తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం
తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం 🔹 రూమ్స్ బుకింగ్ నెంబర్ : 9989 249 679 🔹 నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు 🔹 - ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె హైదరాబాద్ : శ్రీ అయోధ్య వాసవీ ట్రస్ట్ వారి సత్రం సేవలను తిరుపతిలో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ సీతారాములు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, తమ సత్రానికి వచ్చే యాత్రికులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లతో పాటు శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గత ఏడాదికాలంగా అయోధ్యలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల మన్ననలను పొందిన తమ సత్రం సేవలను, ప్రస్తుతం తిరుపతికి విస్తరించామని తెలిపారు. మొత్తం 18 పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నెలకొల్పి, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులకు సేవలు అందేలా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో ప్రారంభమైందన్నారు. త్వరలో అరుణాచలం, వారణాసి, నైమిశారణ్యం...