Posts

*ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాలుగో స్తంభం* *జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం :* *రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ*

Image
 *ప్రజాస్వామ్యానికి జర్నలిజం నాలుగో స్తంభం*  *జర్నలిస్టుల హెల్త్ కార్డుల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం :*  *రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ*   *సంగారెడ్డి, జూలై 9 :* ప్రజాస్వామ్య వ్యవస్థకు జర్నలిజం నాలుగో స్తంభమని, వార్తల ప్రసారంలో వేగం ఎంత అవసరమో విశ్వసనీయత అంతకంటే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.  సత్యం, నైతికత, సామాజిక బాధ్యతలను జర్నలిజం ఎల్లప్పుడూ పరిరక్షించాలని ఆయన సూచించారు. గురువారం సంగారెడ్డిలోని టీఎన్‌జీవో భవన్‌లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (TUWJ–IJU) సంగారెడ్డి జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి వేదికగా జర్నలిస్టుల మహాసభ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టులు ప్రజల గొంతుకగా, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొనియాడారు.  వేగవంతమైన సమాచార ప్రసారంతో పాటు వార్తలలో వాస్తవికత, విశ్వసనీయత, నైతిక విలువలు పాటించడం జర్నలిజం యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. జర్న...

దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం – ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ

Image
 దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం – ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఎబివిపి సెమినార్ మిర్యాలగూడ, జూలై 9: జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) మిర్యాలగూడ నగర శాఖ ఆధ్వర్యంలో ఆరోరా, సినాప్సు జూనియర్ కళాశాలల్లో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎబివిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్ తేజ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశిష్ట పాత్ర పోషించిందని అన్నారు. ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమైన ఎబివిపి నేడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు విస్తరించి 78 లక్షల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని తెలిపారు. ఎబివిపి నినాదాలు నేడు దేశ విధానాలుగా మారాయని పేర్కొన్న ఆయన, కాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక నిబంధనల రద్దు కోసం, అక్రమ వలసల నిరోధం కోసం, జాతీయ భద్రత అంశాలపై ఎబివిపి చేపట్టిన ఉద్యమాలు దేశ ప్రయోజనాలకు దోహదపడ్డాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహా పాదయాత్ర, రణభేరి, హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా వ...

మహబూబ్‌నగర్‌లో ఏసీబీ వలలో సర్వే శాఖ సూపరింటెండెంట్

Image
 మహబూబ్‌నగర్‌లో ఏసీబీ వలలో సర్వే శాఖ సూపరింటెండెంట్ గ్రామ మ్యాప్ సవరణ ఫైలు ముందుకు పంపేందుకు రూ.15 వేల లంచం తీసుకుంటూ పట్టుబాటు మహబూబ్‌నగర్, జూలై 8 (గూఢచారి): మహబూబ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ (సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్) కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ (ACB) వలలో చిక్కారు. ఏసీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం, కర్వేన గ్రామం, భూత్పూర్ మండలానికి సంబంధించిన గ్రామ మ్యాప్‌లో సవరణలు చేయించేందుకు ఫైల్‌ను అసిస్టెంట్ డైరెక్టర్‌కు పంపించేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా మహబూబ్‌నగర్ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.15 వేల లంచం నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. అధికార విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొంది. నిందితుడిని అరెస్టు చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదా...

*11 NALA దరఖాస్తులకు ₹70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ACB వలలో

