వస్తున్నాయి.  ఇందువల్లే అన్ మ్యారీడ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేస్తూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

*సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన కార్మికుడు రవి నాయక్..*

*సూర్యాపేట జిల్లా :-* *-సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన అశ్వద్ధామ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సూర్యాపేట ఆర్టీసీ డిపోలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన nmu జిల్లా నాయకుడు రవి నాయక్..* *- అశ్వద్ధామ రెడ్డి సమ్మెను తాకట్టు పెట్టి కెసీర్ కి అమ్ముడుపోయాడని.. 50 రోజులపాటు సమ్మె పేరుతో కార్మిఖులు జీవితాలతో చేలగాటమాడాడని మనస్తాపంతో ఆత్మహత్యా యత్నం చేసిన రవి నాయక్ ..*

**ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ - పత్రికా ప్రకటన **

ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ - పత్రికా ప్రకటన  యధాతదంగా చదవండి రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉంది. ఓ వైపు పోరాటం కొనసాగుతుంది అని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని చెబుతున్నారు. తమ ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరై, ఇష్టమొచ్చినప్పుడు మళ్లీ విధుల్లో చేరడం దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఉండదు. ఆర్టీసీ కార్మికులు తమంతట తామే విధులకు గైర్హాజరై, చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు తప్ప, ఆర్టీసీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ సమ్మె చేయమని చెప్పలేదు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతి ముఖ్యమైన పండుగల సందర్భంగా అనాలోచిత సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారు. కార్మికులు ఇప్పుడు చట్ట విరుద్ధమైన సమ్మెలో ఉన్నారు. ఇష్టమొచ్చినప్పుడు విధులకు గైర్హాజరయ్యి, మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదు. గౌరవ హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విషయంలో కార్మిక శాఖ కమిషనర్ తగు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు  తీసుకుంటుంది. అంతా చట్ట ప్రకారం, పద్ధ

**త్రాగునీటి పనులలో అలసత్వం వలదు అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు **

త్రాగునీటి పనులలో అలసత్వం వలదు అధికారులకు మంత్రి జగదీష్ రెడ్డి మందలింపు  #ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకం కార్యక్రమం ఇది  #నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై పైప్ లైన్లు వేస్తే చర్యలు కఠినం  #భగీరథ పనుల పూర్తికి 100 రోజుల ప్రణాళిక  #డిసెంబర్ 25 నాటికి ఓ హెచ్ యస్ ఆర్ లు పూర్తి కావాలి  #2,277 కోట్లకు గాను 1,564 కోట్లు గ్రిడ్ పనులకు వ్యయం  #ఇంట్రా పనులకు 590.57 కోట్లు  #యం.యస్ పైప్ లైన్ 90.90 కిలోమీటర్లు పూర్తి  #హెచ్.డి.పి.ఈ 2247 కిలో మీటర్లు, డి ఐ 928.22కిలో మీటర్ల పూర్తి  #1534 కు గాను 1433 ఓ హెచ్ యస్ ఆర్ ట్యాన్క్ లు పూర్తి  #4214.17 కిలోమీటర్ల ఇంట్రా పైప్ లైన్ పూర్తి  #పట్టణప్రాంతాలతో కలుపుకుని 1710 అవాస ప్రాంతాల్లో ఇంట్రా పూర్తి  #13,18,945 జనాభా కు గాను 3,81,372 ఇండ్ల గుర్తింపు  త్రాగునీటి పనులలో అలసత్వం వలదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నిర్ణిత గడువు తేదీ లోపే మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులలో జరుగుతున్న జాప్యం పై ఆయన అధికారులను నిలదీశ

