Skip to main content

Posts

Showing posts from May, 2023

పదేండ్ల తెలంగాణలో దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? - కప్పర

 పదేండ్ల తెలంగాణలో  దందుకున్నది ఎవరు? దగా పడ్డది ఎవరు.? జై తెలంగాణ ఇది తెలంగాణ ప్రజల ఉద్యమ నినాదం. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న దృఢ సంకల్పంతో నాటి పోరాటంలో ముక్కోటి గొంతుకలు ఒక్కటై దిక్కులు పిక్కటిల్లెల, భూమి బద్దలయ్యేలా, పాలకుల గుండెలు అదిరిపోయేలా గర్జించిన రణ నినాదమది. అనుకున్నట్టుగానే, తెలంగాణ ప్రజానీకం ఆశించిన విధంగా రాష్ట్రం సాకారమైంది. చూస్తుండగానే పదేళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పుడు మనం చాలా ముందుకు వచ్చాం. ఇక ఒక్క అడుగు ఆగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. పదేళ్ల తెలంగాణలో దండుకున్నది ఎవరు. దగా పడ్డది ఎవరో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ ఉద్యమంలో కలాలను, గళాలను, హాలాలను, ఒక్కటిగా చేసి ఉద్యమం లో భగస్తులను చేసింది జర్నలిస్టులు. సర్వరోగ నివారిణి జిందా తిలస్మాత్  అన్న చందంగా అన్ని సమస్యలకు తెలంగాణ ఒక్కటే పరిష్కార మార్గమని అందుకోసం అలుపెరుగని పోరాటం అవసరమని భావించాం. మనం ఏది అనుకున్నామో , ఏమి ఆలోచించామో ఆ భావాలన్నింటినీ ప్రజలపై రుద్దాం. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఒక ఆకర్షణీయ నినాదాన్ని తయారుచేసి ఉద్యమకారులకు అందించాము. 1969 నుంచి పోర

*సీఎం కు ప్రసాదం అందించిన ఎమ్మెల్యే బిగాల *

 *సీఎం  కు  ప్రసాదం అందించిన ఎమ్మెల్యే  బిగాల * రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల కలిశారు. సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయిన ఎమ్మెల్యే గతవారం మూడు రోజులపాటు వైభవంగా జరిగిన ఆలయ స్థాపన మహోత్సవంలో పూజలు అందుకున్న ప్రసాదాన్ని అందించారు. తన స్వగ్రామం మాక్లూర్ లో నిర్మించిన దేవాలయాల విశిష్టతను సీఎంకు ఎమ్మెల్యే వివరించారు. తన తండ్రి కృష్ణమూర్తి గారి సంకల్పాన్ని బిగాల సోదరులు ఏ విధంగా పూర్తి చేశారన్న అంశాన్ని సీఎంకు చెప్పారు. ఓకే ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప సహిత,శ్రీ ఆంజనేయ శివ పంచాయతన సహిత, శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయాలను నిర్మించి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సోదరులు చేసిన కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

నూతన పార్లమెంట్‌ భవనానం

 నూతన పార్లమెంట్‌ భవనానం* మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నూతన పార్లమెంట్‌ భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. నూతన పార్లమెంట్ భవనం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పార్లమెంట్ భవనంపై మీ ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్తో వీడియోను 'మై పార్లమెంట్ మై ప్రైడ్' హ్యాష్ట్యాగ్తో షేర్ చేయాలని కోరారు. అందులో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానని.. వీడియోను మర్చిపోవద్దంటూ చెప్పారు. అత్యాధునిక సదుపాయలతో దాదాపు 15 ఏకరాల్లో త్రిభుజాకారంలో పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించారు. ఉభయసభల్లో ఉంచిన అశోక్‌ చక్రం ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ పక్షి నెమలి ఆధారంగా చేసుకొని కొత్త లోక్‌సభ ఛాంబర్‌ను డిజైన్‌ చేశారు. రాజ్యసభ ఛాంబర్‌ను జాతీయ పువ్వు కమలం ఆధారంగా రూపొందించారు. 2020లో పార్లమెంట్కు శంకుస్థాపన చేయగా.. మే 28న జాతికి అంకితం చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