Image
  *11 NALA దరఖాస్తులకు ₹70,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ACB వలలో *నల్గొండ, జూలై 6:* సిద్దిపేట జిల్లా చెరియాల మండల తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ను ACB అధికారులు సోమవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఎలా జరిగింది?*   నాగాపూర్ గ్రామంలో 30 గుంటల భూమికి సంబంధించి సర్వే నంబర్లు 833/B, C, D, E, 834/B, C, D, E పై 11 NALA కన్వర్షన్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి తహసీల్దార్ దిలీప్ నాయక్ ఫిర్యాదుదారుడి వద్ద ₹70,000 లంచం డిమాండ్ చేశారు. ఇందులో 8 దరఖాస్తులు ఇప్పటికే ప్రాసెస్ అయ్యాయి. మిగతా వాటి కోసం డబ్బు అడిగారు.  ఫిర్యాదు అందుకున్న ACB అధికారులు 06.07.2026 నాడు మధ్యాహ్నం 2:40 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో దాడి చేసి, ₹70,000 లంచం డబ్బుతో సహా ఆయనను పట్టుకున్నారు. *కోర్టులో హాజరు*   ACB అధికారులు దిలీప్ నాయక్ ను అరెస్ట్ చేసి, హైదరాబాద్ లోని ACB ప్రత్యేక కోర్టు Hon’ble II Addl. Spl. Judge ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారు వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు. *ప్రజలకు ACB విజ్ఞప్తి*   ఏ ప్రభుత్వ ఉద్యోగి ...

ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్

Image
 ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దు: వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ నల్గొండ: జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తమ మూలాలను, సమాజాన్ని మర్చిపోవద్దని వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ మంచి నడవడిక, సంస్కారం అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు. ఈ ఏడాది వైఆర్పీ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా విద్యార్థులకు రూ.80 లక్షల స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నామని తెలిపారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన 41 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు పంపిణీ చేసినట్లు చెప్పారు. స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, అనంతరం తమలాంటి అవసరమైన విద్యార్థులకు సహాయం చేస్తూ సమాజానికి తిరిగి సేవ చేయాలని సూచించారు. చదువుతో పాటు సంస్కారం, మంచి వ్యక్తిత్వం కూడా పెంపొందించుకోవాలని, కుల, మత, వర్గ భేదాలు లేకుండా ఐక్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాల...

రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు

Image
 రూ.50 కోట్లకు పైగా వసూలు చేసి పరార్.. పోలీసులకు బాధితుల ఫిర్యాదు మల్కాజిగిరి, కుషాయిగూడ భగవాన్ కాలనీకి చెందిన పబ్బా చంద్రశేఖర్ (50)పై సుమారు 80 మంది బాధితులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వివిధ కారణాలు చూపిస్తూ, అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి, వ్యక్తిగత రుణాల పేరుతో మొత్తం రూ.50 కోట్లకు పైగా సేకరించి పరారైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ప్రకారం, పబ్బా చంద్రశేఖర్ గత 30 ఏళ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్‌గా వ్యాపారం నిర్వహించడమే కాకుండా ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ (AIVF) ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. తన కుమార్తె వివాహం, తండ్రి వైద్యం, ఇల్లు నిర్మాణం, సిమెంట్ కంపెనీల ప్రత్యేక పథకాలు, జీఎస్టీ చెల్లిస్తే భారీ మొత్తం విడుదల అవుతుందని వంటి వివిధ కారణాలు చూపించి పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు ఆరోపించారు. జూన్ 22 నుంచి ఆయన మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్‌లో ఉండగా, భార్యతో కలిసి కనిపించకుండా పోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. వెళ్లే ముందు ఇద్దరు కుమార్తెలను తన తమ్ముడి ఇంట్లో వదిలి వెళ్లారని, స్విట్జర్లాండ్‌కు వెళ్లారని తప్పుడు సమాచారం ఇచ్చ...

నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

Image
  నల్లగొండ నారాయణ స్కూల్‌లో విద్యార్థిపై దాడి అమానుషం: బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు నల్లగొండ: నల్లగొండలోని నారాయణ స్కూల్‌లో ఒకటో తరగతి విద్యార్థిపై జరిగిన దాడి అత్యంత అమానుషమని బీజేపీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులపై దాడులు చేయడం నారాయణ స్కూల్‌లో పరిపాటిగా మారిందని ఆరోపించారు. బ్రాండ్ పేరుతో విద్యను వ్యాపారంగా మార్చి, అర్హత లేని వ్యక్తులను అధ్యాపకులుగా నియమిస్తున్నారని, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాల కొనుగోలులోనూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని పేర్కొన్న ఆయన, ఈ ఘటనపై సంబంధిత అధికారుల ద్వారా సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, నారాయణ స్కూల్‌కు సంబంధించిన అనుమతులను తక్షణమే సమీక్షించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘ...