Skip to main content

Posts

Showing posts from May, 2020

మే 31 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణా లో ఇవాళ 199 కేసులు నమోదు ఇప్పటి వరకు మొత్తం 2698 కేసులు నమోదు

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌

జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్రం మరోసారి పొడిగించింది. అయితే, కేవలం కంటైన్‌మెంట్‌ జోన్ల వరకే పరిమితం చేసింది. జూన్‌ 30 వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. రేపటితో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అలాగే లాక్‌డౌన్‌ 5.0కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. దశలవారీగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. అయితే, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రం కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ఫేజ్‌-1 జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి ఫేజ్‌-2 పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. వీటికి అనుమతి లేదు.. మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు. అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు. సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు,

మే 29 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు 169 కరోనా కేసులు

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్

ఆ డాక్టర్‌పై నమ్మకం లేదు: సుధాకర్ తల్లి కావేరి భాయ్ విశాఖ: తన కుమారుడు సుధాకర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ రామిరెడ్డిపై తనకు, తన కుమారుడికి నమ్మకం లేదని సుధాకర్ తల్లి కావేరి భాయ్ అన్నారు. అదే విషయం తన కొడుకు కూడా డాక్టర్‌తో చెప్పాడన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మెంటల్ లేని తన కొడుకును పిచ్చాసుపత్రిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడని.. అలాంటి వ్యక్తిని తీసుకువెళ్లి మెంటల్ ఆస్పత్రిలో ఎలా ఉంచుతారని ఆమె ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కూడా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వంపై కూడా తమకు నమ్మకం లేదని ఆమె అన్నారు. ఇవన్నీ చూస్తుంటే తన కొడుక్కు ప్రాణహాని ఉందనిపిస్తోందని కావేరి భాయ్ అనుమానం వ్యక్తం చేశారు. నిన్న నాలుగు పేజీల లెటర్ రాశారని, అలాంటి వ్యక్తిని మెంటల్ ఆస్పత్రిలో ఎందుకు ఉంచారో అర్థంకావడంలేదన్నారు. సరైన చికిత్స ఇవ్వడంలేదని ఆమె ఆరోపించారు. సరైన చికిత్స చేయపోవడంతో తన కొడుక్కి కొత్త సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ జరుగుతుందని, తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నామన్నారు. తీర్పు వచ్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు

  అమరావతి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారం పై హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కొట్టి పారేసిన హైకోర్టు ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ కొట్టిపారేసిన హైకోర్టు  రమేశ్ కుమార్ ని  కమిషనర్ గా కొనసాగించాలని ఆదేశాలు

మే 28 తెలంగాణ కరోనా బులిటెన్

తెలంగాణ లో  మే 28 117 కరోనా పాజిటివ్ కేసులు.. తెలంగాణ లో 66 ఇతర రాష్ట్రాలు 2, సౌదీ నుంచి వచ్చిన వాళ్లలో 49  

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి

నల్గొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడుగా మొరిశెట్టి భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు గా మొరిశెట్టి నాగేశ్వర్ రావును    నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి  నియమించారు. ఈ సందర్బంగా మొరిశెట్టి మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియమించిన జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి కి  మరియు  రాష్ట్ర జిల్లా పట్టణ నాయకులకు కార్యకర్తలకు బిజెపి తన అభిమానులకు  అందరికి   ధన్యవాదాలు తెలిపారు.

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు

కత్తులతొ సంచరిస్తున్న యువకుని అదుపులొకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పొలిసులు హైద్రబాద్ పాతబస్తి రేయిన్ బజార్ పొలిసు పరిధిలొ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తు రెండు కత్తులు వెంటపెట్టుకుని తిరుగున్న 20 సంవత్సరాల అబ్దుల్ అద్నాన్ అనే యువకుని అదుపులొకి తిసుకుని రెండు ర్యాంబొ కత్తులు స్వాధినము చేసుకుని స్థానిక రేయిన్ బజార్ పొలిసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పొలిసులు.

అమృత్ పథకం పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

మిర్యాలగూడ,నల్గొండ పట్టణం లో అమృత్ పథకం,దేవరకొండ పట్టణం లో మిషన్ భగీరథ పనుల పై సమీక్ష నల్గొండ,మే 27. నల్గొండ,మిర్యాలగూడ పట్టణాల లో చేపట్టిన అమృత్ పథకం కింద చేపట్టిన పనులు,దేవరకొండ అర్బన్ మిషన్ భగీరథ ఆన్యూటీ మోడ్ పనుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో నల్గొండ,మిర్యాలగూడ పట్టణం లలో అమృత్ పనులు,దేవరకొండ పట్టణంలో మిషన్ భగీరథ అర్బన్ పనుల పై నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ మున్సిపల్ కమిషనర్ లు,పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు,మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల తో సమావేశం నిర్వహించి జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశానికి శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,ఎన్ భాస్కర్ రావు,రవీంద్ర కుమార్ లు హజరయ్యారు. దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ మాట్లాడుతూ మిషన్ భగీరథ  ఆన్యూటీ మోడ్ లో పట్టణం లో చేపట్టిన పనులు అసంపూర్తి గా వున్నట్లు తెలిపారు.పట్టణం లో ఒకట వ వార్డ్ లో త్రాగు నీరు సరిగా రావటం లేదని,పనులు అసంపూర్తి గా వున్నట్లు,మార్కెట్ యార్డ్ పరిధి లో ఇండ్లకు త్రాగు నీరు రావటం లేదని, స్లూయిజ్ వాల్వ్ ఏర్పాటు చేయాలన

