Skip to main content

Posts

Showing posts from March, 2021

CBI ARRESTS AN EXECUTIVE ENGINEER OF CPWD AND A SUPERIENTENDENT OF GST IN SEPARATE CASES OF BRIBERY

  CBI ARRESTS AN EXECUTIVE ENGINEER OF CPWD AND A SUPERIENTENDENT OF GST IN SEPARATE CASES OF BRIBERY              The Central Bureau of Investigation has arrested an Executive Engineer (Electrical) of CPWD, Hyderabad and a Superintendent of Central Excise & Central Tax (GST) Honnavar Range, Uttara Kannada  in separate cases of bribery. The first case was registered against an Executive Engineer (Electrical), CPWD, Hyderabad on the allegations that he had demanded Rs. 60,000/- (i.e.3% of final bill amount of around Rs. 20 lakh) from the complainant for clearing complainant’s pending bills for the contracts he executed for CPWD. It was further alleged that the Complainant had already paid Rs. 45,000/- to the accused. But the accused allegedly demanded remaining bribe amount of Rs. 15,000/-, CBI laid a trap and caught the accused red-handed while demanding & accepting bribe of Rs. 15,000/- as second installment from the complainant. Searches were conducted at the office &

సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్

సాగర్ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ రవి కుమార్ గిరిజన సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రవి కుమార్ ను నాగార్జునసాగర్ బిజెపి అభ్యర్థిగా ప్రకటించారు. రవికుమార్  బయోడేటా పూర్తి పేరు : ఫాను గోతు రవికుమార్ స్వగ్రామం: పలుగు తండ త్రిపురారం మండలం పుట్టిన తేదీ: 09-06-1985 భార్య: పానుగోతు సంతోషి తల్లిదండ్రులు: పానుగోతు హరి, పానుగోతు దస్సి పిల్లలు: మన స్వీత్, వీనస్ విద్యార్హతలు: ఎం బి బి ఎస్ వృత్తి: ప్రభుత్వ వైద్యుడు  ( ప్రస్తుతం రాజీనామా ) పలు ఆస్పత్రులలో  సివిల్ సర్జన్ గా ఉద్యోగ బాధ్యతలు. నిర్మల ఫౌండేషన్ చైర్మన్, పలు మండలాలలో సామాజిక కార్యక్రమాలు నిర్వహణ.  

అధిక ఫీజులు వసూలు చేస్తున్న మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP

  *అధిక ఫీజులు వసూలు చేస్తున్న  మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలి-ABVP* నేడు నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డి.వి.కె రోడ్ లో గల మాంట్ ఫోర్ట్ పాఠశాల మరియు   సెయింట్ అల్ఫోన్సస్ హై స్కూల్ పాఠశాలల ముందు అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, నిరసన కార్యక్రమం చేస్తున్న ABVP  విద్యార్థి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని *ABVP రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు* గారు అన్నారు.  ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు సేవ పేరుతో ప్రారంభమైన ఈ మిషనరీ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ నేడు వేలకోట్ల ఆస్తులు గడిచిందని ఆరోపించారు.  ఈ పాఠశాలలో ఎయిడెడ్ పాఠశాల ఉన్నప్పటికీ ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల నుండి కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాల మాదిరిగానే ఫీజులు వసూలు చేయడం సిగ్గుచేటని,  అన్నమో రామచంద్రా అంటూ కరోనా కాలంలో అతి కష్టం మీద జీవిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం నిత్యం

కార్పొరేటర్ మారిన తీరని జియగూడ ప్రజల కష్టాలు

 కార్పొరేటర్ మారిన   తీరని  జియగూడ  ప్రజల కష్టాలు   హైదరాబాద్ జి హెచ్ ఏం సి   జియగూడ డివిజన్  ప్రజల కష్టాలు తీరడం లేదనే  సిట్టింగ్  టిఆర్ఎస్ కార్పొరేటర్ ను  ఓడించి మొన్న జరిగిన  జిహెచ్ఎంసి ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి ని గెలిపించారు. అయినప్పటికి  మా  కష్టాలు తిరడం లేదని, మా బాధలు వినే  వారు కరువయ్యారని ఆ డివిజన్ ప్రజలు వాపోతున్నారు.  జియగూడలో ఉన్న ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య  డంపింగ్ యార్డ్. దానిపై  ఎన్నో సార్లు అధికారులకు విన్నవించినా, కోర్టులు చెప్పిన వీరి కష్టాలు మాత్రం తీరడం  లేదు. దీనితో టిఆర్ఎస్ కార్పొరేటర్ ను ఓడించి బీజేపీ ని గెలిపించారు.అయినప్పటికీ ఎలాంటి మార్పులేదని, ఇప్పటికైనా ఎన్నికైన కార్పొరేటర్ ప్రజా  సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక న్యాయ  శాస్త్ర విద్యార్థి జియగూడా డంపింగ్ యార్డు వలన ప్రజలు పడుతున్న  ఇబ్బందులు   హైకోర్టు కు  లేఖ వ్రాయడంతో  హైకోర్టు సుమోటోగా  పిల్ గా స్వీకరించి  జిహెచ్ఎంసి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు అక్కడి పరిస్థితులపై నివేదిక నాలుగు వారాల్లో సమర్పించామని ఆదేశాలు ఇచ్చింది.   ఆదేశాలు ఇచ్చి దాదాపు 70

రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి.- రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్

 *నల్లగొండ జిల్లా.....* రిటర్నింగ్ అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ మీడియా సమావేశం. పాయింట్స్..... కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. ఇప్పటికే 55 మంది ఎలిమినేషన్ పూర్తి వచ్చిన ఓట్లు 2816 . ఇంకా కౌంటింగ్ కు 24 గంటల సమయం పట్టే అవకాశం. కౌంటింగ్ తొందరగా చేసేందుకు 7 నుంచి 14 టేబుళ్ల చొప్పున పెంచుతాం. రెండు బ్యాలెట్ పేపర్లు బయటికి వచ్చినవి మా దృష్టికి వచ్చింది, మా కస్టడీలో ఉన్నాయి. ......... డీఐజీ ఏవీ రంగనాథ్ పాయింట్స్...... ఒక హోం గార్డు బ్యాలెట్ పేపర్ తీసుకుని ఎన్నికల అధికారికి అప్పగించారు. మూడు రోజులుగా సిస్టమ్ ప్రకారంగా కౌంటింగ్ జరుగుతోంది,అసత్యాలు ప్రచారం చేయొద్దు.

రెండో ప్రాధాన్యత ఓట్లు..... లెక్కింపు.... లో

 రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో   రెండో ప్రాధాన్యత ఓట్లు..... లెక్కింపు.... లో ఇప్పటి వరకు 34 మంది ఎలిమినేషన్.. అయ్యే సమయానికి.. TRS...కి 174....ఓట్లు...వచ్చాయి.... మల్లన్న.........149 ఓట్లు....వచ్చాయి.... కోదండరాం..........193. ఓట్లు.....వచ్చాయి.....

పూర్తి అయిన నల్గొండ MLC మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

  MLC కౌంటింగ్.... నల్గొండ.. పూర్తి అయిన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు...... TRS పల్లా సాధించిన మొదటి ప్రాధాన్యత  ఓట్లు....1,10,840........ మల్లన్న...83,290..... కోదండరాం.....70,072... బీజేపీ....39,107..... తన సమీప అభ్యర్థి.మల్లన్న పై.... 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్న TRS పల్లా రాజేశ్వర్ రెడ్డి....... ...... ....... మొత్తం ఓట్లు ...3,87,969.... చెల్లిన ఓట్లు....3,66,333.... మురిగిన ఓట్లు....21,636.... 7 రౌండ్స్ లాల్లో అన్ని ఓట్లను లెక్కించారు....... ...

నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ 5వ రౌండ్ అప్డేట్*

 *నల్గొండ* *18.03.21* *@9:00pm* *నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ అప్డేట్..*   *ఐదో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి, పలితాలు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులు.* *ఐదో రౌండ్ లలో టీఆరెస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 18549 ఓట్ల ఆధిక్యం.* *ప్రతి రౌండ్ లెక్కింపు కు సుమారు నాలుగు గంటల సమయం.* *మొత్తం ఏడు రౌండ్ ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కు తెల్లవారుజాము వరకు సమయం పట్టే అవకాశం.* *నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద మార్కెటింగ్ గోదాంలో కొనసాగుతున్న ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు.* *నల్గొండ, ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు మొత్తం పోలైన ఓట్లు 3,86,200.* *ఐదు రౌండ్ల లలో కౌంటింగ్ పూర్తయిన మొత్తం ఓట్లు 2,79,970.* *మొదటి స్థానం లో టీఆరెస్ అభ్యర్థి "పల్లా రాజేశ్వర్ రెడ్డి"కి పోలైన ఓట్లు* *మొదటి రౌండ్ : 16130* *రెండో రౌండ్   : 15857* *మూడో రౌండ్ :15558* *నాలుగో రౌండ్ :15897* *ఐదో రౌండ్:15671* *ఐదు రౌండ్ల మొత్తం ఓట్లు 79113* *సమీప స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(జర్నలిస్ట్ నవీన్) పై 18549 ఓట్ల ఆధిక్యం* *రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి

సిద్దు అరెస్టు

  రేపు జరిగే DGP ఆఫీస్ ముట్టడికి ముందుగా నల్గొండ BJYM జిల్లా అధ్యక్షుడు  *ఐతరాజు సైదులు*(సిద్ధు) ను  నల్గొండ  2 టౌన్ పోలీసులు   అరెస్టు చేశారు.

