Posts

శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త

Image
శ్రీ వాసవి సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి  కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులను ఆహ్వానించిన కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త ఆధ్వర్యంలో ఈనెల 22న జరగనున్న శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం-సామూహిక పారాయణ ఉత్సవానికి సంబంధించి రేపు  గురువారం సాయంత్రం 6 గంటలకు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరగనున్న కర్టెన్ రైజర్ ప్రోగ్రాంకు మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క లను ఆహ్వానిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కల్వ సుజాత, బెల్ది శ్రీధర్ లు.   కొణిజేటి శివ సుబ్బారావు (కీ.శే. శ్రీ రోశయ్య గారి తనయుడు) కి ఆహ్వాన పత్రిక ను అందచేశారు. 

18,000/- #లంచం

Image
 కూకట్‌పల్లి జోన్, మూసాపేట్ సర్కిల్-53 కమ్యూనిటీ ఆర్గనైజర్ కె. మురళి, ఒక మహిళా పొదుపు సంఘానికి మంజూరైన రూ. 20 లక్షల రుణాన్ని ప్రాసెస్ చేసినందుకు గాను, ప్రతి లక్షకు వెయ్యి రూపాయల చొప్పున మొత్తం రూ. 18,000/- #లంచం డిమాండ్ చేశారు.  బాధితుడి నుండి కె. మురళి ఈ మొత్తాన్ని స్వీకరిస్తుండగా తెలంగాణ #అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పట్టుకున్నారు.

*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల*

Image
*తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు విడుదల* *తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్ష (2026-28) ఎన్నికల షెడ్యూలు ఈ రోజు అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేశారు.  అడ్వకేట్ కమీషనర్ పి. బాలగోపేంద్రనాథ్ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ లో 2026-2028 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహా సభ అధ్యక్షుడి ఎన్నికల (రిజిస్టర్ నం. 363/2015) ఎన్నికల షెడ్యూల్ క్రింది విధంగా ఉంది. 11-03-2026 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు నామినేషన్ జారీ & స్వీకరణ. సాయంత్రం 04.00 గంటలకు పరిశీలన, సాయంత్రం 05.00 గంటలకు పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. 12-03-2026 ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 04.00 గంటల వరకు ఉపసంహరణలు, తుది పోటీ అభ్యర్థుల జాబితా ప్రకటన. పైన పేర్కొన్న ప్రక్రియ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లోని చింతల్‌బస్తీలోని వైశ్య భవన్‌లో జరుగుతుందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.   17-03-2026 ఉదయం 09.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 06.00 గంటలకు లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన. ఈ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ :Vasavi Kalyana Mandapam...

హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్

Image
హిమాయత్‌సాగర్ పరిసరాల్లో అక్రమ మైనింగ్ – ‘మరో KGF’లా ప్రకృతి వనరుల దోపిడీ: ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ హిమాయత్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, క్రషర్ యూనిట్ల కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పరిశీలన నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ తెలిపారు. హిమాయత్‌సాగర్ ప్రాంతంలోని సర్వే నంబర్లు 66, 67, 68, 69లో నడుస్తున్న క్రషర్ యూనిట్లను బృందం ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందంలో ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, రాజేంద్రనగర్ పార్టీ ఇన్‌చార్జ్ పట్లొళ్ల కార్తీక్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్లు డా. క్రిశాంక్, డా. వాసుదేవ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఉపేంద్రాచారి, కే. కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు అభిలాష్ రంగినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే KGF సినిమా గుర్తుకు వచ్చిందన్నారు. భూమాతను చెరబట్టి ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు

Image
  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత  ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని  అడ్వకేట్  కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు హైద్రాబాద్: తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ  ఓటర్ల లిస్టు లో అర్హత లేని వారు నల్లగొండ జిల్లా ఓటర్ల ను తయారు చేశారని అట్టి ఓటర్ లిస్టు చెల్లదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, ఎన్నికల కొరకు కోర్టు నియమించిన అడ్వకేటు కమీషనర్ పి. బాల గోపేంద్రనాథ్ కు అభ్యంతరాలు వ్యక్త పరుస్తూ భూపతి రాజు ఫిర్యాదు అందచేశారు. ఆ ఫిర్యాదు లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు తమరిని కోర్టు అడ్వకేటు కమీషనర్ గా నియమించారని ప్రస్తుతము ఉన్న ఓటర్స్టు పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 2026 మార్చి 3.4,5 తేదీలలో తెలపవలసిందిగా కోరుతూ ఈనాడు దిన పత్రికలో పబ్లిక్ నోటీసు ను తమరు ప్రకటించారని, నల్లగొండ ఓటర్ లిస్టు చెల్లదని వివరాలు తెలిపారు. నేను అనగా భూపతి రాజు (తండ్రి భద్రాద్రి) రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ జీవిత సభ్యుడననీ, ( జీవిత సభ్యునిగా నా సభ్యత్వ నంబరు 56924), ప్రస్తుతము జిల్లా ఉపాధ్యక్షులు గా ఉన్నానని , నా అడ్రసు: 6-2-1061/2 , వీటి కాలని, నల్గొండ 508001 . సెల్: 9848490545 ని తమరికి చ...

ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు..

Image
 ఎంజీయూ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ ఉత్సవాలు.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం శాఖ ఏబీవీపీ ఆధ్వర్యంలో హోలీ ఉత్సవాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించబడ్డాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పరం రంగులు చల్లుకుంటూ సాంప్రదాయబద్ధంగా హోలీ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ... హోలీ పండుగ ఐక్యత,స్నేహభావానికి ప్రతీక అని తెలిపారు.భేదాభిప్రాయాలను పక్కనబెట్టి విద్యార్థులంతా కలిసిమెలిసి ముందుకు సాగాలని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాన్నిహిత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మోహన్,అజయ్,మౌనేష్ సతీష్,విజయ్,సంపత్,వెంకటేష్ సుధీర్,నగేష్,శంకర్,సాయి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌

Image
 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఓటర్ల లిస్టు పై అభ్యంతరాల స్వీకరణకు పబ్లిక్ నోటీస్ ప్రకటించిన అడ్వకేట్ కమిషనర్ పి. బాల గోపేంద్రనాథ్‌ హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ కార్యాలయానికి ఎన్నికలు నిర్వహించడానికి తనను కమిషనర్‌గా నియమింప బడినట్లు  పి. బాల గోపేంద్రనాథ్‌ (అడ్వకేట్ కమిషనర్) పబ్లిక్ నోటీస్ ను దిన పత్రికలో ప్రకటించారు. ఖైరతాబాద్ లోని చింతల్‌బస్తీ నంబర్ 6-2-648లో రిజిస్టర్డ్ కార్యాలయం ఉంది. దీనిని సాధారణంగా "వైశ్య భవన్" అని పిలుస్తారని , ప్రస్తుత ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈ నోటీసు ప్రచురించబడిన తేదీ నుండి మూడు రోజుల్లోపు అంటే 03-03-2026 నుండి 05-03-2026 వరకు నాకు లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చునని, తాను స్వయంగా ఈ మూడు రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం మధ్యాహ్నం 1-00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు హైదరాబాద్‌లోని వైశ్య భవన్ చింతల్‌బస్తీలో అందుబాటులో ఉంటాననీ, ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించరని పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్నారు. ఓటర్ల లిస్టులో పేర్లు కోల్పోయినవారికి ఇది మంచి అవకాశము. తమ హక్కును నిరంకుశ ధోరణిలో తొలిగిపబడ్డ వారు వారి అభ్యంతరాలు సమర...