వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో
🚨 వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎం. శరత్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ➡️ ఫిర్యాదుదారుని పని కోసం మొదట రూ.30,000 లంచం డిమాండ్ చేయగా, చర్చల తర్వాత రూ.20,000కు తగ్గించి తీసుకున్నట్లు సమాచారం. ➡️ సైట్ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, “నో డ్యూ సర్టిఫికేట్” మరియు “ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి లంచం తీసుకున్నాడు. 💰 అధికారులు ఆయన వద్ద నుంచి రూ.20,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ⚖️ నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 📢 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయండి: 📞 టోల్ ఫ్రీ: 1064 🔐 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.