పోలింగ్ లో భారీగా పాల్గొంటున్న పట్టబద్రులు

  పోలింగ్ లో  భారీగా  పాల్గొంటున్న పట్టబద్రులు నల్గొండ  వరంగల్  ఖమ్మం   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  8 గంటలకు  ప్రారంభం అయ్యింది.  నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో 3  పోలింగ్ బూతుల్లో పట్టబద్రులు   లైన్ల లో భారిగా నిలిచారు. ఆదివారం కావడం తో తొందరగా ఓటు వేసుకొని సెలవును కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

8న హాలియాలో మహిళా రణభేరి - సాగర్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత

8న హాలియాలో మహిళా రణభేరి - సాగర్  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత మార్చ్ 8 అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంనగా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ము లోని హాలియా పట్టణం లొ మద్యాహ్నం 2 గంటలకు మహిళా రణ భేరి ని నిర్వహిస్తున్నట్లు నాగార్జున సాగర్  నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి కంకణాల నివేదిత తెలిపారు. నల్గొండ  జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ రణభేరి కి   బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్ డి కె అరుణ మాజీ మంత్రివర్యులు ముఖ్య అతిధిగా విచేస్తున్నటు ఆమె  తెలుపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్  మహిళల ను కుక్కలతో పోల్చడం సిగ్గుచేటు అని, మహిళలను గౌరవించని టిఆర్ఎస్ కు మహిళలు బుద్ధి చెప్పాలని  ఆమె కోరారు. ఈ ప్రభుత్వం నిజాం రజాకర్లను తలపించే విదంగా ఉందిని,  సమత, దిశ లాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.మహిళలకు ఈ ప్రభుత్వం లో రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. సాగర్ బహిరంగ సభలో మహిళలను కించపరిచిన కేసీఆర్ కు ఈ గడ్డ నుండే బుద్ది చెబుతామని,  రాణి రుద్రమదేవి, చాకలి ఐలమ్మ ల స్ఫూర్తిని నింపుకొని కేసీఆర్ ను తరమడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారు.అందుకు మొదటి అడుగు సాగర్ గడ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ అగ్రనేతల ప్రచారం

  ఉమ్మడి నల్గొండ జిల్లాలో  బీజేపీ అగ్రనేతల  ప్రచారం నల్గొండ, వరంగల్,ఖమ్మం బిజెపి పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి  గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి  విజయాన్ని కాంక్షిస్తూ పూర్వ నల్లగొండ జిల్లా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరిi జిల్లాలలో బీజేపీ అగ్ర నేతల ప్రచారం నిర్వహిస్తున్నారని,  గ్రాడ్యుయేట్ మీటింగ్స్ లో పాల్గొంటారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల తెలిపారు. ఆయా నాయకులు  పర్యటన వివరాలు  ఆయన విడుదల చేశారు  తేదీ:06-03-2021 శనివారం సాయంత్రం 5 గంటలకు  కేంద్ర హోమ్ శాఖ మంత్రి  జీ. కిషన్ రెడ్డి  నల్లగొండ.  6.03.2021 శనివారం ఉదయం 11.00  గంటలకుడాక్టర్ కే,లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు నార్కెట్ పల్లి. వివేక్ వెంకట్ స్వామి గారు మాజీ పార్లమెంటు సభ్యులు తుంగతూర్తీ లో మద్య హనం 2 గంటలకు.  7వ తేదీ  ఆదివారం రోజు  పి.మురళీధర్ రావు  బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి. మునుగోడు లో సాయంత్రం 4 గంటలకు. 8వ తేదీ సోమవారం రోజు శ్రీమతి డీకే. అరుణ బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్  దేవర కొండ మరియు హాలియా. తేదీ 9.3.2021 మంగళ వారం రోజు  బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు 11.00 గం

ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల వసూళ్లపై తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

   ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు నల్గొండ: ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండిని కోరుతూ జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ వారు అధిక ఫీజు లు  వసూలు చేస్తు పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనట్లయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  దుబ్బాక సాయి,  మేకల అనిల్ కుమార్,  లింగస్వామి, బైరు సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

పల్లా ప్రవీణ్ రెడీ ( పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరుడు) నీ, trs నాయకులను అడ్డుకున్న విద్యార్థులు

 నల్గొండ..... మహాత్మాగాంధీ యూనివేర్సిటీ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పల్లా ప్రవీణ్ రెడీ ( పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరుడు) నీ, trs నాయకులను అడ్డుకున్న  విద్యార్థులు... యూనివర్సిటీ భూమిలో చేపల మార్కెట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని , యూనివర్సిటీ సమస్యల ను పట్టించుకోని నాయకులు యూనివర్సిటీ లో ఓటు అడుక్కున్నే హక్కులేదని అడ్డుకున్న విద్యార్థులు

ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజుల వసూళ్లపై తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

  ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండి - బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు నల్గొండ: ప్రైవేట్ స్కూల్స్ లో అధిక  ఫీజుల వసూళ్లపై  తక్షణం స్పందించండిని కోరుతూ జిల్లా విద్యా శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు  బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్ వారు అధిక ఫీజు లు  వసూలు చేస్తు పేద, మధ్య తరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని లేనట్లయితే అధిక ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  దుబ్బాక సాయి,  మేకల అనిల్ కుమార్,  లింగస్వామి, బైరు సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు..

