Posts

ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ .

Image
ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది -  జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ . మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు, జిల్లాలోని 6 మున్సిపల్టీలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ తెలిపారు.         బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన  వెంటనే ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్న ఉర్దూ మీడియం పాఠశాల లో ఏర్పాటుచేసిన  పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఓటర్లకు చేసిన ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలించారు. అన్ని గదుల నుండి వెబ్ క్యాస్టింగ్ ఉండేలా చూడాలని, అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ అందించేందుకు మెడికల్ టీంలు గేట్ సమీపంలో ఏర్పాటు చేయాలని, దివ్యాంగ ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం సమీపంలో వీల్ చైర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ అనుమతించకూడదని, ఓటర్లు ఎన్నికల సంఘం అనుమతించిన 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించిన వెంటనే లోపలికి అనుమతించాలని కలెక్టర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ...

నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

 *నేడు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్..* TG: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. నేడు (బుధవారం) పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరుగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్....

Image
 ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం ఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్.... విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్  కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ విశాఖపట్నంలో అదుపులోకి తీసుకున్నారు. రూ.28 లక్షలు డిమాండ్ చేసి, రేంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ ద్వారా రూ.3.50లక్షలు తీసుకుంటున్న సందర్భంగా అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో ఏసీబీ అధికారులు జనవరి 3న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. టన్నుకు 90 రూపాయల చొప్పున మొత్తం రూ.28 లక్షలు డిమాండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేంజర్ ను ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి డివిజనల్ అధికారిణి శ్రావణి పరారిలో ఉన్నారు. ఏసీబీ ఆమె పై నిఘా పెట్టి విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమె ముందస్తు బెయిల్ కు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించినట్లు తెలుస్తోంది. శ్రావణిని ఏసీబీ కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఈ కేసు అటవీ అభివృద్ధి సంస్థలో సంచలనం సృష్టించింది.

మత్స్యకారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట - శాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం

Image
  కేంద్ర బడ్జెట్ 2026-27: మత్స్యకారుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట - శాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం – బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ బీజేపీ మత్స్యశాఖ రాష్ట్ర నాయకులు ఎల్ వి రమణ ముదిరాజ్ హర్షం నల్గొండ/హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారు ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ మత్స్యకారుల జీవితాల్లో నూతన వెలుగులు నింపేలా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ మత్స్యశాఖ నాయకులు  ఎల్ వి రమణ ముదిరాజ్ కొనియాడారు. ఈ బడ్జెట్‌లో మత్స్య రంగానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ₹2,761.80 కోట్లు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్‌లోని ముఖ్యాంశాలను వివరించారు:  * PMMSY బలోపేతం: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కు అత్యధికంగా ₹2,500 కోట్లు కేటాయించడం శుభపరిణామం. దీనివల్ల మత్స్యకారుల ఆదాయం పెరగడమే కాకుండా, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుంది.  * తెలంగాణకు మేలు: దేశవ్యాప్తంగా 500 రిజర్వాయర్లు, అమృత్ సరోవర్ల అభివృద్ధి పథకం మన తెలంగాణలోని చెరువులు, కుంటలపై ఆధారపడిన లక...

జీహెచ్ఎంసి ఎస్ఈ, కంప్యూ టర్ ఆపరేటర్ అరెస్ట్….

