Posts

*ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత*

Image
 *ఏసీబీ వలలో టోలిచౌకీ ఎస్ఐ - రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టివేత* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* లంచం డిమాండ్ చేసిన టోలిచౌకీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కాడు. గోల్కొండ జోన్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టోలిచౌకీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ *ఆర్. పాండు నాయక్* రూ.10,000 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. *ఏం జరిగింది?* ఫిర్యాదుదారుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై అతనిపై కేసు నమోదు చేయకుండా, కుటుంబ సభ్యుల మధ్య విషయాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు, అతని పాస్‌పోర్టును సీజ్ చేయకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానని చెప్పి ఎస్ఐ పాండు నాయక్ రూ.10 వేలు డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వల వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. నిందితుడి నుండి తడిసిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. కేసు దర్యాప్తులో ఉందని, భద్రతా కారణాల వల్ల ఫిర్యాదుదారుడి వివరాలు గోప్యంగా ఉంచినట్లు ప...

*టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు*

Image
 *టీజీపీసీబీలో 11 ఏళ్ల సేవలు పూర్తి చేసుకున్న వై. భాస్కర్ చారికి ఘన వీడ్కోలు* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) లో 11 సంవత్సరాల పాటు సెక్యూరిటీ పర్సన్ గా నిబద్ధతతో సేవలందించిన వై. భాస్కర్ చారి పదవీ విరమణ సందర్భంగా సనత్‌నగర్‌లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ చారి అందించిన సేవలను అధికారులు, ఉద్యోగులు కొనియాడారు. ఆయనను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ అనంతర జీవితం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీజీపీసీబీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అరుణ, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (OUSEA) అధ్యక్షుడు సి. మధు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఆర్. నవీన్ గౌడ్, రాజా రమేష్, బాబు గౌడ్, రఘు, దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

*ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్*

Image
 *ఘనంగా ప్రారంభమైన ఎల్‌ఐసీ 70వ వార్షికోత్సవ వేడుకలు - జ్యోతి ప్రజ్వలన చేసిన యెర్రం విజయ్ కుమార్* *హైదరాబాద్, సెప్టెంబర్ 1:* భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) 70వ వార్షికోత్సవ వేడుకలు సైఫాబాద్ లోని సౌత్ సెంట్రల్ జోనల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వాసవి కన్స్ట్రక్షన్స్ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త యెర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎల్‌ఐసీ గ్యారెంటీకి, విశ్వాసానికి, ఆర్థిక భద్రతకు ప్రతీక అని, 70 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని శతాబ్ది వైపు సాగాలని ఆకాంక్షించారు. తమ కుటుంబం ఏళ్లుగా ఎల్‌ఐసీతో అనుబంధం కలిగి ఉందని తెలిపారు. జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రతి భారతీయుడికి జీవిత బీమా రక్షణ అందించడమే లక్ష్యమని, ఏడు దశాబ్దాలుగా కోట్లాది మంది విశ్వాసాన్ని నిలబెట్టుకున్న సంస్థ ఎల్‌ఐసీ అని అన్నారు. సెప్టెంబర్ 1 నుండి 8 వరకు బీమా వారోత్సవాలు జరుగుతా...

*స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* - సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ

Image
  *స్థానిక పత్రికలతోనే సమాజ నిర్మాణం* ప్రపంచానికి దిశానిర్దేశం చేసేలా భారత్‌ను విశ్వగురువుగా మలిచేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిపాదించిన పంచపరివర్తన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఉత్తమ భారతీయ సమాజాన్ని రూపొందించుకోవలసిన అవసరం ఉందని సంఘ్ క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ జీ పేర్కొన్నారు. భాగ్యనగర్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో "సమాచార భారతి" సంస్థ ఆధ్వర్యంలో ''స్థానిక పత్రికలు - సమాజ నిర్మాణం'' అంశంపై ఆదివారం జరిగిన ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు. సంఘ్ క్షేత్ర ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్ జీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల నుంచి 30కి పైగా వివిధ స్థానిక పత్రికల సంపాదకులు, పాత్రికేయులు పాల్గొని విశేష స్పందన కనబరిచారు. సంఘం ప్రధానంగా మార్పును, పరిణామాన్ని కోరుతున్నదని, ఇవి వ్యక్తి నుంచి ప్రారంభం కావాలని, దేశ నిర్మాణం లక్ష్యంగా ఇటువంటి వ్యక్తి నిర్మాణం అనేది సంఘ్ శాఖలలో జరుగుతున్నదని భరత్ కుమార్ వివరించారు. ఇలాంటి వ్యక్తులతో కూడిన కుటుంబమే దేశానికి వెన్నెముక అన్నారు. సంఘ్ ప్రస్తుతం 90 వేల...

“ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాదు” -న్యూయార్క్‌ నుంచి మోహన్‌ భాగవత్‌ కీలక సందేశం

Image
“ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాదు” -న్యూయార్క్‌ నుంచి మోహన్‌ భాగవత్‌ కీలక సందేశం వైవిధ్యమే భారత్‌ బలం.. మానవత్వం ఒక్కటే: మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ న్యూయార్క్‌, ఆగస్టు 30: అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో జరిగిన “One World, One Humanity” కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్‌సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భాగవత్‌ ప్రపంచ మానవాళికి ఏకత్వం, వైవిధ్యానికి గౌరవం, పరస్పర సామరస్యంపై కీలక సందేశం ఇచ్చారు. మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 6,000 మందికి పైగా భారతీయ-అమెరికన్‌ సమాజ సభ్యులు, ఇంటర్‌ఫెయిత్‌ నాయకులు హాజరైనట్లు పీటీఐ నివేదించింది. “ముస్లింలు ఉండకూడదనుకునే వ్యక్తి హిందువు కాదు” భాగవత్‌ ప్రసంగంలో అత్యంత ప్రాధాన్యం పొందిన వ్యాఖ్య ఇదే. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి “హిందువుగా ఉండడం మానేస్తాడు” అని ఆయన అన్నారు. 2018లో ఢిల్లీలో తాను నిర్వహించిన ఉపన్యాస కార్యక్రమాన్ని గుర్తుచేసుకున్న భాగవత్‌, అక్కడ పాల్గొన్న కొందరు ముస్లిం సోదరులు “మీరు హిందూ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు.. ముస్లింల పరిస్థితి ఏమిటి?”...

*నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి*

Image
 *నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మృతి - వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *ఘటనపై HRC కి ఫిర్యాదు చేసిన జిల్లా వాసి నవీన్ కుమార్ మల్లేపల్లి* *నల్లగొండ:* జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. *అసలేం జరిగింది?* కంబంపాటి కవిత అనే మహిళ రెండవ కాన్పు కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కాన్పు అనంతరం శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. *HRC కి ఫిర్యాదు* ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త *నవీన్ కుమార్ మల్లేపల్లి* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా జరుగుతున్న శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత కుటుంబాని...

*ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత*

Image
  *ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత* *7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో రక్షాబంధన్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలుగు అమ్మాయి* *న్యూఢిల్లీ:* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు అత్యంత ఘనంగా, ఆత్మీయంగా జరిగాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన చిన్నారులు, విద్యార్థినుల మధ్య ఈ వేడుకలో తెలుగు విద్యార్థిని *సాయి మధుమిత* ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీలో 12వ తరగతి MBiPC చదువుతున్న సాయి మధుమిత ఈ ప్రత్యేక వేడుకలకు ఆహ్వానం అందుకుని, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీకి రాఖీ కట్టే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ప్రధానమంత్రికి స్వయంగా రాఖీ కట్టడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, ఎంతో సంతోషంగా ఉందని మధుమిత తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వారితో సరదాగా హై-ఫైవ్స్ ఇస్తూ సందడి చేశారు. రక్షాబంధన్ వేడుకలకు సంబంధించిన మధుర క్షణాలను ప్రధాని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రక్షాబంధన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సామరస్య బంధాలను మరింత బలోపే...