*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం*
*“జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి పంపిణీ సేవా కార్యక్రమం ప్రారంభం* హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్రమైన ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో “జలతీర్థం” పేరుతో ఉచిత మంచినీటి బాటిల్స్ పంపిణీ సేవా కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ గ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మహాసభ ముఖ్య సలహాదారు బండారు సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమం కింద తొలి దశలో 20,000 మంచినీటి బాటిల్స్ పంపిణీ చేయబడుతున్నాయి. ఎండాకాలం ముగిసేంతవరకు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహత్తర సేవా కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) అఖిల భారత నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విఠల్ స్పాన్సర్గా ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా కౌటికె విఠల్ మాట్లాడుతూ, “విపరీతమైన ఎండల్లో దాహార్తిని తీర్చడం అత్యంత మానవీయమైన సేవ. ఆహారం లేకపోయినా కొంతకా...