Posts

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

Image
IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన హైదరాబాద్, జూన్ 27: ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ (IVF) తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ జనరల్ సెక్రటరీగా ఉన్న పబ్బా చంద్రశేఖర్, మహిళా విభాగం అడ్వైజర్‌గా ఉన్న ఆయన సతీమణి పబ్బా స్వప్నలను వారి పదవుల నుంచి తొలగించినట్లు అధికారికంగా ప్రకటించింది. శనివారం (జూన్ 27, 2026) నుంచి అమల్లోకి వచ్చేలా వారిని సంస్థ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా తొలగించినట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం రాష్ట్ర గవర్నింగ్ బాడీ తీర్మానం మేరకు "కొన్ని అనివార్య కారణాల వల్ల" తీసుకున్నట్లు వెల్లడించింది.  అంతేకాకుండా, పబ్బా చంద్రశేఖర్‌ను IVF బెనారస్ ఆనంద నిలయం–వారణాసి మేనేజింగ్ ట్రస్టీ, అలాగే వాసవి ఆనంద నిలయం–తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ బాధ్యతల నుంచి కూడా తొలగించినట్లు తెలిపింది. ఈ ప్రకటనపై సెంట్రల్ కమిటీ ఛైర్మన్ అడ్వైజరీ బోర్డ్ గంజి రాజమౌళి గుప్తా, IVF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంతకాలు చేశారు.

జూలై 9న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ - జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విష్ణు

Image
  జూలై 9న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ  - జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి, విష్ణు సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజేఐజేయు) మహాసభ వచ్చే నెల 9వ తేదీన సంగారెడ్డి లోని టీఎన్జీవో భవన్ లో జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా అర్హులైన వారికి ఇంటి స్థలం తో పాటు హెల్త్ కార్డును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ, జర్నలిస్టులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన వారందరికీ కూడా అక్రిడేషన్ కార్డులను జారీ చేయాల్సిందిగా తమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని వివరించారు. ఈ సమస్యలన్నింటిపై చర్చించడానికి జిల్లా మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు. జూలై 9న ఉదయం 11 గంటలకు మహాసభ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్ తో పాటు సంఘం రాష...

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశంలో అన్ని ఎజెండా అంశాలకు ఆమోదం - సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ హైదరాబాద్, జూన్ 27: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అధ్యక్షుడు అమరావాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముందుగా గత సమావేశాల తీర్మానాలను ధృవీకరించడంతో పాటు సంస్థ పరిపాలన, సభ్యత్వ విస్తరణ, జిల్లా కమిటీల ఏర్పాటు, మహాసభ భవిష్యత్ కార్యాచరణ, ఆర్థిక వ్యవహారాలు, సేవా కార్యక్రమాలు, సంస్థ బలోపేతానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సమావేశ ఎజెండాలో పొందుపరిచిన మొత్తం 15 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సీనియర్ ఉపాధ్యక్షుడు ఊరే లక్ష్మణ్ తెలిపారు. అలాగే జూలై 4న నిర్వహించనున్న మహాసభ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ఏర్పాట్లు, సభ్యత్వ నమోదు, జిల్లా కమిటీల బలోపేతం, వివిధ సేవా కార్యక్రమాల అమలుకు సంబంధించిన నిర్ణయాలను కూడా కార్యవర్గం ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. సంస్థ అభివృద్ధి, ఆర్యవైశ్య సమాజ సంక్షేమం, రాష్ట్రవ్యాప్తంగా మహాసభ కార్యకలాపాల విస్తరణకు ఈ సమ...

*డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!* *2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్*

Image
 *డ్రగ్స్‌పై యుద్ధానికి నల్గొండ పరుగులు..!*   *2కే రన్‌లో యువతతో కలిసి పరుగెత్తిన కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్* *నల్గొండ:* "డ్రగ్ ఫ్రీ నల్గొండ – డ్రగ్ ఫ్రీ తెలంగాణ" లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో  శనివారం నల్గొండలో భారీ 2కే రన్ నిర్వహించారు. ఎన్జీ కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు జరిగిన ఈ రన్‌లో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ యువతతో కలిసి పరుగెత్తారు. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలకు "నో", ఆరోగ్యవంతమైన జీవితానికి "యెస్" అంటూ యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ విక్రయాలు, అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, సమాజానికి చేటు తెస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూ...

గూఢచారి - జూన్ 2026

Image
  ఈ క్రింది లింక్ టచ్ చేసి గూఢచారి జూన్ 2026 చదవండి https://heyzine.com/flip-book/56c79eec77.html https://heyzine.com/flip-book/56c79eec77.html

*ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*

Image
 *ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం: ఏబీవీపీ*   *ఎంజీయూలో కాగడాల ర్యాలీ నిర్వహించిన ఏబీవీపీ శ్రేణులు*   *నల్గొండ:* పది తొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీన దేశంలో విధించిన అత్యవసర పరిస్థితి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి పేర్కొన్నారు.  ఎమర్జెన్సీకి నిరసనగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం కాగడాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనేశ్వర్ చారి మాట్లాడుతూ అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాసిందని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛను అణచివేసి, రాజకీయ ప్రత్యర్థులను అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించిందని తెలిపారు.  ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించే హక్కు, ప్రజాస్వామ్య విలువలు ఆ కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేలాది మంది ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థి నాయకులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ ...

మత్తు ను చిత్తు చేయండి యువత కు "మాచన" పిలుపు

Image
 మత్తు ను చిత్తు చేయండి యువత కు "మాచన" పిలుపు గంజాయి,డ్రగ్స్ ..ఇలా వివిధ రూపాల్లో లభించే మత్తు పదార్గాలకు అలవాటు కాకుండా యువత తమ బలహీనత ను చిత్తు చేయాలని టుబాకో కంట్రోల్ హీరో అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్. పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. గాంజా చాక్లేట్ ల ను విద్యార్ధుల కు విక్రయించే ముఠా ను పోలీసులు పట్టుకున్న ఉదంతం దరిమిలా..రఘునందన్ మానవీయ కోణంలో స్పందిస్తూ..గాంజా.. మాత్రమే గాక మాదక ద్రవ్యాల నుంచి కూడా రాష్ట్రాన్ని విముక్తి చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని, ఇది ఓ రకంగా యువత ను ఓ గొప్ప "ఆయుధం"గా.. తమ ను తాము మలచుకునేలా చేస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.విద్యార్థులు,యువత మత్తు కు లోనై ను నిర్వీర్యం కావటం అవాంఛనీయమన్నారు. ముఖ్యంగా కార్పొరేట్ పాఠాశాల ల్లో చదివే విద్యార్థుల కు అవసరానికి మించి పాకెట్ మనిని వారి తల్లి దండ్రులు ఇవ్వటం కూడా పిల్లలు చెడు అలవాట్ల కు దగ్గర కావడం దోహదపడేలా ఉంటుంది. టీనేజర్స్ సాధారణం గా మత్తు కు బానిస అవుతుంటారు.అందుకే యుక్త వయస్సు...