Posts

*నియామకాల్లో వివక్షను సహించబోం ... మాదిగ న్యాయవాదులు*

Image
   *నియామకాల్లో వివక్షను సహించబోం ...  మాదిగ న్యాయవాదులు*  Nalgonda, Gudachari: 10/4/2026 న సాయంత్రం 5గంటలకు నల్గొండ జిల్లా మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం *బంధువుల జాడ* పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నల్గొండ మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు తెలంగాణ హైకోర్టు ఎక్స గవర్నమెంట్ ప్లీడర్ కొమ్ము ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని న్యాయశాఖ మొదలు జిల్లాలో గల అన్నీ ప్రభుత్వ శాఖల్లో మరియు బ్యాంకుల్లోను న్యాయవాదులచే చేపట్టే  GP, AGP, APP, standing councils, penal Advocates నియమాకాల్లో మాదిగ న్యాయవాదులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ( MAA ) రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  *కొమ్ము ప్రవీణ్ కుమార్* చీఫ్ అడ్వవైజర్  *లాయర్ మల్లన్న* కార్యదర్శి ఈ కార్యక...

మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు

Image
  మహాసభ రికార్డులు ఇప్పించాలని rti దరఖాస్తు చేసిన భూపతి రాజు & 13 మంది ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ప్రక్షాళన కమిటీ సభ్యులు హైదరాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ బ్యాలెన్స్ కొందరు 3కోట్లు అని, కొందరు 6 కోట్లు అని, ఇంకొందరు 11 కోట్లు ఉండాలి అంటున్న వార్తల మేరకు విషయములో ఏది నిజమో తెలవాలంటే రికార్డులు బహిర్గతం కావాల్సిందేనని ఆర్యవైశ్య జర్నలిస్టు భూపతి రాజు అంటూ  సమాచారం కొరకు తాను rti దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.  సభ్యత్వ రుసుము లో జిల్లాలకు ఇవ్వవలసిన వాటాలు దాదాపు 11 సంవత్సరాల నుండి ఇవ్వడం లేదనీ. ఉమ్మడి మహాసభ నుండి పంచుకున్న విద్యానిధి నుండి స్కాలర్షిప్ ఇవ్వలేదని, సేవా కార్యక్రమాలు కూడా చేసిన దాఖలాలు లేవనీ ఆయన అన్నారు, వసూలైన సభ్యత్వం రుసుము భద్రంగా ఉందా, పంచుకున్న నిధులు, విద్యా నిధి నిలువలు ఉన్నాయా? లేక ఖర్చుల క్రింద ఆవిరి అయ్యాయా? అన్న విషయం ఆర్యవైశ్యులకు ముఖ్యంగా సభ్యులకు తెలవలసి ఉందని తెలిపారు. రికార్డులు బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు.  ఆయనతో పాటు ఆర్యవైశ్య నాయకులు 13 మంది కూడా rti దరఖాస్తు చేశారు. దరఖాస్తు చేసిన వారిలో మాజీ జిల్లా అధ్య...

వాయు & వాహన కాలుష్యంపై అవగాహన కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు

Image
వాయు & వాహన కాలుష్యంపై అవగాహన  కొరకు టీజీపీసీబీని సందర్శించిన నార్సింగి గీతాంజలి వేదిక  9వ తరగతి విద్యార్థులు హైదరాబాద్:  నార్సింగి లోని గీతాంజలి వేదిక 9వ తరగతి విద్యార్థులు, పర్యావరణ కాలుష్యం, వాయు కాలుష్యo, మరియు వాహన కాలుష్యం నియంత్రణ పై అవగాహన కల్పించేందుకు విద్యా పర్యటనలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి టీజీపీసీబీని ను సందర్శించారు. ఈ సందర్భంగా  టీజీపీసీబీ సీనియర్ సోషల్ సైంటిస్ట్ డా. డబ్ల్యూ.జి . ప్రసన్న కుమార్ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలైన నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ ఉద్గారాలు, బెంజీన్, ఓజోన్ వంటి కాలుష్య కారకాలు ఊపిరితిత్తుల వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని వివరించారు. కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, పరిష్కార మార్గాలను కూడా వివరించారు. వాయు  కాలుష్యానికి దారితీసే నాలుగు ముఖ్య కారణాలుగా వాహనాలను అవసరం లేకుండా ఆన్‌లో ఉంచడం, రోడ్ల దుస్థితి, ఇంజిన్ నాణ్యత లోపాలు మరియు సరైన నిర్వహణ లేకపోవడం, కల్తీ పెట్రోల్ వినియోగం గురించి విద్యార్థులకు తెలియజేశారు. టీజీపీసీబీ పర్యావరణ శాస్త్రవేత్త జె. సుమతి విద్యార్థులకు చెత...

ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్.

