Posts

రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి!

Image
  రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి! ​ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ప్రజాస్వామ్యంలో విలువలు ఎంత వేగంగా పతనమవుతున్నాయో అర్థమవుతోంది. కేవలం రాజకీయ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కొందరు వామపక్ష భావజాలం ఉన్నవారు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని అత్యంత తక్కువ స్థాయికి (చిల్లర రాజకీయాలు) దిగజార్చడం శోచనీయం. వారి చర్యలు సమస్యను పరిష్కరించకపోగా, వారి సొంత విలువలను వారే పోగొట్టుకునేలా చేస్తున్నాయి. ​ రాజకీయ కోణం.. పిల్లలకు అన్యాయం ​ఒకరిని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే విధానపరంగా పోరాడాలి. కానీ, ఇద్దరు పిల్లల జీవితాలను, వారి స్నేహాన్ని లేదా వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చి వారి భవిష్యత్తును అంధకారం చేయడం ఏ రకమైన రాజకీయం? తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో కేసు పెట్టారో, వారి మధ్య ఉన్న అసలు విషయం ఏమిటో విచారణలో తేలకముందే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం విచారకరం. ​ ముఖ్యమంత్రి నిర్ణయం - 'సిట్' (SIT) ఏర్పాటు ​ఈ కేసులో ఉన్న సున్నితత్వాన్ని మరియు ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో పారదర్...

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు!

Image
 దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు! న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల మరియు గ్లోబల్ సప్లై చైన్ సమస్యల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ₹3, సిఎన్జీ ధరను ₹2 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇది తక్షణ భారంగా అనిపించినా, విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వయంసమృద్ధి సాధించే దిశగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భారీ ప్రణాళికలో ఇది ఒక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకు ఈ నిర్ణయం? - వాస్తవాలు ఇవే: అంతర్జాతీయ అనిశ్చితి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు సంస్థలు నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడటం దేశ ఆర్థిక భద్రతకు అత్యవసరం. కోల్ గ్యాసిఫికేషన్ (Coal Gasification) - మోదీ మాస్టర్ ప్లాన్: విదేశీ చమురు మరియు సహజ వాయువు దిగుమతులను తగ్గించేందుకు ప్రధాని మోదీ 'నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్' ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భారతదేశంలో అపారంగా ఉన్న బొ...

ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ

Image
ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ వరంగల్ (గూఢచారి ప్రతినిధి): వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పూర్వీకుల ఆస్తి మ్యుటేషన్ కోసం ఒక సామాన్యుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గట్టికొప్పుల రాంబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   అసలేం జరిగిందంటే? దుగ్గొండి మండలానికి చెందిన ఒక వ్యక్తి తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి మ్యుటేషన్ ప్రక్రియ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడానికి, ఫీల్డ్ ఎంక్వయిరీ నిర్వహించి సానుకూల నివేదిక సమర్పించడానికి ఆర్‌ఐ రాంబాబు రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. అధికారి వేధింపులు భరించలేక సదరు బాధితుడు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.   మెరుపు దాడి.. పక్కా స్కెచ్ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పక్కా ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రాంబాబు రూ. 10,000 లంచం తీసుకుం...

అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా!

