Skip to main content

Posts

Showing posts from August, 2019

గణేష్ ఉత్సవ నిర్వాకులకు పోలీస్ పర్మిషన్ ఫోన్ నుండే ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు

గణేష్ ఉత్సవ నిర్వాకులకు పోలీస్ పర్మిషన్ తప్పనిసరి మరియు అప్లై చేసుకోవడం చాలా సులభం. మీరు మీ ఫోన్ నుండే ఈ క్రింద లింక్ ను ఓపెన్ చేసి మీ వివరాలు నమోదు చేసి అప్లై చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. http://policeportal.tspolice.gov.in

గ్రామాల అభివృద్ధికి ప్రతి నాయకుడు కేసీఆరే అని అంటున్న బీజేపీ రాకేష్ రెడ్డి వీడియో చుడండి

గ్రామాల అభివృద్ధికి ప్రతి నాయకుడు కేసీఆరే అని అంటున్న బీజేపీ రాకేష్ రెడ్డి వీడియో చుడండి https://youtu.be/Qa_0SArNEjg

తెలంగాణ రాష్ట్రానికి   రూ.3110 కోట్లు కేంద్రం విడుదల

తెలంగాణ రాష్ట్రానికి   రూ.3110 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ''కంపా'' (Compensatory Afforestation Fund Management and Planning Authority) నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన  జీఓ కాపీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి  శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) శోభ తదితరులు  పాల్గొన్నారు.

యువకుడి ఉన్మాదానికి టెన్త్ క్లాస్ బాలిక బలి....

యువకుడి ఉన్మాదానికి టెన్త్ క్లాస్ బాలిక బలి.... ఓ యువకుడి ఉన్మాదానికి పదో తరగతి విద్యార్దిని బలైంది.. ..  యాదాద్రి భువనగిరి జిల్లా:  సంస్తాన్ నారాయణ్‌ పూర్‌ మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన   బాలిక  స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన గిరి అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించమంటూ బాలిక వెంటపడుతున్నాడు. వేధింపులు భరించలేక బాలిక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. భవానిని గిరి అనే యవకుడు స్కూలుకు వెళ్లే సమయంలో నిత్యం వెంటపడుతూ వేధిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఇదే విషయంపై ఓ సారి యువకుడిని హెచ్చరించినట్టు కూడా చెబుతున్నారు. అయినా మారకుండా… అదేపనిగా బాలికను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన బాలిక.. శుక్రవారం బోనాల సందర్భంగా కుటుంబసభ్యులు గుడికి వెళ్లిన సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గిరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామన్నారు పోలీసులు.

మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన భర్తకు ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పిస్తానంటూ రేణుక మోసగించిందని కళావతి అనే మహిళ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణలో భాగంగా కోర్టు నోటీసులు తీసుకోకపోవడం, కోర్టుకు హాజరుకాకపోవడంతో ఖమ్మం జిల్లా రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు వారెంట్‌ జారీ చేసింది.

దేశంలో తగ్గనున్న బ్యాంకులు 

బ్యాంకింగ్ రంగంలో కేంద్రం సంచలన విర్ణయం   దేశంలో తగ్గనున్న బ్యాంకులు  27 బ్యాంకులనుంచి 12కి తగ్గనున్న బ్యాంకులు  చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం  ఇప్పటి వరకు  27  బ్యాంకులుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు   ఇక నుంచి 12  ప్రభుత్వరంగ బ్యాంకులు   అతిపెద్ద  బ్యాంకుగా  అవతరించనున్న  స్టేట్ బ్యాంక్  అఫ్ ఇండియా  రెండో బ్యాంకుగా  పంజాబ్ నేషనల్ బ్యాంకు  అలహాబాద్  బ్యాంకులో విలీనం కానున్న ఇండియన్ బ్యాంక్   సిండికేట్  బ్యాంకులో విలీనం కానున్న కెనరా బ్యాంక్   ఒకే బ్యాంకుగా  విలీనం కానున్న   యూనియన్ బ్యాంక్ ,  ఆంధ్రా బ్యాంక్ ,  కార్పొరేషన్ బ్యాంకులు   ఒకే బ్యాంకుగా  విలీనం కానున్న   ఓబీసీ,  యునైటెడ్,   పి.ఎన్. ,బి   బ్యాంకులు

ఏపీకి 152 .. టీఎస్‌కు 59 టీఎంసీలు

ఏపీకి 152 .. టీఎస్‌కు 59 టీఎంసీలు   హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు వరకు ఏపీకి 152 టీఎంసీలు, తెలంగాణకు 59 టీఎంసీలు, కనీస నీటి వినియోగ మట్టానికి పైనున్న 257.54 టీఎంసీలు ఇరు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీకి: శ్రీశైలం నుంచి 100 టీఎంసీలు, సాగర్‌ నుంచి 52 టీఎంసీలు, చెన్నైకు తాగునీరు సహా పోతిరెడ్డిపాడు నుంచి 88 టీఎంసీలు, హంద్రీ నీవా, ముచ్చమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి 12 టీఎంసీలు, సాగర్‌ కుడికాలువ ద్వారా 32 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 2 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల విడుదలకు బోర్డు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణకు: శ్రీశైలం నుంచి 14.5 టీఎంసీలు, సాగర్‌ నుంచి 44.51 టీఎంసీలు, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు 14.5 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాలువ నుంచి 26.06, ఏఎమ్మార్పీ నుంచి 10.47 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటికి 5.9 టీఎంసీలు, మిషన్‌ భగీరథకు 2.08 టీఎంసీలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించింది.

శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు!! - నవీన్ రెడ్డి

శ్రీవారి సొమ్ము దుబారా చేస్తే "వెంకన్న కోర్టులో" శిక్ష తప్పదు!! వెంకన్న సొమ్ముతో "ఐఏఎస్ అధికారుల" సోకులా!  అంటున్న రాయలసీమ పోరాట సమితి కన్వినర్,  ఐఎన్టియుసి జిల్లా గౌరవాధ్యక్షులు  నవీన్ రెడ్డి ఆయన  ప్రకటన యధాతదంగా చదవండి 1)కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా టీటీడీ అధికారులు విలీనం చేసుకుంటే కోర్టు దిక్కారం కేసును ఎదుర్కోవాలి!! 2)టీటీడీ లోని ఐఎఎస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే దేవాదాయ శాఖను ఏకంగా టీటీడీ లో విలీనం చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి??? 3)టీటీడీ ఈవో, tirupati jeo, దేవాదాయశాఖ కమిషనర్,ఎస్టేట్ ఆఫీసర్,డిప్యూటీ ఈవో కోర్టుకు సమాధానం చెప్పక తప్పదు!! 4)ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం వెంకన్న సొమ్మును మంచినీళ్లలా ఖర్చు పెట్టే హక్కు అధికారం టిటిడి ఐఏఎస్ అధికారులకు ఎవరు ఇచ్చారు?? 5)టిటిడి శ్రీవారి నిధులకు ధర్మకర్తల మండలి సమావేశంలో "చట్ట భద్రత" చేయాలి!! 6)ప్రభుత్వ కార్యక్రమాలకు శ్రీవారి సొమ్మును తరలించే సంప్రదాయానికి "స్వస్తి" పలకాలి!! 7)దేవాదాయ శాఖ అనుబంధంగా దినదినాభివృద్ధి చెందుతున్న కాణిపాకం,కాళహస్తి,కనకదుర్

ఆది దేవుడికి రసాయనాలు ఆటంకం కారదు - రాష్ట్ర విద్యాశాఖా  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

ఆది దేవుడికి రసాయనాలు ఆటంకం కారదని రాష్ట్ర విద్యాశాఖా  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. మట్టి విగ్రహాలే గణేశుడికి ప్రీతిపాత్రమైనవని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 2 న జరుగనున్న గణేష్ చతుర్థిని పురస్కరించుకుని సూర్యపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యాక్రమాన్ని ఆయన శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి తో పాటు పర్యావరణ పరిరక్షణ కాపాడడం మన విద్యుక్త ధర్మమని ఉపదేశించారు. అందుకు గణేష్ చతుర్థి నాంది పలకాలని ఆయన హితవు పలికారు.రసాయనాలతో తయారు చేసిన గణేష్ ప్రతిమలను మనం నిత్యం వాడుకునే నీటిలో నిమజ్జనం చెయ్యడం వల్ల సంభవించే అనర్దాల విషయంలో ప్రజలను చైతన్య వంతులను చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో బాగంగానే సూర్యపేట పురపాలక సంఘం పరిధిలో మూడు వేలకు పై చిలుకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.అంతే గాకుండా అయిదు ఫిట్ల విగ్రహాలు 100 వరకు ఉచితంగా అందించేందుకు సూర్యపేట పురపాలక సంఘం ముందుకు వచ్చిందన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,తుంగతుర్త

ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను   ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు  సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ది సంస్ధ (ఎంపిఇడిఎ) ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటైన ఆక్వా ఆక్వేరియా - 2019 ప్రదర్శనను ఆయన ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచంలోనే రెండో స్ధానంలో భారత్ ప్రస్తుతం ఉందని, మొదటి స్దానానికి చేరడానికి కృషి జరగాలని ఈ సందర్భంగా అన్నారు. ఆక్వారంగంలో ఉత్పాదక సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రపంచంలో ఆక్వా ఉత్పత్తులలో మొదటి స్దానానికి చేరేందుకు కృషి జరగాలని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న జల వనరులను కేవలం 40 శాతమే ఆక్వా కల్చర్ కు వినియోగించుకుంటున్నామని చెబుతూ, ఆక్వా ఉత్పాదకతను పెంచేందుకు కూడా ఎంపిఇడిఎ లాంటి సంస్ధలు, ప్రభుత్వ సంస్దలు, పరిశోధనా సంస్దలు కృషి చేయాలని సూచించారు. మెరుగైన ఫిషరీస్ మేనేజ్ మెంట్ పద్దతులను రూపొందించుకుని, ఖచ్చితమైన అమలు కోసం కృషి జరగాలని, వాతావరణ మార్పుల ను దృష్టిలో ఉంచుకోవాలని కూడా పేర్కొన్నారు. క్షేత్ర స్ధాయిలో ఆక్వా రైతుల

మూడు జాతీయ స్కోచ్ అవార్డులను అందుకున్న తెలంగాణ సివిల్  సప్లైస్ విభాగం

మూడు జాతీయ స్కోచ్ అవార్డులను అందుకున్న తెలంగాణ సివిల్  సప్లైస్ విభాగం పిడిఎస్ మరియు ప్రొక్యూర్‌మెంట్‌లో సరికొత్త ఐటి ప్రాజెక్టును అమలు చేసినందుకు సివిల్ సప్లైస్ విభాగం ఈ ఏడాది మూడు జాతీయ స్కోచ్ అవార్డులను అందుకుంది. ఇది ఆన్‌లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (OPMS), టి-రేషన్ యాప్, టి-వాలెట్ అవార్డులను అందుకుంది. సివిల్ సప్లైస్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) శ్రీ జి. నాగేందర్ రెడ్డి ఈ అవార్డులను న్యూ డిల్లీలోని స్కోచ్ హెడ్ శ్రీ పన్నీర్ కొచ్చర్ నుండి అందుకున్నారు. OPMS సాఫ్ట్‌వేర్ రైతుల నుండి వరి సేకరణ మరియు చెల్లింపులలో సున్నితమైన లావాదేవీని నిర్ధారిస్తుంది. సేకరణ కాలం ప్రారంభమైన వెంటనే ఇది వారి సమీపంలోని పిపిసి రైతులకు SMS పంపుతుంది. మరియు ఇది రైతుల ఖాతాల్లోకి నేరుగా చెల్లింపులు చేస్తుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రాబీ సీజన్లలో OPMS సహాయంతో రూ. 13,657 కోట్లు, ఇక్కడ నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. టి-రేషన్ యాప్ పిడిఎస్ లబ్ధిదారులకు ఎఫ్‌పి షాపుల ప్రత్యక్ష లావాదేవీని చూడటానికి సహాయపడుతుంది. వారు పని చేస్తున్నా లేదా మూసివేసినా సమీపంలోని ఎఫ్‌పి షాపును గుర్తించగలరు మరియు దుకాణంలో స్టాక

హైదరాబాద్ వాసులకు మరో  రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు

హైదరాబాద్ వాసులకు మరో  రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను శుక్రవారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ.... ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు  అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు దోహదం చేస్తాయన్నారు. నగరంలో స్వచ్ఛమైన గాలి లభించడం గగనమైపోయిందని... ఇలాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కు నలువైపులా 'అర్బన్ లంగ్ స్పేస్' పేరుతో రిజర్వు ఫారెస్టులను అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యాటకులు సైతం సందర్శించేందుకు వీలుగా పార్కుల్లో  అదనపు హంగులు సమకూరుస్తున్నామని చెప్పారు.  దమ్మాయిగూడలో 298 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాను అభివృద్ది చేశారని తెలిపారు. రూ.74.424 లక్షలతో గజీబా, కూర్చునేందుకు వీలుగా బెంచ్ లు, వాటర్ హర్వేస్టింగ్ స్ట్రక్చర్స్, యోగా షేడ్,  వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గజీబా  (వ్యూ పాయింట్) నుంచి చూస్తే మొత్తం అర్బన్ పార్క

*ఆన్ లైన్ బెట్టింగ్, బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల నజర్*

*ఆన్ లైన్ బెట్టింగ్, బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్, వడ్డీ వ్యాపారులపై పోలీసుల నజర్* - - బెట్టింగులకు, అధిక వడ్డీకి వ్యాపారానికి పాల్పడే వారి సమాచారం ఇవ్వండి - - బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్ నిర్వహణ పై పోలీస్ నిఘా - - సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం - - అధిక వడ్డీలు, బెట్టింగుల బారిన పడి ఆత్మహత్యలకు పాల్పడుతున్న సామాన్యులు - - బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ నల్గొండ : జిల్లాలో బెట్టింగులు, జూదం, గ్యాంబ్లింగ్ లకు పాల్పడే వారితో పాటు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్న వ్యాపారుల వివరాలు నేరుగా తనకు, పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. ఎంతో మంది సామాన్య, పేద ప్రజలు డబ్బు ఆశతో జూదానికి, ఆన్ లైన్ బెట్టింగులకు, బెట్టింగులకు పాల్పడుతూ, తమ వద్ద డబ్బులు లేక అప్పులు తీసుకొని సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఇటీవలి కాలంలో బెట్టింగులు, జూదం నడుస్తున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చిందని ఈ క్రమంలో జిల్లాలో జూదం, బెట్టింగులు జరగకుండా పోలీసులు అన్

*బాహుబలి తరువాత సాహో "ప్రభాస్" అభిమానులకు తీవ్ర నిరాశ*

*సాహో* * బాహుబలి తరువాత సాహో "ప్రభాస్" అభిమానులకు తీవ్ర నిరాశ* *కథ పరంగా అజ్ఞాతవాసి ని పోలివుంది, పాటలు బాగొలేవు* *3 గంటలు (171 ని౹౹) చాలా భారంగా నడిచింది, ఒక్క క్లైమాక్స్ తప్ప (చివరి 20 ని౹౹ యాక్షన్ బాగుంది* *ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర చెయ్యకుండా "KGF" లా యాక్షన్ పైపు మళ్ళించాలి అని బొక్కబోర్లాపడ్డారు* *నిర్మాణ విలువలు బాగున్నా ఇది పూర్తిగా దర్శకుడి వైఫల్యం గా చెప్పవచ్చు* *Y J R Rating - 2/5*

వాసవి క్లబ్ వి 104ఏ  దశాబ్ది ఉత్సవాల  వేడుక - ఎల్వీ కుమార్

వాసవి క్లబ్ వి 104ఏ  దశాబ్ది ఉత్సవాల  వేడుక- ఎల్వీ కుమర్   ప్రకటన ఆయన ప్రకటన యధావిధిగా చదవండి... వి104ఏ మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతుంది..... రారెవ్వరు మనకు సాటి..... లెరెవ్వరు మన 104కు పోటీ అనే విధంగా మన వాసవీ జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.... ఈ పదేళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు..... ఎన్నో రికార్డులు.... మరెన్నో రికార్డుల బద్దలు..... ఇది సూక్ష్మంగా మన 104ఏ ఘనత, కీర్తి.... మరి ఎన్నో అద్భుత విజయాలకు చిరునామాగా నిలిచిన మన 104ఏ పదేళ్ల ప్రస్థానాన్ని ఒక్క సారి మననం చేసుకుంటూ లెక్కకు మిక్కిలి నిర్వహించిన సేవా కార్యక్రమాలతో దూసుకుపోతూ తన ప్రత్యేకతను విసిఐలో ప్రతి ఏటా చాటుతున్నాం.... సగర్వంగా నిలుస్తున్నాం.... మన 104ఏ పది వసంతాల  వేడుకలు చరిత్రను భావి వాసవియన్లకు తెలియచేయడం గడిచిన 10 ఏళ్ల మన గవర్నర్ల సేవా పరంపరను గుర్తు చేసుకునేందుకు *దశాబ్ది ఉత్సవాలు* అంగరంగ వైభవంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతోంది మన 104ఏ.....అంతర్జాతీయ పూర్వాధ్యక్షులు, మన 104ఏ పదేళ్ల రధ సారథులు, పూర్వ గవర్నర్లకు ఘన సత్కారం చేసే అద్భుత వేడుక ఇది....ఇంకా గత 10 సంవత్సరాల నుండి మన క్లబ్బులకు సారథ్యం

