Posts

70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........

Image
 70 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన........ సూపరింటెండెంట్ (జనరల్) O/O ది కమిషనర్ & డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, సైఫాబాద్, హైదరాబాద్ మరియు సీనియర్ అసిస్టెంట్, 0/0 ది DEO రంగారెడ్డి ACB కి పట్టుబడ్డారు. 19.02.2026న, హైదరాబాద్‌లోని సైఫాబాద్‌లోని కమిషనర్ & స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ AO-1 సంగీత ఫణిరాజ్, AO-2 గుమ్మిడల శ్రీధర్ సీనర్ అసిస్టెంట్ 0/0 DEO ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం మొత్తాన్ని వసూలు చేసి, దానికి పాల్పడినప్పుడు ACB సిటీ రేంజ్-1 యూనిట్ వారిని పట్టుకుంది. "2026-2027 అకాడమిక్ సంవత్సరానికి ఫిర్యాదుదారు స్కూల్ CBSE NOC సర్టిఫికేట్ దరఖాస్తును ప్రాసెస్ చేయడం, ఫైల్‌ను ఉన్నత అధికారులకు పంపడం" కోసం అతను ఫిర్యాదుదారుడి నుండి రూ. 70,000/- లంచం తీసుకోవడానికి పాల్పడ్డాడు. AO-2 వద్ద నుండి కళంకిత లంచం మొత్తం రూ. 70,000/- స్వాధీనం చేసుకున్నారు.  AO-1 మరియు AO-2 లను అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు, నాంపల్లి హైదరాబాద్. కేసు దర్యాప్తులో ఉంది.

భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్

Image
 భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్), పున్నం రజిత, కొమ్ము సునీతలు పట్టుబడ్డారు సర్టిఫైడ్ కాపీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సీహెచ్ గోపాలరావు అనే న్యాయవాది  ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీంతో రైడ్స్ జరిపిన ఏసీబీ అధికారులు ముగ్గురిని పట్టుకున్నారు

నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక.

Image
  నుమాయిష్ 2026లో ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా టి జి పి సి బి స్టాల్ ఎంపిక. హైద్రాబాద్: ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ ఉత్తమ ప్రదర్శన స్టాల్‌గా ఎంపిక అయ్యింది ఈ స్టాల్ కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. కలిగించింది.   ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను (టీజీపీసీబీ) ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించ...

ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ .

Image
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది -  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ . మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.         బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన  వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటుచేసిన  పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ...

నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

 *నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్..* TG: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్....

Image
 ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్.... విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్  కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. రూ.28 లక్షలు డిమాండ్ చేసి, రేంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ ద్వారా రూ.3.50లక్షలు తీసుకుంటున్న సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో ఏసీబీ అధికారులు జనవరి 3న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. టన్నుకు 90 రూపాయల చొప్పున మొత్తం రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేంజర్ ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి డివిజనల్ అధికారిణి శ్రావణి పరారిలో ఉన్నారు. ఏసీబీ ఆమె పై నిఘా పెట్టి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శ్రావణిని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసు అటవీ అభివృద్ధి సంస్థలో సంచలనం సృష్టించింది.

మత్స్యకారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట - శాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం

Image
  కేంద్ర బడ్జెట్ 2026-27: మత్స్యకారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట - శాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం – బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ బీజేపీ మత్స్యశాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం నల్గొండ/హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ మత్స్యకారుల జీవితాల్లో నూతన వెలుగులు నింపేలా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మత్స్యశాఖ నాయకులు  ఎల్ వి రమణ ముదిరాజ్ కొనియాడారు. ఈ బడ్జెట్‌లో మత్స్య రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ₹2,761.80 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను వివరించారు:  * PMMSY బలోపేతం: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కు అత్యధికంగా ₹2,500 కోట్లు కేటాయించడం శుభపరిణామం. దీనివల్ల మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.  * తెలంగాణకు మేలు: దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి పథకం మన తెలంగాణలోని చెరువులు, కుంటలపై ఆధారపడిన లక...