Posts

చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం*

*చార్మినార్‌లో అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం; కల్తీ ఆహార పదార్థాలు స్వాధీనం* హైదరాబాద్, జూన్ 19, 2026: ఆహార కల్తీ మరియు అసురక్షిత ఆహార పద్ధతులపై నిరంతర నిఘాలో భాగంగా, హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్‌లోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. నమ్మకమైన సమాచారం మేరకు, ఈ బృందం చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే విధంగా అత్యంత అపరిశుభ్రమైన మరియు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం మరియు నిల్వ చేయడం జరుగుతున్నట్లు గుర్తించారు. • నిర్బంధ FSSAI లైసెన్స్ లేకుండా నిర్వహించడం. • నిషేధించబడిన/కృత్రిమ ఆహార రంగులను (MSK లయన్ గ్రీన్ మరియు రాస్ప్‌బెర్రీ రెడ్) ఉపయోగించడం. • పాడైపోయిన మరియు ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం. • నీటి విశ్లేషణ ధృవీకరణ (Wat...

మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన

Image
 *మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన*   *200 మందికి పైగా భావి బిడ్డర్ల హాజరు* *హైదరాబాద్:* హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి 16.6.2026న ప్రాజెక్టు స్థలంలో ప్రీ-బిడ్ సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి 200 మందికి పైగా భావి బిడ్డర్లు ఉత్సాహంగా హాజరై, 24.6.2026న జరిగే ఈ-వేలంపై విశేష ఆసక్తిని వ్యక్తం చేశారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ అధికారులు, నిపుణులు బిడ్డర్ల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ వై. సుదర్శన్ మేడిపల్లి లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించగా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎ. రవీందర్ రెడ్డి లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై స్పష్టత ఇచ్చారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సత్యప్రసాద్ స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించి, సాంకేతిక సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ-వేలం ప్రక్రియ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురించి ఎంఎస్‌టీసీ ప్రతినిధి సిద్ధార్థ్ వివరించారు.  కేపీఎంజీ ప్రతినిధి కళ్యాణ్ మేడిపల్లి లేఅవుట్ ప్రత్యేకతలు,...

ఘనంగా రావికంటి రామయ్య జయంతి

Image
 ఘనంగా రావికంటి రామయ్య జయంతి ... మంథని : మంత్రకూట వేమన, ప్రజాకవి,  రావికంటి రామయ్య గుప్త 90వ జయంతి  వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.‌ మంథనిలోని వారి కాంస్య విగ్రహానికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శశి భూషణ్ కాచే, ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి కొమురవెల్లి విజయ్ కుమార్, ఆర్య వైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు ఎల్లంకి వంశీధర్ , రావికంటి రామయ్య తనయుడు, సీనియర్ జర్నలిస్ట్ రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.‌ అనంతరం మంథని విద్యార్థి యువత వ్యవస్థాపకుడు కొండేల మారుతి ఆధ్వర్యంలో రావికంటి రామయ్య గుప్త సంస్మరణ సభ జరిగింది. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమితులైన కొమురవెల్లి విజయ్ కుమార్ ను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.‌  ... రామయ్య కీర్తి అజరామరం : మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్  ... కవిత్వం, సాహిత్యం ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావికంటి రామయ్య కీర్తి అజరామరంగా నిలిచిపోతుందని మంథని మున్సిపల్ ఛైర్మన్ ఒడ్నాల శ్రీ...

“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్' డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా?

Image
“వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” – TGPCBలో ‘ఎక్కడి వాళ్లు అక్కడే గప్ చుప్'  డిప్యుటేషన్‌ల ఆట మళ్లీ మొదలా? ట్రాన్స్‌ఫర్లు ఒక వైపు... డిప్యుటేషన్లు మరో వైపు! తెలంగాణ పీసీబీలో అక్రమ డిప్యుటేషన్‌లకు సర్వం సిద్ధమనే ప్రచారం! హైదరాబాద్: “వీరి వీరి గుమ్మడి పండు... వీరి పేరు ఏమి?” అనే పాటలో చివరి చరణం “ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్"  అన్నట్లుగా, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB)లో బదిలీలు జరిగినా కొందరు ఉద్యోగులు, అధికారులు మళ్లీ తమకు అనుకూల ప్రాంతాలకే డిప్యుటేషన్‌ల ద్వారా చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా డిప్యుటేషన్ అనేది శాఖ అవసరాల కోసం, ప్రత్యేక నైపుణ్యం కలిగిన సిబ్బంది అవసరమైనప్పుడు మాత్రమే ఇవ్వాల్సిన పరిపాలనా విధానం. కానీ TGPCBలో మాత్రం కొందరి వ్యక్తిగత అవసరాలు, పలుకుబడులు, పరిచయాల ఆధారంగా డిప్యుటేషన్‌లు జరుగుతున్నాయనే విమర్శలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో GHMC పరిధిని ఒకే యూనిట్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పలువురిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అయితే ఆ తర్వాత కొందరు ప్రభావశీలులు అడ్మినిస్ట్రేషన్...

ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్

Image
 ఆర్&బి ఈఈ సంధ్య అక్రమాస్తులపై ఏసీబీ విచారణ జరపాలి: సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసాలపై ఏసీబీ దాడులను స్వాగతిస్తున్నాం ఒకే జిల్లాలో 20 ఏళ్లుగా తిష్టవేసిన సంధ్య అవినీతిపై పోరాడుతాం మహబూబ్‌నగర్ కలెక్టరేట్, కళాభారతి పనులపై విజిలెన్స్ విచారణ జరపాలి మహబూబ్‌నగర్ (జిల్లా కేంద్రం): తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (R&B) ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడులను స్వాగతిస్తున్నామని 'నేనుసైతం' స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మియాపూర్‌లోని ఈఎన్‌సీ మోహన్ నాయక్ నివాసంతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇదే తరుణంలో, మహబూబ్‌నగర్ జిల్లా ఆర్&బి శాఖలో గత 20 సంవత్సరాలుగా ఇక్కడే తిష్టవేసి పనిచేస్తున్న ఈఈ (EE) సంధ్య ఆస్తులపై కూడా సమగ్ర ఏసీబీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విర...

తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు!

Image
  తెలంగాణ: రోడ్లు భవనాల శాఖ ఈఎన్‌సీ జే. బాలు నివాసాలపై ఏసీబీ మెరుపు దాడులు! ​ హైదరాబాద్: తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ (R&B) చీఫ్ ఇంజనీర్ (ఇంజినీర్ ఇన్ చీఫ్) జే. బాలు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో అధికారులు ఈ తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. ​11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు ​మాదాపూర్‌లోని జే. బాలు ప్రధాన నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాలలో ఏసీబీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. బాలు అక్రమ ఆస్తుల సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ​భారీగా లభ్యమైన నగదు, బంగారం, విదేశీ మద్యం ​సోదాల సందర్భంగా బాలు నివాసంలో అధికారులు షాకింగ్ విషయాలను గుర్తించారు. ఇప్పటివరకు జరిపిన తనిఖీలలో కళ్ళు చెదిరేలా ఆస్తులు బయటపడ్డాయి: ​ నగదు: కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు. ​ బంగారం: భారీగా బంగారు బిస్కెట్లు, ఆభరణాలు. ​ వెండి: పెద్ద మొత్తంలో వెండి వస్తువులు. ​ లిక్కర్: నిబంధనలకు విరుద్...

"హీరో"అవార్డు ఓ అద్భుతం..అతిశయం

Image
 "హీరో"అవార్డు  ఓ అద్భుతం..అతిశయం నేషనల్ టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత. మాచన రఘునందన్ మాతృమూర్తి "విజయ" ప్రత్యేక ఇంటర్వ్యూ  "అమ్మా..! డిల్లీ నుంచి ఓ పార్సెల్ వస్తుంది.తీసుకో..మళ్లీ అది వాపస్ పోతే రావడం కష్టం. అని మా అబ్బాయి చెప్తే.. ఏదో.. కవర్,చిన్న పార్సిల్ వస్తుందేమో అనుకున్నా..కాని  ఓ నగల పెట్టే లా..బరువు ఉన్న బాక్స్ వస్తుంది అని అనుకోలేదు. అత్యంత భద్రంగా.. ఏదో విలువైనది ఇందులో ఉన్నది అనుకునేలా.. బందబస్త్ పార్సెల్ వచ్చింది. "రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తరం అందుకోవడం అంత సామాన్య విషయమా?!" నా..బిడ్డ దేశం కోసం ఆలోచించడం.దేశం కోసం ఏదైనా మేలు చేయాలి అని క్షణ క్షణం ఆలోచిస్తేనే కదా..అసాధారణ విజయం సొంతం అయ్యేది. అని.. తన తనయుడు చేసిన  అలుపెరుగని కృషి గురించి ఎంతో ఆర్ద్రంగా వివరించారు మాచన విజయ. ఇన్నాళ్ళకు జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో  అద్భుత ఫలితం రావడం మాకు పద్మ పురస్కారమే అన్నారు "మాచన" మాతృమూర్తి. మరిన్ని వివరాలు..ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో.. మాచన విజయ మాటల్లోనే.. "ఎంత సంపాదించాము. ఎంత కూడబెట్టుకున్నాం అని ఆలోచించే కొందర...