ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు
ఒకే రోజు రెండు ఏసీబీ దాడులు నారాయణపేటలో సబ్ రిజిస్ట్రార్.. హైదరాబాద్ ముషీరాబాద్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరెస్ట్ హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఒకే రోజు రెండు వేర్వేరు కేసుల్లో ప్రభుత్వ అధికారులపై చర్యలు చేపట్టింది. నారాయణపేట జిల్లాలో సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ ముషీరాబాద్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లంచం వ్యవహారంలో ఏసీబీకి చిక్కారు. రూ.90 వేల లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ నారాయణపేట జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకట్ స్వామిపై క్రిమినల్ మిస్కండక్ట్ కేసు నమోదైంది. ఏసీబీ వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 4723/2026ను పూర్తి చేసేందుకు రూ.90,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తంలో భాగంగా రూ.50,000ను ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేష్ ద్వారా స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం మిగిలిన రూ.40,000 కోసం డిమాండ్ చేసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్ట్రార్తో పాటు ప్రైవేట్ వ్యక్తి కమ్మరి నాగేష్న...