చిన్న పత్రికల గ్రేడింగుల లో ప్రింటింగ్ ప్రెస్ నిబంధన తొలగించాలి - చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు

 చిన్న పత్రికల గ్రేడింగుల లో ప్రింటింగ్ ప్రెస్ నిబంధన తొలగించాలి   -  చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు                                    హైదరాబాద్ మే 26... చిన్న మధ్య తరహా దినపత్రికల గ్రేడింగ్ విషయంలో కొంతమంది స్వార్థంతో ఆలోచిస్తూ చిన్న పత్రికలకు గ్రేడింగ్ విషయం సందర్భంగా ప్రింటింగ్ ప్రెస్ ప్రస్తావన తెస్తూ తమకు అనుకూలంగా నిబంధనలు పెట్టిస్తూ దొడ్డిదారిలో లబ్ధి పొందుతున్నారని చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజమైన అర్హతలు ఉన్నవారికి అన్యాయం చేస్తున్నారన్నారు వాస్తవ పరిస్థితులను గతంలోని నిబంధనలను పరిశీలించి అందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు నూతన జీవో వచ్చేలా చర్యలు తీసుకుని ఎం ప్యానెల్మెంట్ గ్రేడింగ్ విషయంలో అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన కోరారు ప్రింటింగ్ ప్రెస్ లు ఎవరికీ లేవు ఉన్నవారు ఇతరుల పేపర్లతోపాటు తమ పేపర్లు ప్రింట్ చేస్తున్నారు అసలు ఏ బి సి డి గ్రేడ్లకు ప్రెస్ నిబంధనలకు అర్థం లేదు ఎవరైనా కోర్టులో ఛాలెంజ్ చేస్తే అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏ బి గ్రేడ్

*దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి* *కేవిపిఎస్ జిల్లా కమిటి డిమాండ్*

  *ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం*  *దళిత అడ్వకేట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి* *కేవిపిఎస్ జిల్లా కమిటి డిమాండ్* తుంగతుర్తి నియోజకవర్గంలో దళితబంధు అవినీతి పై ప్రశ్నించినందుకు దళిత న్యాయవాది యుగేందర్ పై ఎమ్మెల్యే గాదరి కిశోర్ అనుచరులు భౌతిక దాడికి పాల్పడడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవిపిఎస్) జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బుధవారం కేవిపిఎస్ జిల్లాకార్యదర్శి పాలడుగు నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దళిత బందులో అవినీతి జరిగిన దానిని స్వయాన ముఖ్యమంత్రి గారి అంగీకరించారని అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన చేతిలో ఉందని ప్రకటించారని అదే విషయాన్ని ప్రస్తావించిన దళిత న్యాయవాధీపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడడం శోచనీయం అన్నారు. దళితబంధు రాజకీయలకతీతంగా అర్హులైన దళితులందరికి ఇవ్వాలనే న్యాయమైన డిమాండ్ ప్రకారం అందరికి ఇవ్వాలన్నారు.  ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి దళితులపై పరుష పదజాలం వాడడం సమర్థనీయం కాదన్నారు. దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న న్యాయవాధీకి మెరుగైన వైద్యం అందించాలని దాడికి పాల్పడిన వారిని తక్షణ

ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

  గూడచారి :   పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కారు. నల్లగొండ జిల్లా డిండి గ్రామపంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీఓగా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. శంకరాచారి అనే వ్యక్తి తన ఇంటి రికార్డులు ఇవ్వాలని కోరగా పదివేల లంచం డిమాండ్ చేశాడు. దీనిపై శంకరాచారి ఏసీబీని ఆశ్రయించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో శ్రవణ్ కుమార్ పది వేల రూపాయలను శంకరాచారి నుండి తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు  

రవీంద్రనాథ్ ఠాగూర్ దార్శనికత స్ఫూర్తితో విద్యలో స్థానిక భాషపై అమిత్ షా ప్రాధాన్యత

