Skip to main content

Posts

Showing posts from June, 2023

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

 *కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం * తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.  చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం తమ అదృష్టమని యువత ఆనందం వ్యక్తం చేసారు. ఆ విధంగా అన్ని వయసుల వారిని ఉర్రూతలూగిస్తూ పద్మాకర్ గారు చేసిన అష్టావధానంతో తెలుగు సాహితీ కాంతులు కెనడాలో వెల్లివిరిసాయి. గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత

అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం

 *అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంఛార్జిగా అవ్వారి భాస్కర్ నియామకం* *అవ్వారి భాస్కర్ నియామకంతో పద్మశాలి యువతలో నయా జోష్*   *వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పద్మశాలి యువత పాత్ర కీలకం* *రాజ్యాధికార సాధన లక్ష్యంగా ముందుకు సాగాలి* *దేశవ్యాప్తంగా యువజన కమిటీలు* - *అవ్వారి భాస్కర్* అఖిల భారత పద్మశాలి సంఘం మీడియా విభాగం అధ్యక్షులు *అవ్వారి భాస్కర్* కు అఖిల భారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇన్చార్జిగా అదనపు బాధ్యతలను సంఘ అధ్యక్షులు కందగట్ల స్వామి ఇచ్చారు. ఈ మేరకు నారాయణగూడ లోని పద్మశాలి భవన్ లో నియామక పత్రాన్ని గురువారం అప్పగించారు . ఈ సందర్భంగా సంఘ పెద్దలు అవ్వారి భాస్కర్ ని ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా , రాష్ట్ర అధ్యక్షులుగా అవ్వారి భాస్కర్ సుదీర్ఘకాలంగా సేవలందించారు. భాస్కర్ సేవలను గుర్తించి అఖిల భారత పద్మశాలి సంఘంలో మీడియా విభాగం జాతీయ అధ్యక్షునిగా నియమించారు. తాను చేపట్టిన ప్రతి పదవిని బాధ్యతగా స్వీకరించి ఆ పదవులకే భాస్కర్ వన్నె తెచ్చారు. మీడియా రంగంలో భాస్కర్ కు ఉన్న అనుభవం అఖిల భారత పద్మశాలి

భూపతి టైమ్స్ దిన పత్రిక, జూన్ 29, 2023 ను ఈ క్రింద లింక్ టచ్ చేసి చదవండి

 భూపతి టైమ్స్ దిన పత్రిక, జూన్ 29, 2023 ను ఈ క్రింద లింక్   టచ్ చేసి చదవండి   

ACB వలలో చిక్కిన నిజామాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇద్దరు

  ACB వలలో  చిక్కిన నిజామాబాద్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,  అసిస్టెంట్ డైరెక్టర్, మరో ఇద్దరు 28.06.2023న సుమారు 12.15 గంటలకు నిందితుడునిజామాబాద్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్,  అసి. డైరెక్టర్ (AO-1) శ్రీ శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష రూపాయలు లంచం డిమాండ్‌ చేసి స్వీకరించినప్పుడు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు శ్రీ దుగ్గేన రాజేందర్ R/o ధర్మోరా గ్రామం, మోర్తాడ్ మండలం,నిజామాబాదు జిల్లా నుండి10,000/- అధికారిక ఉపకారం చేయడానికి అంటే సరిహద్దు సర్టిఫికేట్ జారీ చేయడానికి మరియు ఫిర్యాదుదారు యొక్క 5 గుంటల భూమికి సంబంధించి లొకేషన్ స్కెచ్ రిపోర్ట్/మ్యాప్. ఇవ్వడానికి లంచం తీసుకున్నారు. AO-1l ఆఫీసు టేబుల్ డ్రాయర్ నుండి కళంకిత లంచం మొత్తం రికవరీ చేయబడింది అంతకు ముందు 19.06.2023, ది (A0-2) శ్రీ ముచ్చటి వెంకటేష్,సూపరింటెండెంట్ & (AO-3) శ్రీమతి.  రహీమా, జూనియర్ అసి. అదే ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి వరుసగా 3,000/- & 2,000/-లంచం మొత్తం డిమాండ్ చేసి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుకు సంబంధించినది. AO-1, AO-2 & AO-3 అక్రమ ప్రయోజనం పొందేందుకు అక్రమంగా మరియు ని

నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం

 నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి  మాంసం ముద్దులైన మృతదేహాలు  నల్లగొండ: నల్లగొండలో ని బర్కత్ పురా కాలనీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై చనిపోయారు. ఈ సంఘటనలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు. పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుండి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.

ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం

 ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి - నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం  నల్గొండ:  ముదిరాజ్ జర్నలిస్టు పై దాడి చేసి అసభ్య పదజాలంతో ముదిరాజ్ కులమును దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ సంఘం నల్గొండ జిల్లా కమిటీ, ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం పెద్ద గడియారం చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులకు క్షమాపణ చెప్పాలని, అతని MLC పదవి తొలగించే వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముదిరాజులు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కేశబోయిన శంకర్, జర్నలిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ట సుధాకర్, ప్రధాన కార్యదర్శి పిట్టల రామకృష్ణ ముదిరాజ్ చిట్టబోయిన అంజయ్య చాగంటి రాములు చాగంటి వెంకన్న , గుడిసె పరుష రాములు సింగారపు మల్లయ్య తదితరు పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది - విజయశాంతి

 తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేకు మతి భ్రమించినట్లుంది - విజయశాంతి ఫేస్ బుక్ లో విజయశాంతి పోస్ట్

పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి

 *#హైదరాబాద్:-* *పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి*  ప్రస్తుతం బిజెపిలోనే ఉన్న.. ఊహాగానాలు నమ్మవద్దు  తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ వివరిస్తామని చెప్పిన రాజగోపాల్ రెడ్డి  కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి  ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు  టిఆర్ఎస్ బిజెపి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారు వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది అందులో భాగంగానే  కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్  కేటీఆర్ కు  కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు  నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుంది  మోదీ , అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది  కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుంది

BHUPATHI TIMES DAILY JUNE, 24, 2023

 

మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవరణలో రూ.1.4 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడి.

  మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆవరణలో రూ.1.4 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడి. పీజీ మెడికల్ సీట్ల బ్లాకింగ్ స్కామ్‌కు సంబంధించి 21.06.2023న ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 16 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించామని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 ఫిబ్రవరిలో, గుర్తు తెలియని వ్యక్తులపై అప్పటి కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (కెఎన్‌ఆర్‌యుహెచ్‌ఎస్) రిజిస్ట్రార్ దాఖలు చేసిన ఫిర్యాదుపై వరంగల్‌లోని మట్వాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఇడి మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.  కొన్ని ఏజెన్సీలు తెలంగాణ & ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థులు/ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై సీట్ బ్లాకింగ్‌లో పాల్గొంటున్నాయి మరియు KNRUHS కింద రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అభ్యర్థుల సంబంధిత పత్రాలను పొందడంలో పాల్గొంటున్నాయి. ED చేసిన పరిశోధనలో విశ్వవిద్యాలయం, దాని స్వంత విచారణల సమయంలో, KNRUHSతో కౌన్సెలింగ్‌కు కూడా దరఖాస్తు చేయలేదని తెలియజేసిన ఐదుగురు అభ్యర్థులను గుర్తించిం

BHUPATHI TIMES E-PAPER, JUNE, 22, 2023

హైందవ జీవన విధానానికి ప్రతిరూపం "దుర్గా వాహిని"

  హైందవ జీవన విధానానికి ప్రతిరూపం "దుర్గా వాహిని" @ మహిళా సురక్ష.. కుటుంబ జీవన విధానం పై అవగాహన..! @ లవ్ జిహాద్.. మతమార్పిడి పై సంక్షిప్త వివరణ @ ఘనంగా గద్వాల జిల్లా దుర్గా వాహిని శిబిరం @ భారీగా హాజరైన మహిళలు, యువతులు.. విద్యార్థినులు.. "హిందూ ధర్మ పరిరక్షణే కర్తవ్యంగా పనిచేస్తున్న సంస్థ దుర్గా వాహిని"  భారతీయ విలువలు.. సనాతన ధర్మం.. హైందవ విలువలను పరిరక్షించే బాధ్యతను దుర్గా వాహిని భుజాన వేసుకుందని దుర్గా వాహిని తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి వాణి సక్కుబాయి గారు అన్నారు. "హిందూ ధర్మ పరిరక్షణే కర్తవ్యంగా పనిచేస్తున్న సంస్థ దుర్గా వాహిని" అని అన్నారు.  భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పే బాధ్యత నేటితరం మహిళలదేనని సక్కుబాయి అన్నారు. విశ్వహిందూ పరిషత్ మహిళా యువజన విభాగమైన దుర్గా వాహిని సమావేశం గద్వాల పట్టణంలో నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ - దుర్గా వాహిని గద్వాల జిల్లా ఆధ్వర్యంలో ఒకరోజు మహిళా వికాస వర్గ ఘనంగా నిర్వహించారు. గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన వికాస శిబిరానికి దుర్గా వాహిని కార్యకర్తలు, మహిళలు భారీ

ఈనెల 26న బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక

  ఈనెల 26న బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక  *ఈనెల 26న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ నల్గొండకు రాక -* *బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్*  *నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ నందు బహిరంగ సభ* *ఈరోజు బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో మే 30 నుండి జూన్ 30 వరకు నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమంలో భాగంగా తేదీ అనగా 26-06-2023 సోమవారం నాడు సాయంత్రం 05:00 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ నందు సుమారు పదివేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు.  ఈ సభకు ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విచ్చేయుచున్నారని, ఈ సభకు బిజెపి రాష్ట్ర, జిల్లా ,మండల, పట్టణ, వివిధ మోర్చాల నాయకులు, శక్తి కేంద్ర ఇన్చార్జిలు, బూత్ కమిటీ సభ్యులు, యువకులు, విద్యార్థులు, మేధావులు, కవులు, మహిళలు నల్గొ

బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్ల లో అధికారులు వైఫల్యం...

 బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ ఏర్పాట్ల లో కొట్టొచ్చిన ప్రభుత్వ అధికారులు వైఫల్యం... శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన ఏర్పాట్లలో అపశృతి ఏర్పడింది. భక్తులకి సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలం చెందిన గుడి యాజమాన్యం మరియు పోలీస్ అధికారులు... ఆర్భాటంగా అన్ని ఏర్పాట్లు చేసాము అని చెప్పుకుంటున్న వాస్తవానికి మాత్రం పూర్తి వైఫల్యం. క్యూలైన్లో అవస్థలు పడుతున్న సాధారణ భక్తులు . రద్దీ ని సరిగ్గా నిర్వహించ లేక తప్పిపోయిన మహిళలు. దర్శనం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు కరెంట్ షాక్కు గురైనట్లు సమాచారం. నిర్వహణ ఏర్పాట్ల నిర్వహణ లో వైఫల్యం చెందడం పట్ల ఆందోళన లో భక్తులు...

ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు - అరుణ్ కుమార్ deshmukh

 ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు - అరుణ్ కుమార్ deshmukh దేశంలో బిజెపి రాష్ట్రంలో టిఆర్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు మేళ్లచెరువు మండలంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్యవర్గ సమావేశంలో అరుణ్ కుమార్ deshmukh అధ్యక్షులు మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్నటువంటి ఆరాచకాలపై మాట్లాడారు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎవరు అదేపడవద్దని అలాగే హుజూర్నగర్ లో ఉత్తంకుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు

నల్లగొండ కళాభారతి కి త్వరలో కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన - ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల

 నల్లగొండ కళాభారతి కి త్వరలో కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన -  ప్రదేశాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కంచర్ల  నల్గొండ: 93 కోట్ల రూపాయల వ్యయంతో పాత ఆర్ &బి, IB కార్యాలయాల ప్రదేశం గడియారం సెంటర్.లో నిర్మితం కాబోతున్న నల్లగొండ కళాభారతి త్వరలో నల్లగొండ లో పర్యటించనున్న పురపాలక శాఖామాత్యులు కెటిఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన.  ప్రదేశాన్ని పరిశీలించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,కమిషనర్ కేవీ రమణా చారీ,మార్కెట్ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, రావుల శ్రీనివాస రెడ్డి తదితరులు

*ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన*

  *ఈ నెల 19 నుంచి వర్షాలు : వాతావరణశాఖ ప్రకటన* ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ నెల 19 నుంచి తిరుపతి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, వైయస్సార్, చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అటు *తెలంగాణ రాష్ట్రంలో* కూడా ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది..

ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు

  ఘనంగా పల్లపు బుద్ధుడు జన్మదిన వేడుకలు నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు  జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. చిట్యాల మున్సిపాలిటీలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో పల్లపు బుద్ధుడు గారి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి దేవాలయ అర్చకులు పూలదండతో శాలువాతో సన్మానించి కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని దీవించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శేపూరి రవీందర్ గారి ఆధ్వర్యంలో పల్లపు బుద్ధుడు గారి జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించి శాలువాతో పూలమాలతో సన్మానించి కేక్ కటింగ్ చేసినారు చిట్యాల కనకదుర్గ అమ్మవారి గుడి వద్ద బిజెపి చిట్యాల మున్సిపాలిటీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్ మరియు చిట్యాల మండల రూరల్ అధ్యక్షులు పొట్లపల్లి నరసింహ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో పల్లపు బుద్ధుడు గారిని శాలువాతో సన్మానించి స్వీట్ తినిపించారు. బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లపు బుద్ధుడు గారు తన పుట్టినరోజు సందర్భంగా చిట్యాల ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ నరేష్ గా

ఆర్యవైశ్య కుటుంభానికి లివర్ ట్రాన్స్ పరెంట్ కోసం ఆర్థిక సహాయం అందించిన గుత్తా అమిత్ రెడ్డి

 ఆర్యవైశ్య కుటుంభానికి లివర్ ట్రాన్స్ పరెంట్ కోసం ఆర్థిక సహాయం అందించిన గుత్తా అమిత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం లోని మన ఆర్యవైశ్య సోదరుడు  నాంపల్లి వాసి వీరమల్ల చంద్రశేఖర్ దీర్ఘకాలికంగా "లివర్ సిరోసిస్ వ్యాధితో బాధపడుతూ చివరి దశగా లివర్ ట్రాన్స్ పరెంట్ ( మార్పిడి) కోసం కిమ్స్ ఆస్పత్రిలో 30 లక్షల రూపాయలు వ్యయంతో చికిత్స చేయించుకోవడానికి సిద్ధపడి, ఉన్న ఇల్లు 13 లక్షలకు అమ్ముకొని, మిగతా 17 లక్షలకు ఆర్థిక ఇబ్బంది పడుతున్న క్రమంలో వారి కుమార్తె అఖిల అభ్యర్ధన మేరకు ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ ఆర్యవైష్యుల కు అండ దండ గా వెన్నంటి వుండే .గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి దృష్టికి తీసుక రావడం తో వీరమల్ల చంద్రశేఖర్ కుమార్తె అఖిల కు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లక్ష 100000. రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. ఆర్థిక సహాయం చేసిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ వారికి ముఖ్యంగా గుత్తా అమిత్ రెడ్డి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు వన

కెనడా లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు - ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు

  కెనడా లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ధూమ్ ధామ్ వేడుకలు ముఖ్యఅతిథిగా కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా శుభన్ క్రిషన్ తెలంగాణ కెనడా అసోసియేషన్ (టిసిఎ) ఆధ్వర్యంలో గ్రేటర్ టోరంటో నగరంలోని తెలంగాణ వాసులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ధూమ్ ధామ్ 2023 ఉత్సవాలు అనాపిలిస్ హాల్స్, మిస్సిసాగా, కెనడాలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా శుభన్ క్రిషన్ (కెనడా కాన్సుల్-కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా), పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా (టిసిఎ) నిర్వహిస్తున్న కార్యక్రమాలని హర్షించారు. కల్చరల్ విభాగంలో పాల్గొన్న చిన్నారులని ప్రోత్సాహించి నందుకు (టిసిఎ) ను అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు పెద్దలు పాల్గొని ప్రేక్షకులను అలరింపజేసారు. ఈ సంబరాలలో 1500 కు పైగా తెలంగాణ వాసులు (ఎన్నారై) లు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, శ్రీమతి లావణ్య ఏళ్ల, శ్రీమతి అనూష ఇమ్మడి, శ్రీమతి స్వాతి అర్గుల, శ్రీమతి రాధిక దలువాయి, శ్రీమతి రజిని తోట జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్బంగా ప్రెసిడెం

ఎమ్మెల్యే మర్రి నివాసంలో ఐ టి అధికారుల సోదాలు..

  జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లోని ఎమ్మెల్యే మర్రి నివాసంలో ఐ టి అధికారుల సోదాలు..  అనారోగ్యానికి గురి అయిన  మర్రి జనార్దన్ రెడ్డి తల్లి అమృతమ్మ.. ఆస్పత్రికి తరలించిన ఐటీ అధికారులు గురి అయిన మర్రి జనార్దన్ రెడ్డి తల్లి అమృతమ్మ.. ఆస్పత్రికి తరలించిన ఐటీ అధికారులు

నేను నామ్ కే వాస్తే PIO ను అని అంటున్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO మధు

నేను నామ్ కే వాస్తే PIO ను అని అంటున్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO  మధు నేను నేను నామ్ కే వాస్తే PIO ను  మాత్రమే అన్న ఆగ్రోస్ సమాచార హక్కు. చట్టం PIO  మధు. గత నెల ధాన్యం కొనుగోలుకు అవసరమయ్యే ప్యాడి క్లీనర్,  తూకం మిషన్లు, మాయిచ్చార్ మీటర్లు, టార్పలిన్ లు, ఫ్యాన్లు  కొనుగోలుకు పిలిచిన టెండర్ ఫైల్స్ ను ఇప్పించమని  సమాచార హక్కు చట్టం క్రింద ఓ వ్యక్తి దరఖాస్తు చేశారు. గడువు లోపల సమాచారం ఇవ్వకపోవడం తో సదరు దరఖాస్తు దారుడు pio  ను కలువగా ఆ  PIO  నేను నేను నామ్ కే వాస్తే PIO ను  మాత్రమే అనడం  ఆగ్రోస్ లో సమాచార హక్కు. చట్టం అమలు తీరు తెన్నులు తెలుస్తుంది. చట్టాన్ని అమలు చేయవలసిన అధికారి చట్టాన్ని తుంగలోకి తొక్కడం శోచనీయం. చట్టాన్ని అమలు పరచని PIO పై న్యాయ పరంగా చర్యలకు ఫిర్యాదు చేస్తామని దరఖాస్తు దారుడు అన్నారు.

దక్కన్ క్రానికల్ అధినేత వెంకట్ రామి రెడ్డి అరెస్ట్..

 దక్కన్ క్రానికల్ అధినేత వెంకట్ రామి రెడ్డి అరెస్ట్.. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లకు ఈడీ షాక్ ఇచ్చింది. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. వెంకట్రామ్ రెడ్డి సహా మరో ఇద్దరిని ఈడీ అదుపులోకి తీసుకుంది. కెనరా బ్యాంకు, ఐడీబీఏ బ్యాంకులను మోసం చేసిన కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. రూ.8వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఈడీ అభియోగాలు మోపింది. గతంలో రూ.264 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో డెక్కన్ క్రానికల్ కు చెందిన 14 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. డెక్కన్ క్రానికల్ స్కామ్ పై ఈడీ ఆరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.