Image
 జీహెచ్ఎంసి ఎస్ఈ, కంప్యూ టర్ ఆపరేటర్ అరెస్ట్…. జీహెచ్ ఎంసి కూకట్‌ పల్లి జోన్ సూపరింటెండింగ్ ఇంజనీర్, కం ప్యూటర్ ఆపరేటర్ బుధవారం ఏ సీబీ వలలో చిక్కారు. బుధవారం కూకట్ పల్లి జోన్ పరిధిలోని ఇంజ నీరింగ్ కా ర్యాలయంలో సూపరిం డెంట్ ఇంజనీర్ గా పొద్దుటూరి చి న్నారెడ్డి అధికారిక సహాయం చేయ డoలో బాగంగా ఫిర్యా దిదారుడు పూర్తి చేసిన పనులను తనిఖీ చేసి అతని రూ. 1.40 లక్షలు విలువైన బిల్లులను ఆమోదం కోసం జోనల్ కమిషనర్‌కు పంపడానికి, ఫిర్యాది దారుడి నుండి రూ.15 లక్షల లం చం డిమాండ్ చేసి తన కార్యాలయంలో ఏఓ-2 శ్రీ బాలాసాని ప్రవీ ణ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ (అవు ట్‌సోర్సింగ్), సూపరింటెం డింగ్ ఇంజనీర్ కార్యాలయం జో నల్ కమిషనర్, కూకట్‌పల్లి జోన్, జిహెచ్‌ఎంసి ద్వారా స్వీక రిస్తుండగా ఏసీబీ, రంగారెడ్డి రేంజ్ అధికారులు పట్టుకు న్నారు. లంచంగా తీసుకున్న రూ. 15 లక్ష ల సొమ్మును ఏఓ-2 వద్ద నుండి అ తని సూచన మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా, ఏఓ-1 ఏఓ-2 అక్రమ ప్రయోజనం పొంద డం కోసం తమ విధులను సక్రమం గా మరియు నిజాయితీ లేకుండా నిర్వర్తించారు. అందువల్ల, ఏఓ-1 ఏఓ-2లను అరెస్టు చేసి, జ్యుడీషి యల్ రిమాండ్ కోసం నాంపల్లి లో ని మొద...

ఆర్య వైశ్యులు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలి - ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
 ఆర్య వైశ్యులు అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందాలి* -*TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం తాడేపల్లిగూడెంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IVF సెంట్రల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ IVF అధ్యక్షుడు, TPCC ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త    ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో 33 లక్షల మంది ఆర్య వైశ్యులకు సంక్షేమ పథకాలు వచ్చే విధంగా అలాగే నామినేటెడ్ పోస్టలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే జగ్గయ్య పేట ఎమ్మెల్యే తాతయ్య అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మెన్ దుంది రాజేష్ తో కలిసి ముఖ్యమంత్రి గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంత్రి లోకేష్ గారిని కలవడం జరుగుతుంది అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో అలాగే మంత్రి శ్రీధర్ బాబు తో మాట్లాడి వారితో పరిశ్రమలు ఏర్...

క్విట్ టుబాకో బీ ఏ హీరో

Image
  క్విట్ టుబాకో బీ ఏ హీరో ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం) "ఏవండి సాయంత్రం సినిమా కి వెళ్దాం ఇంటికి త్వరగా రండి" సర్లే..అంటూ..సిగరెట్ దమ్ము లాగుతూ ..బండి పై కూర్చుని ఆఫీసుకు వెళ్ళి పోయాడు శైలజ భర్త. "ఈ..నగరానికి ఏ..మైంది.. అంటూ .. మొదలై  గుట్కా బీడీ,సిగరెట్ ఇవి ప్రాణాంతకం అని హెచ్చరించి ముగిసింది  ప్రజా హితం కోసం జారీ చేసిన ప్రకటన. ఏ హిట్ సినిమా అయినా.. ఖచ్చితంగా  Smoking is injurious to health  అనే ప్రకటన తో ప్రారంభం కావాల్సిందే. ఇది ఎందుకు చెప్తున్నా..నంటే ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న నన్ను . సిగరెట్ మానమని మాకు హిత బోధ చేసే బదులు  ఫ్యాక్టరీ ల ను బంద్ చేయొచ్చు కదా "మాచన"గారు అని అన్న వారెందరో.. ఐతే.. జన బాహుల్యానికి తెలవని ముచ్చట ఎంది అంటే పారిశ్రామిక విధానం ప్రకారం ప్రభుత్వాల కు , పరిశ్రమ లను మూసే హాక్కు లేదు. కావున పొగాకు వల్ల,పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ రావడం ఖాయం  కాబట్టి చికిత్స కంటే నివారణ శ్రేష్టం అని అంటారు కదా.. సో.. దమ్ము కొట్టడం మానేస్తే?! మన హృదయం మన కాలేయం  ఆరోగ్యం కు మనమే హాని తలపెట్టిన పాపం మనకు అంటదు. సినిమా ...