సాహో* సినిమా రివ్యూ

 * సాహో* సినిమా రివ్యూ టైటిల్‌: *సాహో* న‌టీన‌టులు: ప‌్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాప్‌, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ప్ర‌కాశ్ బ‌ల్దేవ్‌, ఎవ్లిన్ శ‌ర్మ‌, సుప్రీత్‌, చుంకీ పాండే, మందిరా బేడీ, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, టిను ఆనంద్‌ జాన‌ర్‌: యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది ఎడిటింగ్‌: శ్రీక‌ర‌ప్ర‌సాద్‌ నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌ నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ - వంశీ క‌థ‌,ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌ *సెన్సార్ రిపోర్ట్‌:* యూ / ఏ ర‌న్ టైం: 172 నిమిషాలు రిలీజ్ డేట్‌: 30 ఆగ‌స్టు, 2019  బాహుబ‌లి త‌ర్వాత యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టించిన *సాహో* సినిమా ఈ రోజు ఏకంగా ఐదు భాష‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అతిపెద్ద బడ్జెట్ తో తెర‌కెక్కిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ట్రైలర్, పోస్టర్స్ తో అంచనాలు మించి సినిమాకు క్రేజ్ ఏర్పడింది. దేశం మొత్తం సాహో ఫీవ‌ర్‌తో ఊగిపోయింది. ఈ నేపధ్యంలో ఈ రోజు రిలీజైన `సాహో` ఆ క్రేజ్ ని నిలబెట్టగలిగిందా, బాహుబలి వంటి చిత్రం తర్వాత ప్రభాస్ ఎంచుకున్న ఈ సినిమా స్పెషాలిటి ఏమిటి, దర్శకుడుగా సుజీత్ ఏం మ్యాజిక్ తెరపై చేశాడు ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

DRDOలో  ( మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భారత ప్రభుత్వం) ఉద్యోగ అవకాశాలు ఈ క్రింది లింకు ను ఓపెన్ చేసి అప్లయి చేసుకోవచ్చు

DRDOలో  ( మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భారత ప్రభుత్వం) ఉద్యోగ అవకాశాలు ఈ క్రింది లింకు ను ఓపెన్ చేసి అప్లయి చేసుకోవచ్చు https://rac.gov.in/index.php?lang=en&id=0

భువనగిరి జిల్లా పరిషత్ ఎదుట  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా,  పోలీస్ అరెస్టుతో త్రోపులాట, పలువురి కి గాయాలు

భువనగిరి జిల్లా పరిషత్    ఎదుట  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధర్నా,  పోలీస్ అరెస్టుతో త్రోపులాట, పలువురి కి గాయాలు భువనగిరి జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా... స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలని సర్పంచ్ ల అధికారాలను కాపాడాలని జాయింట్ చెక్ పవర్ రద్దు చేయాలని కోరుతూ కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయం భువనగిరి ముందు   భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , భువనగిరి నియోజక వర్గ ఇంచార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా-రాస్తారోకో నిర్వహించారు..   పోలీసుల అరెస్ట్ తోపులాటలో భువనగిరి మండలం వడపర్తి సర్పంచ్- మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి కాలు విరిగింది-కొంత మంది నాయకులకు స్వల్ప గాయాలు  అయ్యాయి నాయకులు,కార్యకర్తలను అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అలనాటి అందాల నటి జమున పుట్టిన రోజు వేడుకలు

అలనాటి అందాల నటి జమున  పుట్టిన రోజు వేడుకలు ఒక రోజు ముందుగానే ఈ రోజు సాయంత్రం ఘనంగా జరిగాయి.  

*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు..... *

*మంచిర్యాల పోలీసులు అధికార పార్టీకి మద్దతు * కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కి ఫిర్యాదు చేసిన మంచిర్యాల బీజేపీ నాయకులు*   ఢిల్లీ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి మరియు మంచిర్యాల అసెంబ్లీ ఇంఛార్జి రఘునాథ్ వెరబెల్లి  కలిసి ఫిర్యాదు చేశారు       మంచిర్యాల పట్టణం లో 23/08/2019 రోజున బీజేపీ మరియు టిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చ కు సిద్దం అయినప్పుడు పోలీసులు ముందుగా వచ్చిన బీజేపీ నాయకులను వివేకానంద విగ్రహానికి పూల మాల వేయకుండా అడ్డుకున్నారని ,  టిఆర్ఎస్ నాయకులు పూల దండ వేస్తుంటే అక్కడే ఉన్న పోలీసులు అది చూస్తూ కూడా పట్టించుకోకుండా ఉన్నారని ఫిర్యాదు చేశారు.  ఈ విధంగా పోలీసులు రాష్ట్ర అధికార పార్టీకి మద్దతు పలుకుతూ మరియు బీజేపీ నాయకుల, కార్యకర్తల పై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు అని మంచిర్యాల పోలీసులపై మంత్రి  కి   తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, సతీష్ రావు, తులా ఆంజనేయులు, తుల మధుసూదన్ రావు, పట్టి కృష్ణ, రంగ శ్రీశైలం, పత్తి శ్రీనివాస్, కిషోర్, శరత్ మరియు తదితరులు పాల్గొన్నారు.

అర్జాలబావి గ్రామ పరిధిలో ఆకతాయిని చితకబాదిన విషయంలో నల్గొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్........ వీడియో చూడండి

 అర్జాలబావి గ్రామ పరిధిలో ఆకతాయిని చితకబాదిన విషయంలో నల్గొండ రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్........ వీడియో చూడండి https://youtu.be/3bkCXgz6HZQ

వి సెల్యులాయిడ్ సినిమా ధియేటర్ ను ప్రారంభించిన సినీ హీరో రాంచరణ్... 

  వి సెల్యులాయిడ్ సినిమా ధియేటర్ ను ప్రారంభించిన సినీ హీరో రాంచరణ్...  థియేటర్ వద్ద రాంచరణ్ కి ఘన స్వాగతం  సూళ్లూరుపేట మండలం పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకోని పిండిపాలెం లోని ఒకే ప్రాంగణంలో నూతన టెక్నాలజీ తో నిర్మించిన వి ఎపిక్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సినిమా ధియేటర్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం థియేటర్లోనే పలు సినిమా ట్రైలర్లను తిలకించారు. ఒకే ప్రాంగణంలో మూడు తెరలతో మంచి డిజిటల్ సౌండ్ తో థియేటర్ ను నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. సూళ్లూరుపేట అభివృద్ధి పథంలో ఉన్నందున అన్ని నూతన టెక్నాలజీకి సంబంధించిన ఇలాంటివి ఉండడం మన నెల్లూరు జిల్లా ప్రేక్షకులు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వంశీ రెడ్డి,విక్రమ్ రెడ్డి,వారి పెద్దలకు శ్యాంసుందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సూళ్లూరుపేట ప్రాంతం అనగానే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రపంచపటంలోలనే ప్రాధాన్యత కలిగిన షార్ ప్రాజెక్టు అని కొద్ది

*మెట్రో స్టేషన్లలో స్నాక్స్ ఫెస్టివల్*

  *మెట్రో స్టేషన్లలో స్నాక్స్ ఫెస్టివల్* అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొదిద్దుకొని ఇప్పటికే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హైదరాబాద్ మెట్రో మరో ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌కు సిద్ధమైంది. మెట్రో స్టేషన్లలో  ఆగస్టు 30 నుండి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ స్నాక్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1 న మూడు రోజులపాటు ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సౌత్ కొరియా, స్విట్జర్లాండ్‌, స్పెయిన్, స్వీడన్, ఇథియోపియా, సూడాన్, చైనా దేశాలకు సంబంధించిన స్నాక్స్ స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు సంబంధించిన విభిన్నమైన స్నాక్స్ కూడా హైదరాబాద్ వాసులకు పరిచయం చేయనున్నారు.ఫెస్టివల్ సందర్భంగా సందర్శకులకు సెల్ఫీ అవార్డులు కూడా అందించనున్నారు. స్నాక్స్ ఫెస్టివల్‌కు వచ్చే వారు స్టాల్స్ దగ్గర దిగిన సెల్ఫీల్లో ఎక్కువ లైక్స్ వచ్చిన వాటికి బహుమతులు ఇవ్వనున్నారు.   

*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం*   *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం* 

*"సాహో" చిత్ర నిర్మాతల ఔదార్యం*   *విద్యుత్ ఘాతంలో గాయపడ్డ ప్రభాస్ అభిమానికి రూ.లక్ష ఆర్థిక సహాయం*   *బాధిత కుటుంబ సభ్యులకు లక్ష అందజేసిన యువనేత మిథున్ రెడ్డి*   *"హీరో ప్రభాస్" సాహో బ్యానర్ కడుతూ అభిమాని వెంకటేష్ నాయక్ విద్యుత్ ఘాతం* ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ సాహో సినిమామేనియా నడుస్తుంది. ప్రభాస్ అభిమానులు కూడా ఈ చిత్రం కోసం కళ్ళలో ఒత్తులేసుకుని మరీ వేచి చూస్తున్నారు. 10 వేల స్క్రీన్స్ లో సాహో విడుదలవుతుంది. రేపు సినిమా విడుదల అవుతున్న  కారణంగా థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి కూడా మొదలైంది. అయితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల థియేటరులో విద్యుత్ ఘాతం జరిగి బోయినపల్లి ప్రాంతానికి చెందిన ప్రభాస్ అభిమాని వెంకటేష్ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్పందించిన చిత్ర నిర్మాతలు, యువి క్రియేషన్స్ నిర్వాహకులు విక్రమ్ రెడ్డి, వంశిరెడ్డి గాయపడ్డ అభిమాని వెంకటేష్ పరిస్థితి తెలుసుకుని చలించిపోయారు. మహబూబ్ నగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి  తనయుడు ఏపీ మిథున్ రెడ్డి ద్వారా ఈ సంఘటనను తెలుసుకొని ఆయన ద్వారా లక్ష రూపాయల ఆర్థిక సహాయం బాధితునికి అంద చేశారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కి హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన స్పీకర్ పోచారం

కేంద్ర మంత్రి  నితిన్ గడ్కరీ కి  హైదరాబాద్ -బైన్సా రహదారిపై వినతిపత్రం సమర్పించిన  స్పీకర్  పోచారం శ్రీనివాసరెడ్డి ఆద్వర్యంలోని పార్లమెంట్ మరియు శాసనసభ్యుల బృందం.   న్యూఢిల్లీలో గడ్కరీ ని అధికారిక నివాసంలో కలిసిన స్పీకర్ పోచారం హైదరాబాద్-నర్సాపూర్-మెదక్-ఎల్లారెడ్డి- బాన్సువాడ- రుద్రూర్-బోదన్-బైన్సా (230 కిమీ) పరిదిలోని రాష్ట్ర రహదారిని కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించిందని తెలిపారు. ఈ రహదారిలో హైదరాబాద్ నుండి మెదక్ (64 కిమీ-NH 765 D), మరియు బోదన్ నుండి రుద్రూర్ (10 కిమీ- NH 161BB) వరకు ఇప్పటికే జాతీయ రహదారులుగా గుర్తించారని. మిగతా బాగంలోని మెదక్ - రుద్రూర్ (92 కిమీ), బోదన్-బాసర-బైన్సా (55 కిమీ) వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ఆమోదించి విస్తరణకు అనుమతి స్పీకర్ పోచారం కోరారు. .నూతన రహదారి అనుసందానంతో ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, బోదన్ నియోజకవర్గాల పరిధిలో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు సులువుగా ఉండడంతో పాటు, ప్రసిద్ధ సరస్వతి దేవాలయం కొలువైన బాసరకు రవాణా మెరుగవుతుందని అని తెలిపారు.  ఈ రహదారి విస్తరణలో ప్రాధమిక మౌళిక వసతులు మార్చడానికి అవసరమయ్యే న

కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్

కరివేన ప్రాజెక్ట్ ను సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి  లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో కీలక రిజర్వాయర్ అయిన కరివేన ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఏరియల్ వ్యూ నిర్వహించి అనంతరం ఇంజనీర్లు అధికారులు వర్క్ ఏజెన్సీలతో పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.  పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో కరివెన రిజర్వాయర్ కీలకమైనదని దీనికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావాలని సంబంధిత ఇంజనీర్లు వర్క్ ఏజెన్సీలకు సీఎం స్పష్టం చేశారు.  ప్రస్తుతం నడుస్తున్న పనులను 3 షిఫ్టుల్లో నిరంతరాయంగా   నిర్మాణ పనులను పూర్తిచేయాలని తెలిపారు. " మీరు ఇక నుంచి మీ బిల్లులకు చింత చేయవలసిన అక్కర్లేదు. పొద్దున బిల్లులు పెడితే సాయంత్రం కల్లా క్లియర్ చేసే బాధ్యత నాది. వర్క్ ఫోర్స్ పెంచుకోండి. పని షిఫ్ట్లు పెంచుకోండి. అధికార యంత్రాంగం మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. నాలుగున్నర నెలల టార్గెట్ పెట్టుకొని ఎండలు ముదురక ముందే  పని పూర్తి చేయండి. వానాకాలం వచ్చేటాల్లకు రైతుల పంటలకు మన నీళ్ళందే తట్టుం డాలే.  ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు లేవు భూసేకరణ సమస్

15 లక్షల సభ్యత్వ నివేదిక ను జాతీయ నాయకులకు అందచేసిన తెలంగాణ బీజేపీ సభత్వ ప్రముక్ లు

15 లక్షల సభ్యత్వ నివేదికను జాతీయ నాయకులకు అందచేసిన తెలంగాణ   బీజేపీ సభత్వ ప్రముక్ లు ఢిల్లీలో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదుపై  జాతీయ స్థాయి సమీక్ష  సమావేశంలో   బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్రంలో 15 లక్షల సభ్యత్వం నివేదిక ను  బిజెపి రాష్ట్ర  సభ్యత్వ ప్రముఖ్ ఎం ధర్మారావు సహా ప్రముఖ్ డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు జాతీయ సభ్యత్వ ప్రముఖ్  శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షులు జె పి నడ్డా కు  అందజేశారు.  దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు  ముగిసినా పశ్చిమ బెంగాల్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో లక్ష్యానికి దగ్గరగా 15 లక్షల సభ్యత్వం చేసినందుకు బిజెపి జాతీయ నాయకత్వం , బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు  జగత్ ప్రకాష్ నడ్డా, బిజెపి సభ్యత్వ జాతీయ ప్రముఖ్ శివ రాజ్ సింగ్ చౌహాన్  అభినందించారు. 

KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్  

KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్   SMH విద్యార్థులకు ప్యాకెట్ మని1000రూ.లు ఇవ్వాలని. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 7న." ఛలో సంక్షేమ భవన్ "  ను జయప్రదం చేయండని    kvps రాష్ట్ర ఉపాధ్యక్షుడు   పాలడుగు నాగార్జున కొరారు.  . ప్రతీ మండలం  నుండి  10 మందిని  సమీకరించాలని ఆయన అన్నారు. 

30న శాంతి సంఘ సమావేశం

నల్గొండ : వినాయక చవితి పండుగ ను సందర్భంగా ఏర్పాట్లపై నేడు(ఆగస్ట్ 30) శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ  మందిరంలో శాంతి సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.జిల్లా అధికారులు,శాంతి సంఘం సభ్యులు సమావేశం కు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు

తెలంగాణా కు 3110 కోట్లు మంజూరి చేసిన కేంద్రం

తెలంగాణా కు 3110 కోట్లు మంజూరి చేసిన కేంద్రం కంపా నిధులు కింద రాష్ట్రానికి రూ. 3110  కోట్లు విడుదల చేస్తూ కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చిందని  రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో గురువారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్  అన్ని రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఇంద్రకరణ్ రెడ్డితోపాటు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆర్. శోభ  ఈ సమావేశంలో పాల్గొన్నారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ....కంపా (కాంపెన్సెటరీ ఎఫారెస్టెషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధుల  కింద రాష్ట్రానికి  కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు.  రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పెద్దమొత్తంలో నిధులు విడుదల అయ్యాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రత్యామ్నాయ అడవుల సృష్టికి  సీయం కేసీఆర్ సారధ్యంలోని తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.   ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి కంపా నిధులను సమర్థంగా ఉపయోగించడం వల్లే కేంద్రం నిధులు విడుదలన చేసిందని స్పష్టం చేశారు. వ

బిజెపి పార్టీ దూసుక పోతుంటే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి - లక్ష్మణ్

కొత్తగూడెం వెళుతూ సూర్యాపేటలో ఆగిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Dr లక్ష్మణ్.. ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు, లక్ష్మణ్ సమక్షంలో పలు పార్టీల నుండి బీజేపీలో చేసిన పలువురు కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు...  లక్ష్మణ్ కామెంట్స్: యధాతదంగా చదవండి * రాష్టం లో బిజెపి పార్టీ దూసుక పోతుంటే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. * టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు కళ్యాణాలక్ష్మి , షాధిముభారక్, పెన్షన్స్,ఇన్సూరెన్స్ మొదలగు తాయిలాలు చూపి సభ్యత్వ నమోదు చేసుకుంటే బీజేపీ లో నరేంద్ర మోడీ గారి పని తీరును చూసి స్వచ్చందంగా సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. *టిఆర్ఎస్ కుటుంభ అవినీతి  పాలనను అంతమందించడానికి, సమాధి చేయడానికి పెద్దఎత్తున యువకులు ముందుకొస్తున్నారు. *ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాషాయ జండను రెపరెపాలదిస్తామన్నారు.

గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ రంగనాధ్*

గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి : ఎస్పీ రంగనాధ్* - - డి.జె.లకు అనుమతి లేదు - - పోలీస్ సూచనలు పాటించాలి - - జిల్లాలోని ప్రతి గణేష్ మండపం వద్ద జియో ట్యాగింగ్ - - అన్ని విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి - - అవాంఛనీయ ఘటనలు చోటు చేసుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చర్యలు నల్గొండ : జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ నిర్వహించుకోవాలని ఎస్పీ ఏ.వి.రంగనాధ్ సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని అన్నారు. శాంతి సంఘ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వహకులతో సమావేశాలు నిర్వహించి వారి నుండి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. తొమ్మిది రోజుల పాటు విగ్రహాల వద్ద రాత్రి సమయంలో ఆయా విగ్రహాల వద్ద కనీసం ఇద్దరు వ్యక్తులు బాధ్యత వహించి ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి విధిగా  అనుమతి పొందాలని, అనుమతి పొందిన విగ్రహాల నిర్వాహకులక

అక్క మొగుడే కాలయముడు.