Image
 ఏసీబీ వలలో చిక్కుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్. హైద్రాబాద్:  ఏసీబీ వలలో చిక్కుకున్న ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్ట్, హైదరాబాద్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్. 07.04.2026న, ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు చెందిన ఏఓ-1 శ్రీ యు.కె. సిద్దేశ్వర్, ఎస్.ఎల్. పోలీస్ మరియు ఏఓ-2 శ్రీ సంపతి కనకయ్య, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రంగారెడ్డి రేంజ్ యూనిట్ చేత పట్టుబడ్డారు. వారు ఒక అధికారిక సహాయం చేస్తామన్నందుకు, అంటే "ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్, శంషాబాద్ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడం మరియు ఫిర్యాదిదారుని కుటుంబ సభ్యులను అరెస్టు చేయకుండా, ఈ కేసులో ఇరికించకుండా ఉండటం" కోసం, ఫిర్యాదిదారుని నుండి రూ. 5,00,000/- లంచం డిమాండ్ చేసి, డిమాండ్ చేసిన లంచంలో భాగంగా రూ. 2,00,000/- లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.  AO-2 నివాసంలో జరిపిన సోదాల ఫలితంగా రూ.33,97,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని ఆస్తి పత్రాలు కూడా లభ్యమయ్యాయి, వాటిపై దర్యాప్తు జరుగుతోంది. అందువల్ల, ఏఓలను అరెస్టు చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలో...

అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది!

Image
 అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తులకి ఇంకా గడువు ఉన్నది! తొందర పాటు తో తప్పులు చేయొద్దు! టీయూ డబ్ల్యూ జే జిల్లా నేతలు  సంగారెడ్డి : అక్రెడిటేషన్ కార్డు దరఖాస్తుల కు సంబంధించి సోమవారం వరకే గడువు అనేది పూర్తిగా అవాస్తవం అని టీ యు డబ్ల్యూ జే (ఐ జె యు) రాష్ట ఉపాధ్యక్షుడు ఎం ఎ కే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి అసిఫ్ పేర్కొన్నారు. ఇంకా జిల్లా స్థాయిలో అక్రెడిటేషన్ కమిటీలు ఏర్పాటు కాలేదని వారన్నారు. ఈ కమిటీ ఏర్పాటు కావడానికి సమయం పడుతుందని అన్నారు. కమిటీ ఏర్పాటు అయిన తర్వాత సమావేశం జరగడానికి మరో రెండు మూడు రోజులు పడుతుంది అని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో కూడా కమిటీ సమావేశం జరిగి, కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అర్హులైన జర్నలిస్టు మిత్రులందరికీ కార్డులు వచ్చే విధంగా కొన్ని గైడ్ లైన్స్ రాబోతున్నాయని చెప్పారు. ఈ కారణంగా దరఖాస్తు చేసుకునే గడువు ఇంకా ఉన్నదని స్పష్టం చేశారు. జర్నలిస్టు మిత్రులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. అందరూ ఒకటే సారి దరఖాస్తు ...

*ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం*

Image
  *ఐక్య పోరాటమే ఇండ్ల స్థలాల సాధనకు మార్గం* - పాత్రికేయుల హక్కుల కోసం పోరాటం  – సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి ఖమ్మం, ఏప్రిల్ 03 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను ఇకపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేయరాదని, ఇది కేవలం కొందరి వ్యక్తిగత అవసరం కాదని, మొత్తం పాత్రికేయ వర్గ భద్రత, జీవన హక్కులకు సంబంధించిన కీలక అంశమని టిడబ్ల్యూజెఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ టి.ఎస్. చక్రవర్తి స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిరోజూ వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులకే కనీస గృహ భద్రత లేకపోవడం దురదృష్టకరమని, 'కలం పట్టే చేతులకు కనీస స్థలం కూడా దక్కకపోతే అది వ్యవస్థ వైఫల్యానికి ప్రత్యక్ష నిదర్శనం' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశం అనేది ఒక్కో వ్యక్తి కోరిక కాదని, ఇది వృత్తి గౌరవాన్ని కాపాడే హక్కు పోరాటమని ఆయన పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం నిర్వహించిన పలు ఆందోళనలు, వినతిపత్రాల కార్యక్రమాలు, దీక్షలు, నిరసనల్లో తాను ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేశారు. ఇటీవల నిర్వహించిన రిలే నిరాహార దీక్షల్లో ఒ...

ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన

Image
  ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల TGPCB సనత్నగర్ సందర్శన హైద్రాబాద్:  నాగర్కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం మరియు విపత్తు నిర్వహణ) కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సనత్నగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా  పి. శరత్, పర్యావరణ శాస్త్రవేత్త, విద్యార్థులతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు మరియు సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ప్రాక్టికల్ ఎక్స్పోజర్లో భాగంగా విద్యార్థులను TGPCB ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు మరియు నీటి కాలుష్య స్థాయులను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పర...