Posts

*మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*

Image
 *మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*   *మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ*   *రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు* *హైదరాబాద్:* తెలంగాణ అభివృద్ధి రథసారథి, ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైఎం నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తూ రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కోరారు.  తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా కాజీపేట-విజయవాడ మూడవ రైల్వే లైన్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో రూ. 3,175 కోట్ల నేషనల్ హైవే పనులు, మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రగతి కానుకలను ప్రధాని మోదీ మోసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లు కేటాయించిందని, సుమారు 3.40 క...

*భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

Image
   *భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*   *హైదరాబాద్‌లో 30% వార్షిక వృద్ధి - ఎగుమతుల్లో 103% సీఏజీఆర్*   *2030 నాటికి రూ.3 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం* *హైదరాబాద్:* భారత రక్షణ రంగంలో హైదరాబాద్ దేశానికి 'నరాల కేంద్రం'గా ఎదిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగం ఏటా 30% పైగా వృద్ధి నమోదు చేస్తోందని, 2024 నుంచి 2026 మధ్య ఎగుమతులు ఏకంగా 103% సీఏజీఆర్‌తో దూసుకుపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఏరోస్పేస్, రక్షణ సరఫరా వ్యవస్థలో ఇప్పటికే 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు క్రియాశీలంగా ఉన్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0 సదస్సులో కీలకోపన్యాసం చేసిన మంత్రి, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు స్థాయి నుంచి 100కు పైగా దేశాలకు రక్షణ పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. ఈ వృద్ధికి కాంగ్రెస్ పాలన తొలి సంవత్సరాల నుంచే రక్షణ వ్యవస్థ అభివృద్ధిపై పెట్టిన ప్రత్యేక దృష్టే కారణమని అన్నారు. వరుస ప్రభుత్వాల కృషి వల్ల దేశ రక్షణ అవసరాల్...

*రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*

Image
   *రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*   *హైదరాబాద్:* రిటైర్డ్ డీజీపీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తనూజ గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది నేపాలి గ్యాంగ్ పనిగా అంచనా వేస్తున్నామని, కొన్ని కీలక క్లూస్ లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేని సమయంలో దుండగులు వెనుక గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, పిల్లలు ఇద్దరూ పై అంతస్తులో ఉన్నారు. దుండగులు ఆమె చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసి, అనంతరం వెనుక మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళ బయటి వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి సహకరించినట్లు సీపీ వెల్లడించారు. మాజీ డీజీపీ తన తల్లి అనారోగ్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఆమె మరణించడంతో మృతురాలు తనూజ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎంత బంగారం, నగదు చ...

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం

Image
 ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం హైద్రాబాద్, గూఢచారి డెస్క్:  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్‌ను సంస్థ గ్లోబల్ చైర్మన్ టీ.జీ. వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన టీ.జీ. వెంకటేష్, కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వెయ్యిమందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజపట్ల అంకితభావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కౌటికే...

*"మిర్యాలగూడ మున్సిపల్‌లో ఏసీబీ పంజా - అవినీతి గుట్టు రట్టు!"*

Image
 *"మిర్యాలగూడ మున్సిపల్‌లో ఏసీబీ పంజా - అవినీతి గుట్టు రట్టు!"*   *డీఎస్పీ జగదీష్ చందర్ సారథ్యంలో మెరుపు దాడులు - రికార్డులు సీజ్*   *భవన అనుమతులు, పన్నుల వసూళ్లలో 'కమీషన్ల కుంభకోణం'?*   *ఉద్యోగుల్లో వణుకు - మధ్యవర్తుల్లో పరుగులు* *మిర్యాలగూడ:* అభివృద్ధి పేరుతో అందినకాడికి దండుకుంటున్న మున్సిపల్ అవినీతిపై ఏసీబీ కొరడా ఝళిపించింది. గురువారం ఉదయం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. అధికారుల ఆకస్మిక ఎంట్రీతో కార్యాలయంలో కలకలం రేగింది. *ఎందుకు దాడులు?*   భవన నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అవినీతి జరుగుతోందనే పక్కా సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 'అనుమతి కావాలంటే చేతులు తడపాల్సిందే' అనే స్థాయికి మున్సిపల్ వ్యవస్థ దిగజారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. *గంటల తరబడి తనిఖీలు - రికార్డుల గాలం*   ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ బృందం వివిధ విభాగాల్లో కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించింది. కొంతమంది ఉద్యోగులను పక్కకు తీసు...

*పర్యావరణ రక్షణకు 'గ్రీన్ సెల్యూట్' - టీజీపీసీబీ ఉత్తమ అవార్డులు ప్రకటన*

Image
*పర్యావరణ రక్షణకు 'గ్రీన్ సెల్యూట్' - టీజీపీసీబీ ఉత్తమ అవార్డులు ప్రకటన*   *జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం*   *9 కేటగిరీల్లో విజేతలకు సత్కారం - పాఠశాలల నుంచి పరిశ్రమల వరకు*  *"గూఢచారి" గ్రీన్ డెస్క్*   *హైదరాబాద్:* పరిశుభ్రమైన, పచ్చని తెలంగాణ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు 'గ్రీన్ సెల్యూట్' చెప్పేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) సిద్ధమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'రాష్ట్ర ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డులు-2026'ను ప్రకటించింది. *ఎవరెవరికి అవార్డులు?*   పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత కోసం విశేష కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల లక్ష్యం. ముఖ్యంగా 4 రంగాల్లో అద్భుత పనితీరు కనబరిచిన వారికి ఈ అవార్డులు దక్కనున్నాయి:   1. *కాలుష్య నియంత్రణ చర్యలు*   2. *సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన*   3. *ఘన & ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ*   4. *సుస్థిర అభివృద్ధి ఉత్తమ పద్ధతులు* *9 కేటగిరీల్లో పోటీ:*   టీజీపీస...

*భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*

Image
*"చెట్టు పేరుతో కోట్ల దోపిడీ.. అడవి తల్లిని అమ్ముకుంటున్న అధికారులు!"*   *భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*   *"కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు" - కాంట్రాక్టర్‌తో బేరం*   *అటవీ శాఖలో అవినీతి కుళ్ళు - ఏసీబీ దెబ్బకు బట్టబయలు* *భద్రాద్రి కొత్తగూడెం:* అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే అడవి తల్లిని అమ్ముకుంటున్నారు. చెట్లు నరికితే కేసులు పెట్టాల్సిన వాళ్లే, లంచం కోసం కేసులు ఎత్తేస్తున్నారు. భద్రాచలంలో ఏసీబీ దాడులతో అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతి కంపు మరోసారి బయటపడింది. *అసలు ఏం జరిగింది?*   చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా పొరపాటున కొన్ని చెట్లకు నష్టం జరిగింది. ఇదే అదనుగా భావించిన భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కాంట్రాక్టర్‌తో బేరానికి దిగింది. *"10 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తా" - ఎఫ్‌డీవో బెదిరింపు*   చెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో ఎఫ్‌డీవో సుజాత ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.3.5 లక్షలకు బేరం కుదిరింది. గు...