Skip to main content

Posts

Showing posts from May, 2021

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, విరాళం

  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో  మంగళసూత్రం, మెట్టెలు,  విరాళం     హైదరాబాద్ లోని వారి నివాసంలో వచ్చి కలిసిన పెళ్లికూతురు బంధువులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-ఛైర్ పర్సన్ ఉప్పల స్వప్న  చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా పెళ్లి కూతురు కి ఇచ్చారు.  పేద కుటుంబానికి చెందిన అనాధ మహిళ, వివాహం కోసం మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా ఇచ్చారు.. మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ అంబేద్కర్ కాలనీ కి చెందిన అనిగళ్ల స్వరూప- మల్లేష్ ల కూతురు వివాహానికి విరాళంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధికంగా వెనుకబడిన, తల్లిదండ్రులు లేని అనాథ మహిళ వివాహన్నీ గుర్తించి, పేదింటి అమ్మాయిని ఆదుకోవాలని సహాయం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు 

జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి - తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి -  తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్ : జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లను జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుతోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాలలో నమోదు చేసుకొని టీకాలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పని సరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా, మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నార

*కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ*

 *కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ* - - కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు భోజన వితరణ నల్లగొండ : లాక్ డౌన్ నేపద్యంలో కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందికి భోజనం అందించారు. అనంతరం మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రావడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారికి ఇబ్బందిగా ఉన్న తరుణంలో కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీసులు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం కోసం ఇంటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం.పని చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న తమతో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్, కాచం ఫౌండేషన్ ప్రతినిధులు

*టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్*

 *టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్* నల్లగొండ : పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన స్వాతి టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుండి తీసుకొని వారిని మోసం చేసిన స్వాతి, ఆమెకు సహకరించిన పార్వతి లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసి అధిక లాభాలు చూపిస్తానని చెప్పి మోసం చేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ను సంప్రదించగా కేసు నమోదు చేసి నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేసి పిడి యాక్ట్ నమోదు చేసి టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు గురువారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..*

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..* *నకిలీ ఈమెయిల్ ద్వారా 23 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు..* హైదరాబాద్ కి చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు. తాను కోవిడ్ పొజిటీవ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నానని.. అర్జెంట్ గా పేరుతో 23 లక్షల 60 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని నకిలీ ఈమెయిల్ ద్వారా మెయిల్ చేసిన కేటుగాళ్ళు   తమ ప్రమేయం లేకుండానే నకిలీ  లెటర్ ప్యాడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. బేగంపేట యాక్సిస్ బ్యాంక్  మెయిల్ చేసిన.. సైబర్ నేరగాళ్లు. సంతకం టాలీ అవడంతో వారు చెప్పిన మూడు అకౌంట్లకు 23 లక్షలు 60 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు అధికారులు.  సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో..తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి వీరేంద్ర బండారి.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.  *ఇదే తరహాలో మరో మోసం..* *తాను హాస్పటల్ లో ఉన్నాను అని తన అకౌంట్ నుండి 5 లక్షల రూపాయలు అర్జెంటుగా బదిలీ చేయాలని నకిలీ లెటర్ పై సంతకం చే

నిషేధిత గుట్కాలు పట్టివేత

 నల్గొండ.... నల్గొండ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ రోడ్ లో శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో నిషేధిత గుట్కా లు అమ్ముతున్నారనే సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనికీలు...నిషేధిత నికోటిన్, గుట్కా ప్యాకేట్ల పట్టివేత..కేసు నమోదు

కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి పంపిన సిపిఎం

కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి    పంపారు యధావిధిగా చదవండి                           *శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి*          *విషయం* :- *(1) కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచుట.*                                                                    *(2)వెంటీలేటర్ బెడ్స్ 100కి పెంచుట,రిపేరులో వున్నవాటికి అవసరమైన మెటీరియల్ తెప్పించుట.*                                  *(౩) కరోన వార్డుల్లో సి.సి కెమారాలు అమర్చుట*                                                                               *( 4) జిల్లా కేంద్రం ఆసుపత్రిలో కరోన టెస్టులు 50 మాత్రమే చేస్తున్నారు,రోజుకి 300 కు పెంచుట మరియు phc ల లో 25 మాత్రమే చేస్తున్నారు 100 వరకు పెంచుట గురించి.*                                     *(5) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇప్పించుట గురించి.*                                     *(6) ప్రతిరోజు కరోన చికిత్సా పైనా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించీ తగు సుాచనలు చేయుట మరియు అవసరమైన నిధులు కేటాయించి వస

కోవిడ్ బులిటీన్ మే 8

 కోవిడ్ బులిటీన్ మే 8

*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.