Image
  అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా! ఇప్పటి కాలం “ఫ్రెండ్‌షిప్” అన్న మాటతో మొదలై… “కేసు” దగ్గర ముగిసే పరిస్థితులు వస్తున్నయ్‌. ఒక్క చిన్న తప్పు… ఒక్క అజాగ్రత్త… ఒక్క అర్ధం కాని రిలేషన్… జీవితాంతం మచ్చగా మారుతోంది. ముఖ్యంగా ఇప్పుడు బయట పడుతున్న కొన్ని కేసులు చూసాక తెలంగాణ పొరగాల్లు గుబులు పడుతున్నరు. ఎవరు నిజం… ఎవరు తప్పు… అది కోర్టులు తేల్చాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ — అవగాహన లేకుండా అడుగు వేస్తే… లైఫ్ మొత్తం జైలు గోడల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తది. “ఏజ్” అనేది చిన్న విషయం కాదు రా! “ఆమె ఒప్పుకుంది…” “మేము ప్రేమించుకున్నాం…” “ఇద్దరం కలిసి తిరిగాం…” అన్న మాటలు చట్టం ముందు చాలాసార్లు పనికిరావు. ముఖ్యంగా మైనర్ విషయంలో అయితే చట్టం చాలా కఠినంగా ఉంటది. పొరగాల్లు “ఫన్”, “లవ్”, “టైమ్‌పాస్” అనుకుని తిరిగేది… తర్వాత పెద్ద కేసులుగా మారుతున్నయ్‌. సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు – ప్రమాదకర మలుపులు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్… వాట్సాప్‌లో చాట్… బైక్‌పై షికార్లు… రాత్రి వీడియో కాల్స్… ఇవి ఇప్పుడు చాలామందికి కామన్ అయిపోయినయ్‌. కానీ ఎవరి వయసెంత? ఎవరి ఉద్దేశ్యం ఏంటి? తర్వాత ఏం జరుగు...

మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం

Image
  బండి భగీరథ్ వ్యవహారం: స్నేహం నుంచి కేసుల వరకు… అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిందే మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం హైదరాబాద్:  కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, మీడియా మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే కేసు చుట్టూ బయటకు వస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, భగీరథ్ మరియు ఫిర్యాదు చేసిన యువతి మధ్య పరిచయం ఒక్కరోజులో ఏర్పడినది కాదని తెలుస్తోంది. ఇద్దరూ స్నేహితులుగా తిరిగిన సందర్భాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇరువురి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బండి భగీరథ్‌ను కేసు పెట్టిన యువతి ఇంటికి రానివ్వడం, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కా...

బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ!

Image
  బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ! హైదరాబాద్: సామాన్యుడికి ఆయుధంగా మారాల్సిన సమాచార హక్కు చట్టం (RTI), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్లానింగ్ విభాగంలో మాత్రం పక్కదారి పడుతోంది. పారదర్శకతకు నిలువుటద్దంలా ఉండాల్సిన అధికారులు, అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానాలిస్తూ కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? ప్లానింగ్ సెక్షన్‌లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాల బోర్డు (RTI Disclosure Board) ఎక్కడ ఉందో తెలపాలని ఒక అర్జీదారుడు కోరగా, దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) ఇచ్చిన సమాధానం విస్తుగొలుపుతోంది. "ఎక్కడో కింద ఎక్కడో ఉంది" అంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా, వెటకారంగా సమాధానం ఇచ్చారని బాధితుడు వాపోతున్నాడు. చట్ట ప్రకారం కార్యాలయంలో స్పష్టంగా కనిపించాల్సిన బోర్డుల గురించే స్పష్టత లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఫైళ్ల కదలికలో 'నత్తనడక' అర్జీదారుడి ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 29న దరఖాస్తు చేయగా, అది ఏప్రిల్ 30...

చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం

Image
  *చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం*   *కబేళాకు తరలిస్తుండగా పోలీసుల మెరుపు దాడి*   *లారీ డ్రైవర్ అదుపులో: ముఠా కోణంలో దర్యాప్తు* *నల్లగొండ, గూఢచారి:* జిల్లాలోని చిట్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ గో అక్రమ రవాణాను భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్న సుమారు 60 గోవులను పోలీసులు పట్టుకున్నారు. లారీలో కిక్కిరిసిన స్థితిలో గోవులను అత్యంత అమానవీయంగా తరలిస్తుండగా, చెక్‌పోస్టు వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఊపిరాడని స్థితిలో ఉన్న 60 గోవులను గుర్తించి డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోవుల రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కీలక వివరాలపై డ్రైవర్‌ను గట్టిగా విచారిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గోవులను సురక్షితంగా చింతపల్లి గోశాలకు తరలించి, వాటికి పశువైద్యులతో చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చిట...