Posts

*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*

Image
 *“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం* హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో “జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు  బండారు సుబ్బారావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంతవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అఖిల భారత నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్  కౌటికె విఠల్  స్పాన్సర్‌గా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా  కౌటికె విఠల్  మాట్లాడుతూ, “విపరీతమైన ఎండల్లో దాహార్తిని తీర్చడం అత్యంత మానవీయమైన సేవ. ఆహారం లేకపోయినా కొంతకా...

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! హర్షం వ్యక్తం చేసిన వనమా వెంకటేశ్వర్లు

Image
 తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! 🌸 తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా "రాష్ట్ర పండుగగా" ప్రకటించింది. ముఖ్య విశేషాలు: 📍 ప్రతి సంవత్సరం "వైశాఖ శుక్ల పక్ష దశమి" నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఈ వేడుకలను నిర్వహిస్తుంది. 📍 ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 📍 అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మరియు  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏✨  వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

Image
 శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు ముడిదుడ్డి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   ముఖ్యమంత్రి వైశ్య వాసవి మాత పారాయణం నిర్వహించిన ప్రోగ్రామ్ లో వాసవి మాత జయంతి ని పండుగా రోజు గా గుర్తిస్తామన్నారు. అన్న మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం లోని ఆర్యవైశ్యులు అందరు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కి ధన్యావాదాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్యులకు పిలుపు నిచ్చారు.

ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ,ఎస్ఐ

Image
 అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ,ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్లో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ  తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ...

*తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త*

Image
  *తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త* హైద్రాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగుగా, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్‌గా ఉప్పల శ్రీనివాస్ గుప్త  నియమితులయ్యారు.  ఈ సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకంపై ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఆనందం వ్యక్తం చేస్తూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన అసోసియేషన్ ప్రెసిడెంట్ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే అసోసియేషన్ సభ్యులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బ్యాడ్మింటన్ క్రీడను మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ప్రతిభ కలిగిన యువ క్రీడాకారులను గుర్తించి వారికి సరైన మార్గదర్శకత్వం, సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.  క్రీడా మౌలిక సదుపాయాల పెంపు, శిక్షణా శిబ...

డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు

Image
  డిజిటల్ అరెస్టు కేసులో సీబీఐ సోదాలు; అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్‌తో సహా ముగ్గురి అరెస్టు తేదీ: 18.04.2026 'డిజిటల్ అరెస్ట్' కేసుకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. గౌరవనీయ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. బాధితురాలైన ఒక సీనియర్ సిటిజన్‌ను 'డిజిటల్ అరెస్ట్' చేస్తామని బెదిరించి, ఆమె నుండి రూ.1.6 కోట్లకు పైగా మొత్తాన్ని బదిలీ చేయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయని అధికారులు ఒక ప్రకటన లో వెల్లడించారు. సైబర్ మోసం ద్వారా వచ్చిన సొమ్మును స్వీకరించడాన్ని సులభతరం చేసేందుకు, మోసపూరితంగా కాజేసిన నిధులను ఒక కంపెనీ పేరుతో మోసపూరితంగా తెరిచిన బ్యాంకు ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. దర్యాప్తు కొనసాగింపులో భాగంగా, మోసపూరితంగా బ్యాంకు ఖాతా తెరవడంలో సహకరించిన ఆరోపణలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. అరెస్టు అయిన మిగతా ఇద్దరు నిందితులు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేయడంలో, అలాగే ...

ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్

Image
 ఏసీబీ వలలో కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్   కామారెడ్డి, గూఢచారి: 17-04-2026న, కామారెడ్డి జిల్లా, బిచ్‌కుండకు చెందిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, నిందితుడైన అధికారి దీను సత్యనారాయణ, ఫిర్యాదిదారుడికి అధికారికంగా సహాయం చేస్తానని చెప్పి, బిచ్‌కుండలోని అతని అద్దె ఇంట్లో రూ. 2,00,000 లంచం డిమాండ్ చేస్తూ, తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఆ సహాయం ఏమిటంటే, "గ్రామాల నుండి కల్లు దుకాణాలను తరలించమని ఫిర్యాదిదారుడిపై ఒత్తిడి చేయవద్దని, తదుపరి కేసులు నమోదు చేయకుండా ఉండాలని, తద్వారా కల్లు దుకాణాలను ఎటువంటి జోక్యం లేకుండా నడపడానికి అనుమతించాలని" చెప్పడం. పైన పేర్కొన్న వాటితో పాటు, అతని బ్యాగ్‌లో లెక్క చూపని రూ. 45,760/- కూడా లభ్యమైంది. ఈ విధంగా, అసెస్‌మెంట్ ఆఫీసర్ రూ.2,00,000/- అక్రమ ప్రయోజనాన్ని స్వీకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని గుర్తింపు గోప్యంగా ఉంచబడింది. అందువల్ల, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో, ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల విచారణ కొరకు నియమించబడిన గౌరవనీయ రెండవ అదనపు ప...