Posts

*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

Image
  *అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?* *హైస్పీడ్ ఫ్యాన్ల టెండర్‌లో 10 లక్షల కుంభకోణం బట్టబయలు*  *నాసిరకం సామాను సరఫరా: సప్లయర్, అధికారులపై వేటుకు డిమాండ్* *  *20 లక్షల టెండర్‌లో 10 లక్షలు స్వాహా? *సప్లయర్, అధికారులపై విచారణకు డిమాండ్* *నల్గొండ, గూఢచారి:* చిన్నారులకు ఎండ తాపం తగలకూడదని జిల్లా కలెక్టర్ తలపెట్టిన పుణ్యకార్యంలో దోపిడీ దొంగలు పడ్డారు. డిపార్ట్‌మెంట్ నుంచి బడ్జెట్ రాకున్నా, మినరల్ ఫండ్స్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మంచి మనసుతో నిర్ణయించానట్లు తెలిసింది.  క్రాంప్టన్ HS Plus  హై స్పీడ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ 4 ఫీట్ల ట్యూబ్‌లైట్లకు టెండర్ పిలిచి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. అసలు  కుంభకోణం జరిగింది మాత్రం సప్లైలోనే.  టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ HS Plus హై స్పీడ్ ఫ్యాన్లకు బదులు నాసిరకం నార్మల్ సీవిండ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లకు బదులు నార్మల్ ఫిలిప్స్, కొన్నిచోట్ల క్రాంప్టన్ నార్మల్ ట్యూబ్‌లైట...

*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*

Image
  *CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*   *భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి*   *పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి* *హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు. *ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం*   పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉ...

*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*

Image
*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*   *పేదింటి ముగ్గురు ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీరెలు పంపిణీ*   *కులాలకు అతీతంగా ఉప్పల దంపతుల సేవలు* *నాగోల్, గూఢచారి:* సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న దంపతులు ముగ్గురు పేదింటి ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కులమతాలకు అతీతంగా సాయం అందిస్తున్న ఉప్పల దంపతులు ఈసారి ముదిరాజ్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన మూడు కుటుంబాలకు అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్‌కు చెందిన నీరడి సాత్విక, షామీర్‌పేటకు చెందిన రాపాని లలిత, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఎడ్ల శివాని వివాహాలకు కావాల్సిన మంగళసూత్రాలు, నూతన వస్త్రాలను అందించారు. శివాని తండ్రి పక్షవాతంతో మంచాన పడగా, తల్లి కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న దీనస...

*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*

Image
*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*  *హైదరాబాద్:* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలను ఐవీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారని ఐవీఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనం  తెలిపారు. మే 5వ తేదీన శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు కాగా, ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది, గత రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి గోవిందు బాలరాజుతో కలిసి హైదరాబాద్‌లో శ్రీనివాస్ గుప్తాను కలిసి కేక్ కటింగ్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నారాయణ, యువజన విభాగం కోశాధికారి నరేష్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తూముకుంట నర్సిరెడ్డి, ఐవీఎఫ్ నాయకులు...

*మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*

Image
 *మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*   *మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ*   *రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు* *హైదరాబాద్:* తెలంగాణ అభివృద్ధి రథసారథి, ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైఎం నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తూ రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కోరారు.  తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా కాజీపేట-విజయవాడ మూడవ రైల్వే లైన్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో రూ. 3,175 కోట్ల నేషనల్ హైవే పనులు, మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రగతి కానుకలను ప్రధాని మోదీ మోసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లు కేటాయించిందని, సుమారు 3.40 క...

*భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

Image
   *భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*   *హైదరాబాద్‌లో 30% వార్షిక వృద్ధి - ఎగుమతుల్లో 103% సీఏజీఆర్*   *2030 నాటికి రూ.3 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం* *హైదరాబాద్:* భారత రక్షణ రంగంలో హైదరాబాద్ దేశానికి 'నరాల కేంద్రం'గా ఎదిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగం ఏటా 30% పైగా వృద్ధి నమోదు చేస్తోందని, 2024 నుంచి 2026 మధ్య ఎగుమతులు ఏకంగా 103% సీఏజీఆర్‌తో దూసుకుపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఏరోస్పేస్, రక్షణ సరఫరా వ్యవస్థలో ఇప్పటికే 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు క్రియాశీలంగా ఉన్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0 సదస్సులో కీలకోపన్యాసం చేసిన మంత్రి, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు స్థాయి నుంచి 100కు పైగా దేశాలకు రక్షణ పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. ఈ వృద్ధికి కాంగ్రెస్ పాలన తొలి సంవత్సరాల నుంచే రక్షణ వ్యవస్థ అభివృద్ధిపై పెట్టిన ప్రత్యేక దృష్టే కారణమని అన్నారు. వరుస ప్రభుత్వాల కృషి వల్ల దేశ రక్షణ అవసరాల్...

*రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*

Image
   *రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*   *హైదరాబాద్:* రిటైర్డ్ డీజీపీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తనూజ గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది నేపాలి గ్యాంగ్ పనిగా అంచనా వేస్తున్నామని, కొన్ని కీలక క్లూస్ లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేని సమయంలో దుండగులు వెనుక గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, పిల్లలు ఇద్దరూ పై అంతస్తులో ఉన్నారు. దుండగులు ఆమె చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసి, అనంతరం వెనుక మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళ బయటి వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి సహకరించినట్లు సీపీ వెల్లడించారు. మాజీ డీజీపీ తన తల్లి అనారోగ్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఆమె మరణించడంతో మృతురాలు తనూజ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎంత బంగారం, నగదు చ...