Posts

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

Image
  అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి  అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం  * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ * ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం * వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తాం * శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం  * వాసవీ పారాయణానికి గిన్నీస్ రికార్డు  హైదరాబాద్: వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ, జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోగానే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. వైశ్యులు ఊరికొక్కరు ఉన్నా ఊరందరూ వారితో ఉంటారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సహకారంతోనే రైతులు వ్యవసాయం చేసుకుంటారు న్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర నిర్మాణంలో వైశ్యులది ముఖ్య పాత్ర అని కొనియాడారు.  రాజకీయంగా గుర్తింపు దక్కినా, దక్కకున్నా క్రమ శిక్షణ తప్పకుండా తమ పాత్ర పోషిస్త...

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్

Image
  తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి  * ఏపీ మంత్రి టీజీ భరత్  హైదరాబాద్: తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.  2014 నుంచి తెలంగాణలో వైశ్యులకు మంత్రి పదవి దక్కలేదని గుర్తు చేశారు. జనాభా లో దాదాపు 5 శాతం ఉన్న ఆర్య వైశ్యులకు తగిన ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.  వైశ్యులు ఐకమత్యంతో ఉండి శక్తి చాటితేనే గౌరవం దక్కుతుందన్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్యవైశ్యులకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందన్నారు. అందరు వైశ్యులు కూడా పేరు చివరన గుప్త అని పెట్టుకోవాలని సూచించారు. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేది ఆర్య వైశ్యులేనన్నారు.  అందరూ గోసేవ కూడా చేయాలని  ఆయన పిలుపునిచ్చారు. గోసేవ చేసిన ఫలితం గానే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పారు. వాసవీ పారాయణ మహోత్సవాన్ని తలపెట్టిన కల్వ సుజాత గుప్తను ఆయన అభినందించారు.

పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల

Image
 *పేదింటి ఆడపిల్ల పెళ్లి కి పూస్తే మట్టెలు అందజేసిన ఉప్పల* Hyderabad, Gudachari:  నాగోల్ లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్త బీసీ ( చారి) కుటుంబానికి చెందిన జవహర్ నగర్ నివాసి ప్రమీల అనే దివ్యాంగురాలు వారి కుమార్తె జ్యోతి & వెంకట్ పెళ్లికి దంపతులకు పూస్తే మట్టెలు చీర అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ ఉప్పల ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం అని దానిలో భాగంగానే పేదింటి ఆడపిల్ల వివాహానికి అండగా నిలవాలని ఎంతో మందికి పూస్తే మట్టెలు చీర అందజేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. ఈ సందర్భగా వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివ కృష్ణ గారు మాట్లాడుతూ ఎంతోమంది దివ్యాంగులకు పేదవాళ్లకు అండగా నిలుస్తున్న ఉప్పల అందరికీ ఆదర్శం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న , IVF నాయకులు పబ్బా చంద్రశేఖర్ గుప్త , కటకం శ్రీనివాస్ గుప్త, Raghu Gangishett...

మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.

Image
  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలి-మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి.                 ఘనంగా ఐవిఎఫ్ మహిళా దినోత్సవం.                          ప్రజా ప్రతినిధులకు సన్మానం  నల్లగొండ మార్చి 21, గూఢచారి :                  మహిళలు అన్ని రంగాలలో ముందుకెళ్లాలని పురుషులతో సమానంగా ఎదగాలని నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన ఐవీఎఫ్ మహిళా దినోత్సవం ప్రజాప్రతినిధులకు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వ్యాపార పరంగా ఎదగాలన్నారు. మహిళలకు ఓర్పు సహనం ఎక్కువ అని కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తుందన్నారు. మహిళలు నేడు అన్ని రంగాలలో రాణిస్తున్నారని మహిళలను గౌరవించడం వారిని సన్మానించడం మంచి సంప్రదాయమన్నారు. మహిళలు లేని సమాజం లేదని మహిళలు గౌరవించినచోట శుభాలు క...

వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్

Image
  వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మేడా నరేష్ హైద్రాబాద్: వాసవి బంధన్ గ్లోబల్ ఫౌండేషన్ యొక్క గ్లోబల్ ప్రెసిడెంట్ 2026-2028) గా ఉదయం 10:00 లకు లక్ష్మీ కన్వెన్షన్, ఖర్మాన్‌ఘాట్, హైదరాబాద్ లో మేడా నరేష్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ అధికారిక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఈ రోజు స్త్రీత్వ స్ఫూర్తిని గౌరవించడానికి కూడా అంకితం చేయబడిందనీ మేడా నరేష్ తెలిపారు. ఈ నాయకత్వ మార్పునకు మరియు సాధికారతను మనం అందరం సమిష్టిగా జరుపుకుంటున్న ఈ వేడుకకు మీ రాక ఎంతో శోభను చేకూరుస్తుందని తెలిపారు.

అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం

Image
 అంగ‌రంగ వైభ‌వంగా శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం  * 22న హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హ‌ణ‌  * ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌నున్న ఘ‌ట్టం * స్వ‌చ్ఛందంగా త‌ర‌లి వ‌స్తున్న ఆర్య‌వైశ్యులు  * విజ‌య‌వంతం చేయాల‌ని కల్వ సుజాత గుప్త పిలుపు  హైద‌రాబాద్‌:  హైద‌రాబాద్‌ ఎల్ బీ స్టేడియం మ‌రో అద్భుత చారిత్ర‌క ఘ‌ట్టానికి వేదిక కాబోతోంది.  ఈ నెల 22న ఆదివారం ఆర్య‌వైశ్య వెల్ఫేర్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్టు సౌజ‌న్యంతో తెలంగాణ ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ ఆధ్వ‌ర్యంలో శ్రీ వాస‌వీ మ‌హాశ‌క్తి మ‌హోత్స‌వం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.  దాదాపు 30 వేల మంది వైశ్యులు ప్ర‌ముఖ క‌వి చింత‌ల శ్రీ‌నివాస్ రచించిన 102 చ‌ర‌ణాల‌తో కూడిన వాస‌వీ పారాయ‌ణాన్ని సామూహికంగా ఆల‌పించ‌నున్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన ఇన్ని వేల మంది ఒకే స్వ‌రంతో పారాయ‌ణం చేయ‌డం ప్ర‌పంచ‌రికార్డు కానుంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు.  ఈ ఘ‌న‌త‌ను రికార్డు చేయ‌డానికి గిన్నీస్ ప్ర‌తినిధులు వ‌స్తున్నార‌ని పేర్కొన్నారు.  ఆధ్యాత్మిక , సేవా కార్యక్ర‌మాల్లో ముందుండే ఆర్య‌వైశ్యులంద‌రినీ ఒక్క‌తాటిపైకి తేవ‌డ‌మే ఈ కార...

ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

Image
 ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నల్గొండ:   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 21-03-2026 శనివారం రోజు ఉదయం 10.30 లకు నల్గొండ క్లాక్ టవర్ సమీపంలోని డైన్ ఇన్ హోటల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మరియు నల్గొండ జిల్లాలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధుల తో పాటు నల్గొండ పట్టణ ప్రముఖులు అనగా మేయర్ డిప్యూటీ మేయర్ తదితరులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  మహిళా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మహిళలకు తంబోలా ఇతర ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇవ్వబడును ఎర్లీ బర్డ్ బహుమతి ప్రధానం కూడా చేస్తారు.  అనంతరం భోజన సౌకర్యం ఏర్పాటు చేయబడినదనీ, భోజన విరామం తర్వాత ప్రజా ప్రతినిధులకు సన్మానం, చివరిగా ఐ వి ఎఫ్ సభ్యుల సమావేశం ఏర్పాటు చేసామని నిర్వాహకులు తెలిపారు.   ఐ వి ఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు మహిళ విభాగ్ అధ్యక్షురాలు కొమిరిశెట్టి రమ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో ఐపీఎఫ్ తెలంగాణ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పబ్బా చంద్రశేఖర్ గుప్తా, మహిళా న...