హిందువులంతా సంఘటితం కావాలి VHP సమావేశంలో స్వామీజీల పిలుపు

  హిందువులంతా సంఘటితం కావాలి  VHP సమావేశంలో స్వామీజీల పిలుపు హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి జరుగుతోందని.. అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు హిందూ సమాజాన్ని పీక్కుతింటున్నారని సాదు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతల ఆధారంగా.. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా మతమార్పిడి మహమ్మారి హిందుత్వం పై భీకరమైన దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు మఠాలు పీఠాల సాధువులు సంతులు ప్రముఖులతో సమావేశం నిర్వహించింది. కాచిగూడ లోని శ్రీ శ్యాం బాబా మందిర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి 110 మంది ప్రముఖ స్వామీజీలు హాజరయ్యారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాధువులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది.  స్వామీజీలు అందరూ హిందూ ఐక్యత కోసం కట్టుబడి పని చేయాలని ప్రతిన భూనారు. ప్రముఖంగా ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు.  1) మతమార్పిడిని తీవ్రంగా ప్రతిఘటించడం. 2) ఆదర్శ హిందూ కుటుంబ జీవనాన్ని ప్రోత్సహించడం. 3)

గూఢచారి openion Poll నల్గొండ బిజెపి MLA అభ్యర్థిగా మీ ఓటు

   నల్గొండ బిజెపి MLA అభ్యర్థిగా  మీ ఓటు ఎవరికి ఈ క్రింద టచ్ చేసి ఓటు వేయండి ఓటింగ్ చివరి తేదీ 30-6-2023  సాయంత్రం 4 లకు రిజల్ట్ పబ్లిష్ https://strawpoll.com/polls/e2nar0DezgB

ఖమ్మo లో అమిత్ షా సభకు శ్రీమతి ఉప్పల శారద గృహమునందు ప్రిప్రెటరీ మీటింగ్

ఖమ్మo లో అమిత్ షా సభకు శ్రీమతి ఉప్పల శారద గృహమునందు ప్రిప్రెటరీ మీటింగ్ మూడవ టౌన్ seniour సభ్యుల సమావేశం జరిగినది

కొత్తగా 125 మంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం

125 మంది  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా  నియామకం Sri Mavala Ganga Reddy Sn Nalla Ratnakar Reddy sri Koyala Emaj Sri Raju |Si Narayana Reddy Sn Ravi Pandey |Sri Appala Ganesh Chakravarthy Sri Ajmeera Hari Naik Sri Mohan Rao Patl Sn K Malikarjun Reddy Si Rama Rao Patl |Sri Pavai Hareesh Babu Si Ajmeera Athmaram Nak |sri Konga Satyanarayana Sn Peddola Gangareddy SriP Vinay Kumar Reddy Sri V Mohan Reddy |Sri Varayogi Shyamsundar Sri Medapati Prakash Reddy Sri Aleti Malikarjun Reddy Sri Adluri Srinivas Si Malyadri Reddy Dr. Ram Reddy Si Pala Kishna Reddy Si Banganu Raiendra Dr Pullela Pavan Kumar Sn Enugonda Nageshwar Reddy |Smt Tula Uma |Sri JN Venkat draprasad Si Surabhi Naveen Si Ram Sudhakar Smt Balmoori Vanitha |Si Vaddepally Ramchander Si Chandupatla Sunil Reddy Si G. Suresh Reddy |Si Parvathailu Sri Merugu Hanmanth Goud S Matta Venkateshwar Reddy Si Aladi Ramesh Sri Daruvu Elanna Sri Kanimela Chakradhar Reddy Sri Adelli Ravinder Si Eda Ramesh Smt C. Godavari Anj Reddy Si Damodar

స్కూల్ బస్సుల పై రవాణా శాఖ ఫోకస్.

