అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.!
అర్హులైన జర్నలిస్టులందరికీ ఆక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.! టి యు డబ్ల్యూ జే (ఐ జె యు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ సమావేశం సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా లో నూతనంగా ఏర్పడిన అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి ఆరా తీశారు. టీయూడబ్ల్యూజేఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి , ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ లు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో చాలా సంవత్సరాలుగా అర్హులైన వారు జర్నలిస్టులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో , మండలాల్లో అర్హులు చాలామంది ఉన్నారని చెప్పారు.వీరందరికీ కూడా సకాలంలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే బాగుంటుందని వివరించారు. జిల్లాలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో , ఉర్దూ , ఇ...