Posts

ACB కి చిక్కిన జిల్లా విద్యా అధికారి & జూనియర్ అసిస్టెంట్,

Image
 ACB కి చిక్కిన జిల్లా విద్యా అధికారి & జూనియర్ అసిస్టెంట్, వరంగల్,(గూఢచారి): జిల్లా విద్యా అధికారి, ములుగు & జూనియర్ అసిస్టెంట్, స్థాపన విభాగం, డిఈఓ ఆఫీస్, ములుగు ACB కి చిక్కారు.  16.06.2025న 13:20 గంటలకు, (AO-1) గోర్ల పాణిని ములుగు జిల్లా విద్యా అధికారి, మరియు (AO-2) తోటే దిలీప్ కుమార్ యాదవ్, జూనియర్ అసిస్టెంట్, స్థాపన విభాగం, డిఈఓ ఆఫీస్, ములుగు ACB అధికారుల చేత పట్టుబడ్డారు.   వరంగల్ యూనిట్, డిఈఓ ఆఫీస్, ములుగు వద్ద. AO-1 & AO-2 రద్దీ మొత్తంగా రూ. 15,000/- మరియు రూ. 5,000/- లంచం కోరారు మరియు AO-2 అధికారిక అనుకూలత కోసం, అంటే, ఫిర్యాదుదారుడి చేరికా నివేదికను ఆమోదించడం మరియు అతనికి విధులు చేపట్టడానికి అనుమతించే ఆదేశాలు జారీ చేయడం కోసం రూ. 20,000/- (రూ. 15,000/- AO-1 కోసం & రూ. 5,000/- తన కోసం) లంచం మొత్తాన్ని ఆమోదించాడు.   రూ. 20,000/- లంచం మొత్తం AO-2 యొక్క కార్యాలయ టేబుల్ నుండి రికవరి చేయబడింది. AO-2 యొక్క కుడి చేతి వేళ్లలో రసాయన పరీక్షలో సానుకూల ఫలితం వచ్చింది. ఫిర్యాదుదారుడి గుర్తింపు భద్రతా కారణాల కోసం అధికారులు వెల్లడించలేదు. ,...

టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వల్లూరు క్రాంతి IAS

Image
 టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి వల్లూరు క్రాంతి IAS   హైద్రాబాద్, గూఢచారి: 16.06.2025 (సోమవారం):    హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లోని తెలంగాణ టూరిజం కార్పొరేట్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీమతి వల్లూరు క్రాంతి, IAS బాధ్యతలు స్వీకరించారు. TGTDC కార్యాలయంలో చైర్మన్ పాతాళ రమేష్ రెడ్డితో మర్యాదపూర్వక సమావేశం మరియు తెలంగాణ ప్రభుత్వ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మర్యాదపూర్వక సమావేశం అయ్యారు. అన్ని విభాగాల అధిపతులు మరియు సిబ్బంది హాజరయ్యారని PRO కె. శ్రీనివాస్ తెలిపారు.

గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Image
 గాంధీ ఆసుపత్రిని పరిశీలించిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  Hydrabad, GUDACHARI:  కేంద్ర మంత్రివర్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  కిషన్ రెడ్డి  ఈరోజు గాంధీ ఆసుపత్రి నిర్వహణను పరిశీలించి, వైద్య - ఔషధ సదుపాయాలను, రోగులకు అవసరమైన వసతి మరియు భోజన వ్యవస్తలను, వైద్యులకు అవసరమైన పరికరాలను - వ్యవస్థలను, రోగ నిర్ధారణ మరియు పరీక్ష కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించారు. కోవిడ్ మహమ్మారి ప్రబలిన కష్టసమయంలో ప్రధాని  నరేంద్ర మోదీ గారి చొరవతో, "పీ.ఎం. కేర్స్" నిధులతో అత్యవసరంగా, అతితక్కువ సమయంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించి ఆ పరికరాల ప్రస్తుత పనితీరుని, స్థితిగతులను తెలుసుకున్నారు. గాంధీ ఆసుపత్రిలోని మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.  గాంధీ దవాఖానాలో రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి అటు వైద్యులను, ఇటు రోగులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధాని  నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందిస్తున్న చికిత్సల గురించి, వైద్య పరీక్షల గురించి సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అ...

సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీ & కమీషనర్ గా చక్కా ప్రియాంక బాధ్యతల స్వీకరణ

Image
  సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీ & కమీషనర్ గా చక్కా ప్రియాంక బాధ్యతల స్వీకరణ హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమీషనర్ గా సి.హెచ్. ప్రియాంకా నేడు భాద్యతలు స్వీకరించారు. శాఖ స్పెషల్ కమీషనర్ గా ఉన్న డా. హరీష్ ను తెలంగాణ జెన్కో ఎండి గా బదిలీచేసి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న సిహెచ్. ప్రియాంకను సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నేడు ఉదయం సచివాలయంలో డా.హరీష్ నుండి ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రటరీగా, సమాచార శాఖ స్పెషల్ కమీషనర్ తో పాటు తెలంగాణా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా భాద్యతలను స్వీకరించారు.           స్పెషల్ కమీషనర్ గా భద్యతలు స్వీకరించిన ప్రియాంక కు సమాచార శాఖ, ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్, మీడియా అకాడమీ అధికారులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జెన్కో ఎండిగా వెళ్లిన డా. హరీష్ కు ఘనంగా వీడ్కోలు పలికారు. స్పెషల్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం సమాచార శాఖ కార్యక్రమాలు, పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిషోర...

జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం

Image
 *జర్నలిస్టుల సమస్యలపై డబ్ల్యూ జే ఐ పోరాటం*  నల్గొండ, గూఢచారి:: పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ దేశాయ్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న అక్రిడేషన్లు వెంటనే ఇచ్చే విధివిధానాలను ప్రకటించి అర్హులైన వారందరికీ ఇవ్వాలని అన్నారు... జర్నలిస్టులు సంక్షేమంలో భాగంగా అర్హులైన వారందరికీ ఇంటి స్థలాలు ఆసుపత్రులలో ఉచిత చికిత్స, తదితర అంశాలతో పాటు పాత్రికేయుల సమస్యలపై త్వరలో ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్లు, విమానాల టికెట్లలో జర్నలిస్టులకు రాయితీ ఇవ్వాలని, టోల్ ఛార్జీల మినహాయింపు ఇవ్వాలని తాము పోరాడుతున్నట్లు తెలిపారు. తమ వృత్తిలో భాగంగా జర్నలిస్టులు నిష్పక్షపాతంగా ఉంటేనే సమాజంలో వారిపట్ల గౌరవం పెరుగుతుందనీ, వారు   దేశహితం కోసమే పని చేయాలని సూచించారు. వర్కింగ్ జర్నలిస్ట్స్ ...

శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి

Image
 శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం ఈవో అరాచకాలు.....బదిలీ అయినా కదలని ఈవో.....ఆలయ ఆధాయానికి గండి  హైద్రాబాద్, గూఢచారి:  2024ఆగస్టు నెలలో దేవాదాయశాఖ ఉద్యోగుల ట్రాన్స్ఫర్ జరిగాయి. అయినప్పటికీ పెద్దల అండదండల తో కదలని ఈవో మనోహర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఉజ్జయిని అమ్మవారి గోశాలలో ఉండవలసిన మూడు గోవులను నల్లగొండ జిల్లా ఉరుముడ్ల లొని సొంత పొలం కు తరలించిన అడిగే నాధుడు లేరు.  పదిమంది(ముగ్గురు సన్నాయి వాళ్ళు, ఇద్దరు పురోహితులు, మరో ఐదుగురు )ఉద్యోగులకు ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసింది.అయినా గత రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా, వేదిస్తున్నారు, ఏప్రిల్ నెలలో రెగ్యులరైజేషన్ అయినప్పటికీ సెప్టెంబర్ నెల నుంచి మాత్రమే జీతాలు ఇచ్చారు. ఐదు నెలల జీతం రెండు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు..బకాయి పడ్డ జీతం... పెండింగ్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అంటే రెండు నెలల జీతం సమర్పించుకోవాలి అంటూ ఈవో డిమాండ్ చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.ఇటీవల కొందరు ఉద్యోగులు తమ అవసరాల కోసం సరెండర్ లీవ్ క్లెయిమ్ చేస్తే Secure stop దగ్గర  8 శాతం Religious staff దగ్గర 10 శాతంతీసుక...

*సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త*

Image
 *సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం* - *TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త* పేద ప్రజలకు కార్పోరేట్ వైద్యం అందించాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందిస్తుందని TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. సాయి రామ్ నగర్ BN Reddy Nagar కి (ఆర్య వైశ్య సామాజిక వర్గం ) కి చెందిన శ్రవణ్ కుమార్  కుమార్తె హన్యశ్రీ కి మంజూరు ఐన 3,50,000/- (Three Lakhs Fifty thousand )రూపాయల CMRF చెక్కు నీ ఉప్పల శ్రీనివాస్ గుప్త  క్యాంపు కార్యాలయంలో  ఆయన అందజేశారు .  ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం పేద ప్రజలకు వరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో Boggarapu Varun ,Dr Rajayya Guptha ,Congress Leaders ,ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.