Posts

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ

Image
 ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది  మెదక్ ( గూఢచారి) : ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ పట్టణం కు చెందిన శైలజ కు సర్వేనెంబర్ 505/1/2 లో 605 గజాల ఇంటి స్థలం ఉంది. భూమి మ్యుటేషన్ కోసం గత నెలలో దరఖాస్తు చేసింది. కానీ మ్యుటేషన్ కోసం మున్సిపల్ ఆర్ ఐ జానయ్య ను సంప్రదించగా పని చేయలేదు. దీంతో పలు మార్లు అతని వద్దకు వెళ్లిన ప్రయోజనం కలగలేదు. దీంతో విషయం సోదరుడు ధర్మకారి శివకుమార్ కు చెప్పడంతో మున్సిపల్ ఆర్ ఐ వద్దకు వెళ్లి మ్యుటేషన్ చేయాలని కోరగా అందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రభుత్వ అధికారి లంచం అడగడంతో శివకుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ...

మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు

Image
  మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు   హైద్రాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ బై లాకు మరియు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 కు  విరుద్ధంగా జరుగుతున్నందున,  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డాక్యుమెంట్లు  అట్టేస్ట్  చేసి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం క్రింద రిజిస్టర్ ఆఫ్ సొసైటీ హైదరాబాద్ సౌత్ గారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి కి దరఖాస్తు చేసిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాజు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి నుండి ఇప్పటివరకు ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 ప్రకారం గా ఇప్పుడున్న పాలకులు వ్యవహరించారా?  లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించుట కొరకు దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. బైలా మరి అమెండ్మెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001  ప్ర కారం  చేశారా?, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన డాక్యుమెంట్లు ఇచ్చారా?  అందులో ఏవైనా అక్రమాలు జరిగాయా?  అన్న విషయాన్...

Amruta Pranay Case Judgment

Image
 Amruta Pranay Case Judgment

సిటి సివిల్ కోర్టు లో దాఖలైన కేసులో ఆర్డర్ కొరకు ఏప్రిల్ 4 నాటికి వాయిదా

Image
 హైద్రాబాద్:  సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లిఖార్జున్, రేణుకుంట్ల గణేష్ గుప్త, తొడుపునూరి చంద్రపాల్ లను ప్రతివాదులుగా చేరుస్తూ ఎ. వెంకటేశం సిటి సివిల్ కోర్టులో వేసిన కేసు నంబర్ 6/2025 సంభందించిన కేసులో ఎ. వెంకటేశం దాఖలు చేసిన IA No. 1/2025 & IA No. 2/2025 వాటిపై తేది 4-4-2025 నాటికి ఆర్డర్ ల కొరకు వాయిదా పడింది. ఈ ఆర్డర్ ల పైనే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.

Image
  *దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.* ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపెట శివారులో గల ఎం.హెచ్ నగర్ లోని ప్రభుత్వ భూములలో, వరంగల్, కాశిబుగ్గలోని వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్ అనే అతడు సిపిఎం పార్టీ పేరుతో గుడిసెలు వేసి, వాటిని తన ఆధీనంలోకి తీసుకొని, అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ, ఒకటే ఫ్లాట్ ని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్ముతూ అడిగిన వారినీ ఇంకా అదనంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తేనే వారికి అట్టి ప్లాట్ ను అప్పగిస్తానని, అలా కాకుండా అతడు డబ్బులు తీసుకున్న విషయం ఎవరికైనా చెప్పితే చెప్పిన వారిని చంపుతానంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడని తేదీ:20.02.2025 న బాధితులు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన ఇంతేజార్గంజ్ పోలీసులు. ఈరోజు అనగా తేదీ 28.02.2025న సదరు దుబ్బ శ్రీనివాసుని ఆధీనంలోకి తీసుకోనీ, అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది అని ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.

ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి

Image
 ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి ఆదిలాబాద్‌ విద్య & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అధికారుల కథనం ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు బిల్లు మంజూరు చేసే విషయంలో ఆదిలాబాద్‌ విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ సానుకూలంగా వ్యవహరించేందుకు సదరు వ్యక్తి నుండి ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారు. కాగా సదరు వ్యక్తి అభ్యర్థన మేరకు లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు కోరారు.

భూపతి సుశీలమ్మ కు నివాళులు అర్పించిన కాచం సత్యనారాయణ, వనమా వెంకటేశ్వర్లు

Image
  భూపతి  సుశీలమ్మ  కు నివాళులు అర్పించిన   కాచం సత్యనారాయణ,  వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ: భూపతి రవీంద్రనాథ్, భూపతి రాజు, భూపతి లక్ష్మీనారాయణ గార్ల మాతృమూర్తి  కీ.శే.  భూపతి సుశీలమ్మ   12వ రోజు  ఇష్టబంతి కార్యక్రమానికి  హాజరై   నివాళులు   అర్పించిన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు  వనమా వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శులు యామ దయాకర్, బుక్క ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి  లక్ష్మి శెట్టి శ్రీనివాస్,  మాజీ కౌన్సిలర్ గుబ్బ  శ్రీనివాస్,  కాసం  శేఖర్, తల్లం గిరి పాల్గొన్నారు.