కూకట్ పల్లి జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు

*కూకట్ పల్లి జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు* *జర్నలిస్టుల సంక్షేమానికి కోటి విరాళం* *తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత* *అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్* హైద్రాబాద్, (గూఢచారి): నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేసే జర్నలిస్ట్ యోధులకు కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అండగా నిలిచారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. శనివారం నిర్వహించిన వడ్డేపల్లి రాజు( రాజేశ్వరరావు ) జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో అందజేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను చూసి తాను చెల్లించానని ఈ సందర్భంగా తెలిపారు. తన సూచన మేరకు కూకట్పల్లిలోని సీనియర్ జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి కూకట్పల్లి జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను ఇస్తున్న కోటి ర...