**బ్రేకింగ్.. సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు**

బ్రేకింగ్.. సమ్మె విరమించిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్: 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. రేపటి నుంచి కార్మికులందరూ డ్యూటీలకు హాజరుకావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ఇదే విషయమై సోమవారం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు.. కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. కార్మికుల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత యాజమాన్యం నుంచి కనీసం స్పందన రాలేదని అన్నారు. ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరించిందన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండ మధ్య నిరసన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. అధికారులు కొంతమంది ఆర్టీసీని అమ్ముకునే ప్రయత్నం చేశారని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. దానిని అడ్డుకోవాలన్నారు. సమ్మె విరమించినా నైతిక విజయం కార్మికులదేనని అన్నారు. కార్మికులు ఓడిపోలేదని, ప్రభుత్వ గెలవలేదని పేర్కొన్నారు. హైకోర్టు సూచన మేరకు ప్రభుత్వం లేబర్ కోర్డుకు వెళ్లాల్సి ఉందన్నారు. కార్మికుల శ్రేయస్సు దృ

**కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...**

కోడిపందాలు నిర్వహిస్తున్న శిబిరాలపై దాడులు నిర్వహించిన కంచికచర్లపోలీసులు...  కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఉత్తర్వులు మేరకు నందిగామ డి.ఎస్.పి జివి రమణ మూర్తి ఆధ్వర్యంలో నందిగామ రూరల్ సీఐ కె. సతీష్  ఎస్ఐ  శ్రీ హరి బాబు ఎస్సై 2 ఫక్రుద్దీన్ మరియు వారి సిబ్బంది కలిసి  కంచికచర్ల మండలం కొత్తపేట లంక ప్రాంతాల్లో పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా 16 వేల 500 నగదు 8 సెల్ ఫోన్లు మూడు బైకులు రెండు కోళ్లు పది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు..

**వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు...**

*దారుణ హత్య* క్రోసూరు మండలం గరికపాడులో దారుణం.. వడ్డీకిఇచ్చిన డబ్బులుఅడుగుతున్నాడని వ్యక్తిని కోట్టిచంపిన ఆగంతకుడు... గరికపాడుకు చెందిన కృష్ణప్రసాద్‍ ను మద్యం తాగుదామని పోలాల్లోకితీసుకెళ్ళి కోట్టిచంపిన గోపికృష్ణ.. రెండేళ్ళక్రిందట కృష్ణప్రసాద్‍ దగ్గర ఐదులక్షలు అప్పుతీసుకున్న గోపికిృష్ణ.. డబ్బులు అడుగుతుండడంతో కృష్ణప్రసాద్‍ను పోలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిచంపిన గోపికృష్ణ... అర్ధరాత్రి ఘటన... క్రోసూరు పోలీస్టేషన్‌లో లొంగిపోయిన గాదెవారిపాలెంకు చెందిన నిందితుడు పిడుగు గోపికృష్ణ.. 

**బొయిలర్ పేలడం తో ఇద్దరు నేపాల్ కూలీలు తీవ్ర గాయాలు**

బాలాపూర్ పీస్ పరిధిలోన్ని సుల్తాన్పూర్ లో ఓడోర్ కంపిని లో బొయిలర్ పేలడం తో ఇద్దరు నేపాల్ కూలీలు తీవ్ర గాయాలు అందులో ఒకరి పరిస్థితి విషమమం...  ఇద్దరి కుడు స్థానిక రాధికా హాస్పిటల్ కు తరలింపు... కేసు దర్యాప్తు చేస్తున్న బాలాపూర్ పోలీసులు... 

**ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌తో రైతు హల్‌చల్*!**

  *మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్‌తో రైతు హల్‌చల్*! గుంటూరు: మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ రైతు హల్‌చల్ చేశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే.. రైతు శివ కోటేశ్వరరావు పట్టాదారు పాసుపుస్తకం కోసం నేడు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు పాసుపుస్తకం కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. అయినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన శివ కోటేశ్వరరావు నేడు ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు. అయితే దీనిని గమనించిన కార్యాలయ సిబ్బంది వెంటనే అతన్ని అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా హతాశులయ్యారు. అతని వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్‌ను గుర్తించకపోతే ఎంత ప్రమాదం జరిగిఉండేదో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండల తహసీల్దార్పై ఓ రైతు పెట్రోల్‌ పోసి నిప్పటించిన విషయం తెలిసిందే. ఆ ఘటన నాటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎమ

**దీప్తిశ్రీ.. మృతురాలిగా**

తూర్పు గోదావరి జిల్లా  కాకినాడలో అపహరణకు గురైన దీప్తిశ్రీ.. మృతురాలిగా బయటపడింది. ఇంద్రపాలెం డ్రెయిన్‌లో చిన్నారి భౌతిక కాయాన్ని గుర్తించారు.  శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన దీప్తిశ్రీ కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు.

**హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు..**

*హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్* హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు.. 4.2 కిలోల నిషేధిత opm డ్రగ్ ను పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బోయినపల్లి మల్లా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రాజస్థాన్ కు  చెందిన గంగారాం ను పట్టుకున్న  పోలీసులు.. వారి వద్ద నుండి ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం.. పరారీలో మరో నిందితుడు బిక్ర మ్ అనే వ్యక్తి. పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్తాన్ లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇలాంటి దందా చేస్తున్నారు.. గంగారాం ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు పని చేస్తున్నారు.. గంగారాం ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నాం..

**అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం**

*అవినీతి పై ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ ప్రారంభం* *క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్‌ హెల్ప్ లైన్‌ కాల్‌సెంటర్‌ని ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌* పోస్టర్‌ రిలీజ్‌ చేసిన సీఎం వైఎస్.జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు *కాల్‌సెంటర్‌కి నేరుగా ఫోన్‌ చేసిన సీఎం జగన్* *కాల్‌సెంటర్‌ పనితీరు, వివరాలు తెలుసుకున్న సీఎం జగన్* *ఎలాంటి ఫిర్యాదునైనా 15 రోజులు నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలి అని సూచించిన సీఎం జగన్* 

**డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత..**

డిసెంబ‌ర్‌ 25, 26 తేదీల్లో తిరుమల ఆలయం మూసివేత..   తిరుమల : డిసెంబర్‌ 25, 26 తేదీల్లో శ్రీవారి ఆలయం పాక్షికంగా మూతపడనుంది.  సూర్య గ్రహణం నేపథ్యంలో రెండు రోజుల్లో కలిపి మొత్తం 13 గంటల పాటు తిరుమల ఏడుకొండల స్వామి ఆలయం తలుపులు క్లోజ్ చేయనున్నారు.   డిసెంబరు 26 తేదీ.. గురువారం మార్నింగ్ 8.08 గంటల నుండి ఉదయం 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుందని వేద పండితులు తెలిపారు.  ఈ కారణంతో.. ఆలయ చారిత్రక నేపథ్యం ప్రకారం 6 గంటల ముందుగా, డిసెంబరు 25న బుధవారం రాత్రి 11 గంటలకు గుడి తలుపులు మూసి.. డిసెంబరు 26న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు తెరుస్తారు.  ఆ తర్వాత పూర్తిగా ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత  మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.  ఈ మేరకు టీటీడీ ప్రకటనను విడుదల చేసింది.

**గ్రీవెన్స్ పరిష్కారానికి సాంకేతికతను జోడిస్తాం : ఎస్పీ రంగనాధ్**

*గ్రీవెన్స్ పరిష్కారానికి సాంకేతికతను జోడిస్తాం : ఎస్పీ రంగనాధ్* - - ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా సాంకేతిక పరిజ్ణానం - - ఆర్జీదారులకు సమయం వృధా కాకుండా ఎస్.ఎం.ఎస్.ల.ద్వారా సమయం కేటాయింపు నల్గొండ : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి సోమవారం, సాధారణ రోజులలో వచ్చే దరఖాస్తుదారులు, బాధితుల సమస్యల పరిష్కారానికి సాంకేతికతను జోడించి త్వరగా పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన దరఖాస్తుదారుల నుండి ఆయన దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విని సంబంధిత అధికారులకు తదుపరి చర్యల కోసం ఆదేశాలు ఇచ్చారు. గ్రీవెన్స్ డే ను మరింత సమర్ధవంతంగా నిర్వహించడం కోసం అన్ని స్థాయిలలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామని చెప్పారు. భూ తగాదాల విషయంలో అన్ని కోణాల్లో విచారణ చేయడంతో పాటు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరితంగా పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. భూ సమస్యలను శాంతి భద్రతల సమస్యగా మారకుండా ఉండేలా పోలీస్ అధికారులు, సిబ్బందికి భూ చట్టాలపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్స్, శిక్షణా కార్యక్రమాలు న

**తాడేపల్లి లోటస్ హోటల్ వద్ద గంజాయి స్వాధీనం**

తాడేపల్లి లోటస్ హోటల్ వద్ద గంజాయి స్వాధీనం హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు అరెస్ట్, 2 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ స్విఫ్ట్ కారు, నలుగురు యువకులు. పట్టుపడ్డ యువకులను  ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించినట్లు తెలిపిన తాడేపల్లి పోలీసులు.

**మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా**

*మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తులకు జైలు శిక్ష, 16,500 జరిమానా* నల్గొండ : మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించడంతో పాటు మోతాదుకు మించి సేవించిన వారిని కోర్టులో హాజరుపరిచాడు. సోమవారం ట్రాఫిక్ సి.ఐ. సురేష్ బాబు, ఎస్.ఐ. కొండల్ రెడ్డిల ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాలలో బ్రీత్ ఎనలైజర్లతో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి పరీక్షలు నిర్వహించారు. పోలీసుల తనిఖీలో భాగంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన నల్గొండ పట్టణానికి చెందిన సైదులు, కట్టంగూరు మండలం బొల్లేపల్లికి చెందిన జి..కృష్ణయ్య లకు రెండు రోజుల జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా, నల్గొండ పట్టణం బొట్టుగూడకు చెందిన ఎం.డి.లతీఫ్ కు ఒక రోజు జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ సురేష్ తెలిపారు. అదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన మరో ఎనిమిది వ్యక్తులకు 10,500 రూపాయల జరిమానా విధించారని మొత్తం 16,500 జరిమానా విధించునట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 కేసులకు గాను 11 మందికి జరిమానాలు విధించగా, ముగ్గురికి జైలు శిక్షతో పాటు జరిమానాలు

వైభముగా శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం, సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు

వైభముగా శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం, సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు యదాద్రి భువనగిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్వర్యములో కార్తిక వనభోజనలు ,గోపూజ ,     శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం ,సామూహిక సత్యానారాయణ స్వామి వ్రతములు అత్యంత వైభవముగా జరిగాయి ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి గా అమరవాది లక్ష్మినారాయణ,  విశిష్ట అతిథి గా వాసవిక్లబ్స్ఇంటర్నేష నల్ మాజీ అద్యక్షులు అయిత రాములు గారు హాజరయ్యారు .ఈ కార్యక్రమమునకు  అర్వపల్లి ఆనంద్ హైదరాబాద్  ఆతిధ్యం ఇచ్చారని నిర్వాహకులు తెలిపారు. దేవాలయచైర్మన్ అర్వపల్లి శంకరయ్య, మల్లగారి శ్రీనివాస్ ,ఎల్వికుమార్ , బుక్కా శ్రీనివాస్  ,ఐతరాములు సహకరించారని నిర్వాహకులు తెలిపారు.

** మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసిన సుప్రీమ్**

మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసిన సుప్రీమ్ దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టును తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది  

**ఈనాడు ఉద్యోగుల బస్సుకు ప్రమాదం**

పెద్ద అంబర్ పెట్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం.. ఈనాడు ఉద్యోగుల బస్సును డీ కొట్టిన లారీ.. ప్రమాదం లో  పలువురు ఉద్యోగులకు గాయాలు.. హయత్ నగర్ లోని అమ్మ హాస్పటల్ కు తరలింపు.. 12 మందికి గాయాలు.. అందులో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.. రామోజీ ఫిల్మ్ సిటీ లో ఉద్యోగం ముగుంచుకొని ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.. బస్ లో అందరూ ఈనాడు కు చెందిన ఉద్యోగులే ఉన్నారు....

**నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  **

నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్   హైదరాబాద్, నిజాంపేటలొని...తిరు సంకల్ప్ విలాస్ల వద్ద,జరిగన.నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  చేశారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులను మరియు మీడియా వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా   మంజీరా గ్రూప్ అధినేత శ్రీ గజ్జెల యోగానంద్  ,  టీ టీ డి బోర్డ్ మెంబర్ శ్రీ చిప్పగిరి ప్రసాద్,  కూకట్పల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా ,సన్మానం పొందిన వారు వాసవి కిరణాలు  ఎడిటర్ సోమా త్రినాథ్ , వైశ్య న్యూస్ పత్రిక సంపాదకుల.వెనిశెట్టి నటశేఖర్, వైశ్య వికాసం సంపాదకులు గంగిశెట్టి రఘు.

**ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్.**

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించిన మేధా పాట్కర్. ఒడిస్సా రాష్ట్రంలో ని పూరిలో జరుగుతున్న ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక సదస్సు సందర్భంగా సాగర తీర మానవహారం ఏర్పాటు కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించి ఆర్టీసీ కార్మికుల సమస్య పై ప్రసంగించిన  ప్రజా ఉధ్యమాల జాతీయ వేదిక అధ్యక్షురాలు మేధా పాట్కర్..ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటి ప్రతినిధి క్రిష్ణ గారు..

**రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా**

రాంగుండంలో *'ఆపరేషన్ చబుత్రా* రామగుండం పోలీస్ కమీషనర్  వి. సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అర్ధరాత్రి రోడ్లపై జులాయి గా తిరుగుతూ, అసాంఘిక చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న యువతే లక్ష్యంగా *'ఆపరేషన్ చబుత్రా'* పేరుతో రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లో పోలీసులు ముమ్మర త‌నిఖీ లు రాత్రి వేళల్లో ప్రధాన కూడళ్లు, వీధులు, రోడ్లు, ఫుట్‌పాత్‌లపై గుంపులుగా ఉన్న,ఓపెన్  డ్రింకింగ్ చేస్తున్న,  అనుమాన స్పదంగా కనిపించిన *219* మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

షాపూర్ నగర్ లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కె.పి వివేకానంద్, ఉప్పల శ్రీనివాస్ గుప్త

*కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ లో రాష్ట్ర  ముఖ్యమంత్రి కెసిఆర్   రాష్ట్ర ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించిన సందర్భంగా ఇంటర్నేషన్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త  మరియు ఎమ్మెల్యే కె.పి వివేకానంద్"ఆధ్వర్యంలో కెసిఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో   మరియు కుత్బుల్లాపూర్ మండల ఆర్య వైశ్యులు,షాపూర్  నగర్ వాసవి క్లబ్ మెంబెర్స్ పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.*

**అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం**

*అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం* కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట నియోజకవర్గం: పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొనకంచి గ్రామంలో ఈ రోజు సాయంత్రం మగ సరోజిని అనే మహిళ అక్రమంగా అమ్ముతున్న 17 మద్యం బాటిళ్లతో సహా  లభించిన సమాచారం మేరకు  పెనుగంచిప్రోలు పోలీసు వారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెనుగంచిప్రోలు ఎస్సై రామకృష్ణ. 

**పేకాట ఆడుతున్న ఎనిమిది మంది మహిళలు అరెస్టు**

*పేకాట ఆడుతున్న ఎనిమిది మంది మహిళలు అరెస్టు* అమరావతి:  ఓ ఇంట్లో పేకాడుతున్న ఎనిమిది మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తాడేపల్లి సీతానగరంలోని  పట్టాభి సీతారామయ్య కాలనీలో పేకాటస్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.  ఈ క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్న ఎనిమిది మంది మహిళలను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి  రూ.1.36లక్షల నగదు, 8 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు గతంలోనూ ఇదే కేసులో అరెస్టయ్యారు. 

**ప్రజల భద్రత కోసమే కార్డాన్ అండ్ సెర్చ్ : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి**

*ప్రజల భద్రత కోసమే కార్డాన్ అండ్ సెర్చ్ : డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి* నల్గొండ : సంఘ విద్రోహక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజా జీవనాన్ని ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు రక్షణ కల్పించడమే కార్డాన్ అండ్ సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమని నల్గొండ డిఎస్పీ జి. వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. ఆదివారం తెల్లవారు జామున 4.00 గంటల నుండి 6.00 గంటల వరకు రెండు గంటల పాటు నల్గొండ పట్టణంలోని బస్ స్టాండ్, సతీష్ నగర్ ప్రాంతాలలో కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రజలతో మాట్లాడుతూ కొత్త వ్యక్తులకు ఇల్లు అద్దెకు ఇచ్చే సమయంలో వారి వివరాలు పూర్తిగా తీసుకోవాలని, ఆదార్ గుర్తింపు కార్డు జీరాక్స్ తీసుకోవడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. లాడ్జీల నిర్వహకులు సైతం గదులు అద్దెకు ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులకు గదులు ఇవ్వకూడదని చెప్పారు. గదులు అద్దెకు తీసుకునే వారిలో ఎవరైనా అనుమానం కలిగించే విధంగా ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్డాన్ అండ్ సెర్చ్ ద్వారా ప్రజలలో భద్రతా భావం పెరుగుతుందని చెప్పారు. నల్గొండ

**ఆర్మూర్ కు చెందిన బైక్ దొంగలను పట్టుకున్న పోలీసు,  35 బైకులను స్వాధీనం .**

రాజన్న సిరిసిల్లా జిల్లా.. ఆర్మూర్ కు చెందిన బైక్ దొంగలను పట్టుకున్న పోలీసు,  35 బైకులను స్వాధీనం . రుద్రంగి మండలం పోలీసు స్టేషన్ లో ముగ్గురు దొంగలను చూపించిన DSP  చంద్రకాంత్. రిమాండ్ కు పంపుతునట్లు వెల్లడి

**బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు**

బిల్లులు లేకుండా భారీగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబయి నుంచి విజయవాడకు రూ.3.18కోట్ల విలువైన 8.86 కిలోల బంగారం తరలిస్తుండగా ఇబ్రహీంపట్నం వద్ద వారిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముంబయిలోని అంధేరికి చెందిన జయేష్‌ జైన్‌.. విజయవాడలోని ఇస్లాంపేటకు చెందిన పాగోలు శ్రీనివాసరావు ముంబయి నుంచి బంగారు ఆభరణాలు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారిని విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న పోలీసు అధికారులను విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. 

**కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దైద శివాలయం ఈవో అనిత**

కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న దైద శివాలయం ఈవో అనిత పొందుగల వద్ద కృష్ణానదిలో దూకిన అనిత ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు భర్తతోనూ విభేదాలు! గుంటూరు జిల్లా పొందుగల వద్ద విషాదం చోటుచేసుకుంది. దైద శివాలయం ఈవో అనిత పొందుగల వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తొలుత స్థానికులు ఆమెను గుర్తుతెలియని వ్యక్తిగా భావించారు. అనంతరం పోలీసుల రాకతో ఆమె శివాలయం ఈవో అని తెలిసింది. ఇటీవలే అనితపై అవినీతి ఆరోపణలు రాగా అధికారులు సస్పెండ్ చేసినట్టు వెల్లడైంది. అటు, వైవాహిక జీవితంలోనూ కలతలు రావడంతో కొన్నినెలలుగా ఆమె భర్త నుంచి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. అయితే అనిత ఆత్మహత్యకు దారితీసిన కారణాలు ఇవేనా, లేక మరేదైనా కోణం ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

**మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు**

మార్చి 31 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి మొదటి వారానికల్లా రిజర్వేషన్ల ఖరారు పూర్తి జనవరి 10వ తేదీకల్లా వివరాలను ఎన్నికల సంఘానికి పంపుతాం హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ అమరావతి  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కంటే ముందు పూర్తి చేయాల్సిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం  హైకోర్టు ముందుంచింది.  2020 జనవరి మొదటి వారం నాటికి పంచాయతీల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు తదితర ప్రక్రియలను పూర్తి చేస్తామని నివేదించింది.  జనవరి 10వ తేదీ కల్లా ఆ వివరాలన్నింటినీ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపుతామంది.  మార్చి 31వ తేదీకల్లా పంచాయతీ ఎన్నికలను పూర్తి చేస్తామని వివరించింది.  ఈ వివరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. జనవరి 3వ తేదీ కల్లా పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేస్తారని ఆశిస్తున్నామని పేర్కొంది.  తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.  ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  పంచాయతీల గడువు ముగిసినా ఎన్నికలు ని

**చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం!**

చిరంజీవి ఇంట్లో 80వ దశకం తారల కోలాహలం! ప్రతి ఏటా కలుస్తున్న 80ల నాటి తారలు ఈసారి చిరంజీవి ఇంట్లో వేడుకలు రెండ్రోజుల పాటు ఆటపాటలు   తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర దక్షిణాది చిత్రపరిశ్రమల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనేకమంది ప్రముఖ నటీనటులు ప్రతి ఏడాది ఓ చోట కలుస్తుండడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, సుమన్, శరత్ కుమార్, ప్రభు, భానుచందర్, నరేశ్, రాధిక, జయసుధ, సుమలత, లిజి, ఖుష్బూ తదితరులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.  తాజాగా మరోసారి కోలాహలం సృష్టించేందుకు అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి వారి వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే చిరు తన నివాసాన్ని అపురూపమైన అతిథుల కోసం సిద్ధం చేశారు. రెండ్రోజుల పాటు తారలు చిరు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడమే కాదు, ఆటపాటలు, ర్యాంప్ వాక్ లు, ఇతర కార్యక్రమాలతో హాయిగా ఆస్వాదించనున్నారు. 

**ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకి**

ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకిగా చూడవచ్చు. Rtc కార్మికులు సమ్మె ఉపసంహరించుకున్న 3 రోజుల తరువాత కూడా టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగుల పున  స్థాపనపై బిజెపి తెలంగాణ యూనిట్ నిశ్శబ్దం రాష్ట్రంలో ఒక శక్తిగా ఎదగడానికి బీజేపీకి అడ్డంకిగా చూడవచ్చు. ఆర్టీసీ కార్మికులు బీజేపీ పై, కేంద్రం పై, గవర్నరుపై గంపెడు ఆశలు పెట్టుకొని సమ్మెకు ముందుకు వెళ్లారని ప్రజలంతా అనుకుంటున్నారు. సముద్రంలో మధ్యకు తీసుకెళ్లి వదిలినట్లు పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా వాటా ఉన్న కేంద్రం  త్వరగా జోక్యం చేసుకొని కార్మికులకు  స్వంతన చేకూర్చేలా తెలంగాణ బీజేపీ ముందడుగు వేసి మానవత్వం చాటుకోవాలని సామానులు ఆకాంక్షిస్తున్నారు.

**ప్రేమజంట బలవన్మరణం**

*ప్రేమజంట బలవన్మరణం* కరీంనగర్​ జిల్లా:  సైదాపూర్ మండలంలోని దుద్దనపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.   ఆత్మహత్యాయత్నం చేసిన ప్రేమజంట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.             దుద్దనపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్ వీరాసింగ్ (25), ఎలిగేడు మండలం నారాయణపల్లి గ్రామానికి చెందిన  లయమాధురి (19) రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.  ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడం వల్ల పెళ్లికి పెద్దలు అంగీకరించకలేదు.  శుక్రవారం దుద్దనపల్లి గ్రామంలో శీతల పానీయంలో పురుగుల మందు కలుపుకొని తాగారు.  ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించారు.

**హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం.**

హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం. ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ కారు...కారులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. ఒక మహిళ మృతి, ఎనిమిది మందికి గాయాలు హాస్పిటల్ కి తరలింపు. పల్టీలు కొడుతూ కింద వెళ్తున్న మరో కారుపై పడ్డ కారు ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ  అక్కడికక్కడే మృతి 8 మందికి తీవ్ర గాయాలు. ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్  నగరంలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్  పై నుంచి ఓ కారు (TS09 EW 5659)అదుపు తప్పి కింద వెళుతున్న మరో కారు మీద పడింది.  అక్కడే ఆటో కోసం ఎదురు చూస్తున్న కొందరు వ్యక్తులపై  పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా మరో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి . ఓవర్ స్పీడ్ తో  వెళుతున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి  పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. దీంతో ఫ్లై ఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.