 విద్యా సంస్థలు ప్రారంభం కావడం తో……విద్యార్ధులను తరలించే స్కూల్ బస్సుల పై రవాణా శాఖ ఫోకస్. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సుల పై కొనసాగుతున్న దాడులు. రాజేంద్రనగర్, శంషాబాద్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం లో స్కూల్ బస్సుల పై దాడులు. మోటర్ వాహనాల చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న స్కూల్ బస్సుల పై కొరడా. Rc, permit, ఫిట్‌నెస్, ఫయర్ extinguisher, ఫస్ట్ ఎయిడ్ కిట్ లను తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు. బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తున్న అధికారుల బృందం. 60 సంవత్సరాల వయస్సు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని వార్నింగ్.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్

మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్ల ధర్నా*

  *ఇంట్రా కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించండి ఎర్రమంజిల్ లోని  మిషిన్ భగీరథ కార్యాలయం వద్ద  కాంట్రాక్టర్ల ధర్నా* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం అని చెబుతున్న మిషన్ భగీరథ పనులు చేసిన  కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ కార్యాలయానికి వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఇంజనీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి ని కలిసి కార్యాలయం ముందు బైఠాయించి తమ బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు శుద్ధమైన నీళ్లు అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా తామంతా ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. ఇంట్లోని మహిళల బంగారం, బంధువులు స్నేహితులు వద్ద అప్పులు చేసి మరి పనులు చేశామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేసి 5ఏళ్ళు గడుస్తున్నా తమకు రావలసిన బిల్లులు రాకపోవడంతో తమ పరిస్థితి అద్వానంగా తయారైందని వాపోయారు. సొంత ఊర్లలో తిరగలేని పరిస్థితి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభు

నాలుగు తరాల కాంగ్రెస్ పాలన కంటే మోదీ తొమ్మిదేళ్లలో పేదలకు ఎక్కువ మేలు చేశారు: అమిత్ షా

  నాలుగు తరాల కాంగ్రెస్ పాలన కంటే మోదీ తొమ్మిదేళ్లలో పేదలకు ఎక్కువ మేలు చేశారు: అమిత్ షా నాందేడ్:  పేదరిక నిర్మూలనలో ఘోరంగా విఫలమైనందుకు కేంద్రంలోని కాంగ్రెస్ నేతృత్వంలోని గత ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తూ, గత తొమ్మిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ జీ దేశంలోని పేదలకు కాంబినేషన్ కంటే ఎక్కువ మేలు చేశారని హోంమంత్రి అమిత్ షా శనివారం అన్నారు.  మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన బీజేపీ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా షా మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు, మరుగుదొడ్లు, వంటగ్యాస్ వంటి కనీస అవసరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఏనాడూ అందలేదన్నారు. గాంధీ కుటుంబం హయాంలో  కాంగ్రెస్ పేదరికాన్ని మాత్రమే కొనసాగించిందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీ నేతృత్వంలోని గత 9 సంవత్సరాల ప్రభుత్వం భారతదేశం గర్వించదగిన సంవత్సరాలని, భారతదేశం యొక్క అభివృద్ధి మరియు భారతదేశం పేదల సంక్షేమానికి భరోసా ఇస్తుందని అన్నారు. సోనియా-మన్మోహన్ పాలన ముగిసి, మోడీ జీ వచ్చిన తర్వాతనే భారతదేశం పురోగమించి, అభివృద్ధికి భరోసా ఇచ్చింది' అని షా అన్నారు.  పదేళ్ల