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్

వ్యభిచారం కేసులో పట్టుబడ్డ ఇన్ కం ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ అమీర్‌పేట లోని వ్యభిచార గృహం పై ఎస్సార్ నగర్ పోలీసుల దాడి. ముగ్గురుయువతులతో పాటు పట్టుబడ్డ ఇన్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ భుక్య ముంబై ఎం కె రోడ్డు లోని అయకార్ భవన్ లో విధులు నిర్వహిస్తున్న నాగేందర్

మే 26 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఇవాళ  71 పాజిటివ్ కేసులు నమోదు తెలంగాణ లో ఇప్పటి వరకు 1991 కేసులు నమోదు ఇవ్వాళ కొత్తగా ఒకరు మృతి. ఇప్పటి వరకు మొత్తం 57కి చేరిన మృతుల సంఖ్య. తెలంగాణా లో 650 అక్టీవ్ కేసులు ఇవాళ 120 మంది  డిశ్చార్జి అయినట్లు వైద్యుల వెల్లడి. ఇప్పటి వరకు 1284 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 38 12 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి. విదేశాల నుంచి వచ్చిన వారికి 4మందికి కొరొనా పాజిటివ్ నమోదు. రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చెల్ 6,-  సూర్యాపేట్, వికారాబాద్, నల్గొండ, నారాయణ్ పెట్ లో ఒక్కో కేసు నమోదు

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్

సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  -   హై కోర్ట్ సూర్యాపేట లో టెస్టులు చేయడం లేదని   బిజెవైయం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకీనేని వరుణ్ రావు వేసిన పిల్ పై విచారణ చేసి సూర్యాపేటలో టెస్టులు చేయాల్సిందే  అని తేల్చి చెప్పిన హై కోర్ట్. సూర్యాపేట లో టెస్టులు చేయకపోవడంపై  చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహన్ జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తో కూడిన ధర్మాసనం మూడు గంటల పాటు  విచారణ చేపట్టారు తెలంగాణ ప్రభుత్వం ఎమైన  ప్రత్యేక రాజ్యాంగం ఉందా అని ప్రభుత్వం పై మండిపడ్డా కోర్ట్ లక్షణాలు ఉన్న లేకున్నా టెస్టులు చేయాల్సిందే ఏప్రిల్ 24 తర్వాత కేవలం 35 టెస్టులు మాత్రమే చేసి రెడ్ జోన్ నుండి గ్రీన్ జోన్ గా మార్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతారా అని తీవ్రంగా సీరియస్ అయిన కోర్ట్  సూర్యాపేటతో పాటు తెలంగాణ అంతటా టెస్టులు నిర్వహించి జాతీయ సగటును అందుకోవాలని ఆర్డర్   వలస కార్మికుల కోసం తీసుకుంటున్న చర్యలేమిటని ప్రశ్నించిన  కోర్ట్

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి - దర్యాప్తు చేపట్టిన పోలీసులు

అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి    LB నగర్ లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో నివసిస్తున్న రఘురాం పద్మ కూతురు సాహితీ ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాలుగో సంవత్సరం చదువుతున్న సాహితీ ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోనే 14 వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుండి దూకి ఆత్మహత్య   సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు...

మే 21 తెలంగాణ కరోనా బులిటెన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో   38 పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం.  కేసులు నమోదు 1699 కరోనా తో ఇవాళ   5 మృతి ఇప్పటి వరకు మొత్తం 45 మంది మృతి తెలంగాణా లో అక్టీవ్ కేసులు 618 ఇవాళ 23  డిశ్చార్జి ఇప్పటి వరకు  1036 మంది డిశ్చార్జి ఇవాళ నమోదయిన పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసీ పరిధిలో లో 26  పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి..10 రంగారెడ్డి 2 ఇప్పటి వరకు రాష్ట్రంలో  99 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు కరోనా  

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర -  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వ్యవసాయ రంగంలో వస్తున్న వస్తున్న మార్పులు,లాభసాటి వ్యవసాయ సాగుకు క్షేత్ర స్థాయిలో రైతులకు సలహాలు,సూచనలు  అందించడం లో వ్యవసాయ విస్తరణ అధికారులు కీలక పాత్ర పోషిస్తారని  నల్గొండ అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏ.ఈ. ఓ.లు) వ్యక్తిత్వ వికాస శిక్షణ,ఒత్తిడి అధిగమించడం పై  నిర్వహించిన  శిక్షణ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ది కి,రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా వ్యవసాయ విస్తరణ అధికారులు నియామకం జరిగినప్పటి నుండి ఎటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ, స్ట్రెస్ మేనేజ్ మెంట్ పై శిక్షణ నివ్వలేదని,రానున్న రోజుల్లో వ్యవసాయ అధికారుల పై మరింత ఒత్తిడి వుంటుందని, ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ పరంగా ఒత్తి

గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దు - జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ,మే 20..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు పని కల్పించడం లో నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.ఉపాధి హామీ కింద పని కోరిన ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాలని అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఎం.పి.డి. ఓ.లు, ఎం.పి. ఓ.లు,ఏ.పి. ఓ.లు,, పంచాయతీ కార్యదర్శులు,ఈ జీ ఎస్ సిబ్బంది తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉపాధి హామీ పనులు,నర్సరీలు నిర్వహణ,మొక్కల సంరక్షణ తదితర అంశాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 844 గ్రామ పంచాయతీ ల్లో ఒక లక్షా 53 వేల 290 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వస్తున్నారని,ప్రతి జి.పి.లో సరాసరి 197 మంది హజరు అవుతున్నారని,సరాసరి ప్రతి జి.పి.లో 250 మంది వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఒక్కొక్కరికి సరాసరి 137 రూ. ల వేతనం వస్తుందని,వచ్చే వారం నాటికి సరాసరి వేతనం165  రూ.లు చెల్లించేలా పనులు కల్పించాలని సూచించారు. నర్సరీల లో మొక్కలు జి.పి.గ్రీన్ ప్లాన్ ప్రకారం పెంచాలని,పంచాయతీ కార్యదర్శులు మొక్కలు సంరక్షణ బాధ్యత వహించాలని అన్నారు.ముఖ్యంగా పండ్ల మొక్కలు పెంపకం చేపట్టాలని,జామ,ఉసిరి,బొప్

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక

మాస్కులు దరించక పోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరిక మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి  కేసీఆర్ హెచ్చరించారు.  కరోనా లాక్ డౌన్  మే 31వరకు పొడిగించినట్లు ప్రకటించిన కేసీఆర్.  కేబినెట్ సమావేశం అనంతరం పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ బస్సులు రేపటి నుంచే నడుస్తాయని,  జిల్లాలకు చెందిన బస్సులు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేశారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు హైదరాబాద్‌ పరిధిలో సిటీ బస్సులకు, ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతిలేదని తెలిపారు. మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.  కేబినెట్‌ సమావేశం అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడారు. 'హైదరాబాద్‌లో ఆటోలు, ట్యాక్సీలకు అనుమతినిస్తున్నాం. హైదరాబాద్‌ నగరంలో సిటీ బస్సులు తిరగవు. మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు. ఆర్టీసీ బస్సులు కోవిడ్‌-19 జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు వందశాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు. పరిశ్రమలన్నింటికీ అనుమతి. హైదరాబాద్‌ నగరంలో సరిబేసి విధానంలో దుకాణాలు తెరవాలి.  సినిమ

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి

గాలివాన బీభత్సనికి  ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయిన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మండలం రాములబండ గ్రామంలో నిన్న  వచ్చిన గాలివాన బీభత్సనికి కూలిపోయిన విద్యుత్ స్తంభాలు విరిగిపడిన భారీ వృక్షాలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి  నిరాశ్రయు లైన కుటుంబాలను పరామర్శించిన నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకట్ రెడ్డి స్థానిక సర్పంచ్ రూపని జయమ్మ కార్యదర్శి సింగిల్విండో ఉపాధ్యక్షులు తవిటి కృష్ణ స్థానిక నాయకులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నాం-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్   నల్గొండ,మే 18 .రాష్ట్ర ప్రభుత్వం,వ్యవసాయ శాఖ సూచించిన విధంగా వానాకాలం లో పంటలు నియంత్రిత పద్దతిలో సాగు చేయడానికి రైతులకు అవగాహన కలిగించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.సోమవారం హైద్రాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ,రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ లు,అదనపు కలెక్టర్ లు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు,సహకార,ఉద్యాన శాఖ,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో మండల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం సీజన్ లో నియంత్రిత పద్దతిలో ప్రభుత్వం సూచించిన విధంగా పంటలు వేయడం పై సుదీర్ఘంగా వివరించి జిల్లా కలెక్టర్ లు,రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షుల తో జిల్లా పరిస్థితులు తెలుసుకొని సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ గత సంవత్సరం వానాకాలం సీజన్ లో 11 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లు,ఇందు లో 6.7లక్షలు ఎకరాలు పత్తి,3.4 లక్షల ఎకర

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ పెండింగ్ పనులు పూర్తి చేసి గ్రామాలకు త్రాగు నీరు అందించాలి జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం లో ఎం.పి.లు,శాసన సభ్యులు మిషన్ భగీరథ పనుల పై తీవ్ర అసంతృప్తి పోతిరె డ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచి  3 టి.యం.సి.నీటిని డ్రా చేస్తూ జి. ఓ.203 జారీ వ్యతిరేకిస్తూ సభ ఏకగ్రీవ తీర్మానం నల్గొండ,మే 16.దక్షిణ తెలంగాణ ప్రాంతంకు ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రాంతం కు తీవ్ర అన్యాయం జరిగేలా  ఏ.పి.రాష్ట్రం పోతి రెడ్డి పాడు రెగ్యులేటర్ నుండి అక్రమంగా జి. ఓ 203 జారీ చేసి 3 టి.యం.సి నీటిని డ్రా చేయడం పట్ల వ్యతిరేకిస్తూ  జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం లో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ తీర్మానం చేశారు.శని వారం జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించి పంచాయతీ రాజ్,కరోనా నియంత్రణ చర్యలు, మిషన్ భగీరథ పనులు తదితర అంశాల పై సమీక్షించారు.సభ ప్రారంభం కాగానే నాగార్జున సాగర్ శాసన సభ్యులు నోముల నర్సింహయ్య మాట్లాడుతూ పోతిరె డ్డిపాడు నుండి అక్రమంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 3 టి.యం.సి  నీటిని తరలించడం పట్ల వ్యతిరే కిస్తూ తీర్మానం చేయాలని మాట్లాడగా హజరైన సభ్యులు బల పరుస్తూ సభలో ఏకగ్రీ