యువతిపై అత్యాచారయత్నం..

 పెద్దపల్లి జిల్లా... యువతిపై అత్యాచారయత్నం.. గోదావరిఖని ఫోర్ ఇంక్లైయిన్ గడ్డ సమీపంలో ఓ యువతి పై కత్తులు చూపించి యువతికి బెదిరించి అత్యాచారయత్నంకు ప్రయత్నం చేసినా యువకులు యువతి అరుపులతో విని ఘటన స్థలానికి వచ్చిన స్థానికులు పోలీసుల అదుపులో యువకులు ఉన్నట్లు సమాచారం

"అయోధ్య" కార్యానికి రెట్టింపు స్పందన: దేవేందర్ జి

  "అయోధ్య" కార్యానికి రెట్టింపు స్పందన: దేవేందర్ జి "అయోధ్య రామమందిర నిర్మాణం ప్రతి భారతీయుడి స్వప్నం.. ఇది  కేవలం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ సంస్థలది మాత్రమే కాదు" అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రచారక్ శ్రీ దేవేందర్ జి అన్నారు. కేవలం 45 రోజుల వ్యవధిలో లక్ష్యానికి రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరడమే  ఇందుకు సాక్షాత్కారం అని వారు  పేర్కొన్నారు. జనవరి 15 వ తేదీ ప్రారంభమైన అయోధ్య రామమందిర నిర్మాణ అభియాన్ కార్యక్రమం ఫిబ్రవరి 28వ తేదీ నాటికి ముగిసింది. ఈ సందర్భంగా మార్చి ఒకటవ తేదీన భాగ్యనగరంలోని తాజ్ డెక్కన్ హోటల్లో " శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్" సమావేశం నిర్వహించింది. ఇందులో దేవేందర్ జి మాట్లాడుతూ.. ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టిన విశ్వహిందూ పరిషత్ నిధుల సేకరణ ప్రారంభానికి ముందు మందిర నిర్మాణానికి పదకొండు వందల కోట్లు ప్రజల నుంచి సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకుందని, కానీ ప్రజల నుంచి, రామభక్తుల నుంచి అనూహ్య స్పందన లభించి.. రెట్టింపు స్థాయిలో నిధులు సమకూరాయి అని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు రెండు వేల ఒక

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నాం - చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

  ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నాం -  చిన్న మరియు మధ్యతరహా పత్రికల రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు. హైదరాబాద్ : ఎంపానెల్ అయిన ప్రాంతీయ పత్రికలకు తెలంగాణ సమాచార శాఖ రెండున్న‌ర సంవ‌త్స‌రాల నుంచి అటెండెన్స్ నిర్వ‌హిస్తూన్న  ఒరిగింది మాత్రం ఏమీ లేదని, యజ‌మానుల జీవితాలు క‌రిగిపోవ‌డం త‌ప్ప‌ ప్ర‌భుత్వం చేసింది మాత్రం శూన్య‌మ‌ని చిన్న మరియు మధ్యతరహా  పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు  విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం చిన్న , మధ్యతరహా, మ్యాగజైన్ లకు  ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వకుండా నిరంకుశ ధోరణి  ప్రదర్శిస్తున్నదని, ఎన్నో సార్లు ప్రభుత్వానికి, అధికారులకు విన్నవించుకున్నా, ధర్నాలు చేసిన ఫలితం దక్కలేదని  చివరగా  మాకు జరుగుతున్న   అన్యాయానికి  నిరసనగా  దాదాపు 10 వేల మంది ఎడిటర్లు, విలేఖరులు  ఉన్నారని వారంతా పట్టభద్రులేనని ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తెరాస పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేయాల‌ని తీర్మానించుకున్నామని తెలిపారు.   గెలిచి మళ్ళీ అధికార  పార్టీలోకి పోయేవారికి కాకుండా  ఎన్

కొవాగ్జిన్‌ టీకాను వేయించుకున్న మోదీ

  దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా  60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఈ రోజు నుంచి టీకా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కొవిడ్‌ టీకా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్‌ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న మోదీ.. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్‌ సిస్టర్‌ పి.నివేదా టీకా ఇచ్చారు