మేలుకోండి నల్గొండ ముస్లింలారా - మహమ్మద్ అలీ, జర్నలిస్టు-

 మేలుకోండి నల్గొండ ముస్లింలారా  - మహమ్మద్ అలీ,  జర్నలిస్టు- ☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️ *_గత మూడు సంవత్సరాల నుంచి నేనొక్కడినే ..అల్లాహ్ సాక్షిగా.. నా ప్రాణం.. నా పరువు ను ...నా ఇంటి 🏡 నీ పనంగా పెట్టి... అల్లాహ్ తోడుగా చేస్తున్న ధర్మపోరాటం ఇది ✊..._* *ఎన్నో అవమానాలు.!* *మరెన్నో అపనిందలు..!!* *ఇంకెన్నో వేధింపులు...!!!*    *!! అయినా సరే.. అన్యాయలు జరుగుతుంటే చూస్తూ ఉండలేను.. వేల కోట్ల విలువైన వందల ఎకరాల (536 ఎకరాలు) కబ్జా చేసి.. తమ అయ్యా తాతల జాగీర్లుగా చెప్పుకుంటూ.. పేద ప్రజల ధన ,మాన ప్రాణాలను తో చెలగాటం అడుతూ... నల్లగొండలో నయ నయీం రాజ్యాన్ని నడిపిస్తూ.. రాజ్యాంగ వ్యవస్థల్ని ప్రభావితం చేస్తూ.. రౌడీయిజం రాజ్యమేలుతుంటే...*    *వేల కోట్ల విలువైన.. వందల ఎకరాల ముస్లింల జాతి సంపాదనను అమ్ముకుంటూ....విందులకు, పసందులకు... విలాసాలకు... కొండల్ని కరిగిస్తు.. యువతకు మత్తుకు బానిసలుగా చేస్తూ... తమ కబ్జా స్థలాలకు కాపలా దారులుగా... బ్రోకర్లుగా మారుస్తూ..యువశక్తిని నిర్వీర్యం చేస్తుంటే...* *!!న్యాయం, ధర్మం.. నా వైపు ఉన్నప్పుడు... నేను లొంగను* *?? ప్రశ్నించే తత్వం.. ✊పోరాడే తత్వం లేని చోట బానిసత్వం కొనసాగుతోంద

తమ ఉదారత్వాన్ని చాటుకున్న నాచారం పోలీసులు

 *తమ ఉదారత్వాన్ని చాటుకున్న నాచారం పోలీసులు* నాచారం జాన్సన్ గ్రామర్ స్కూల్ పరీక్ష కేంద్రానికి చేరుకున్న పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రం ఇది కాదు అనడంతో అయోమయంలో పడ్డ అభ్యర్థులను నాచారం పోలీసులు తమ వాహనంలో వారి వారి పరీక్ష కేంద్రాలకు చేర్చారు అభ్యర్థులు నాచారం పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు

క్లిక్ చేయండి ఫ్రీ గా గూడచారి 64 పేజీలు చదవండి

 

మహిళను హత్య చేసిన పూజారి

 *శంషాబాద్* శంషాబాద్ పరిధిలో మహిళను హత్య చేసిన పూజారి - వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి - పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో మహిళను హత్య చేసిన పూజారి - ఇదివరకే పూజారికి వివాహమై ఇద్దరు పిల్లలు - ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటుచేసిన పూజారి - సరోయూర్ నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేసిన పూజారి - అనంతరం మహిళా మృతదేహాన్ని కవర్ లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్ లో పడేసిన పూజారి - ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్ జి ఐ ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పూజారి - కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టిన పోలీసులు మూడు రోజుల క్రితం మహిళ ను హత్య చేసిన పూజారి నిందితుడు వెంకట సాయి సూర్య కృష్ణ, మృతురాలు అప్సర

మంత్రి గంగుల కు తప్పిన పడవ ప్రమాదం

  మంత్రి గంగుల కు తప్పిన పడవ ప్రమాదం   మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పడవ ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది,   అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సకాలంలో ఆయనను రక్షించారు.  తెలంగాణ టర్న్స్ 10 వేడుకల్లో భాగంగా నదుల పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సరస్సు వద్ద ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగింది.

నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ బీరప్ప

 *నిమ్స్ డైరెక్టర్ గా డాక్టర్ బీరప్ప నియామకం* *ప్రభుత్వ ఉత్తర్వులు జారీ*