  అక్క మొగుడే కాలయముడు. ఒంగోలు: అక్క మొగుడే కాలయముడయ్యాడు. బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి.. చివరికి ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు అత్యచారం చేశాడు. పెళ్లికి ఒప్పుకోకపోతే తల్లి తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు. బావ సుధాకర్ వేధింపులు భరించలేని యువతి చివరికి ప్రాణాలు తీసుకున్న ఘటన ఒంగోలులో కలకలం రేపుతోంది. ఢిగ్రీ సెకండియర్ చదువుతున్న యువతిని గత కొంతకాలంగా ఆమె బావ లైంగికంగా వేధిస్తున్నాడు. ఆమె అక్కను ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లో ఇల్లరికం అల్లుడుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో మరదలిపై కన్నేశాడు. పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు.   ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. మరదలితో తాను కలిసిన వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సుధాకర్ అసలు స్వరూపం బయడపడంతో వారు రెండో పెళ్లి

మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు : సురేష్ బాబు*

*మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి జైలు : సురేష్ బాబు* నల్గొండ : మద్యం సేవించి వాహనం నడుపుతూ పెట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష, జరిమానా పడినట్లు నల్గొండ ట్రాఫిక్ సిఐ సురేష్ బాబు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిన ఎనిమిది మందిని కోర్టులో హాజరు పర్చగా గుర్రంపోడుకు చెందిన జి. శివ కుమార్ కు రెండు రోజులు, నల్గొండ పట్టణం అబ్బాసియా కాలనీకి చెందిన వేముల స్వామికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడినట్లు ఆయన తెలిపారు. మిగిలిన ఆరుగురు వ్యక్తులకు 8,100 రూపాయల జరిమానా విధించారని చెప్పారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మారనున్న ఎంవీఐ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని అందువల్ల వాహనదారులు జాగ్రత్త వహించి నిబంధనలు పాటించి జరిమానాలు బారిన పడకుండా పోలీసులతో సహకరించాలని వారు కోరారు.

రైతులకు 100శాతం రైతు బంధు అందించాలి-ఎంపీ ఉత్తమ్

రైతులకు 100శాతం రైతు బంధు అందించాలి-ఎంపీ ఉత్తమ్ సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో  ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పాల్గోన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ     మేళ్లచెర్వు మండల పరిధిలోని రైతులకు 100శాతం రైతు బంధు అందించాలని కోరారు. సర్వ సభ్య సమావేశాలకు అన్నిశాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు, హాజరు కానివారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను  ఇంకా చాలా మందికి అందలేదని నాదృష్టికి వచ్చిందన్నారు. మహిళా సంఘాలకు పూర్తి స్థాయిలో వడ్డీ రాయితీ అందించాలన్నారు. ఐ కె పి కి సంబంధించి డ్యూస్ క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను కోరారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, టీచర్ల కొరత, మంచినీటి సమస్య లను పరిష్కరిస్తానన్నారు. రెవిన్యూ శాఖ పరిధిలోని రైతులకు సంబంధించి భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. స్థానిక వైద్య శాల ను త్వరలో సందర్శిస్తానన్నారు. సమావేశానికి వారం రోజులు ముందుగా సభ్యులకు ఎజెండా నోటీసు తోపాటు ఆయాశాఖల నివేదిక లు అందజేయాలన్నారు.గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ లో ఓల్టేజి సమస్యను పరిష్కరించడం తో పాటు, వీధి లైట్లు, రైతు సమస్యలు పరిష్కరించాలన్నారు.  అధికారుల

మొక్కలు నాటిన ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మొక్కలు నాటుతున్న నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పాల్గొన్న స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ లు, అధికారులు.

సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్

సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విమోచన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేసింది. తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్ ఎన్.శ్రీవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కామర్సు బాలసుబ్రహ్మణ్యం, జి.ప్రేమేందర్ రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధికారికతెలంగాణ విమోచన దినోత్సవానికై టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు పిలుపునిచ్చారు.

సీనియర్ జర్నలిస్టు శ్రీ కోటగిరి దైవదీనం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు

మా గురువుగారు సీనియర్ జర్నలిస్టు శ్రీ కోటగిరి దైవదీనం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు   - 💐💐💐💐💐💐 భూపతి రాజు, ఎడిటర్: భూపతి టైమ్స్, గూఢచారి పత్రికలు

*కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి.*

*కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి.* వరంగల్‌: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. తప్పు చేస్తే దండించాల్సింది పోయి అతనే తప్పుగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. మట్టేవాడ ప్రభుత్వ పాఠశాలలో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు పోశాల శ్రీనివాస్‌ చిన్నపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ, పిల్లలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ.. అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని ఓ బాలిక ఇంట్లో చెప్పగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులు పాఠశాలకు వచ్చి కీచక ఉపాధ్యాయుడిని చితకబాదారు. అనంతరం అతన్ని విధుల నుంచి తొలగించాలని పాఠశాల ఎదుట బైఠాయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫొటో తీసి ఈ నెంబరుకి పంపొచ్చు:

ఏపీలో ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫొటో తీసి ఈ నెంబరుకి పంపొచ్చు: మంత్రి పేర్ని నాని ఏపీ రవాణా శాఖ వినూత్న కార్యక్రమం రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై అవగాహన ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులకు 9542800800 నెంబర్ కేటాయించాం ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏపీ రవాణా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలో మీడియాతో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, రహదారి భద్రతపై అవగాహన దిశగా రవాణా శాఖ చర్యలు చేపట్టామని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన ఫిర్యాదులకు 9542800800 నెంబర్ ను కేటాయించినట్టు వెల్లడించారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఫొటో తీసి ఈ నెంబరుకి పంపవచ్చని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారి ఇంటికే జరిమానా పంపుతామని అన్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

పివి సింధు దేశానికి గర్వకారణం - సీఎం కేసీఆర్

పివి సింధు దేశానికి గర్వకారణం - సీఎం కేసీఆర్ ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలవడం ద్వారా పివి సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసే వేదికగా హైదరాబాద్ మారిందని సిఎం అన్నారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. తనకు వచ్చిన మెడల్ ను కేసీఆర్ కు పివి సింధు చూపించారు. రెండు రాకెట్లను సిఎంకు బహుకరించారు. సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సిఎం సన్మానించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ''పివి సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెల

అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?*

అన్నయ్య హితవుతో మళ్లీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్... రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్?* పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల వైపు వస్తారా? నటిస్తారా? అనే విషయంలో చాలా రోజులుగా భిన్నవాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ గురించి ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. పవన్ కళ్యాణ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు తెరపైకి వచ్చాయి. 2021 వరకు వరుస సినిమాలు చేస్తూ పవర్ స్టార్ బిజీ బిజీగా గడపబోతున్నారట. తాను మళ్లీ నటన వైపు వస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అధికారికంగా అయితే ప్రకటించలేదు. సినీ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చను పలు మీడియా సంస్థలు తమ బాక్సాఫీస్ న్యూస్ బులిటెన్లలో ఫోకస్ చేసే ప్రయత్నం చేశాయి. అందుకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన సోదరుడు పవన్ కళ్యాణ్‌ను కలిశారని, సినిమా కెరీర్‌ను వేస్ట్ చేసుకోవద్దు అని హితవు పలికినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరో వైపు అభిమాలను నుంచి కూడా ఒత్తిడి ఉండటంతో సినిమాల వైపు రావాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. ఈ ఏడాది నవంబర్లో పవన్ కళ్యాణ్ చేయబోయే మొదటి సినిమా సెట్స్ మీదకు వస్తుందని, గతంలో చేస

ఇద్దరు విద్యార్థినిలు మృతి.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా /  వేములవాడ బస్ డిపో దగ్గర డివైడర్ ను ఢీకొట్టిన వాగేశ్వరి స్కూల్ వ్యాన్... ఇద్దరు విద్యార్థినిలు మృతి..  1. మానస్విని వట్టెముల గ్రామం,  2. దీక్షిత మానాల గ్రామం మరో 20 మందికి తీవ్రగాయాలు, ఆసుపత్రికి తరలింపు

నల్గొండలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ

నల్గొండలో విద్యుత్తు అమరవీరుల సంస్మరణ సభ స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో ఈ రోజు జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేక విధానాలు చేపడితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ఆనాటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి రైతాంగం ఆత్మహత్యలు కు దోహదపడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండ శ్రీశైలం నారి ఐలయ్య పాలడుగు నాగార్జున జిల్లా కమిటీ సభ్యులు పాలడుగు ప్రభావతి పుచ్చకాయల నర్సిరెడ్డి చినపాక లక్ష్మీనారాయణ నాయకులు దండంపల్లి సత్తయ్య అద్దంకి నరసింహ కొండ వెంకన్న మల్లం మహేష్ తదితరులు పాల్గొన్నారు నల్లగొండ

టిఆర్ఎస్ లో  క్రియాశీలకంగా ఉన్న ఆర్య వైశ్య నాయకులకు ఆర్యవైశ్య చెతన్య పోరాట సమితి  జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ  విజ్ఞప్తి 

టిఆర్ఎస్ లో  క్రియాశీలకంగా ఉన్న ఆర్య వైశ్య నాయకులకు ఆర్యవైశ్య చెతన్య పోరాట సమితి  జాతీయ అధ్యక్షులు ప్రేమ్ గాంధీ  విజ్ఞప్తి  ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి    యధాతదంగా చదవండి. తెలంగాణ రాష్ట్ర సమితి(TRS)లో క్రియాశీలకంగా పనిచేస్తున్న మన ఆర్యవైశ్య నాయకులకు విజ్ఞప్తి: తెలంగాణ ప్రభుత్వం ఈ సెప్టెంబరు నెలలో రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. మన ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలలో "ఆర్యవైశ్య కార్పొరేషన్" ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. ఇదే బడ్జెట్‌లో "ఆర్యవైశ్య కార్పొరేషన్" ఏర్పాటు చేసి కనీసం రూ. 1000 కోట్లు కేటాయించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మెప్పించి ఒప్పించే విధంగా ఒత్తిడి తీసుకరావలసిన బాధ్యత మీది. ఇప్పడు కాకుంటే మనం మరో సంవత్సరం వేచి చూడవలసి రావచ్చు. కావున తామంతా కలిసికట్టుగా కెసిఆర్ గారిని కలిసి మాట్లాడ వలసినదిగా విజ్ఞప్తి   ఈ వార్త నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి  

17 సెప్టెంబర్  తెలంగాణ విమోచన  దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి - N శ్రీవర్ధన్ రెడ్డి తెలంగాణ విమోచన కమిటి చైర్మన్.

