*మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘన సన్మానం* *రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన భరతక్క, వనజక్కలకు సత్కారం* *వరంగల్, తేదీ:* ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమాలకు పురిటిగడ్డగా నిలిచిన నేపథ్యంలో, రైతుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న మేరు జాతి మహిళా ఉద్యమకారులకు ఘనంగా సన్మానం జరిగింది. ప్రజా ఉద్యమ నేత అక్కరాజు హరిగోపాల్ అలియాస్ రామకృష్ణ సతీమణి సింగు సిరిష అలియాస్ భరతక్క, సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన పటేల్ సుధాకర్ రెడ్డి సతీమణి పటేల్ వనజ అలియాస్ కాపురి వనజక్కలను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మేరు కార్పొరేషన్ చైర్మన్ సంగా వెంకటరాజం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణ, రాష్ట్ర మేరు సంఘం నాయకులు మునగాల రమేష్, మునగాల రాము, జిల్లా నాయకులు రాయబారు సంతోష్ తదితరులు పాల్గొని వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ సంగా వెంకటరాజం మాట్లాడుతూ... "మేరు జాతిలో పుట్టి రైతుల హక్కులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కో...