Posts

చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం

Image
  *చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం*   *కబేళాకు తరలిస్తుండగా పోలీసుల మెరుపు దాడి*   *లారీ డ్రైవర్ అదుపులో: ముఠా కోణంలో దర్యాప్తు* *నల్లగొండ, గూఢచారి:* జిల్లాలోని చిట్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ గో అక్రమ రవాణాను భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్న సుమారు 60 గోవులను పోలీసులు పట్టుకున్నారు. లారీలో కిక్కిరిసిన స్థితిలో గోవులను అత్యంత అమానవీయంగా తరలిస్తుండగా, చెక్‌పోస్టు వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఊపిరాడని స్థితిలో ఉన్న 60 గోవులను గుర్తించి డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోవుల రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కీలక వివరాలపై డ్రైవర్‌ను గట్టిగా విచారిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గోవులను సురక్షితంగా చింతపల్లి గోశాలకు తరలించి, వాటికి పశువైద్యులతో చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చిట...

జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్

Image
 *జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్*   *చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి*   *కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా & నిరసన* *కరీంనగర్, గూఢచారి:* రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 17ను వెంటనే రద్దు చేసి, చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి కొంకటి శేఖర్, అక్కనపల్లి శిరీష, మేకల రవీందర్, జన్ను స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.17ను తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో అవకాశం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. *గుజరాత్ కంపెనీకి కట్టబెడుతున్నారు*   "ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందవలసిన వాటాను వాళ్లకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్ఫత్‌లాల్ ...

*తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*

Image
  *తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*   *ఈ నెల 18 నుంచి 22 వరకు తీవ్ర వడగాలులు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*   *వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: వాతావరణ శాఖ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడు భగభగలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిన్న నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది వేడి నుంచి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. *47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు*   ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరక...

*"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’* *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?* *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్*

Image
 *"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’*   *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?*   *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్* గూఢచారి:* "ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్.. ఇదే అడ్మినిస్ట్రేషన్ వండర్" అంటూ ఓ ప్రభుత్వ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయకపోయినా, వివరణ ఇచ్చినా సరెండర్ చేయడమేంటని  నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. *అసలేం జరిగింది?*   డీటీగా విధులు నిర్వహిస్తున్న రఘునందన్‌కు ఒకరోజు ఉన్నతాధికారి నుంచి పిలుపు వచ్చింది. "ఏమయ్యా.. నీ ఫోన్ ఎందుకు బంద్ ఉంది? ఫోన్ లేప్తలేడు, ఫీల్డ్‌లో లేడు అని ఆ మేడం నీపై ఫిర్యాదు చేసింది. ప్యాడీ సెంటర్లకు పోవడం లేదని కంప్లైంట్ ఇచ్చింది. వెళ్లి సారీ చెప్పి, అటెండెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకో. లేకపోతే ఈ నెల జీతం ఆగుతది" అని హెచ్చరించారు. దానికి రఘునందన్ "సార్.. నా ఫోన్ డ్యామేజ్ అయ్యింది. రిపేర్‌కు ఇచ్చాను. నేను నౌకరీ చేసేది ఇక్కడ. అక్కడి నుంచి అటెండెన్స్ ఎట్లా తేవాలి?" అని ప్రశ్నించగా, "ఏయ్.. ఎక్కువ మాట్లా...

*తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*

Image
 *తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*   *హైటెక్స్‌లో ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్*   *రాష్ట్ర ప్రగతికి డబుల్ ఇంజన్ సర్కార్ హామీ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. భాగ్యనగరంలోని హైటెక్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎం వెండి నంది విగ్రహాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను ప్రధానికి బహూకరించారు. *ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే*   తెలంగాణలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, రవాణా, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ప్రధాని పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. 1. రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి ప...

*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

Image
  *అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?* *హైస్పీడ్ ఫ్యాన్ల టెండర్‌లో 10 లక్షల కుంభకోణం బట్టబయలు*  *నాసిరకం సామాను సరఫరా: సప్లయర్, అధికారులపై వేటుకు డిమాండ్* *  *20 లక్షల టెండర్‌లో 10 లక్షలు స్వాహా? *సప్లయర్, అధికారులపై విచారణకు డిమాండ్* *నల్గొండ, గూఢచారి:* చిన్నారులకు ఎండ తాపం తగలకూడదని జిల్లా కలెక్టర్ తలపెట్టిన పుణ్యకార్యంలో దోపిడీ దొంగలు పడ్డారు. డిపార్ట్‌మెంట్ నుంచి బడ్జెట్ రాకున్నా, మినరల్ ఫండ్స్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మంచి మనసుతో నిర్ణయించానట్లు తెలిసింది.  క్రాంప్టన్ HS Plus  హై స్పీడ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ 4 ఫీట్ల ట్యూబ్‌లైట్లకు టెండర్ పిలిచి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. అసలు  కుంభకోణం జరిగింది మాత్రం సప్లైలోనే.  టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ HS Plus హై స్పీడ్ ఫ్యాన్లకు బదులు నాసిరకం నార్మల్ సీవిండ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లకు బదులు నార్మల్ ఫిలిప్స్, కొన్నిచోట్ల క్రాంప్టన్ నార్మల్ ట్యూబ్‌లైట...

*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*

Image
  *CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*   *భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి*   *పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి* *హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు. *ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం*   పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉ...