Posts

శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్

Image
  శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్ నల్గొండ:  నల్లగొండ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారీ గుట్ట నిర్వహణ అభివృద్ధి కమిటీ (రిజిస్టర్) మెంబర్గా శ్రీ చింతా హరిప్రసాద్ నన్ను నియమించారనీ ఆయన కీర్తి శేషులు అయినారని, నాకు కొన్ని వ్యక్తిగత కారణముల కమిటినుండి తప్పుకొను చున్నాని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుండి పైన తెలిపిన కమిటీకి నాకు ఎటువంటి సంబంధములు ఉండవని పత్రికా ముఖంగా తెలియ చేయు చున్నానని ఆయన తెలిపారు.

గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు -  పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  గ్యాస్ సిలిండర్ సరఫరాలో అక్రమాలు ఉపేక్షించే ప్రసక్తే లేదని,గ్యాస్ డెలివరీ బాయ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కు అధిక వసూళ్లపై కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయగా.. శనివారం నాడు గ్యాస్ సరఫరా చేసే బండ్ల ను  తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీకి అక్రమంగా అధికంగా వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. గ్యాస్ బండల సరఫరాలో కొందరు డెలివరీ బాయ్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదు లు వస్తున్నాయన్నారు. అక్రమ వసూళ్ల కు పాల్పడే వారిపై ఒక్కరు ఫిర్యాదు చేసినా చాలు అని రఘునందన్ సూచించారు. గ్యాస్ కు రశిదు కూడా ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. గ్యాస్ ఎజెన్సీ అనుమతి రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు అని హెచ్చరించారు. వినియోగదారుల ను వి ఐ పి లు గా పరిగణించాలని సూచించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

   *తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ

Image
 జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ   పోలీసులు సంయమనం పాటించాలి! పండుగనాడు భయభ్రాంతులకు గురి చేయడం తగదు! తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి! టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ సంగారెడ్డి:   ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం పత్రికా స్వేచ్ఛను నొక్కివేయడమే అని వారు అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధ మని పేర్కొన్నారు. జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి తగదు. అని అన్నారు.ఏదైనా అంశంపై వివరణ కోరాల్సి ఉంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు ఇవ్వాలి తప్ప, ...

గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
  గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.    హైద్రాబాద్, 13, జనవరి: గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు తాజా వార్తలను భూపతి టైమ్స్, గూఢచారి అందిస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు. పత్రికల అభివృద్ధి కి సహాయ సహకారాలు అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ కు ఎడిటర్ భూపతి రాజు కృతఙ్ఞతలు తెలిపారు.

దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత

Image
 దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత, అనారోగ్యం తో అమీర్పేట్ లోని స్వగృహం లో కన్ను మూసారు

జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC

Image
 జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC  హైదరాబాద్, జనవరి 11, 2026: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జనవరి 12 మరియు 13 తేదీలలో నగరం అంతటా మెగా ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని GHMC కమిషనర్ R.V. కర్ణన్ శనివారం ప్రకటించారు. సురక్షితమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల నుండి ఈ-వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యం. ఈ డ్రైవ్ సమయంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, బ్యాటరీలు, యుపిఎస్ సిస్టమ్లు మరియు పవర్ బ్యాంకులు వంటి అనేక రకాల విస్మరించబడిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరిస్తారు. బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల తొలగింపు యొక్క ప్రాముఖ్యతపై పౌరులకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య సిబ్బంది, నివాసి సంక్షేమ సంఘాలు (RWAs), NGOలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలతో కూడిన అవగాహన ప్రచారాలను GHMC ఇప్పటికే ప్రారంభించింది. ప్రజల ...