Posts

రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు

Image
  రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం.. అందరికీ వనమా వెంకటేశ్వర్ల కృతజ్ఞతలు నల్గొండ: రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా వనమా వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో అందించిన సహకారం మాదిరిగానే, ఇకపై రాష్ట్ర ఉపాధ్యక్షునిగా తన బాధ్యతల నిర్వహణలో కూడా నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నాయకులు, సభ్యులు అందరూ సహకరించాలని ఆయన కోరారు. ఆర్యవైశ్య సమాజ అభ్యున్నతి, సంఘ బలోపేతం మరియు సామాజిక సేవా కార్యక్రమాల కోసం మరింత కృషి చేస్తానని వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. .

సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం)

Image
  సిగరెట్ మానెయ్..బిడ్డా.! *ఒక చిన్న నిర్ణయం…ఒక పెద్ద మార్పు* (మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం) సిగరెట్ మానెయ్ బిడ్డా.. ఏమండి స్మోకింగ్ మనరా.?! ప్లీజ్  నాన్నా..స్మోకింగ్ కిల్స్ యూ.. నాన్న. ఈ మాటలు..విని,విని  ఆ అలవాటు మనలేక గోడకు ఫోటో ఐ"పోయే" బదులు.. ఒక్క క్షణం మనల్ని ప్రాణం గా.. ప్రేమించే వారి కోసం.. సిగరెట్ అలవాటు ను జీవితం లో నుంచి విసిరి అవతల పారెయ్యండి. పొగాకు, సిగరెట్ మానడం కష్టం కావచ్చు. కానీ అసాధ్యం కాదు. ఒక రోజు సిగరెట్ లేకుండా ఉండగలిగితే, ఒక వారం కూడా ఉండగలరు. ఒక వారం గడిస్తే, ఒక జీవితం గెలవగలరు. మీ పిల్లల కోసం… మీ తల్లిదండ్రుల కోసం… మీ భార్య కోసం… ముఖ్యంగా — మీ ప్రాణం కోసం. సిగరెట్ వెలిగించినప్పుడు మనం కేవలం పొగను కాదు…మన జీవిత కాలాన్ని కాలుస్తున్నాం. పొగాకు మొదట అలవాటుగా వస్తుంది… తర్వాత అవసరంగా మారుతుంది… చివరికి మనిషిని నిశ్శబ్దంగా మరణం వైపు నడిపిస్తుంది. అందుకే ఈ *World No Tobacco Day* సందర్భంగా మనమందరం ఒక మాట మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి: “పొగాకు కాదు… ప్రాణమే ముఖ్యం.” ఎందుకంటే — ఒక సిగరెట్ ఆర్పేస్తే ఒక జీవితం వెలుగుతుంది. చివరిగా ఏమంటే సరదా అంటూ సిగరె...

"ఉప్పల స్వప్న గారికి ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు"

Image
  "ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మక “ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”  హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ (IVF) ప్రధమ మహిళ  శ్రీమతి ఉప్పల స్వప్న కు ప్రతిష్టాత్మకమైన “కళావేదిక ఎన్టీఆర్ సేవా రత్న అవార్డు”.  సామాజిక సేవా రంగంలో మరియు మహిళా సాధికారత కోసం ఆమె అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా నిర్వాహకులు ఈ పురస్కారాన్ని అందజేశారు. అమీర్‌పేటలోని AAA సినిమాస్‌లో అత్యంత వైభవంగా జరిగిన “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025” వేడుకలో సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖుల సమక్షంలో ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అతిథులు ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను బహూకరించారు. అవార్డుతో బాధ్యత మరింత పెరిగింది: ఉప్పల స్వప్న పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఉప్పల స్వప్న గారు మాట్లాడుతూ.. మహానటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో నెలకొల్పిన ఈ అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. "నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డుతో సమాజం పట్ల నా బాధ్యత మరి...

‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత?

