Posts

*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు*

Image
*“పర్యావరణ పరిరక్షణ నైతిక బాధ్యత” – సనత్నగర్లో మంత్రి కొండా సురేఖ పిలుపు* *హైదరాబాద్:* “పర్యావరణ పరిరక్షణ ఒక నైతిక బాధ్యత. ప్రతి ఒక్కరూ సుస్థిర పద్ధతులను అవలంబించాలి. మనం మన ప్రకృతి మాతను కాపాడుకోవాలి. అడవుల నరికివేత, వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి, ధాన్యం దిగుబడి తగ్గడం వల్ల ఆకలి పెరగడం వంటివన్నీ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే జరుగుతున్నాయి. చికిత్స కన్నా నివారణే మేలు”   ఇదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్లోని TGPCB ప్రధాన కార్యాలయంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రి *శ్రీమతి కొండా సురేఖ* చేసిన వ్యాఖ్యలు. ఐక్యరాజ్యసమితి ఈ ఏడాది ఇతివృత్తంగా ప్రకటించిన *“వాతావరణ చర్య”*పై ఆమె ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని నొక్కి చెప్పారు. కార్యక్రమానికి EFS&T ముఖ్య కార్యదర్శి *శ్రీ అహ్మద్ నదీమ్*, TGPCB బోర్డు సభ్యులు *సి. సత్యనారాయణ రెడ్డి*, ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్సార్టియం అధ్యక్షురాలు *టి. విజయలక్ష్మి*, JNTU-హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ తదితరులు హాజరయ్యారు. *2047 నాటికి 250 కోట్ల మొక్కలు*   EFS&T ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్ మాట్ల...

రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి

Image
  రసాయన కాలుష్యంపై అంతమ్మగూడెం వాసుల పోరాటం  - స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ కు వినతి కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పీకర్ హామీ మద్దతుగా నిలిచిన ప్రముఖ పర్యావరణవేత్తలు పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ లోని పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని రసాయన పరిశ్రమల వల్ల స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర కాలుష్య సమస్యలపై "అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి" సమరశంఖం పూరించింది. హజేలో తదితర పరిశ్రమల నుండి వెలువడుతున్న రసాయన వ్యర్థాల వల్ల పీల్చే గాలి, త్రాగే నీరు, తినే పంటలు, భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయి గ్రామంలో జీవనం అస్తవ్యస్తంగా మారిందని, ఆరోగ్యం క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమితి సభ్యులు బుధవారం శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ గ్రామాన్ని కాలుష్యం బారి నుండి కాపాడాలని వేడుకున్నారు. ప్రముఖ పర్యావరణవేత్తలు కుంభం పురుషోత్తం రెడ్డి, దొంతి నరసింహారెడ్డి ల సహకారంతో స్పీకర్‌కు ఓ సమగ్ర వినతిపత్...

# అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ!

Image
  ## అంబర్‌పేటలో ఘోరం: మహిళ మెడలోంచి 2.5 తులాల బంగారు గొలుసు అపహరణ! **హైదరాబాద్, జూన్ 2 (గూఢచారి ప్రతినిధి):** రాజధాని నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలే నివాస గృహాల వద్దే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ### అసలేం జరిగిందంటే..? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దుర్గాబాయి దేశ్‌ముఖ్ కాలనీలోని 'వేదశ్రీ అపార్ట్‌మెంట్‌'లో నివసించే శ్రీమతి రత్నమాల అనే మహిళ మంగళవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఆమె అపార్ట్‌మెంట్‌ లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో, అప్పటికే అక్కడ పొంచి ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి కాలినడకన ఆమె వద్దకు వచ్చాడు. సదరు వ్యక్తి రత్నమాలతో మాటలు కలుపుతూ నమ్మించడమే కాకుండా, ఆమె ఏమరపాటుగా ఉన్న సమయాన్ని చూసి ఒక్కసారిగా మెడలోని బంగారు గొలుసును తెంచుకుని వేగంగా పారిపోయాడు. అపహరణకు గురైన గొలుసు బరువు సుమారు **2.5 తులాలు** ఉంటుందని బాధితురాల...