వీడియో చూడండి https://youtu.be/Yu8HIFgOl2o 17 సెప్టెంబర్  తెలంగాణ విమోచన  దినోత్సవాన్ని అధికారికంగా జరపాలి. N శ్రీవర్ధన్ రెడ్డి తెలంగాణ విమోచన కమిటి చైర్మన్. సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి - విమోచన కమిటి చైర్మన్ ఎన్ శ్రీవర్ధన్ రెడ్డి       బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మీడియా కన్వీనర్ సుధాకర్ శర్మ,విమోచన కమిటి కన్వీనర్ స్వామి గౌడ్, నూకల వెంకట్ నారాయణ రెడ్డితో కలసి మాట్లాడారు. భారత దేశానికి 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతాన్ని మాత్రం 1948 సెప్టెంబర్17 స్వాతంత్రం వచ్చిందని, నాటి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తిపొంది నాటి కేంద్ర హోంశాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసోపేత పోలీస్ చర్య వల్ల పటేల్ కి లొంగిపోయి తెలంగాణ ప్రాంతాన్ని భారత దేశంలో విలీనం చేసాడని అన్నారు. నిజాం నిరంకుశత్వానికి అమాయకపు ప్రజలు బలిఅయ్యారని, నిజాం రజాకార్ల పాలనలో ప్రజలందరూ ఎంతో ఇబ్బందులకు,అఘాయిత్యాలకు, అత్యాచారాలకు బలిఅయ్యారని  అన్నారు.  నిజాం ప్రభువు,రజాకార్ల హింసలకు ఎంతో మంది మరణించగా వందలాదిమంది నిజాంకు జరిగిన వ్యతిరేక ఉద్యమంలో బల

అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు 

అవినీతి  ........పట్టుకున్న ఏసీబీ అధికారులు  జగిత్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు ఓ అవినీతి అధికారిని లంచం తీసుకుంటుండగా మాటు వేసి పట్టుకున్నారు... జిల్లాలోని మాల్యాల మండల తహశీల్దార్  కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పర్వేజ్ అనే అధికారి ఓ రైతు వద్ద నుండి రెండు వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు... ఓ రైతు తన భూమి పహాని పత్రాల కోసం జూనియర్ అసిస్టెంట్ రెండు వేల రూపాయలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేసాడని రైతు ఆరోపణ...

స్వర్ణ పతకం విజేత పీవీసింధును సత్కరించి ప్రధాని మోడీ

స్వర్ణ పతకం విజేత   పీవీసింధును  సత్కరించి  ప్రధాని మోడీ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన తెలుగు తేజం పీవీసింధు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. ప్రధాని సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్‌ గోపీచంద్‌లను మోదీ అభినందించారు.  'బంగారు పతకం సాధించి దేశం గర్వపడేలా చేసిన ఛాంపియన్‌ సింధు. ఆమెను కలవడం ఆనందంగా ఉంది. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా' అని మోదీ పేర్కొన్నారు

ముంబై లో భారీ అగ్నిప్రమాదం

ముంబై :  మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.  ముంబైలోని మజ్‌గాం ప్రాంతంలోని ముస్తఫా బజార్ టింబరు యార్డులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  శ్వేతామార్గ్ లో మంటలు ఎగసిపడుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు 8 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించారు.  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.  ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. 

ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ సస్పెన్షన్

*ఖమ్మం జిల్లా* కామేపల్లి ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కరుణాకర్ సస్పెన్షన్ కొమ్మినేపల్లి పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసిన కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ కొమ్మినేపల్లి పంచాయతీ నిధులు రికార్డులు లేకుండా కోటి 60 లక్షలు ఖర్చు చేసిన అధికారులపై చర్యలు

తితిదే ట్రెజరీలో 5 కిలోల వెండికిరీటం మాయం

తితిదే ట్రెజరీలో 5 కిలోల వెండికిరీటం మాయం తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు రెండు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దీనిపై తితిదే ఏఈవో శ్రీనివాసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అతడి జీతం నుంచి రికవరీ చేసుకున్నారు

హైద్రాబాద్ లో హెచ్ఎండీఏ  ద్వారా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ

హైద్రాబాద్ లో హెచ్ఎండీఏ  ద్వారా మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ పర్యావరణ పరిరక్షణలో ప్రజలలో అవగాహన కల్పించడానికి మట్టి గణేష్ విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహించడానికి 60,000 సంఖ్యల 8  ఇంచుల గణేష్ విగ్రహాలను ప్రజలకు, ఎన్జీఓలు ఉచితంగా పంపిణీ చేయడానికి హెచ్‌ఎండిఎ ఏర్పాట్లు చేస్తోంది. హెచ్‌ఎండిఎ ప్రతి సంవత్సరం లాగా   ఈ సంవత్సరం  కూడా హైదరాబాద్‌లోని 33 ప్రదేశాలలో పంపిణీ చేస్తోంది. వివిధ ప్రదేశాలలో మరియు హెచ్‌ఎండిఎ సిబ్బంది మరియు అధికారులతో కూడిన మొబైల్ వ్యాన్‌లలో కూడా ప్రజలకు నేరుగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు.  మట్టి గణేష్ విగ్రహాలు  28-08-2019 నుండి 30-08-2019 వరకు పంపిణీ చేస్తారు.

ఎమ్మెల్సీగా గుత్తా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్ : టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంఎల్ సిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. గుత్తాతో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఎంఎల్ సిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంఎల్ఎ కోటా ఎంఎల్ సి ఎన్నికల్లో గుత్తా ఎంఎల్ సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  తనను ఎంఎల్ సిగా ఎన్నుకున్న ఎంఎల్ఎలకు గుత్తా ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆశయ సాధనలో తాను ముందుకు సాగుతానని ఈ సందర్భంగా గుత్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, పలువురు ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలి - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - 749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలి - కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ 749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలి వీడియో చూడండి https://youtu.be/uj8hS9HsRNE తెలంగాణ రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై విచారణ జరిపించాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతు గ్రానైట్ మాఫియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న గ్రానైట్ తవ్వకాలపై,ఎగుమతులపై వేల కోట్ల రూపాయల పన్నుల ఎగవేతపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం,గవర్నర్,న్యాయస్థానాల దృష్టికి,మైనింగ్ అక్రమాలను తీసుకెళ్లి పోరాటాలను నిర్వహిస్తామన్నారు. 2008 నుంచి 2011 సం. వరకు గ్రానైట్ వ్యాపారులపై విధించిన రూ: 749 కోట్ల పెనాల్టీ తక్షణమే వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్  APP - 45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలు ఈ APP లో

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్  APP  45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలు ఈ APP లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ సమాచారాన్ని పొందుటకు తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్సైంజ్  APP ను రూపొందించినట్లు రాష్ట్ర కార్మిక, ఉపాథి కల్పన శాఖ మంత్రి  సి.హెచ్. మల్లా రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో  DEET APP ను  IT శాఖ ముఖ్య కార్యదర్శి  జయేష్ రంజన్  తో కలసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు సుమారు 45 వేల ప్రైవేటు ఉద్యోగాల ఖాళీల వివరాలను ఈ APP లో పొందుపర్చామని తెలిపారు. దీనిలో ప్రైవేటు ఉద్యోగాల తో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. నిరుద్యోగులు ఈ APP ద్వారా నేరుగా కంపెనీకి దరఖాస్తు చేసుకోవచ్చని, కంపెనీలు ఇంటర్వూ కూడా ఈ APP ద్వారా నిర్వహించుకోవచ్చని తెలిపారు. ఐ.టి. బ్యాంకింగ్, నిర్మాణ రంగం తదితర సంస్థలలో గల ఖాళీలను ఈ APP లో పొందు పరుస్తాయన్నారు. నిరుద్యోగులకు ఈ APP ఒక వరంలాంటిదని అన్నారు. కంపెనీలు కూడా శ్రమ లేకుండా తమ అవసరాలకనుగుణంగా ఉద్యోగాలను భర్తీ చేసుకోవడానికి ఉపయోగ పడుతుందన్నారు. దేశంలో నే మొదటి సారిగా తెలంగాణ ప్రభుత్వం ఈ సౌకర్యాన

ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి

భద్రాది కొత్తగూడెం జిల్లా కారేపల్లి ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి  లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో ఆర్ డి. రెండు నెలల వేతనం మంజూరు కి 24 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు

*హంస వాహిని టాకీస్*  *ఇట్లు మీ శ్రీమతి షూటింగ్ *ప్రారంభం*

*హంస వాహిని టాకీస్*  *ఇట్లు మీ శ్రీమతి షూటింగ్ *ప్రారంభం* హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్. ఎస్.రెడ్డి నిర్మాణంలో మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఇట్లు మీ శ్రీమతి". వినోదభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఈరోజు (ఆగస్ట్ 25) జరిగాయి. ప్రముఖ దర్శకుడు వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెకరిట్రీ టి.ప్రసన్న కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు అలాగే నిర్మాత దామోదర్ ప్రసాద్ మొదటి సన్నివేశానికి క్లాప్ కొట్టడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది. వెంగీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు తోట.వి.రమణ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ ఈ సినిమాకు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో ఆ వివరాలు చిత్ర యూనిట్ ప్రకటిస్తారు.  *ఈ సందర్బంగా నిర్మాత ఎమ్.ఎస్.రెడ్డి మాట్లాడుతూ...* ఇట్లు మీ శ్రీమతి సినిమా కామెడీ ఎంటర్టైనర్. దర్శకుడు మురళి బోడపాటి చెప్పిన కథ నచ్చడంతో సినిమాను నిర్మిస్తున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే వి

అట్టహాసంగా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ 

అట్టహాసంగా మార్షల్ చిత్ర ఆడియో ఆవిష్కరణ  అభయ్, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం 'మార్షల్'. హీరో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని హీరో అభయ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జై రాజాసింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబరు 19 న విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో, టీజర్ అవిష్కరణ ఇటీవలే గుంటూరులో జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు హాజరై... ఆడియోను ఆవిష్కరించారు. ఆయనతో పాటు షేక్ మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరి,  వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి,  పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, ముస్తఫా మరియు మద్దాల గిరి, బోనబోయిన శ్రీనివాసయాదవ్, నిమ్మకాయల రాజా నారాయణ, చిత్ర లోని హీరోయిన్ మేఘన చౌదరి, డైరెక్ట్ జై రాజాసింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఆడియో సీడీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ 'హీరో అభయ్ కథానాయకుడిగా.. నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించి... తన జన్మస్థలమైన గుంటూరులోనే ఆడియో ఆవిష్కరణ వేడుక జరుపుకోవడం ఎంతో సంతోషకరం. ఈ చిత్రం ఘన విజయం స

*ఏసీబీ కోర్ట్.....*

*ఏసీబీ కోర్ట్.....* గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ డీల్ కేసు ను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్. గతంలో మైనింగ్ కేసు లో అరెస్ట్ అయిన గాలి జనార్ధన్ రెడ్డి  చంచల్ గూడ జైల్లో ఉన్న గాలి కి బెయిల్ ఇప్పించాలని దశరథరామి రెడ్డిని కొరిని గాలి గాలి బెయిల్ కు 100 కోట్ల డీల్ కుదిర్చిన దశరథరామి రెడ్డి గాలి బెయిల్ డీల్ కేసు లో గతంలో ఏసీబీ కి పట్టుబడ్డ దశరథరామి రెడ్డి ఏసీబీ విచారణ లో అనేక విషయాలు వెల్లడించిన దశరథరామి రెడ్డి  గాలి కి బెయిల్ ఇచ్చిన సీబీఐ జడ్జ్ పట్టాభి పై కేసు నమోదు చేసిన ఏసీబీ గాలి కి బెయిల్ డీల్ లో సహకరించిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమశేఖర్ రెడ్డి,సురేష్ రెడ్డి నేడు మరోసారి గాలి బెయిల్ డీల్ కేసు ను విచారించిన ఏసీబీ కోర్ట్ తదుపరి విచారణను సెప్టెంబర్ 12 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

*మరో 22 మంది అధికారులపై కేంద్రం వేటు* 

*మరో 22 మంది అధికారులపై కేంద్రం వేటు*  దిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 22 మంది సీనియర్‌ అధికారులపై కేంద్ర ప్రభుత్వం వేటు వేసింది. తక్షణమే వారు తమ ఉద్యోగాలకు స్వచ్ఛంద విరమణ చేయాలని కేంద్ర పరోక్ష పన్నులు, సుంకాల బోర్డు(సీబీఐసీ) ఆదేశించింది. వీరంతా సుపరింటెండెంట్‌/ఏవో ర్యాంక్‌కి చెందిన అధికారులు కావడం గమనార్హం. నిబంధన 56(జే) ఆధారంగా వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు సబీఐసీ వివరించింది. 'పన్నుల విభాగంలో కొంత మంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నార'ని స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ప్రస్తావించిన విషయాన్ని సీబీఐసీ తన ఉత్తర్వుల్లో గుర్తుచేసింది.   వృత్తిరీత్యా తప్పుడు ప్రవర్తన కారణంగా గతంలోనే 27 మంది సీనియర్‌ అధికారులపై వేటు వేసిన విషయం తెలిసిందే. 'ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగంలోని ప్రత్యేకాధికారాలతో భారత రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న 15 మంది సీనియర్‌ ఉద్యోగుల తక్షణ పదవీ విరమణకు రాష్ట్రపతి ఆదేశించారు' అని అప్పట్లో ఆర్థిక శాఖ పేర్కొంది.

టిటిడి విజిలెన్స్ కు చిక్కిన మరో బడా దళారి 

టిటిడి విజిలెన్స్ కు చిక్కిన మరో బడా దళారి  చిత్తూరు జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి దగ్గర పిఆర్ఓ గా పనిచేస్తున్న ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్  ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖపై 18 మందికి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు పొంది  ఒకటిన్నర లక్ష లకు బ్లాక్ లో విక్రయించిన దళారి  టీటీడీ చైర్మన్ కార్యాలయం నుండి టికెట్లు పొందిన దళారి  దళారీని విచారిస్తున్న విజిలెన్స్ అధికారులు.

*గ్రీవెన్స్ పై నిరంతర పర్యవేక్షణ : ఎస్పీ రంగనాధ్*

* గ్రీవెన్స్ పై నిరంతర పర్యవేక్షణ : ఎస్పీ రంగనాధ్* నల్గొండ : గ్రీవెన్స్ డే ద్వారా ప్రజల నుండి స్వీకరిస్తున్న దరఖాస్తులు, ఆర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ తెలిపారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వస్తున్న ప్రతి దరఖాస్తును పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి దరఖాస్తుదారునికి రశీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారం అయిందో లేదో తెలుసుకుంటున్నామని తెలిపారు. వీటన్నింటితో పాటు మూడు కన్నా ఎక్కువ సార్లు వచ్చిన దరఖాస్తుల విషయంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందనే విషయమై విచారిస్తున్నామని తెలిపారు. పరిష్కారం అయిన ఫిర్యాదులు, అర్జీలకు సంబంధించి సెంట్రల్ కంప్లైంట్ సెల్ ద్వారా సమాచారం అందిస్తున్నామని వివరించారు. దరఖాస్తులన్నింటిని ఆన్ లైన్ లో పొందుపర్చడం ద్వారా వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరిగుతుందని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీస్ అధికారులతో గ్రీవ

నల్గొండ ఆసుపత్రిలో ఓ పి 12 గంటలకే ఖతం ...

నల్గొండ ఆసుపత్రిలో ఓ పి 12 గంటలకే ఖతం  నల్గొండ ప్రభుత్వ దావఖానలో  op 2 గంటల వరకూ జరుపాలి.. నల్గొండ లో డాక్టర్లు  మాత్రం 12 గంటలకే వెళ్ళి పోయారు ..ఐద్వా ఆద్వర్యంలో ఈరోజు ఈరోజు సర్వే నిర్వహించారు . ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతుా జిల్లా కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకొవాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని సార్లు విన్నవించినా పలితం లేదు .సుదూర ప్రాంతాలనుండి రోగులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు ఆని అన్నారు .2గంటల వరకూ op నిర్వహించ కుంటే ప్రభుత్వ ధవఖాన ప్రిన్సిపాల్  ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరికఛేశారు...ఈ కార్యక్రమం లో పట్టణ కార్యదర్శి తుమ్మల పద్మ.జిల్లా కమిటీ సభ్యులు భుాతం అరుణ.నాయకులు కణుకుంట్ల ఉమ.తదితరులు పాల్గొన్నారు ...

ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం   ట్రైలర్ లాంచ్*

ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం   ట్రైలర్ లాంచ్* ఇప్పుడున్న యువతకు, పిల్లలకు తెలుగు సరిగ్గ రావడం లేదు. వారంతా ఆంగ్లం మీద మోజుతో తల్లి లాంటి తెలుగును మర్చిపోతున్నారు. ఇది ఇలా కొనసాగితే ఎదో రోజు  తెలుగు భాష అంతరించిపోవచ్చు. అలా జరక్కుండా ఉండాలంటే మనందరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. మన భాషను మనమే కాపాడుకోవాలనే ఇద్దరు యువతీయువకులు తెలుగు భాష కోసం ఏం చేసారన్నదే మా ''ఒక తెలుగు ప్రేమకథ'' చిత్రం ఇతివృత్తం. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కె.ఎస్.రవికుమార్ (జై ప్రకాష్ నారాయణ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మహబూబ్ నగర్) నంది అవార్డ్ గ్రహీత ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కె.ఎస్.రవికుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా ప్రివ్యూ చూసాను. తెలుగు భాష గురించి ఈ చిత్రంలో చాలా గొప్పగా చూపించడం జరిగింది. మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగింది. ప్రేక్షకులు ఈ సినిమాను తప్పకుండా ఆధారిస్తారని అనుకుంటున్నాను అన్నారు. ఆచార్య చక్రవర్తి సమేత గాంధీ మాట్లాడుతూ... నేను గతంలో చాలా చిత్రాల్లో నటించాను. ఈ సినిమాలో మరో మం

బాలికపై అత్యాచారం

 బాలికపై అత్యాచారం మల్లప్పురం (కేరళ) : సమాజంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలపై కూడా కొందరు మృగాళ్లు అత్యాచారాలు చేయడం గమనార్హం. కేరళలోని మల్లప్పురం జిల్లాలో పాఠాలు చెప్పే అధ్యాపకుడే ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భందాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఈ ఘోరం బయటకు వచ్చింది. గత రెండు నెలల నుంచి అధ్యాపకుడు  బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు వెల్లడించింది. దారుణానికి పాల్పడిన అధ్యాపకుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు. 

బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు....

బాత్‌రూంలో బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న శంషాబాద్‌ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులు హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారు బిస్కెట్లను పట్టుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ. 1.11 కోట్లు విలువైన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌ వస్తున్న షేక్‌ అబ్దుల్‌ సాజిద్‌ అనే ప్రయాణికుడు అక్రమంగా బంగారం తరలిస్తున్నాడనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో దిగిన సాజిద్‌ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే విషయాన్ని గ్రహించి తాను తీసుకొచ్చిన బంగారాన్ని విమానాశ్రయంలోని మరుగుదొడ్డిలో పడేశాడు. కాగా సాజిద్‌ను తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారులకు అతని వద్ద ఎలాంటి బంగారం లభించలేదు. దీంతో అదుపులోకి తీసుకొని విచారించగా శౌచాలయంలో పడేసిన విషయాన్ని అధికారులకు చెప్పాడు. దీంతో బాత్‌రూంలో ఉన్న 2.99 కిలోల బరువున్న 26 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 

కొండా సురేఖ,  రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి!

కొండా సురేఖ,  రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ లోకి! వరంగల్‌: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన విషయం విదితమే. ఇందులో భాగంగా ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నేతలు, సిట్టింగ్‌లు సైతం కాషాయ కండువా కప్పేసుకున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో 2024 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కమలనాథులు ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీల నుంచి వచ్చే నేతలను కాదనకుండా కమలనాథులు కండువా కప్పేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ మహిళా నేత కొండా సురేఖ, టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంత్రి అమిత్ షాను కలిసేందుకు రేవూరి విశ్వప్రయత్నాలు చేశారు. అయితే ఇదే రోజు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ హఠాన్మరణంతో.. నగరంలోని పలు కార్యక్రమాను రద్దు చేసుకున్న షా హుటాహుటిన ఢిల్లీకి పయనమై వెళ్లిపోయారు. దీంతో షా-రేవూరి భేటీకీ వీలుకాలేదు. అయితే ఢిల్లీ వెళ్లి మరి అమిత్‌షాను కలిసే యోచనలో రేవూరి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తమ్ముడి మృతితో కొండా సురేఖ

పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !

పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ ! పిల్లల  పిల్లల అక్రమ రవాణా కేసులో బెంగాల్ పోలీసులు బీజేపీ మహిళా మోర్చా నాయకురాలిని అరెస్టు చేశారు. భారతీయ మహిళా మోర్చా బెంగాల్ ప్రధాన కార్యదర్శి జూహీ చౌదరి ని భారత్ నేపాల్ బార్డర్ లో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆమె పేరు రావడంతో ఆమె అఙాతంలోకి వెళ్ళింది. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమెను గుర్త్ంచి అరెస్టు చేసిన పోలీసులు జల్పాయ్ గురి జిల్లా కోర్టులో హాజరు పర్చారు.  విమల శిశు గ్రుహ అనే ఎన్ జీ ఓ నడుపుతూ దాని ముసుగులో పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి, సంస్థ అధికారి సోనాలీ మండల్, చందన సోదరుడు మానసా బౌమిక్ లను పోలీసులు పోయిన వారం అరెస్టు చేశారు. వీళ్ళు 17 మంది పిల్లలను అక్రమంగా అమ్మేశారని పోలీసుల ఆరోపణ.  అయితే తమకు బీజేపీ నాయకురాలు జూహీ చౌదరీ అన్ని విధాలా సహకరించారని, ఆమె సహాయంతో బిజెపి నాయకులు కైలాష్ విజయవర్గియా రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు రూప గంగూలీతో కూడా మాట్లాడామని ఆ సంస్థ చైర్మెన్ చందనా చక్రవర్తి చెప్పడంతో పోలీసులు జూహీ చౌదరిని అరెస్టు చేశారు.

ప్రింట్ మీడియాలో నకిలీ  సమాచారం ఉండే అవకాశం తక్కు వ -- మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ  

ప్రింట్ మీడియాలో నకిలీ  సమాచారం ఉండే అవకాశం తక్కువ -- మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ   కోల్‌కతా: ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన మీడియా అవార్డుల కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న ప్రణబ్‌ ముఖర్జీ  ప్రసంగించారు. ప్రింట్‌ మీడియాలో సమాచారం ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసిన తర్వాతే ముద్రిస్తారని కాబట్టి నకిలీ సమాచారం ఉండే అవకాశం తక్కువని అన్నారు.సామాజిక మాధ్యమాల ద్వారా కొందరు వ్యక్తులు పంపే నకిలీ సమాచారం కారణంగా సమాజంలో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అమాయకులైన ప్రజలు వాటిని నమ్మి షేర్‌ చేస్తారు, కాబట్టి ఇలాంటి వార్తలను దృష్టికి వచ్చినపుడు జాగ్రత్త వహించాలని సూచించారు. తనకు ప్రింట్‌ మీడియా పట్ల అపారమైన నమ్మకం ఉందని అన్నారు.                                                                                                                                         పాత్రికేయులు నిష్పక్షపాతంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకుండా స్వేచ్ఛగా వార్తలు రాయాలని ప్రణబ్‌ వారికి సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న నాలుగో ఎస్టేట్‌ అయిన మీడియాను ఆయన ప్రశంసించారు 

*ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల హతం*

"ఎన్‌కౌంటర్‌: ఐదుగురు మావోయిస్టుల హతం నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌లో ఘటన రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో మరోసారి తుపాకీల మోత మోగింది. భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్‌ జిల్లా అంబుజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో  ఈ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపట్టిన బలగాలకు వారు ఎదురుపడ్డారు. దీంతో తుపాకుల మోతమోగించారు. ఈ ఘటనలో  ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని బేస్‌క్యాంపుకి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా తాజా ఎన్‌కౌంటర్‌తో అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. మరికొంత మంది మావోయిస్టులు దాగిఉన్నారని సమాచారం అందడంతో కూబింగ్‌ను కొనసాగిస్తున్న భద్రతా బలగాలు. ఘటనా స్థలం లో భారీగా ఆయుధాలు, దుస్తువులు, పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.

బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్

బీజేపీ మొబైల్ సభత్వ నమోదుపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని  ఖండించిన రాష్ట్ర బీజేపీ సభత్వ ప్రముఖ్ రాష్ట్ర మంత్రి   శ్రీనివాస్ గౌడ్ బిజెపి ఆన్లైన్, మొబైల్ నెంబర్ ఆధారిత సభ్యత్వ నమోదుపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని బిజెపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందని ఎం ధర్మారావు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,రాష్ట్ర బిజెపి సభ్యత్వ ప్రముఖ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా మొబైల్ ద్వారా బిజెపి సభ్యత్వం తీసుకోవడం పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ  హర్షం వ్యక్తం చేస్తుండగా విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు  *టిఆర్ఎస్* *పార్టీ చేస్తున్నట్లు ఓటర్* *లిస్టు ముందు పెట్టుకుని ఇంట్లో* *కూర్చొని బిజెపి సభ్యత్వాన్ని* *నమోదు చేయడం* *లేదు* . *టిఆర్ఎస్ పార్టీ లాగా ఆశలు* *చూపడం లేదు. బలవంతం* *పెట్టడం లేదు. భయ* *పెట్టడం లేదు. టీఆర్ఎస్ సభ్యత్వం* *తీసుకోకపోతే పెన్షన్లు,* *రైతుబంధు ఆగిపోతాయని ప్రజలను* *భయ పెట్టడం లేదు.* *సభ్యత్వం చేసుకుంటే ఇన్సూరెన్స్* *వస్తుందని టిఆర్ఎస్ లాగా బిజెపి* *తాయిలాలు ప్రకటించలేదని విమర్శించారు. జాతీయవాదాన్ని బలపరచాలని, దేశం అభివృద్ధి చెందాలని,  ప్రధాని నరేంద్ర మోదీ గా