Image
 గూఢచారి స్పెషల్: ‘సూటు-బూటు’ మేధావులారా... మీ ‘లెఫ్ట్’ అనాలసిస్‌లు సనాతన సంస్కృతి ముందు ఎంత? యూట్యూబ్ కెమెరాల ముందు కూర్చోవడం, సూటు-బూటు వేసుకుని గంభీరంగా గొంతు సవరించుకోవడం, తామేదో సమాజాన్ని ఉద్ధరించే ‘మేధావులం’ అని కలరింగ్ ఇచ్చుకోవడం... ఈ మధ్య కాలంలో కొందరు సోషల్ మీడియా విశ్లేషకులకు ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా లెఫ్ట్ సిద్ధాంతాల ముసుగులో, విశ్లేషణల పేరుతో సనాతన సంస్కృతిని, సంప్రదాయాలను టార్గెట్ చేయడం ఒక ట్రెండ్‌గా మార్చారు. కానీ వీరు గుర్తించని నిజం ఒక్కటే... ఈ దేశ మూలాలను కదిలించడం మీ యూట్యూబ్ థంబ్నైల్స్ మార్చినంత సులువు కాదు! 2000 ఏళ్ల చరిత్రే ఏం చేయలేకపోయింది.. మీరెంత? ఈ దేశంపై ఎందరో దండయాత్రలు చేశారు. 2000 ఏళ్లుగా ఎందరో పాలకులు ఈ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని చూశారు. నలందా విశ్వవిద్యాలయాన్ని తగులబెట్టారు, దేవాలయాలను కూల్చారు, మతాంతర మార్పిడులకు ఒడిగట్టారు. కానీ, ఇంతటి పెనుతుఫానులను తట్టుకుని, కాల గర్భంలో కలిసిపోకుండా నేటికీ సజీవంగా, సగర్వంగా నిలబడింది మన భారతీయ సంస్కృతి. అలాంటి గొప్ప సంస్కృతిని, చరిత్రను... నాలుగు వ్యూస్ కోసం, కొన్ని లైక్స్ కోసం యూట్యూబ్ ఛ...

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

Image
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...

ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్!

Image
ఆర్యవైశ్య మహాసభలో 'కీలక' నియామకాలు.. బైలా వివాదంపై రిజిస్ట్రార్ నజర్! హైదరాబాద్:గూఢచారి:  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఎట్టకేలకు కీలక  సర్దుబాటు పూర్తయింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఎన్నికల్లో కొద్దిపాటి మెజారిటీతో పీఠాన్ని దక్కించుకున్న అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, దాదాపు రెండు నెలల సుదీర్ఘ కసరత్తు తర్వాత తన కోటరీని సిద్ధం చేసుకున్నారు. మహాసభ ప్రధాన కార్యదర్శిగా కొండ్లే మల్లికార్జున్ ను నియమించారు, కోశాధికారిగా రేణుకంట్ల గణేష్ గుప్తాను ఖరారు చేసినట్లు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది.  ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంఘంలో హాట్ టాపిక్‌గా మారింది. అసంతృప్తుల నడుమ నియామకాల జోరు! ఎన్నికలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా కార్యవర్గ విస్తరణ జరగకపోవడంతో ఇన్నాళ్లూ రకరకాల ఊహాగానాలు సాగాయి. తీరా ఇప్పుడు నియామకాలు జరిపినా, అంతర్గతంగా అందరినీ సమన్వయం చేయడం అమరవాదికి అంత తేలికైన విషయమేమీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు ఈ పదవుల పంపకంపై హర్షం వ్యక్తమవుతుండగా, మరోవైపు ఆశావహుల అసంతృప్తి సెగలు కూడా లోపాయికారీగా పొగలుగక్కుతున్నట్లు సమాచారం. తెరపైకి 'బైలా' వివాదం.. రిజిస్ట్రార్ నోటీసుల ...

శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్!

Image
శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ పంజా: రూ.30 లక్షల డిమాండ్.. రూ.2 లక్షలు నొక్కేస్తూ డ్రైవర్, ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్! మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ కార్యాలయం మరోసారి అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. భూమి కన్వర్షన్ కోసం ఏకంగా రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఉదంతంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించి గుట్టు రట్టు చేశారు. రూ.30 లక్షల డీల్.. ఎకరానికి లక్ష చొప్పున వేట! శామీర్‌పేట మండలం ఆలియాబాద్ ప్రాంతంలో సుమారు 30 ఎకరాల భూమిని కన్వర్షన్ (ల్యాండ్ కన్వర్షన్) చేయడానికి సంబంధించి ఒక రైతు కన్సల్టెంట్ నుంచి ఇక్కడి అధికారులు భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశారు. ఎకరానికి రూ.1 లక్ష చొప్పున.. మొత్తం రూ.30 లక్షలు ఇస్తేనే పని జరుగుతుందని కరాఖండిగా చెప్పారు. దీనిపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా నిఘా పెట్టారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు.. రెడ్ హ్యాండెడ్‌గా! లంచం మొత్తంలో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. తహసీల్దార్ (ఎమ్మార్...