*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు*

Image
*అమెరికాలో ఘనంగా టీసీఏ వనభోజనాలు, తెలంగాణ ఆవిర్భావ వేడుకలు* *కుపర్టినో, కాలిఫోర్నియా, మే 31, 2026:* శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని కుపర్టినోలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో వార్షిక వనభోజనాలు సమ్మర్ పిక్నిక్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. వందలాది కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. *తెలంగాణ రుచులు అమెరికాలో:*   ఈ వనభోజనాల్లో ఇంటి వంటకాల పాట్‌లక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ నుండి ప్రత్యేకంగా విమానంలో తెప్పించిన సకినాలు అందరినీ అలరించాయి. అక్కడికక్కడే వేడివేడిగా తయారుచేసిన సర్వపిండి, దానితో పాటు నిలోఫర్ స్టైల్ ఇరానీ చాయ్ కాంబినేషన్ పాల్గొన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాదీ వంటకాలు, సమోసాలు, ఇతర చిరుతిళ్లతో వేడుకకు తెలంగాణ శోభ సంతరించుకుంది. *వాలంటీర్ల సేవలకు ప్రశంసలు:*   TCA సౌత్ బే నాయకత్వ బృందం అంజనేయులు పి, గోపీకృష్ణ జి, శ్రీధర్ జి లతో పాటు అనంత్ ఎ, అశోక్ సి, భాస్కర్ ఎం, సుధీర్ జి, మాధవ్ కె, రాజ్‌కుమార్ ఎం, సతీష్ ఎ, ఉదయ్ జె, యా...

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

Image
  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అందించిన సహకారం మాదిరిగానే, ఇకపై రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తన బాధ్యతల నిర్వహణలో కూడా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి, సంఘ బలోపేతం మరియు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మరింత కృషి చేస్తానని వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. .

సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

Image
  సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం) సిగరెట్ మానెయ్ బిడ్డా.. ఏమండి స్మోకింగ్ మనరా.?! ప్లీజ్  నాన్నా..స్మోకింగ్ కిల్స్ యూ.. నాన్న. ఈ మాటలు..విని,విని  ఆ అలవాటు మనలేక గోడకు ఫోటో ఐ"పోయే" బదులు.. ఒక్క క్షణం మనల్ని ప్రాణం గా.. ప్రేమించే వారి కోసం.. సిగరెట్ అలవాటు ను జీవితం లో నుంచి విసిరి అవతల పారెయ్యండి. పొగాకు, సిగరెట్ మానడం కష్టం కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఒక రోజు సిగరెట్ లేకుండా ఉండగలిగితే, ఒక వారం కూడా ఉండగలరు. ఒక వారం గడిస్తే, ఒక జీవితం గెలవగలరు. మీ పిల్లల కోసం… మీ తల్లిదండ్రుల కోసం… మీ భార్య కోసం… ముఖ్యంగా — మీ ప్రాణం కోసం. సిగరెట్ వెలిగించినప్పుడు మనం కేవలం పొగను కాదు…మన జీవిత కాలాన్ని కాలుస్తున్నాం. పొగాకు మొదట అలవాటుగా వస్తుంది… తర్వాత అవసరంగా మారుతుంది… చివరికి మనిషిని నిశ్శబ్దంగా మరణం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ *World No Tobacco Day* సందర్భంగా మనమందరం ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి: “పొగాకు కాదు… ప్రాణమే ముఖ్యం.” ఎందుకంటే — ఒక సిగరెట్ ఆర్పేస్తే ఒక జీవితం వెలుగుతుంది. చివరిగా ఏమంటే సరదా అంటూ సిగరె...

"ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు"

Image
  "ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”  హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) ప్రధమ మహిళ  శ్రీమతి ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”.  సామాజిక సేవా రంగంలో మరియు మహిళా సాధికారత కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అమీర్‌పేటలోని AAA సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” వేడుకలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: ఉప్పల స్వప్న పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. "నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుతో సమాజం పట్ల నా బాధ్యత మరి...