  రవీంద్రనాథ్ ఠాగూర్ దార్శనికత స్ఫూర్తితో విద్యలో స్థానిక భాషపై అమిత్ షా ప్రాధాన్యత స్థానిక భాషలో విద్యను అందించాలనే ప్రతిజ్ఞ, హోం మంత్రి అమిత్ షా యొక్క జాతీయ విద్యా విధానం (NEP) లో చెరగని ముద్ర వేయబడింది, ఇది స్థానిక భాషలో విద్యను అందించడాన్ని నొక్కి చెబుతుంది, ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఎల్లప్పుడూ ఒకరి మాతృభాషలో విద్యపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.  అతను/ఆమె తన మాతృభాషలో మాట్లాడలేకపోతే పిల్లల ఆలోచన మరియు పరిశోధన సామర్థ్యం తీవ్రంగా పరిమితం చేయబడుతుంది.  హోం మంత్రి షా ఆలోచనల నుండి వచ్చిన నూతన విద్యా విధానం, గురుదేవ్ ఆలోచనల నుండి ప్రేరణ పొంది మాతృభాషలో విద్యకు ప్రాధాన్యతనిచ్చింది. రవీంద్రనాథ్ యొక్క అమర క్రియేషన్స్ యొక్క విపరీతమైన పాఠకుడు, షా రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క నిజమైన శిష్యుడు మరియు రాజకీయాలతో సహా వివిధ అంశాలలో గురుదేవ్ యొక్క తత్వశాస్త్రం యొక్క దృఢ విశ్వాసం.  NEP అనేది ఠాగూర్ యొక్క తత్వశాస్త్రం ఆధారంగా రూపొందించబడింది, ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని మరియు పరిశోధించడానికి మరియు ఆమె అంతరంగాన్ని అన్వేషించడంలో సహాయపడుతుంద

సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు

 _*కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు 15 వేల నగదు స్వాధీనం.. సబ్ రిజిస్టార్ తో పాటు స్టాంప్ రైటర్ అరెస్ట్*_ ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి కంభం మండలం కందుల పురం గ్రామానికి చెందిన సాకం కృష్ణా రంగారెడ్డి అనే రైతు   205 గజాల భూమిని 45000 వేల నగదును డిమాండ్ చేసి చివరికి 15000 ఇచ్చే లాగున సబ్ రిజిస్టర్ డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణ రంగారెడ్డి 14400 యాప్ ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు ఇక్కడి స్టాంప్ రైటర్ శ్రీరామచంద్రుడు అలియాస్ రాము సబ్ రిజిస్టర్ ఎస్ శ్రీరామ్మూర్తి కి 15 వేల నగదును లంచంగా ఇస్తుండగా ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఏసీబీ డిఎస్పి తెలిపారు.

బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..

 బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ చెరువులో భారీగా చేపల మృతి..  వేల సంఖ్యలో చనిపోయి నీళ్లపై తేలుతున్న చేపలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వాకర్లు.. రంగంలోకి దిగిన పిసిబి అధికారులు.. ఫిషరీస్ అధికారులు

చీఫ్ అడ్వైసర్ గా సోమేష్ కుమార్

 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చీఫ్ అడ్వైసర్ గా సోమేష్ కుమార్ ను నియమిస్తూ జీవో విడుదల చేశారు. క్యాబినెట్ హోదాతో 3 సంవత్సరాలు చీఫ్ అడ్వైసర్ గా కొనసాగుతారు.

సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ- బురుగడ్డ పుష్ప నగేష్

 సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం బీరప్ప పండుగ- బురుగడ్డ పుష్ప నగేష్  సాంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దాలు కురుమ లు నిర్వహించే బీరప్ప పండుగ అని పటాన్చెరు మాజీ కార్పొరేటర్ ఉమ్మడి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బూరుగడ్డ పుష్ప నగేష్ అన్నారు.జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి లో జరుగుతున్న బీరప్ప చౌడలమ్మ జాతరకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. కురుమల ఆరాధ్య దేవం బీరప్ప కామరతి కళ్యాణోత్సవం యాదవుల ఆరాధ్య దైవం చౌడలమ్మ కళ్యాణ్ ఉత్సవం అంగరంగ వైభరంగ వైభవంగా నిర్వహించారని కొనియాడారు. రాష్ట్రంలో ఉండే ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని రైతులు పంటలు సమృద్ధిగా పండి సంతోషంగా ఉండాలని కులదైవాన్ని కోరుకున్నానని అన్నారు. కురుమల్లో రాజకీయంగా అత్యంత వెనుక పడ్డారని ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్య పరంగా కురుమలు ముందుండాలని గ్రామాల్లో అన్నదమ్ముల కలిసిపోయే తత్వం కురుమ కులానికి ఉన్న గొప్ప వరం అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో కురుమలు బీరప్ప సంస్కృతిని కొనసాగిస్తున్నారని ఈ సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష

జర్నలిస్ట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్

  జర్నలిస్ట్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ నల్గొండ : దళిత బంధుపై HMTV లో వచ్చిన కధనం పై ...నకరికల్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ,దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కక్ష్యపూరితంగా వ్యవహరించి...వ్యక్తిగతంగా తీసుకుని HMTV యాజమాన్యం పై HMTV జిల్లా ఇంచార్జ్ ఉన్న నాపై Sc St అట్రాసిటీ కేసు తో పాటు ఇతర కేసులు ఆరు పోలీసు స్టేషను లలో నమోదు చేయడం ....ఎమ్మెల్యే ల ఒత్తిడి తోనే కేసులు నమోదు చేసారని అక్రమ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తోటి జర్నలిస్టు సహకారం తో జిల్లా ఎస్పీ అపూర్వ రావును కలిసి వినతి పత్రం అందజేసారు. హెచ్ఎంటీవీ లో న్యూస్ వచ్చిన దగ్గర నుంచి నకరికల్లు, దేవరకొండ నియోజకవర్గం లోని పలు మండలాల నుంచి ఎమ్మెల్యే ల పేరు చెబుతూ వారి అనుచరులు బూతులు తిడుతూ భౌతిక దాడులు చేస్తని బెదిరింపులు చేస్తున్నారని దీనిపై వారు మాట్లాడిన వాయిస్ రికార్డు లు ఉన్నాయని ఎస్పీ కి వివరించారు..‌ప్రజాస్వామ్యంగా న్యూస్ కవరేజి చేస్తే జర్నలిస్టు లపూ కేసులు పెట్టడం ఎంటనీ అదీ కూడా Sc St అట్రాసిటీ కేసులు పెట్టడం ఎంటనీ ఎస్పీ దృష్టి కి జర్నలిస్టు లు జర్నలిస్టు సంఘాలు తీసుకెళ్లాయి.. HMTV సిబ్బంది యాజమాన్యం పై అక్

గీతా కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవి .

  గీతా కార్మికుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా పల్లె రవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం... రెండేళ్ల పాటు చైర్మన్ గా కొనసాగనున్నారు పల్లె రవి

గాంధీభవన్ ను ముట్టడించిన బజరంగ్ దళ్

 గాంధీభవన్ ను ముట్టడించిన బజరంగ్ దళ్ @ పోలీసుల కళ్ళుగప్పి గాంధీభవన్ ముట్టడికి బయలుదేరిన శివరాములు @ వేలాది మంది పోలీసులు మోహరించినా.. మెరుపు దాడి @ గాంధీభవన్ లోకి చొచ్చుకొని వెళ్లి నిరసన @ పోలీసుల అత్యుత్సాహం.. బజరంగ్దళ్ కార్యకర్తలపై దాడులు @ పోలీసుల దాడిలో గాయపడిన బజరంగ్ దళ్ కార్యకర్తలు @ చట్ట విరుద్ధంగా అక్రమ కేసుల బనాయింపు @ హిందూ ద్రోహి అని మరోసారి రుజువు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ @ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహన కార్యక్రమం విజయవంతం బజరంగ్ దళ్ ను నిషేధిత ఉగ్రవాద సంస్థ PFI తో పోల్చడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. బుధవారం ఉదయం 10:30 నుంచి విడతలు విడతలుగా నాలుగుసార్లు గాంధీభవన్ ముట్టడించింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముస్లిం సంతుష్టీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ హిందువులపై విషం చిమ్మడాన్ని నిరసిస్తూ బజరంగ్ దళ్ ఆందోళనకు దిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలతో పాటు కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసింది. బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు నేతృత్వంలో భాగ్యనగర్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యా

