Skip to main content

Posts

Showing posts from June, 2021

*ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల*

 *ABVP ఆధ్వర్యంలో పరిషత్ పాఠశాల* నేడు నల్గొండ నగరంలోని స్థానిక బోయవాడ లో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవనం ఏబీవీపీ కార్యాలయంలో  కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో నిరుపేద విద్యార్థులు విద్యకు దూరం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల వద్దకే విద్య వెళ్లాలి అనే ఉద్దేశంతో పరిషత్ పాఠశాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ లో భాగంగా కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి పేదరికం వల్ల ఆన్లైన్ క్లాసులు వినలేక తీవ్ర ఇబ్బందులు పడుతు విద్యకు దూరం అవుతున్న విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు గ్రామ గ్రామాన,వాడల్లో, బస్తీల్లో,కాలనీల్లో *పరిషత్ పాఠశాల* అనే పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, ఎన్జి కళాశాల ఉపాధ్యక్షుడు భానోత్ నాగేందర్, బాలాజీ, ప్రవీణ్,రమేష్ బాల్థాక్రే, నరేష్, పాల్గొన్నారు.

బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్

 బిజెపి... బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుంది-డా. దాసోజు శ్రవణ్ వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోండి : హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలోనూ మోడీ సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని, వ్యాపారాన్ని పక్కన పెట్టి కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు .   ఏఐసీసీ ఆదేశాల మేరకు, పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లోని అన్ని పెట్రోల్ బంకుల వద్ద కోవిడ్ గైడ్ లైన్స్ పాటిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో బాగంగా ''ప్రజల చెవిలో పువ్వుపెట్టిన ప్రధాని'' అంటూ మోడీ మాస్కులు ధరించి చెవిలో పువ్వులు పెడుతూ వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల రక్తమాంసన్ని జలగల్లా పిల్చేసే రీతిలో మోడీ పాలన ఉందని, ప్రజలని లూటీ చేయడమే మోడీ సర్కార్ అజెండాయని ఆయన విమర్శించారు. క్రూడాయిల్ ధర తగ్గుతుంటే సేల్స్ ట్యాక్స్ పెంచేస్తున్నారు. ఎలాగైనా ప్రజలని దోచుకోవాలనేదే మోడీ సర్కార్  ప్లాన్ గా ఉందని అన్నారు. గత

ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి

 ఎబివిపి ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం- నల్గొండ డి.ఎస్.పి వెంకటేశ్వర్ రెడ్డి   నల్గొండ :  నగరంలోని స్థానిక జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు  ఏబీవీపీ ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్  రెండవ రోజులో భాగంగా  200 మందికి భోజన వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి  కార్యక్రమాన్ని ప్రారంభించి ఏబీవీపీ ఫర్ సొసైటీ పేరుతో ఏబీవీపీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని, యువత ఇలాగే పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ఏబీవీపీ నల్గొండ జిల్లా ప్రముఖ్ కత్తుల ప్రమోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఏబీవీపీ ఫర్ సొసైటీ అనే పేరుతో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జూన్ 10వ తేదీ నుండి 15 తేదీ వరకు వివిధ సేవా కార్యక్రమాలు పేదలకు భోజన వితరణ,కరోనా పై అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం,మాస్కులు పంపిణీ , వాడల్లో శానిటేషన్ చేయడం, అలాగే కరోనా కారణంగా పాఠశాలలకు దూరమైన పేద విద్యార్థులకు పరిషత్ పాఠశాల పేరుతో తరగతులు ని

ఎబివిపి నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్

 ఎబివిపి  నల్గొండ విభాగ్ ఆధ్వర్యంలో ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్   అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో జూన్ 10 నుండి 15 వ తేదీ వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద ప్రజలకు అండగా నిలిచేందుకు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూన్ 10 నుండి 15 వరకు ఎబివిపి ఫర్ సొసైటీ మెగా సర్వీస్ డ్రైవ్ పేరుతో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి మారుమూల గ్రామాలు, గిరిజన తండాల వరకు పెద్ద ఎత్తున 150 స్థలాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నమని తెలిపారు.  వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించడం, కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన అనాధలై

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి

  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి   నల్గొండ : కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  బీజేపీ కిసాన్ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి  సందర్శించారు. ఈ సందర్బగంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని రెండు మాసాలు పూర్తయినప్పటికీ కూడా ప్రభుత్వం ,మరియు అధికారుల నిర్లక్ష్యం వలన మరియు ముందుచూపు లేని కారణంగా  కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దై మొలకలేత్తినవని, రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడంలో విసిగివేసారిపోతున్నారని,   వెంటనే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుందని తెలిపారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో నిల్వఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులు విక్రయించిన వరి ధాన్యానికి వెంటనే డబ్బులను వారి ఖాతాల్లో జమచేయాలని. అధికారులు  లారీలకొరత లేకుండా చూడాలని మరియు మిల్లుల వద్ద  ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని తాలు పేరుతో ధాన్యంలో కోత విధించారాదని  ఆయన  ప్రభుతాన్ని డిమాం