 *Delhi* *కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ. *DRDO మరియు Dr Reddy's  laboratories సంయుక్త ఆధ్వర్యంలో 2DG పేరుతో అందుబాటులోకి కొత్త డ్రగ్.* కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న *రోగులను రెండింతల వేగంతో నయం చేస్తున్న 2-deoxy-D-glucose గా పిలువబడే కొత్త డ్రగ్.* *రోగుల ఆక్సిజన్ అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్న 2DG డ్రగ్.* పౌడర్ రూపంలో లభించే ఈ 2DG డ్రగ్ ను  నీళ్లలో కలుపుకుని తాగవచ్చని రక్షణ శాఖ ప్రకటన. *వైరస్ ద్వారా ప్రభావితమైన కణాల్లో ఈ కొత్త డ్రగ్ చేరి వైరస్ వృద్ధిని నిరోధిస్తుందని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ*. *కేవలం వైరస్ సోకిన క్షణాల్లో మాత్రమె చేరడం ఈ కొత్త డ్రగ్ ప్రత్యేకత అని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ.* *COVID వ్యతిరేక పోరాటంలో మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ కీలక భాగస్వామ్యం.* DRDO తో కలిసి సంయుక్త పరిశోధన చేసి 2DG డ్రగ్ ను ఆవిష్కరించిన   హైదరాబాద్ కు చెందిన Dr. Reddy's లబోరేటరీస్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు...*

 *తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్  బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://covidtelangana.com

*ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్*

  *ప్రతి ఆసుపత్రిలో చార్జీల వివరాలు ఏర్పాటు చేయాలి : డిఐజి రంగనాధ్* - - విపత్కర సమయంలో ఆసుపత్రుల యజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి - - ధరల పట్టిక ఏర్పాటు చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం - - కష్టకాలంలో  పేదలు, సామాన్యులకు మెరుగైన వైద్యం అందించాలి - - మందులు, ఆక్సిజన్ కోసం అధిక డబ్బులు వసూలు చేస్తే కేసులు నల్లగొండ : కరోనా విపత్కర సమయంలో డాక్టర్లు అందిస్తున్న సేవలు అద్వితీయమని, అదే సమయంలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా హృదయంతో కరోనా రోగులకు సేవలందించాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరోనా రెండో దశ వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. కరోనా సోకిన వారు ధైర్యాన్ని కోల్పోకుండా హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ఆత్మస్థైర్యంతో సరైన రీతిలో మందులు, ఆహారం తీసుకుని కరోనాను జయించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులలో కొన్ని ఆసుపత్రుల్లో అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం

తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి 400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు*

  *తప్పిన పెనుప్రమాదం ,,,సకాలంలో ఆక్సిజన్ అందించి  400 మంది ప్రాణాలను కాపాడిన ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు* *విజయవాడ GGHలో ఆక్సిజన్ తో చికిత్సపొందుతున్న సుమారు నాలుగు వందలకు మంది కోవిడ్ భాదితులు* *18టన్నుల తో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థ తో తెగిపోయిన సంబంధాలు* *విజయవాడ సిటీ కమిషనర్ కి సమాచారాన్ని చేరవేసిన సంబంధిత అధికారులు* *హుటాహుటిన రంగంలోకి దిగిన విజయవాడ సి.పి ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని  మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేసిన సి‌పి* *ఈస్ట్ గోదావరి జిల్లా, ధర్మవరం వద్ద ఓ డాబా లో ఆక్సిజన్ ట్యాంకర్ ని గుర్తించిన ప్రత్తిపాడు పోలీసులు* *నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా లో నిమగ్నం అవడంతో అలసిపోయి వాహనాన్ని నిలిపి వేసినట్టుగా పత్తిపాడు సిఐ కి డ్రైవర్ వివరించాడు* *డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిన  ప్రత్తిపాడు సిఐ...అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ చానల్ ఏర్పాటు* *డ్రైవర్ కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డుతో ఆక్సిజన్ ట్యాంకర్ ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జి.జి.హెచ్ కి  చేర్చిన పోలీసులు*

బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించా

  *బెంగాల్ లో బిజెపి కార్యకర్తల పై జరుగుతున్న దాడులను* ప్రజాస్వామ్య వాదులు అందరూ కూడా ఖండించాలని నల్గొండ బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి లు ధరించి నిరసన తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు గారు, పోతెపాక సాంబయ్య గారు, అసెంబ్లీ కన్వీనర్ కంకణాల నాగిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్, కుమ్మరికుంట్ల సాయి కుమార్, పంజాల యాదగిరి, వట్టికోటి దుర్గ, టంగుటూరి శ్యామ్, పోకల దశరథ, సాయి, నరేందర్ గార్లు  తదితరులు పాల్గొన్నారు..

Mamata Banerjee took oath as chief minister of Bengal

 Trinamool Congress chief Mamata Banerjee took oath as chief minister of Bengal for the third time today. On Monday, she had met governor Jagdeep Dhankhar to stake claim to form the next government. Banerjee said the event itself would be a low-key affair, because of the pandemic.

ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్

 ప్రైవేట్ లో కోవిడ్ వ్యాక్సినేషన్ పై తెలంగాణ వైద్య శాఖ గైడ్ లైన్స్  వ్యాక్సినేషన్ కు  ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి  ఇచ్చిన వైద్యశాఖ  45 ఏళ్ళ పైబడి, కోవిన్ సాఫ్ట్వేర్ లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వాక్సిన్ వెయ్యాలి..  *ప్రైవేట్ సెంటర్లు  వ్యాక్సిన్ ను సొంతంగా తయారీ కంపెనీల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుంది

*జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం* కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి

  *జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నాం*   కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి న్యూడిల్లీ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆందోళన కల్గిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నియంత్రణ ఛాయలు పాటించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ కోరారు. జర్నలిస్టులను కూడా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాలు అప్రమత్తత పాటిస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 12 రాష్ట్రాల్లో లక్షకు పైగా క్రీయాశీలక కేసులు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, అసోం, బీహార్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడు, పశ్చిబెంగాల్‌లో తాజాగా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 22 రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 15 శాతంగా ఉందని వెల్లడించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో కరోనా మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైందని, 18 – 44 వయస్సు ఉన్న 20 లక్షల మందికి టీకాలు అందాయని పేర్కొన్నారు.

*రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

 *రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్*

ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం

 For info... నల్గొండ.... నకిరేకల్ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ (29).కరోనా తో నల్గొండ పట్టణంలోని మాక్స్ వెల్త్ ఆసుపత్రిలో మృతి...ఇప్పటికే 140000  రూపాయలు ఆసుపత్రికి ఇచ్చిన పేరెంట్స్.. ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం 50 వేలు కట్టడానికి సిద్ధంగా ఉన్న బంధువులు నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా వినని ఆసుపత్రి యాజమాన్యం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బంధువులు మృతినికి  చిన్న బాబు ఎలాగైనా డెడ్ బాడీ ఇప్పించండి అంటూ ఆసుపత్రిని వేడుకుంటున్న వినడం లేదంటున్నారు

మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ

  మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు - అద నపు కలెక్టర్ రాహుల్ శర్మ నకిరేకల్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నిక, నల్గొండమున్సిపాలిటీ 26 వ వార్డు కు ఆకస్మిక ఎన్నిక కౌంటింగ్ రేపు 3 న రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జారీ చేసిన కోవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.ఆదివారం అదనపు కలెక్టర్ నల్గొండ ఎం.జి.కళాశాల లో నల్గొండ 26 వ వార్డు కౌంటింగ్ నిర్వహిస్తున్న కౌంటింగ్ కేంద్రం,నకిరేకల్  లో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో నకిరేకల్ మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం లో ఏర్పాట్లు పరిశీలించారు.కౌంటింగ్  రూమ్ లను  పారిశుధ్య సిబ్బంది క్రిమి సంహరక ద్రావణం తో శానిటైజ్ చేశారు.కోవిడ్ నెగటివ్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్, పాస్ లు కలిగి యున్న ఉన్న అభ్యర్థులు,కౌంటింగ్ ఏజెంట్లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియా, అధికారులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.ఆదివారం ఎన్. జి.కళాశాల నల్గొండ,నకిరేకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో అభ్యర్థులు, ఏజెంట్ లు,కౌంటింగ్ సిబ్బంది,మీడియాకు ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించారు.కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని ఆయన

కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు

  కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కోదాడ గర్ల్స్ మైనారిటీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి లో 80 సీట్లు ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40 బైపీసీ లో 40 సీట్లు కలవని మత గురువు  మౌలానా అబ్దుల్ లతీఫ్ తెలియ చేశారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల మసీదుల 1)సదర్ 2)ఇమాములు 3)ఆఫీజ్ 4)ఆలీమ్ 5)మసీదు కమిటీలు 6)మైనార్టీ ముఖ్య నేతలను, తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజలకు తెలియజెయ్యండని కోరారు. ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా htty:// tmreis.telangana.gov.in తెలంగాణలోని అన్ని మైనారిటీ గురుకుల పాఠశాలలో పేద పిల్లలను జాయిన్  కావొచ్చని   ఆయన మరియు  కోదాడ గర్ల్స్ మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్, కోరారు వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు 7331170856 9346541637 7569110928

గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  కోవిడ్ రోగుల కోసం  గాంధీ ఆసుపత్రికి drdo నుంచి 100 ఆక్సిజన్ సిలెండర్లను అందజేసిన  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి హాజరైన drdo మిస్సైల్  dg msr ప్రసాద్,గాంధీ సూపరిండెంట్ రాజారావు రాజారావు,గాంధీ superindent కామెంట్స్ కిషన్ రెడ్డి గారు మాకు ఏ ఇబ్బంది ఉన్న వెంటనే రెస్పాండ్ అవుతున్నారు,మాలో   నైతిక స్టైర్యం  నింపుతున్నారు Drdo నుంచి వచ్చిన సిలెండర్లతో మరి కొంతమంది ని కాపాడుకోగలుగుతాం కిషన్ రెడ్డి గారి చొరవ వల్లే అన్ని రకాలుగా గాంధీ సేవలందించగలుగుతుంది కిషన్ రెడ్డి కామెంట్స్ గాంధీ  650 icu పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి గా సేవలందిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారు గాంధీకి ఆక్సిజన్ సిలెండర్లను ఇవ్వాలని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజనాధ్ ను కోరగా drdo సతీష్ గారు మిస్సైల్ కు వాడే నైట్రోజన్ సిలెండర్లను ఆక్సిజన్ సిలెండర్లగా కన్వర్ట్ చేసి గాంధీకి పంపారు నేడు 50 వచ్చాయి,రేపు మరో 50 సిలెండర్ల వస్తాయి తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో కేంద్రం తోడు ఎప్పుడూ ఉంటుంది గాంధీ ఆసుపత్రిలో ఆక్సిజన్  కొరత ఉండకూడదని సిఎస్ తో మాట్లాడాను,నివేదిక అందజేయమ

ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు

  ఎమ్మెల్యే కంచర్ల గృహంలో విజయోత్సావాలు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నివాసగృహంలో విజయోత్సావాలు జరుపుకుంటున్న టి ఆర్ యస్ నేతలు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,యన్. భాస్కర్ రావు టి ఆర్ యస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ యం ఎల్ సి పూల రవీందర్, కంచర్ల కృష్ణారెడ్డి,కటికం సత్తయ్య గౌడ్,టి ఆర్ యస్ వి నాయకులు జిల్లా శంకర్ తదితరులు.

కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు*

  *కిలాడీ లేడీ మోసాలకు చెక్ పెట్టిన నల్లగొండ జిల్లా పోలీసులు* - - పెండ్లి సంబంధాల పేరిట అబ్బాయిల పేర్లు మార్చి చెపుతూ మోసాలకు పాల్పడుతున్న యువతి - - సామాజిక మాధ్యమాలు వేదికగా వలపు వల విసురుతూ డబ్బులు దండుకుంటున్న వైనం - - పదుల సంఖ్యలో బాధితులు, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించిన బాధితులు నల్లగొండ : పెండ్లి సంబంధం కోసం మీ ఫోటో ఎవరికైనా ఇస్తున్నారా, ఆ వ్యక్తి గురించి మీకు అన్ని వివరాలు తెలిస్తేనే ఇవ్వండి..... లేదంటే ఇలా మోసపోతారని హెచ్చరిస్తున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు.... ఇలా అబ్బాయిల ఫోటోలను అమ్మయిల తల్లితండ్రుల వద్ద నకిలీ పేర్లతో, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ సంబంధం మాట్లాడతానని డబ్బులు దండుకుంటుంది ఈ కిలాడీ లేడి... అంతే కాదు తాను ఎవరి ఫోటోలైతే అమ్మాయిల తల్లితండ్రులకు చూపిస్తుందో వాళ్లను సైతం బెదిరిస్తూ తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ కేసులలో ఇరికిస్తానని బెదిరింపులకు పాల్పడుతుంది ఈ మాయలేడి... ఇలా మోసాలకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్న కిలాడీ లేడీని అరెస్ట్ చేసి ఆమె చేస్తున్న మోసాలకు ఫుల్ స్టాప్ పెట్టారు నల్లగొండ జిల్లా పోలీసులు... ఇక వివరాలలోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లికి

కౌంటింగ్ విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి సూచనలు చేస్తున్న డిఐజి ఏ.వి. రంగనాధ్

  నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బందికి నల్లగొండ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సూచనలు చేస్తున్న డిఐజి ఏ.వి. రంగనాధ్, ఆయన వెంట డీఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణా రెడ్డి, వెంకటేశ్వర్ రావు, ఇతర పోలీస్ అధికారులు

కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక ప్రాణం విడిచిన తండ్రి.

 కరోనా తో కొడుకు మృతి ని తట్టు కోలేక  ప్రాణం విడిచిన తండ్రి.  కరోన మహమ్మారి బారిన పడి కుమారుడు గత నాలుగు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు,అదే ఆలోచన తో బెంగ తో తండ్రి తనువు చాలించారు.  నాగారం మున్సిపాలిటీ లోని రాంపల్లి చెందిన నీరుడి వాసు కరోనా తో చికిత్స కోసం నగరం లోని ఆసుపత్రి లో చేరి తనువు చాలించారు,ఆర్థికంగా కుటుంబ పరిస్థితి బాగో లేక ఆసుపత్రి  బిల్లు చెల్లించలేక బాధపడుతూ  తండ్రి బాలయ్య రోజు ఆలోచించి ఆలోచించి తనువు చాలించారు. ఇది విన్న మున్సిపల్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.కోడలు ఇద్దరు పిల్లలతో ఇంటికి పెద్దలను కోల్పోయి అనాధలు గా మిగిలి పోయారు. అయ్యో భగవంతుడా అని ఏడవడం తప్ప ఏమీ లేకుండా అయిపోయే పాపం అంటూ కాలనీవాసులు శోకసంద్రం లో మునిగిపోయారు కరోన రక్కసి తో కుటుంబం అతలాకుతలం అయి ఆర్థికంగా ఆదుకుంటే తప్ప ఎలాంటి ఆధారం లేని విగత జీవులుగా ఉన్నారు,ఈ తరుణం లో దయ తలిచి తోటి వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు.

మసాజ్ సెంటర్ పై సైబరాబాద్ స్పెషల్ టీం పోలీసుల దాడి

 కే పి హెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధిలో లో మసాజ్ సెంటర్ పై సైబరాబాద్ స్పెషల్ టీం పోలీసుల దాడి  రోడ్ నెంబర్ వన్ లో Spa ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్ మౌనిక శివ, మరో ఇద్దరు విటులు అరెస్ట్.  గత ఏడాది జనవరిలోనూ అరెస్టయిన ఆర్గనైజర్ మౌనిక

కౌంటింగ్ రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

 నల్గొండ పట్టణంలో ని గిడ్డంగుల సంస్థ గౌడన్స్ లో ఏర్పాటు చేసిన సాగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు,, కౌంటింగ్  రిహార్సల్స్   ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. RO రోహిత్ సింగ్...  కేంద్ర ఎన్నికల పరిశీలకుడు    సజ్జన్ సింగ్ చవాన్.....

మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద orange travels bus బోల్తా పది మందికి గాయాలు

 బ్రేకింగ్ న్యూస్  సూర్యాపేట జిల్లా జిల్లా కోదాడ  NH65  పై  మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద  orange travels bus బోల్తా  పది మందికి గాయాలు   39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు   హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద   ఘటన