ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్! హైదరాబాద్:గూఢచారి: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్గా మారింది. అసంతృప్తుల నడుమ నియామకాల జోరు! ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం. తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల ...