Skip to main content

Posts

Showing posts with the label INTERNATIONAL

కరోనా కట్టడకి కేరళ ఏంచేసింది - కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు

STAY HOME   STAY SAFE  కరోనా కట్టడికి  కేరళ ఏంచేసింది. కేరళ వైపు ప్రపంచ దేశాల చూపు ఎందుకు కరోనా కట్టడిలో చర్యలు భళా. కరోనాని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్, భౌతిక దూరం. ఇవి రెండే చాలవు, ఇంకా చాలా చేయాలి. ఆ పని చేసి చూపించింది కేరళలో పి.విజయన్‌ ప్రభుత్వం. ప్రపంచం మేల్కొనక ముందే కళ్లు తెరిచింది. కరోనా ఎంత భయంకరంగా కమ్మేస్తుందో తెలుసుకుంది ముందుగా జాగ్రత్త పడింది. అదే పదిమందికి స్ఫూర్తినిస్తోంది ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీ, కమ్యూనిటీ కిచెన్‌లు ఏర్పాటు చేసి వలస కూలీలకు, నిలువ నీడలేని వారికి ఆహార పొట్లాలు అందిస్తోంది.     *తిరువనంతపురం:* ప్రాణాంతక నిఫా వంటి వైరస్‌లు, వరదలు వంటి ప్రకృతి బీభత్సాలను ఎదుర్కొన్న అనుభవం కేరళకి బాగా కలిసి వచ్చింది. భారత్‌లో తొలి కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ రికవరీలోనూ ముందుంది. ఇక్కడ జనసాంద్రత ఎక్కువ. చదరపు కిలోమీటర్‌కి 860 మంది వరకు నివసిస్తారు. విదేశీ రాకపోకలు ఎక్కువే. గల్ఫ్‌ దేశాలలో కేరళ కార్మికులే ఎక్కువ. ఇక చైనాలోని వూహాన్‌లో చదువుకునే వైద్య విద్యార్థులు అధికభాగం కేరళ వారే. 60 ఏళ్ల వయసు పై బడిన జనాభా 12 శాతం. ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులు ఎక్కువే. అయినా కరోనా కట్టడి చర్య

**బెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌**

బెంగాల్‌ మంత్రికి వీసా నిరాకరించిన బంగ్లాదేశ్‌ పశ్చిమ బెంగాల్‌ గ్రంథాలయ శాఖ మంత్రి, జమాత్‌ ఉలేమా హింద్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిక్‌ అల్లాహ్‌ చౌదరికి బంగ్లాదేశ్‌ వీసా నిరాకరించింది. వీసా నిరాకరణకు గల కారణం వెల్లడికాలేదు. ఈ విషయంపై సిద్ధిక్‌ చౌదరి మాట్లాడుతూ.. 'డిసెంబర్‌ 26 నుంచి 31ల మధ్య ఐదు రోజుల బంగ్లాదేశ్‌ పర్యటనకు ఈ నెల 12వ తారీఖున వీసా కోసం దరఖాస్తు చేశాను. అక్కడ ఓ సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం వచ్చింది. నాకూ కొన్ని వ్యక్తిగత పనులున్నాయి. వీసా ఇస్తున్నట్టుగానీ, తిర​స్కరిస్తున్నట్టు గానీ నాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. వీసా కోసం అన్ని పత్రాలను సమర్పించాను. అవసరమైన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద తీసుకున్నాను.అయినా వీసా రాకపోవడంతో ఇప్పటికే బుక్‌చేసుకున్న టికెట్‌ను క్యాన్సిల్‌ చేసేశా'నని వెల్లడించారు. ఈ విషయంపై బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను వివరణ కోరగా, ఆయన అందుబాటులోకి రాలేదు. ఆ కార్యాలయ సిబ్బంది కూడా అందుబాటులోకి లేకుండా పోయారు. ఈ విషయంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఒకరు మాట్లాడుతూ.. వీసా రాకపోవడంపై మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం. ఒక మంత్

**సౌదీ జర్నలిస్ట్‌ ఖషోగీ హత్య కేసులో.. ఐదుగురికి మరణ శిక్ష..ముగ్గురికి 24ఏళ్ల జైలు**

సౌదీ జర్నలిస్ట్‌ ఖషోగీ హత్య కేసులో.. ఐదుగురికి మరణ శిక్ష..ముగ్గురికి 24ఏళ్ల జైలు రియాద్‌ : సౌదీ అరేబియా జర్నలిస్టు జమాల్‌ ఖషోగీ దారుణ హత్య కేసులో సౌదీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. హత్యలో నేరుగా భాగస్వాములైనందుకు ఐదుగురికి మరణ దండన విధించగా, నేరాన్ని కప్పిపుచ్చినందుకు, చట్టాన్ని ఉల్లంఘించినందుకు ముగ్గురికి 24 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మిగతా ముగ్గురు నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. వివరాల్లోకెళ్తే.. జమాల్‌ ఖషోగ్జీ సౌదీ అరేబియా జర్నలిస్టు .. గతేడాది అక్టోబర్‌ 2న సౌదీ అరేబియా ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌సల్మాన్‌, తన టర్కీ ప్రియురాలుతో వివాహం జరిగిందనే కీలక పత్రాలను స్వాధీనం చేసుకోవడానికి సౌదీ అరేబియా కాన్సులేట్‌ కార్యాలయానికి వెళ్లారు.ఈ నేపథ్యంలో ఖషోగ్జీకి, సౌదీ అధికారులకు మధ్య ఘర్షణ జరిగిందనీ, ఈ క్రమంలోనే ఆయనకు అధిక మోతాదులో డ్రగ్స్‌ ఇచ్చారనీ, దీంతో మరణించడాన్ని అధికారులు తెలిపారు. అనంతరం అతని మృతదేహాన్ని ముక్కలు చేసి, కాన్సులేట్‌ బయట వేచి ఉన్న మరో వ్యక్తికి అందజేశారని వెల్లడించారు. సౌదీ అరేబియా ఏజెంట్లేనంటూ.. సౌదీ అరేబియా ఏజెంట్లు ఖషోగ్జీని హత్య చేసి ఉంటారంటూ అప్పట్లో వార్తలు వెలు

**ముషారఫ్ శవం దొరికితే .... !!**

ముషారఫ్ శవం దొరికితే .... !! పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కి ఆ దేశ న్యాయస్థానం ఉరిశిక్ష విధించిన వార్త ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 2007వ సంవత్సరంలో ఆ దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసే విధంగా పర్వేజ్ ముషారఫ్ ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక ఆర్థిక నేరాలు మరియు అవినీతి చేసినట్టు అనేక ఆరోపణలు రావడంతో పాకిస్తాన్ దేశ న్యాయస్థానం విచారణ చేపట్టారు. అదే సమయంలో ముషారఫ్ తన అనారోగ్యం కారణంగా దుబాయ్ మరియు ఇంగ్లాండ్ దేశాలకు వెళుతూ చెకప్ చేయించుకుంటూ ఆ దేశాలలో ఉన్న హాస్పిటల్లో విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో ముషారఫ్ విచారణకు హాజరుకావాలని వాంగ్మూలం ఇవ్వాలని కోర్టు కోరడంతో హాస్పిటల్ నుండి వీడియో రూపంలో తాను పాకిస్తాన్ దేశానికి రావడం కష్టమని తన ఆరోగ్యం సహకరించడం లేదని వీడియో రూపంలో కోర్టుకి తెలపడం జరిగింది.ప్రస్తుతం తాను మరణకరమైన స్థితిలో ఉన్నట్లు పర్వేజ్ ముషారఫ్ ఆ వీడియోలో పేర్కొనటం జరిగింది. దీంతో పాకిస్తాన్ న్యాయస్థానం పర్వేజ్ ముషారఫ్ చేసిన వ్యాఖ్యలు విని ఒకవేళ ముషారఫ్ ఉరిశిక్షకు ముందే చనిపోయిన శవాన్ని తీసుకు వచ్చి ఉరిశిక్ష విధించాలని సంచలన తీర్పు ఇవ్వ

**ముషారఫ్‌కు మరణశిక్ష**

ముషారఫ్‌కు మరణశిక్ష   పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. దేశ ద్రోహం కేసులో ప్రత్యేక కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. మాజీ అధ్యక్షుడికి మరణ శిక్ష విధించడం పాకిస్థాన్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2007లో అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ముషారఫ్‌ పాకిస్థాన్‌లో అత్యయిక స్థితిని ప్రకటించారు. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించారు. అనేక మంది న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించారు. మీడియాపై ఆంక్షలు విధించారు. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో 2013 డిసెంబరులో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది. అయితే విచారణ జరుగుతుండగానే 2016 మార్చిలో ముషారఫ్‌ పాక్‌ విడిచి వెళ్లిపోయారు. కోర్టుకు హాజరుకావాలని ఎన్నిసార్లు ఆదేశించినా.. ముషారఫ్ న్యాయస్థానానికి రాలేదు. దీంతో ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక న్యాయస్థానం నవంబరు 19న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా ఆయనకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ముషారఫ్‌కు మరణశిక్ష విధించడాన్ని ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర

**ఎల్లలు దాటిన ప్రేమ: ఒక్కటి కానున్న సికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి**

*ఎల్లలు దాటిన ప్రేమ: ఒక్కటి కానున్న సికింద్రాబాద్ అబ్బాయి- జర్మనీ అమ్మాయి* *త్వరలో తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్- జర్మనీ యువతి డాక్టర్ జూలియాల ప్రేమ వివాహం* • జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన‌ స్వర్ణాకర్- జూలియా • స్వర్ణాకర్-జూలియాలను అభినందించిన మాజీ ఎంపీ కవిత ప్రేమకు కులం, మతం, ప్రాంతం హద్దులు కావని మరోసారి నిరూపితమైంది. ఖండాంతరాలు, దేశాలు దాటైనా ప్రేమను గెలిపించుకుంటున్నారు ప్రేమికులు. దీన్ని మరోసారి నిరూపించారు తెలంగాణ యువకుడు, జర్ననీ అమ్మాయి.  తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షులు స్వర్ణాకర్, జర్ననీ అమ్మాయి జూలియా మూడు ముళ్ల బంధంతో త్వరలో ఏడడుగులు వేయనున్నారు. స్వర్ణాకర్, జూలియా హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.  సికింద్రాబాద్ కు చెందిన స్వర్ణాకర్ కొన్నేళ్ల క్రితం ఉద్యోగ నిమిత్తం జర్ననీ దేశానికి వెళ్ళాడు. స్వర్ణాకర్ ఉద్యోగం చేస్తూనే, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తెలంగాణ జాగృతి జర్మనీ విభాగం అధ్యక్షుడైన స్వర్ణాకర్, జర్మనీలో ఉన్న తెలం

**నిత్యానంద నిజ స్వరూపం మరో సారి బయటపడిందిలా ?**

*నిత్యానంద నిజ స్వరూపం మరో సారి బయటపడిందిలా ?* మన దేశంలో ఉన్న స్వాములు మనుషుల్లో వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ... స్వయంగా దేవుళ్లం అని చెప్పుకుంటూ ఉంటున్నారు. అందులో నిత్యానంద ఒకరు. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే... ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ బిజినెస్‌ను పెంచుకుంటున్నాడు. ఇండియాతోపాటూ... విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో డొనేషన్లు ఇస్తూ... అతన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం... నిత్యానంద ఆశ్రమానికి వెళ్లడం, ఆయన చెప్పింది వినడం... ఆ తర్వాత ఆయన భక్తులుగా మారిపోయి... అన్నీ సమర్పించుకోవడం సహజమైపోతోంది. ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది...యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో... ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకొని... రేపులు, అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద ఇప్పుడు ఎక్కడున్నాడు? రేపు ఎక్కడుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం పోలీసుల దగ్గర లేదు. ఇక ఈయ

**అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య**

  అమెరికాలో హైదరాబాద్  యువ‌తి దారుణ హ‌త్య నవంబర్ 22 న యువతి హత్య యూనివ‌ర్సిటీ ఆఫ్ ఇలియ‌నాస్‌లో చదువుతున్న 19 ఏళ్ల రూత్ జార్జ్‌ అత్యాచారం చేసి. హ‌త్య చేసిన‌ట్లు నిర్ధారణ యూనివ‌ర్సిటీ గ్యారేజీలో  రూత్ జార్జ్ మృత‌దేహాం  రూత్ జార్జ్ ను హత్య చేసిన డోనాల్డ్ తుర్‌మాన్

**ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష**

. *ఈజిప్టులో తెలుగు యువకుడికి ఉరిశిక్ష* క్షేమంగా దేశానికి రప్పించండి.. విదేశాంగ శాఖమంత్రిని కోరిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు  శ్రీకాకుళం రూరల్‌ మండలం చంద్రయ్యపేటకు చెందిన బగ్గు రమణ అనే వ్యక్తికి ఈజిప్ట్‌ న్యాయస్థానంలో మరణ శిక్ష పడింది. ఆయన పనిచేస్తున్న షిప్‌లో మాదకద్రవ్యాలు లభించడమే ఇందుకు కారణం. 2016 డిసెంబరు 18న ఆయన ఈజిప్ట్‌ పోలీసులకు పట్టుబడగా ఇటీవలే విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబసభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఇంటర్‌ చదువుకున్న రమణ విశాఖలోని ఎస్‌కేడీ కంపెనీకి చెందిన వర్మ అనే ఏజెంట్‌ ద్వారా విదేశాల్లో సీమెన్‌గా పనిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఇందుకుగాను రూ.4 లక్ష లు చెల్లించాడు. 2016 సెప్టెంబరులో ముంబాయి నుంచి ఇరాన్‌కు విమానంలో వెళ్లాడు. అక్కడ ఏజెంట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అబ్బాన్‌ సిరదౌసీ కంపెనీకి చెందిన షిప్‌లో సీమెన్‌గా చేరాడు. సంబంధిత షిప్‌ ఈజిప్ట్‌ జలాల్లోకి ప్రవేశించగా.. అక్కడి పోలీసులు తనిఖీ చేయగా నిషేధిత మాదక ద్రవ్యాలు దొరికాయి. ఈ కేసులో రమణను అరెస్ట్‌ చేయగా అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించినట్టు తెలిసింది. కాగా రమణ విదేశాలకు వెళ్లిన నాటి నుంచి ఆయన ఆచూకీ లే

**ప్రపంచ కుబేరుల్లో  అగ్రస్థానాన్ని    చేజిక్కించుకున్నా బిల్‌గేట్స్‌**

ప్రపంచ కుబేరుల్లో  అగ్రస్థానాన్ని    చేజిక్కించుకున్నా బిల్‌గేట్స్‌ ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్‌ మరో సారి తన అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నారు.  దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ఈ పీఠాన్ని అధిరోహించారు.  మైక్రోసాఫ్ట్‌కు 10 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.70,000 కోట్లు) క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కాంట్రాక్టు రావడమే ఇందుకు కారణం. అమెజాన్‌కు కాకుండా ఈ కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌కు ఇస్తున్నట్లు అమెరికా రక్షణశాఖ అక్టోబరు 25న ప్రకటించింది.  అప్పటి నుంచి ఇప్పటిదాకా మైక్రోసాఫ్ట్‌ షేర్లు 4 శాతం మేర పెరిగాయి.  దీనితో గేట్స్‌ సంపద 110 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.7.7 లక్షల కోట్లు) చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ చెబుతోంది.  అదే సమయంలో అమెజాన్‌ షేరు 2% తగ్గిన నేపథ్యంలో బెజోస్‌ నికర సంపద 108.7 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. ప్రతి రోజు ప్రపంచంలోని 500 మంది సంపన్నుల సంపదను సూచించే ఈ సూచీ ప్రకారం.. ఐరోపాలోనే అత్యంత సంపన్నుడైన బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ మొత్తం మీద మూడో స్థానంలో నిలిచారు. ఈయన సంపద 102.7 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఈ ఏడాది మైక్రోసాఫ్ట్‌ షేరు 48 శాతం మేర రాణించింది. దీనితో గేట్స్‌కున

***~_వాట్సాప్_~* .....**

*~_వాట్సాప్_~* ...... వాట్సాప్​.. స్మార్ట్​ఫోన్ వాడుతున్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు.  ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా ఈ యాప్​ను వాడుతున్నారు.  కేవలం మన దేశంలోనే 40 కోట్ల మంది వాట్సాప్​ను వినియోగిస్తున్నారు.  ఈ యాప్​ ఇంత ఎక్కువ మందికి చేరువ కావడానికి ప్రధాన కారణం.. అందులో ఉండే ఫీచర్లు.  యూజర్లను ఆకర్షించేందుకు వాట్సాప్​ అదే తరహాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్​డేట్లు తెస్తుంది.  తాజాగా భారీ ఎత్తున కొత్త ఫీచర్లు తెచ్చేందుకు సిద్ధమైంది ఫేస్​బుక్​కు చెందిన మెసెంజర్ దిగ్గజం​.  ఈ సారి తీసుకొచ్చే ఫీచర్లపై భారీ అంచనాలున్నాయి. మరి ఆ ఫీచర్లేంటి? వాటి ఉపయోగమెంత? అనే విషయాలు మీ కోసం. డార్క్​ మోడ్​.. వాట్సాప్​ ఎప్పటి నుంచో ఊరిస్తున్న కొత్త ఫీచర్​డార్క్​ మోడ్​.  ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే వాట్సాప్​ ఇంటర్​ఫేస్​​ సహా అన్ని ఆప్షన్లు కేవలం లేత రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యం ఉండనుంది.  దీని ద్వారా రాత్రి పూట వాట్సాప్​ వాడేందుకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఫోన్​​ ఛార్జింగ్​ ఎక్కువసేపు వస్తుంది.  ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉంది.  త్వరలోన

**ఇండొనేషియాలో సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ**

ఇండొనేషియాలో సముద్రంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ న్యూఢిల్లీ: ఇండొనేషియా మొలుక్కా సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. రాత్రి 9.47కు ఈ ప్రకంపనలు సంభవించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.

**ఒకేసారి వేరు వేరు ఫోన్లలో వాట్సాప్  లాగిన్**

ఒకేసారి వేరు వేరు ఫోన్లలో వాట్సాప్  లాగిన్ ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఎన్నో రోజులుగా యూజర్స్ నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా ఈ సరికొత్త ఫీచర్‌ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దాకా రిజిస్టర్‌ చేసుకున్న ఫోన్లో మాత్రమే వాట్సాప్‌ లాగిన్ కాగలం. వేరొక ఫోన్లో లాగిన్‌ అవ్వాలనుకుంటే గతంలో రిజిస్టర్‌ అయిన ఫోన్లో నుంచి ఆటోమేటిక్‌గా లాగ్‌అవుట్‌ అవుతుంది. దీంతో ఒకేసారి ఒక్కటి కంటే ఎక్కువ ఫోన్లో లాగిన్‌ అవటం సాధ్యపడదు. అయితే మరికొద్ది వారాలలో ఒకేసారి వేర్వేరు ఫోన్లోలో లాగిన్‌ అవ్వగలిగే ఫీచర్‌ని వాట్సాప్‌ అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. పరీక్షల దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది. దీనితో పాటుగా డార్క్‌మోడ్‌ ఫీచర్‌ని తీసుకు రానున్నారు.  ఇవి కాకుండా మరి కొన్ని సరికొత్త ఫీచర్స్‌ని కూడా వాట్సాప్‌ అందుబాటులోకి తేనుంది. ఇప్పటి వరకు ఐఫోన్‌లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్‌ను ఇకముందు ఐపాడ్‌లలో వినియోగించుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ కల్పించనుంది. యూపీఐ ఆధారంగా పనిచేసే వాట్సాప్‌ పేమెంట్స్‌ ఫీచర్‌ను త్వరలో అధికారికంగా విడుదల చ