Posts

కూకట్ పల్లి జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు

Image
 *కూకట్ పల్లి జర్నలిస్టులకు అండగా నిలిచిన వడ్డేపల్లి రాజు*   *జర్నలిస్టుల సంక్షేమానికి కోటి విరాళం*   *తన జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కు అందజేత*   *అభినందించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్*  హైద్రాబాద్, (గూఢచారి):  నిత్యం ప్రజల పక్షాన పోరాటం చేసే జర్నలిస్ట్ యోధులకు కూకట్ పల్లి బిజెపి సీనియర్ నాయకులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు అండగా నిలిచారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. శనివారం నిర్వహించిన వడ్డేపల్లి రాజు( రాజేశ్వరరావు ) జన్మదిన వేడుకల సందర్భంగా రూ. 25 లక్షల చెక్కును మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో అందజేశారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులను చూసి తాను చెల్లించానని ఈ సందర్భంగా తెలిపారు. తన సూచన మేరకు కూకట్పల్లిలోని సీనియర్ జర్నలిస్టులు ఏకతాటిపైకి వచ్చి కూకట్పల్లి జర్నలిస్టు మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. తాను ఇస్తున్న కోటి ర...

తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీల్లో బయట బడ్డ బడ్జెట్‌ దుర్వినియోగం

Image
  తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ తనిఖీల్లో బయట బడ్డ బడ్జెట్‌ దుర్వినియోగం  తుంగతుర్తి, గూఢచారి:: రిజిస్టర్‌లో ఉన్న విద్యార్థులు 51 మంది.. హాస్టల్‌లో ఉన్నది 25 మందే.. పక్కనే ఉన్న బడికి వస్తున్నా, వసతి గృహం ముఖం చూడటం లేదు. పేరుకు అందరి పేర్లూ ఉంటున్నా.. రికార్డులేవీ సరిగా లేవు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏసీబీ చేసిన తనిఖీల్లో వెల్లడైన తతంగం ఇది. హాస్టల్‌కు వచ్చే నిధులు దుర్వినియోగం అవుతున్నాయని తనిఖీల అనంతరం అధికారులు తెలిపారు. కానీ అక్కడ నెలకొన్న సమస్యలతో వసతి గృహానికి విద్యార్థులు రావడం లేదని పేర్కొన్నారు. సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఏసీబీ అధికారులు మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు తుంగతుర్తి హాస్టల్‌కు చేరుకున్నారు. ఆడిటర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, లీగల్‌ మెట్రాలజీ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లతో కలసి తనిఖీలు చేశారు. అనంతరం నల్లగొండ జిల్లా ఏసీబీ డీఎస్పీ జగదీ్‌షచందర్‌ మాట్లాడారు. వసతి గృహం రికార్డుల్లో ఉన్న సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది లేరని గుర్తించామని చెప్పారు. 51 మంది విద్యార్థులు ఉంటున్నట్టు ...

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌

Image
 ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ (Marubeni Corporation) తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. 🔸 హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు మరుబెనీ సంసిద్ధమైంది. టోక్యోలో మరుబెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ని కలిసి, ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. 🔸 మరుబెనీ రూ. 1,000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దశలవారీగా ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ ((letter of intent (LOI))పై ముఖ్యమంత్రి  సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మరుబెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. 🔸 జపాన్ మరియు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్‌లో తమ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఈ ఇండస్ట్రియల్ పార్క్‌ను...

సింగరేణి మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయం - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

Image
 సింగరేణి మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయం - ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాదాపు 130 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.  ఒడిశాలోని అంగుల్ జిల్లాలో సింగరేణి సంస్థ తనకు కేటాయించిన బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించడం శుభ పరిణామంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే సందర్భమని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.

చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు

Image
 చీకటి బతుకుల్లో వెలుగు నింపిన అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం - కప్పర ప్రసాద రావు సిద్దిపేట ఏప్రిల్ 15, గూఢచారి : రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జగదేవ్పూర్ మండలం తీగుల్ నరసాపూర్ లో జై భీమ్ యూత్ వారు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో, ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని. ఆ మహాశయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషిచేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలలుగన్న సమసమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వంతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తుచేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను కొనియాడారు ఆయన ఆశయాలను ముందుక...

సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ - బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు

Image
  సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ - బింగి స్వామి కె ఆర్ పి ఎస్ అధ్యక్షులు సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు కురుమ లు నిర్వహించే బీరప్ప పండుగ అని బింగి స్వామి కె ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్నారు.చేర్యాల మండలం గుర్జకుంట లో జరుగుతున్న బీరప్ప కామరతి కల్యాణం పెద్దపండుగా  మహోత్సవంలో కురుమ సంఘం ప్రతి నిధులతో  కలిసి పాల్గొని ప్రసంగించారు. కురుమల ఆరాధ్య దేవం  బీరప్ప కామరతి కళ్యాణోత్సవ   ఉత్సవం అంగరంగ వైభరంగ వైభవంగా నిర్వహించారని  కొనియాడారు. గురుజకుంట కురుమ సంఘం ఆహ్వానం మేరకు వచ్చానన్నారు .రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు పంటలు సమృద్ధిగా పండి సంతోషంగా ఉండాలని కులదైవాన్ని కోరుకున్నానని అన్నారు. కురుమల్లో రాజకీయంగా అత్యంత వెనుక పడ్డారని  ఐక్యంగా . విద్య పరంగా కురుమలు ముందుండాలని గ్రామాల్లో  అన్నదమ్ముల కలిసిపోయే తత్వం కురుమ కులానికి ఉన్న గొప్ప వరం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో కురుమలు బీరప్ప సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ సత్యం న్యాయం ధ...

కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున

Image
   కులవివక్షకు బలైన మల్లేశ్వరి మరణానికి కారణమైన జాన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి - పాలడుగు నాగార్జున   మల్లీశ్వరి. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం. నిడమానూరు మండలం నివాసి జిల్లాలో సంక్షేమ గురుకులాల్లో చదివిందని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో గత ఏడేళ్లుగా నర్స్ గా పనిచేస్తున్నది. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. తనే ఆ కుటుంబానికి అండగా ఉన్నదని పాలడుగు నాగార్జున తెలిపారు. జాన్ రెడ్డి అనే ఒక వ్యక్తితో గత ఏడేళ్లుగా Live In Relationship లో ఉన్నదని తెలిసినది. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పినందు వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా గుడ్డిగా నమ్మిందనీ. యధావిధిగా తక్కువ(?) కులం వాళ్లతో పెళ్లేంది, మన పరువు ఏమైతది అని బంధువులంతా అంటున్నారని అతను ఈమెకు తెలియకుండా వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడని, ఈ విషయం తెలుసుకున్న ఈమె అన్ని ప్రయత్నాలు చేసి, అవమానానికి గురై రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నదని ఆయన పేర్కొన్నారు శవంతో ధర్నా, పోలీసుల కేసులు, బెదిరింపులు, తల్లిదండ్రుల రోదనలు, రాజీ కమ్మని ఒత్తిళ్లు పేదలకు కొత్త కాదని , ఇప్పటికీ కూడా నిందితుల...