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - టిజేయు

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి - టిజేయు  *ఆర్డీవోను కలిసిన టీ జే యు జర్నలిస్టులు..* జర్నలిస్టులకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి - టిజేయు అక్రిడేషన్ రాని వారికి కార్డులు త్వరగా అందజేయాలి- టిజేయు కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మంగళవారం రోజు కామారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి తో కామారెడ్డి జర్నలిస్టులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బాబురావు ఆర్డీవో శ్రీనివాస్ తో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జర్నలిస్టు ఇళ్ల పట్టా స్థలాలను వెంటనే మంజూరు చేయాలని. మరియు అలాగే నూతనంగా నిర్మించిన ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జర్నలిస్టులకు సమావేశం కొరకు గదిని ఏర్పాటు చేయాలని ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి ని కోరారు. అనంతరం ఆర్డిఓ స్పందించి నేను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీ యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపూరావు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మహేష్ గౌడ్. అధ్యక్షులు వడ్ల రాజేందర్. జిల్లా కార్యదర్శి గోపాల్. ఉపాధ్యక్షులు ప్రసాద్. శ్రీనివాస్. మ

ఎసిబి వలలో విద్యుత్ A E

 *ఎసిబి వలలో బోడుప్పల్ విద్యుత్  A E  ప్రసాద్ బాబు* చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్ వద్ద ప్యానల్ బోర్డ్ కోసం పది వేలు లంచం అడిగిన ఏ ఈ ప్రసాద్ రావు. లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏఈ ప్రసాద్ బాబు, విద్యుత్ సబ్ స్టేషనులో సోదాలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.

ఐ అండ్ పి ఆర్ కమీషనర్ అశోక్ రెడ్డి ని కలిసి పూల బోకే సమర్పించిన చిన్న పత్రికల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు

  ఐ అండ్ పి ఆర్ కమీషనర్ అశోక్ రెడ్డి ని కలిసి పూల బోకే సమర్పించిన చిన్న పత్రికల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు దాస్ మాతంగి, బాలకృష్ణ, అశోక్, నరహరి, వెంకటయ్య, గోళ్ళ రమేష్ తదితరులు.

నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ

 నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చీర పంకజ్ యాదవ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్ చైర్మన్‌గా దొంతం ఇంద్రసేనారెడ్డి, సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్లావత్ హనుమంతు, దేప అమృతా రెడ్డి, సయ్యద్ ఎజాజ్, పనాస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కోండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణ, ఎలిశాల వెంకటేశం, గుండా రమేష్ బాబులను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు

చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి : వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె

 చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలి :  వాసవీ పొలిటికల్ ఫోరం ఛైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె  హైదరాబాద్ : చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం పెరగాలని వాసవీ పొలిటికల్ ఫోరం చైర్మన్ హరినాథ్ గుప్త బెలిదె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరినాథ్ గుప్త మాట్లాడుతూ, సమాజ సేవా కార్యక్రమాల్లో ఎల్లవేళలా ముందు వరుసలో నిలిచే వైశ్యుల్లో రాజకీయ చైతన్యం పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు. ఏ మాత్రం స్వార్థం లేకుండా సమాజ సేవకు తమ స్వార్జితాన్ని వినియోగించే వైశ్యులు అధికారంలో ఉంటే, బహుళ జనులంతా సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. గతంలో చట్టసభల్లో వైశ్యుల ప్రాతినిధ్యం ఐదు నుండి 10 వరకు ఉండేదన్నారు. క్రమేణా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వైశ్యులకు కనీసం 10 టికెట్లు ఇవ్వాలని ఆయన అన్ని పార్టీలను డిమాండ్ చేశారు. కాగా లోకానికి శాంతి సందేశం ఇచ్చిన వాసవీ మాత త్యాగనిరతిని విశ్వవ్యాప్తం చేయాలని హరినాథ్ గుప్త పిలుపునిచ్చారు.  ఇదిలా ఉండగా వినోబా నగర్

పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యం పై ముఖ్యమంత్రి స్పందించాలి.* - *పొన్నం ప్రభాకర్*

 *పౌరసరఫరాల శాఖ మంత్రి వైఫల్యం పై ముఖ్యమంత్రి స్పందించాలి.* - *పొన్నం ప్రభాకర్* *ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు భారీగా నష్టపోయారు.* - *కవ్వంపల్లి సత్యనారాయణ*  జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతన్నల సమస్యలను తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా నేడు మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లను సందర్శించిన అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి వారం రోజులు గడిచినా కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. అధికారులు 360 సెంటర్లలో కొనుగోలు సెంటర్లను ప్రారంభించామని చెప్పినప్పటికీ కేవలం 160 సెంటర్లలో మాత్రమే కొనుగోలు జరుగుతుంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ శనివారం నాటి నుండి కొనుగోలు ప్రక్రియ ఆగిపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు భారీగా నష్టపోయారు. 25 రోజుల ముందు నుండే ధాన్యం కొనుగోలు ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వ అసమర్ధత వల్ల కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులు, లార

మీడియాను అగౌరవ పర్చడం సరైంది* *కాదు* *-ఐజేయూ, టీయుడబ్ల్యుజె*

  *మీడియాను అగౌరవ పర్చడం సరైంది* *కాదు* *-ఐజేయూ, టీయుడబ్ల్యుజె* నూతన సచివాలయం రాష్ట్రానికి తలమానికంగా ఉండడం శుభ పరిణామమని, మీడియాను అగౌరవ పరిచే ప్రభుత్వ వైఖరి మాత్రం సరైంది కాదని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే. విరాహత్ అలీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సచివాలయమంటే అన్ని రంగాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, చట్ట సభల్లోనే మీడియాకు గ్యాలరీ ఉంటుందని, పరిపాలన కేంద్రంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాకు సముచిత స్థానం లేకపోవడం విచారకరమన్నారు. పరిపాలనకు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే నిర్ణయాలకు, ప్రజలు తెలుసుకునే హక్కును కాపాడటానికి సచివాలయం తోడ్పడాలనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని వారు సూచించారు. సమాచార సేకరణ కోసం జర్నలిస్టులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మంచి మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసిందని వారు గుర్తుచేశారు.  సచివాలయ ప్రారంభోత్సవ కవరేజీకి కోట్ల రూపాయలు ఖర్చు

చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు

 చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్,థాయిలాండ్ లోని పటాయలో 90 మంది భారతీయుల అరెస్ట్,ఇందులో 14 మంది మహిళలు,భారీగా నగదు,గేమింగ్ చిప్స్ స్వాధీనం,చీకోటి ప్రవీణ్ నేతృత్వములో ఈ గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. చీకోటి ప్రవీణ్ ని అరెస్ట్ చేసిన థాయిలాండ్ పోలీసులు Hyderabad: A massive gambling racket in Thailand has led to the arrest of 80 Indian gamblers, including Chikoti Praveen from Telangana, Madhav Reddy (A1 in an ED case in Hyderabad), and Medak DCCB Bank Chairman Chitti Devender Reddy, as per sources.  According to reports, Chikoti Praveen had allegedly set up the gambling den in Pattaya along with Thai women. People from Hyderabad and other parts of India were allegedly brought in for gambling. The group was scheduled to leave for India on Monday morning, but the police raided the hotel late at night and caught them. The Thai police said that 80 Indians were arrested in the raid at the Asia Pattaya Hotel on Soi Phr