చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వల — ఎస్ఐ, కానిస్టేబుల్ అరెస్ట్
చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ వల — ఎస్ఐ, కానిస్టేబుల్ అరెస్ట్ హైదరాబాద్, ఆగస్టు 22: చందానగర్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ బండెల బాల్రాజ్, కానిస్టేబుల్ బి. రాఘవేంద్రను లంచం తీసుకుంటుండగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడానికి అధికారికంగా అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.75,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. ఏసీబీ ప్రకారం, రూ.75,000 లంచం మొత్తాన్ని ఎస్ఐ బాల్రాజ్ కార్యాలయంలోని టేబుల్ డ్రాయర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందే బాల్రాజ్ రూ.20,000 నగదు తీసుకోగా, కానిస్టేబుల్ బి. రాఘవేంద్ర రూ.10,000ను యూపీఐ ద్వారా స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తూ అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో ఇద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్లోని స్పెషల్ జడ్జి ఫర్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్...