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం

టెలి కాన్ఫరెన్స్ ద్వారా నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం    ప్రపంచమంతా కరోనా దరిమిలా  ఎక్కడి  కక్కడ  కొత్త పద్దతులతో  జీవించాల్సిన  పరిస్థితులు  వచ్చాయని , తప్ప ని పరిస్థితులలో  నూతన  పద్దతుల ను  అవలంభించడం  జరుగుతుందని మంత్రి  జగదీశ్  రెడ్డి   చెప్పారు . ఇందులో  భాగంగానే  టెలి కాన్ఫరెన్స్ ద్వారా   నల్గొండ  మునిసిపల్  బడ్జెట్   సమావేశం  నిర్వహించు కోవడం  జరిగిందని  , ఇందుకు  సహకరించిన  మునిసిపల్  కౌన్సిల్  సభ్యులకు కృతజ్ఞతలు  తెలిపారు . శుక్రవారం  103 కోట్ల 14 లక్షల 65 వేల తో  2020 -21 ఆర్థిక  సంవత్సరానికి  గాను  బడ్జెట్ అంచనా , 2019 -20  సంవత్సర  సవరింపు  బడ్జెట్  అంచనా  ఆమోదానికి  గాను శుక్రవారం  కౌన్సిలర్లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మునిసిపల్  బడ్జెట్   సమావేశం   నిర్వహించారు .  నల్గొండ  మున్సిపల్  కార్యాలయం లోని  సమావేశ  మందిరం  నుండి  నిర్వహించిన  ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా  హాజరైన  రాష్ట్ర విద్యుత్  శాఖ మంత్రి  గుంత కండ్ల  జగదీశ్  రెడ్డి   మాట్లాడుతూ  కరోనా  నేపథ్యం లో  కొత్త  పద్దతుల  ద్వారా  ఎక్కడికక్కడ  కార్యక్రమాలు  నిర్వహించడం  జరుగుతుందని , ఇందులో  భాగంగానే   నల్గొండ

వానా కాలామ్ పంటకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నాయి - రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

వానా కాలామ్ పంటకు రైతులకు ఎరువులు,విత్తనాలు అందు బాటులో ఉన్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ లతో కలిసి వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంటకు ఎరువులు,విత్తనాలు సరఫరా, యాసంగీ ధాన్యం కొనుగోళ్లు సమీక్షించారు.జిల్లాలో ఎరువులు రెండు లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల వానాకాలం సాగుకు అవసరం కాగా అందులో 80,000 మెట్రిక్ టన్నులు యూరియా,36,000  డి. ఏ.పి.,66,000 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కాగా, యూరియా,డి. ఏ.పి.,కాంప్లెక్స్ ఎరువులు 29,000 మెట్రిక్ టన్నులు అందు బాటులో వుందని వ్యవసాయ అధికారులు మంత్రికి వివరించారు. ఇందు లో 11,000 మెట్రిక్ టన్నుల యూరియా,2700 మెట్రిక్ టన్నుల డి. ఏ.పి.,13600 కాంప్లెక్స్ ఎరువులు అందు బాటులో వున్నట్లు వారు వివరించారు.ఎప్పటి కప్పుడు వచ్చిన ఎరువుల ర్యాక్ పి. ఏ.సి.ఎస్.,డీలర్ లకు పొజిషన్ చేస్తున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు 1900 మెట్రిక్ టన్నులు ఎరువులు డీలర్ లు,పి. ఏ.సి.ఎస్., అగ్రోస్ సేవా కేంద్రాల ద్వారా రైతుల కు విక్రయించి నట్లు అధికారులు

రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్

    రెవెన్యూ పెండింగ్ కోర్ట్ కేసులు సమీక్షించిన జిల్లా కలెక్టర్  రెవెన్యూ శాఖ కోర్ట్ కేసులకు సంబంధించి  కౌంటర్ లు దాఖలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.గురు వారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరం లో అర్.డి. ఓ.లు,తహశీల్దార్ లతో సమావేశం నిర్వహించి రెవెన్యూ పరంగా హైకోర్టు లో దాఖలు చేసిన పెండింగ్ కేసుల ను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, పట్టా భూములకు సంబంధించి హై కోర్ట్ లో దాఖలు చేసిన కేసుల కు సంబంధించి కౌంటర్ లు దాఖలు చేయాలని తహశీల్దార్ లు,అర్.డి. ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.అదే విధంగా ప్రభుత్వ ఆదేశాల ననుసరించి నియోజక వర్గాలలో ఒక్కొక్క నియోజక వర్గంలో గోదాముల నిర్మాణం కు 15 నుండి 20 ఎకరాలు గుర్తించి నట్లు,గుర్తించిన స్థలం గోదాం ల నిర్మాణం చేయుటకు అనువుగా వున్నదా లేదా కలెక్టర్ చర్చించారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్,అర్.డి. ఓ.లు జగదీశ్వర్ రెడ్డి,(నల్గొండ),లింగ్యానాయక్,(దేవర కొండ),తహశీల్దార్ లు పాల్గొన్నారు.

మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్

  మిషన్ భగీరథ కింద చేపట్టిన ఇంట్రా పనులు వేగవంతం చేసి త్వరితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మిషన్ భగీరథ కింద బల్క్ వాటర్ సరఫరా, ఇంట్రా పనులు నియోజక వర్గం వారిగా పెండింగ్ పనుల పై మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారుల తో సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్  భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా రక్షిత త్రాగు నీరు సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మెయిన్ గ్రిడ్ నుండి బల్క్ వాటర్ సరఫరా కు పెండింగ్ లో నున్న ఇన్ లెట్ కనెక్షన్ లు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.జిల్లాలో మిషన్ భగీరథ ఇంట్రా  విలేజ్ పనులు కింద 1534 ఓ.హెచ్ ఎస్.ఆర్ లకు గాను 1494 పూర్తి చేసినట్లు,40 పెండింగ్ లో నున్నట్లు మిషన్ భగీరథ అధికారులు వివరించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ ఓ.హెచ్.ఎస్.ఆర్.లు పూర్తి చేసి కనెక్షన్ లు ఇవ్వాలని అన్నారు.ఇప్పటి వరకు 4275.82 కి.మీ. లకు గాను 4119కి.మీ. పైపు లైన్ వేయడం జరిగిందని, పెండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 355339 ఇంటింటి నల్లా కనెక్షన్ లకు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

  ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు  ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టండి - అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో యాసంగి  వరి ధాన్యం కొనుగోళ్ళపై ఆయన సమీక్షించారు. యాసంగి లో వరి ధాన్యం సాగు అధికంగా జరిగినందున ఇంకా వరి ధాన్యం వస్తున్13 మండలాల వ్యవసాయ అధికారులు,పౌర సరఫరా శాఖ డి. టి.లు, ఏ.పి.యం.లు,పి. ఏ.సి.ఎస్.సి.ఈ. ఓ.లతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో స్టాక్,ఇంకా ఎంత ఉంది తదితర అంశాలు సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని లు కొరత వుంటే సరఫరా చేస్తామని,ఇతర జిల్లాల మిల్లులకు ట్యాగింగ్ చేసే అవకాశం వుందని,నాణ్యతా ప్రమాణాలు,తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జె.డి.శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ   రోహిత్ సింగ్ , నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ,దేవర కొండ ఆర్డీఓ లింగ్యా నాయక్,  జిల్లా  పౌర సరఫరాలసంస్థ జిల్లా మేనేజర్ నాగేశ్వర్ రావు,  జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీదేవి.  

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు

మావోయిస్టు నక్సల్ ఐతడు లొంగుబాటు తెలంగాణ, ములుగు: మావోయిస్టు నక్సల్ పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  వెట్టి ఐతు అలియాస్ ఐతడు అనే మావోయిస్టు నేడు ములుగు జిల్లా పోలీసుల ఎదుట లొంగి పోయాడు.  మావోయిస్టు నేత బడే చొక్కా రావు కు ఐతడు గన్ మెన్‌ .

రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం

రేపు ఉదయం 11 గంటలకు సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం హాజరుకానున్నా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ , టిజెస్ అధ్యక్షుడు కోదండరాం , సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ లు. సమావేశం అనంతరం 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న అఖిలపక్షం నేతలు రాష్ట్రంలో లో కరోన కట్టడి విషయం లో ప్రభుత్వ నిర్ణయలు, మద్యం షాపులు తెరవడం, రైతుల దాన్యం కొనుగోలు ,  రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం చేయుత తదితర అంశాలపై చర్చించనున్న అఖిలపక్షం నేతలు. కరోన నేపథ్యంలో  రాష్ట్రంలో  వలస కార్మికులు ఎదుర్కొంటున్నా సమస్యలపై 12 వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి కార్యాచరణ పై నిర్ణయం తీసుకోనున్న అఖిలపక్షం నాయకులు.

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల బంధువులకు భోజనం అందిస్తున్న నల్గొండ ఎన్.అర్. ఐ. ఫోరం సభ్యుల ను అభినందించిన అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి* *రాత్రి భోజనం తో పాటు,నేటి నుండి రోగుల బంధువులకు మధ్యాహ్న భోజనం అర్.డి. ఓ. చేతుల మీదుగా ప్రారంభించిన నల్గొండ ఆర్గ్( ఎన్.అర్. ఐ.ఫోరం) సభ్యులు* నల్గొండ,మే 10. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆస్పత్రి లో రోగుల బంధువులు ఇబ్బంది పడకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్.అర్. ఐ. లు సేవా దృక్పథం తో రాత్రి భోజనం తో పాటు,మధ్యాహ్నం భోజన సౌకర్యం సమ కూర్చటం పట్ల నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి వారి సేవలను అభినందించారు.ఆదివారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి లో రోగుల బంధువుల ఆకలి తీర్చాలని నల్గొండ అర్.డి. ఓ.జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా మధ్యాహ్న భోజనం ప్రారంభించారు.      ఎన్.అర్. ఐ. పోరం కో ఆర్డినేటర్ మిట్టపల్లి సురేష్ గుప్తా మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పుట్టి అమెరికా లో స్థిరపడిన NRI లు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి తోడ్పాటు అందించాలని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గత 20 రోజుల నుంచి రాత్రి సమయం లో భోజనం ఏర్పాటు చేసి హాస్పిటల్ కి వచ్చే రోగుల బంధువుల ఆకలిని తీర

బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్

బీజేపీ దళిత మహిళ నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బాలాల పై కేసు నమోదు చేయాలి- బంగారు శృతి బిజెపి జాతీయ దళిత మోర్చా ఈసీ మెంబర్ చాదరఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ దళిత మైనర్ బాలికను ఎమ్మెల్యే బాలాల అనుచరుడు షకీల్ అత్యాచారానికి ఒడికట్టాడు. ఆ  బాలికను పరామర్శించడానికి వెళ్లిన బిజెపి జాతీయ దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు శృతిని ఎమ్మెల్యే బాలాల 'థర్డ్ క్లాస్ వాలి' అని దూషించాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బిజెపి దళిత నాయకులు తీవ్రంగా స్పందించారు. తనను బాలాల దూషించడంతో స్వయంగా బంగారు శృతి శనివారం చాదరఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జై భీమ్ అంటున్నాడు కానీ వాళ్ళ పార్టీ నాయకులు దళితులను అత్యాచారం చేస్తున్నారు మరో ఎమ్మెల్యే దూసిస్తున్నాడు ఓవైసీ మాత్రం నోరు మెదపడం లేదు ఇది అన్యాయం అన్నారు. నన్ను దూషించిన ఎమ్మెల్యే బాలాల పై పోలీసులు sc,st కేసు నమోదు చేయాలి లేకపోతే రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతాము కేంద్ర sc,st కమిషన్ దృష్టికి తీసుకెళుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు భగవంత్ రావు,నర్సింహ

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నర్సరీ ల లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తిప్పర్తి, మా డ్గుల పల్లి,దామరచర్ల మం డలాల్లో నర్సరీలు సందర్శించిన జిల్లా కలెక్టర్ .గ్రామ పంచాయతీ ల్లో నర్సరీ ల్లో మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి  మండలం రాయిని గూడెం,మా డ్గులపల్లి మండలం కొత్త గూడెం,దామరచర్ల మండలం రాజ గట్టు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు సందర్శించారు. నర్సరీ ల్లో మొక్కల పెంపకం, జెర్మినేషన్,గ్రామ గ్రీన్ ప్లాన్,వైకుంఠ దామం,కంపోస్ట్ షెడ్ ల పనుల ప్రగతి పై మండల ,గ్రామ అధికారులతో చర్చించి ఆదేశాలు,సూచనలు జారీ చేశారు.గ్రామంలో పచ్చదనం పెంపొందించాలని,హరిత హరం కార్యక్రమం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జి.పి కి ఒక నర్సరీ ఏర్పాటు చేసిందని అన్నారు.ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు హరిత హరం పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని,గ్రామ గ్రీన్ ప్లాన్ ప్రకారం మొక్కలు పెంచుతూ మొక్కలు చని పోకుండా మొక్కలకు వాటరింగ్,చేయాలని అన్నారు.పల్లె ప్రగతి లొ గ్రామంలో తిరిగి గ్రామ ప్

విశాఖపట్నం మృతుల వివరాలు

విశాఖపట్నం మృతుల వివరాలు ఇద్దరు చిన్నారులు కూడా మృతి కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19) మృతి గంగాధర్, నారాయణమ్మ, నరసమ్మ, గంగరాజు, కృష్ణ మూర్తి మృతి మృతుడు చంద్రమౌళి ఏఎంసీలో ఎంబీబీఎస్‌ విద్యార్థి  విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య  9కి చేరిందని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కుందన శ్రేయ (6), ఎన్‌.గ్రీష్మ (9), చంద్రమౌళి (19), గంగాధర్, నారాయణమ్మ (35), అప్పల నరసమ్మ (45), గంగరాజు (48), మేకా కృష్ణ మూర్తి (73)తో పాటు మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు చంద్రమౌళి విశాఖ పట్నంలోని ఏఎంసీలో ఎంబీబీఎస్‌ తొలి ఏడాదిలో చేరి చదువుకుంటున్నాడు. గ్యాస్‌ లీకైన ప్రాంతాల్లో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మృతుల్లో కొందరు రోడ్డుపైనే మృతి చెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఏపీ సీఎం జగన్ పర్యటన అనంతరం ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెల్లడిస్తామని సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు.

విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు

విశాఖలో భారీ ప్రమాదం కంపెనీ నుంచి లీకైన కెమికల్ వాయువు రోడ్డుపైనే పడిపోతున్న జనం ఎల్జీ పాలిమర్స్‌లో ఘటన ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసుల హెచ్చరిక భయంతో మేఘాద్రి గడ్డవైపు ప్రజల పరుగులు   విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున భారీ ప్రమాదం జరిగింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. 200 మంది అస్వస్థతకు గురైనారని తెలిసింది.అసవస్థతకు గురైన వారిలో ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు. అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ ఇవాళ రాష్ట్రంలో 11   పాజిటివ్ కేసులు నమోదు ఇప్పటి వరకు రాష్ట్రం లో మొత్తం. 1107  కేసులు నమోదు తెలంగాణా లో 430 అక్టీవ్ కేసులు ఇవాళ 20 మంది డిశ్చార్జి ఇప్పటి వరకు 648 మంది డిశ్చార్జి ఇప్పటి వరకు మొత్తం 29 మంది మృతి  

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు:

సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా, ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు: జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్.పి. ఏ.వి.రంగనాథ్* నల్లగొండ,మే6. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తూ   అనేక సదలింపులు ఇస్తూ మార్గదర్శకాలు జారీ చేసినందున నిర్మాణ రంగంలో పనులకు ఇబ్బంది లేకుండా సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా కు వినియోగ దారులు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,ఎస్.పి. ఏ.వి.రంగ నాథ్ లు తెలిపారు.ప్రభుత్వ పనులకు,నిర్మాణ పనులకు సాండ్ టాక్సీ ద్వారా ఇసుక సరఫరా చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దుకాణాలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరిచేందుకు అవకాశం కల్పించిందని, ఈ దశలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లాలనే నిర్ణయాన్ని ఒకసారి పునరాలోచించి ఇక్కడ పని చేసేలా వారికి నచ్చ చెప్పి వివరించాలని,పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఎస్పీ  ఏ.వి.రంగనాథ్ లు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మండల తహశీల్దార్ లు,పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వలస కార్మికులు,సాండ్ టాక్సీ,స్మశాన వాటికలు,ఇంకుడు గుంతల నిర్మాణం

మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్

మే5-  ఆంధ్రప్రదేశ్ కరోనా బులిటెన్  మే5 - ఆంద్రప్రదేశ్  కరోనా బులిటీన్ ను   ఆరోగ్య శాఖ అధికారి విడుదల చేశారు. ఈ బులిటీన్లో  ఈ రోజు  67 కరోనా పాజిటివ్ కేసులు  నమోదు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం కేసులు 1717. ఆక్టివ్ కేసులు 1094,    ఇప్పటి వరకు 589 డిశ్చార్జ్ లు అయ్యారు. 34 మంది మృతి  చెందారు.

మద్యం దుకాణాలు ఖాళీ

దాదాపు 40 రోజుల లాక్ డౌన్ తరువాత మళ్ళీ మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. ఇక తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ఒక్కో షాపులో పది నుంచి పదిహేను లక్షల వరకూ మద్యం అమ్మకాలు జరిగాయి. ఇప్పటికీ వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలైన్లలోనే ఉన్నారు. కాగా.. కొన్ని చోట్ల మద్యం సిబ్బంది మద్యం దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. రేపు డిపో నుంచి మద్యం స్టాక్ వచ్చాకే అమ్మకాలు జరుపుతామని దుకాణదారులు తెలిపారు. నేడు గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అమ్మకాలు జరిగాయి.

దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం

ఏపీ వైపు దూసుకొస్తున్న భారీ తుపాన్.. ఎంఫాన్ గా నామకరణం తెలుగు రాష్ట్రాలకు భారీ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తుపాను ముప్పు పొంచి ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా..ఇది మే 7 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈ

తెలంగాణలో మందు బాబులకు షాక్‌

తెలంగాణలో మందు బాబులకు షాక్‌ మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మందుబాబులకు తెలంగాణ సర్కార్‌ షాక్ ఇచ్చింది. సోమవారం నుంచి గ్రీన్‌ జోన్లలో మద్యం అమ్మకాలు చేసుకోవచ్చంటూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఎక్సైజ్‌ అధికారులు మాత్రం నో చెప్పేశారు. రేపటి నుంచి తెలంగాణలోని గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు లేవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో మందు బాబులకు షాక్ తగిలినట్లైంది

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ కట్టంగూర్,నార్కట్ పల్లి,మే 3.కట్టంగూర్ మండలం అయిటి పాముల, ఈదులూర్ గ్రామాల్లో,నార్కట్ పల్లి తుమ్మల గూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ ఆదివారం తనిఖీ చేశారు.ధాన్యం కొను గోలు కేంద్రాల్లో వరి ధాన్యం ఎంత పరిమాణంలో ఉంది నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే ట్యాగ్ చేసిన సంబంధిత మిల్లులకు పంపించాలని ఆదేశించారు.మిల్లుల వద్ద అన్ లోడింగ్ సమస్య లేకుండా చూడాలని,కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు పంపడం లో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని పౌరసరఫరాల అధికారి ని ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో గన్ని ల సమస్య,ధాన్యం మిల్లులు రవాణా చేయడం లో కాంట్రాక్టర్ లు లారీ లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల డి.యం.ను ఆదేశించారు.అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారిణి రుక్మిణీ దేవి,జిల్లా సహకార అధికారి రాబిరాల శ్రీనివాస మూర్తి,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు

జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

  జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.(ఇది వరకే 10 వేల నిత్యావసర కిట్లు పంపిణీ జరిగింది) మసబ్ ట్యాంక్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఈ దఫా మరో పది వేలు నిత్యవసర కిట్లు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మంత్రి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి ,గౌతం రావు ,దీపక్ రెడ్డి ,ఛాయా దేవి లతో కలిసి ప్యాకింగ్ తీరును పరిశీలించారు. ప్రతి కిట్లో  5 కిలోల మేలురకం రైస్, ఒక కిలో  పప్పు ఒక లీటర్ నూనె, పసుపు,కారం,చింతపండు- ఒక్కొక్కటి పావు కిలో చొప్పున, పికిల్ పాకెట్ -150గ్రామ్స్, ఎనర్జీ జ్యుస్ -1 లీటర్, మాస్కులు-4 ఉన్నాయి. మొత్తం 9 వస్తువులతో 10 వేల కిట్ల ప్యాకింగ్ బంజారా పంక్షన్ హాళ్ళో అయింది. సురక్షితంగా  ప్యాకింగ్  అవుతున్న తీరును  పరిశీలించిన  శ్రీమతి కావ్యా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఇంకా పొడిగించడంతో జంటనగరాల్లోని పేద ప్రజలకు ఈ కిట్లు అందించాలని కిషన్ రెడ్డి  నిర్ణయించారని, అందుకే అన్ని జాగ్

ఇక నుండి ఆన్లైన్లో లాక్ డౌన్ పాసులు : ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక నుండి ఆన్లైన్లో లాక్ డౌన్ పాసులు : ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా అత్యవసర, నిత్యావసర అవసరాల నిమిత్తం లాక్ డౌన్ పాసుల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి సులువుగా పాసులు అందించడానికి తెలంగాణ రాష్ర్ట పోలీసు వారు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు. h ttps://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో పాసుల కోసం కావలసిన సమాచారాన్ని అందజేసి అత్యంత సులభంగా లాక్ డౌన్ పాసులను పొందవచ్చని ఈ సందర్భంగా తెలియజేసినారు.వివిధ రకాల కారణాలతో పాసుల కోసం ఇబ్బంది పడుతున్న వారు ఆన్లైన్ ద్వారా పోలీసు వారు అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఇంటర్నెట్ గురించి అవగాహన లేని వారు సంభదిత పోలీస్ స్టేషన్లో గానీ,సబ్ డివిజన్ పోలీసు అధికారి ఆఫీస్ నందు గాని లాక్ డౌన్ పాసులను పొందవచ్చని తెలిపారు.ఈ రెండు పద్ధతుల ద్వారా లాక్ డౌన్ పాసులను పొందిన వారిని మాత్రమే పోలీసువారు అనుమతిస్తారని తెలియజేసారు.

మే 1-తెలంగాణా- కరోనా సమాచారం

మే 1-తెలంగాణా- కరోనా సమాచారం ఇవాళ తెలంగాణా 6 పాజిటివ్ కేసులు మొత్తం 1044 ఇవాళ 22 మంది డిశ్చార్జి మొత్తం డిశ్చార్జి 464 ఆక్టివ్ కేసులు 552 28 మంది చనిపోయారు ఇవాళ మరణాలు లేవు

దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో రోగుల వివరాలను మెడికల్ షాప్  వారు రికార్డు నిర్వహించి మునుసిపల్ కమీషనర్ కు అందచేయాలి- నల్గొండ  జిల్లా కలెక్టర్

దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో రోగుల వివరాలను మెడికల్ షాప్  వారు రికార్డు నిర్వహించి మునుసిపల్ కమీషనర్ కు అందచేయాలి- నల్గొండ  జిల్లా కలెక్టర్ నల్గొండ,మే 1. జిల్లాలో మెడికల్ షాప్ యజమానులు కోవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యం లో దగ్గు,జ్వరం,జలుబు,గొంతు నొప్పిమందులు అమ్మినచో రోగుల వివరాలు తప్పనిసరిగా తమ వద్ద రికార్డ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు.మెడికల్ షాప్ యజమానులు దగ్గు,జలుబు,జ్వరం,గొంతు నొప్పి మందులు విక్రయించిన రోగి పేరు,చిరునామా,ఫోన్ నెంబర్ వివరాలు,మందుల వివరాలు తమ పరిధిలో మున్సిపల్ కమిషనర్ లకు విధిగా అంద చేయాలని అన్నారు.మున్సిపల్ కమిషనర్ లు  మెడికల్ షాపుల వారీగా  నుండి  ప్రతి రోజూ వివరాలు సేకరించి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కు అంద చేయాలని ఆదేశించారు.పై ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘంచినచో విపత్తు నిర్వహణ చట్టం 2005 సెక్షన్ 51,అంటువ్యాధుల చట్టం 1897 సెక్షన్ 3, ఐ పి సి సెక్షన్ 188 ప్రకారం చట్ట పరంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు

లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగింపు న్యూఢిల్లీ: ఈనెల 3వ తేదీతో దేశవ్యాప్తంగా ముగియనున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ  తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 4 నుంచి 17వ తేదీ వరకూ లాక్‌డౌన్ కొనసాగనుంది. తాజా ఆదేశాల ప్రకారం, కంటైన్మెంట్ జోన్లలో పూర్తిగా ఆంక్షలు అమల్లో ఉంటాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. రైళ్లు, బస్సులు, మెట్రో సర్వీసులు, విమానాల రాకపోకలపై నిషేధం యథాప్రకారం కొనసాగుతుంది. సైకిల్ రిక్షాలు, ఆటో రిక్షాలు, టాక్సీలు, క్యాబ్‌లు తిరగవు. బార్బర్ దుకాణాలు, స్పా, సెలూన్లు తెరవరాదు. అంతర్ జిల్లా, రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది. డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టం-2005 కింద రెండు వారాల పాటు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం మంత్రిత్వా శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్ 

లాజిక్ తో లేఖ వ్రాసిన కాంగ్రెస్ MLA భరత్ సింగ్  శానిటైజర్ తో చేతులు కడుకుంటే  కరోనా వైరస్ పోతుంది అంటున్నారు కదా.  శానిటైజర్ లో ఆల్కహాల్ ఉండడం వల్లనే వైరస్ పోతుందని నిర్దారణ అయింది కదా.. అలాంటప్పుడు ఆల్కహాల్ తాగితే  గొంతులో వున్నా కరోనా వైరస్ కూడా పోతుంది కదా. అందుకే మీరు మద్యం దుకాణాలను తేరవడానికి అనుమతి ఇవ్వండని రాజస్థాన్ సీఎం కు అక్కడి కాంగ్రెస్ MLA భరత్ సింగ్ లేఖ రాసిండు.