Posts

ACB కి చిక్కిన, బిల్ కలెక్టర్, బీట్ ఆఫీసర్

Image
 గుండాల ఫారెస్ట్ రేంజ్‌లో ACB దాడి:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో ఫారెస్ట్ బీట్ అధికారి చిక్కాడు. 30-04-2026 తేదీన నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ బానోత్ నరేష్, ప్రస్తుతం సాయనపల్లి ఇన్‌చార్జ్‌గా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. గుండాల ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని తన కార్యాలయంలో రూ.10,000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వెంకటపురం రెవెన్యూ గ్రామంలో ఉన్న సుమారు 5 ఎకరాల పట్టా పోడు భూమిని, ప్రభుత్వం ఫిర్యాదుదారుడి తండ్రికి కేటాయించినప్పటికీ, ఆ భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.10,000 స్వీకరిస్తుండగా అధికారులు అతన్ని పట్టుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, లంచం మొత్తాన్ని నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అవినీతి ప్రవర్తన ప్రదర్శించి అన్యాయ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల భాగంగా నిందితుడిని అరెస్ట్ చేసి, వరంగల్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక కోర్టు, మూడవ ...

తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం

Image
  తిరుపతిలో ప్రారంభమైన అయోధ్య వాసవీ సత్రం 🔹 రూమ్స్ బుకింగ్ నెంబర్ : 9989 249 679  🔹 నూతన భవనంలో అధునాతన సౌకర్యాలు 🔹 - ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె హైదరాబాద్ : శ్రీ అయోధ్య వాసవీ ట్రస్ట్ వారి సత్రం సేవలను తిరుపతిలో ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి, శ్రీ సీతారాములు, తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సత్రానికి శ్రీకారం చుట్టారు.       ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె మాట్లాడుతూ, తమ సత్రానికి వచ్చే యాత్రికులకు వసతి, భోజన, రవాణా ఏర్పాట్లతో పాటు శుచి, శుభ్రతలకు అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. గత ఏడాదికాలంగా అయోధ్యలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రికుల మన్ననలను పొందిన తమ సత్రం సేవలను, ప్రస్తుతం తిరుపతికి విస్తరించామని తెలిపారు. మొత్తం 18 పుణ్యక్షేత్రాల్లో సత్రాలు నెలకొల్పి, దక్షిణాది రాష్ట్రాల యాత్రికులకు సేవలు అందేలా ప్రతిపాదనలు చేశామని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు తిరుపతిలో ప్రారంభమైందన్నారు. త్వరలో అరుణాచలం, వారణాసి, నైమిశారణ్యం...

వాసవి మాత జయంతి ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Image
  నల్లగొండ: గూఢచారి : పట్టణంలోని బీట్ మార్కెట్ రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్‌లో నిర్వహించిన వాసవి మాత జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్గరు పాల్గొని వాసవి మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆర్యవైశ్య సమాజానికి ఎలాంటి సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. రామకోటి స్తూప దేవాలయ అభివృద్ధికి గతంలో అన్ని విధాలుగా సహకారం అందించినట్లు తెలిపారు. దేవాలయ విస్తరణకు అవసరమైన స్థలాన్ని కూడా సమకూర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*

Image
 *“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం* హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో “జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు  బండారు సుబ్బారావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంతవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అఖిల భారత నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్  కౌటికె విఠల్  స్పాన్సర్‌గా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా  కౌటికె విఠల్  మాట్లాడుతూ, “విపరీతమైన ఎండల్లో దాహార్తిని తీర్చడం అత్యంత మానవీయమైన సేవ. ఆహారం లేకపోయినా కొంతకా...

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! హర్షం వ్యక్తం చేసిన వనమా వెంకటేశ్వర్లు

Image
 తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! 🌸 తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా "రాష్ట్ర పండుగగా" ప్రకటించింది. ముఖ్య విశేషాలు: 📍 ప్రతి సంవత్సరం "వైశాఖ శుక్ల పక్ష దశమి" నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే ఈ వేడుకలను నిర్వహిస్తుంది. 📍 ఈ ఏడాది ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగగా జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 📍 అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీ వాసవీ మాత జయంతిని అధికారికంగా ప్రకటించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మరియు  ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి కి ఆర్యవైశ్యుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏✨  వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్

Image
 శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు ముడిదుడ్డి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.   ముఖ్యమంత్రి వైశ్య వాసవి మాత పారాయణం నిర్వహించిన ప్రోగ్రామ్ లో వాసవి మాత జయంతి ని పండుగా రోజు గా గుర్తిస్తామన్నారు. అన్న మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రం లోని ఆర్యవైశ్యులు అందరు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కి ధన్యావాదాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్యులకు పిలుపు నిచ్చారు.

ఏసీబీ వలలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ,ఎస్ఐ

Image
 అనంతగిరి: వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ,ఎస్ఐ రాణి ఏసీబీ వలలో చిక్కారు. వివరాలిలా ఉన్నాయి.. తాండూరు పట్టణానికి చెందిన కౌన్సిలర్ ఇర్షాద్ భార్య కుటుంబ గొడవల విషయంపై మహిళా పీఎస్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఇర్షాద్లో పాటు అతని కుటుంబసభ్యులు ఐదుగురిపై కేసు నమోదైంది. దీదీనిపై నోటీసులు తీసుకోవాలంటూ మార్చి 15న పోలీసులు ఇర్షాద్కు ఫోన్ చేశారు. దీంతో అమ్మానాన్న, తమ్ముడిని తీసుకుని 16న పీఎస్కు వచ్చాడు. ఇద్దరు చెల్లెళ్లు రాలేదు. కేసులో ఉన్న ఆరుగురికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు ఇవ్వాలని సీఐ, ఎస్ఐ డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ.40 వేలకు బేరం కుదుర్చుకున్నారు. మార్చి 23వ తేదీన రూ.20 వేల నగదుతో వెళ్లిన ఇర్షాద్ సీఐ సమక్షంలో ఎస్ఐకి డబ్బులు అందజేశాడు. అనంతరం ఇందుకు సంబంధించిన ఆధారాలతో ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ మహిళా పీఎస్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సీఐ, ఎస్ఐని విచారించారు. వీరి ఇళ్లతో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ  తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే టోల్ ...