Skip to main content

Posts

Showing posts from February, 2021

మళ్లీ తెరపైకి వివాదాస్పద పుస్తకం కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు

  మళ్లీ తెరపైకి వివాదాస్పద పుస్తకం కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు *కంచ ఐలయ్య రాసిన కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే వివాదాస్పద పుస్తకంపై ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న ప్రొఫెసర్   తన అభిప్రాయాన్ని  వెల్లడించాలి అంటు మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల లో ఆర్య వైశ్య సంఘాల నిరసన

ఆరుగురు టీచర్లు సస్పెండ్

 గవర్నమెంట్​స్కూల్​లో మందు తాగి, పేకాట ఆడిన ఎంఈఓ, ఆరుగురు టీచర్లను విద్యా శాఖ ఆర్జేడీ సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  ఆదిలాబాద్ జిల్లా బేల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​కోలా నర్సింహులు, బేల, తాంసి, భీంపూర్ మండలాల ఎడ్యుకేషనల్​ఆఫీసర్. అయితే ఇటీవల బేల స్కూల్​లో చెప్రాల జడ్పీహెచ్ఎస్ హెడ్​మాస్టర్​ జీపీ జ్నానేశ్వర్, బేల జడ్పీహెచ్ఎస్​అసిస్టెంట్ సోనేరావు, బాది యూపీఎస్ అసిస్టెంట్​టి.నర్సింహస్వామి, సిర్సన్న, కరోని బి ఎంపీపీఎస్ లోని ఎస్ జీటీలు దేవురావు, అనంతరావులతో కలిసి మందు కొడుతూ, పేకాట ఆడారు. సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో బాగా వైరల్ ​అయ్యాయి. డీటీఎఫ్​ ఆర్జేడీతోపాటు విద్యాశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఇష్యూని సీరియస్​గా తీసుకున్న వరంగల్ ఆర్జేడీ కె.లింగయ్య బాధ్యులను డ్యూటీల నుంచి సస్పెండ్ ​చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారని డీఈఓ ఎ.రవీందర్​రెడ్డి తెలిపారు.

బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్ సాఫ్ట్వేర్ కంపెనీ

 Breaking  బోర్డు తిప్పేసిన ఫన్ లాబ్ టెక్నాలజీస్  సాఫ్ట్వేర్ కంపెనీ   బీటెక్ ఫ్రెషర్స్ కి ఉద్యోగమిస్తామని చెప్పి   వందలాదిమంది విద్యార్థుల నుండి సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో  ఇరవై నుండి యాభై వేల వరకు వసూళ్లు... ఆపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన నెలరోజుల్లోపే చేతులెత్తేసిన సంస్థ  • పరారీలో సంస్థ యజమాని  గతంలో కూడా ఇలాగే చేసినట్లు ఆరోపణలు... • పోలీసులకు బాధితుల ఫిర్యాదు... • నేడు లేబర్ కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్న బాధితులు....

గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్

   *గోవధ చేసిన 8 మంది నిందితులను సంఘటన జరిగిన ఆరు గంటల లోపు అరెస్ట్*  నేరం నెంబర్ 124/2021 U/s 429,153,153-A IPC and  Sec 10 of prohibition of cows slaughter  Act, and Sec 11 of  prevention of cruelty to animal Act. పోలీస్ స్టేషన్ సిద్దిపేట వన్ టౌన్ *నిందితుల వివరాలు* 1. మహ్మద్ జుబేర్ తండ్రి షఫీ, వయస్సు 45 సంవత్సరములు, నసిర్ నగర్ సిద్దిపేట.  2. మహ్మద్ ఖాజా తండ్రి బాబామియా, వయసు 35 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 3. మహ్మద్ సద్దాం తండ్రి మహబూబ్ సాబ్, వయస్సు 30 సంవత్సరములు,  సాజిద్ పుర సిద్దిపేట. 4. మహ్మద్ అరఫత్ తండ్రి వసీం, వయస్సు 24 సంవత్సరాలు, సాజిద్ పుర సిద్దిపేట. 5. మహ్మద్ ఇబ్రహీం తండ్రి మహబూబ్, వయసు 32 సంవత్సరములు,సాజిద్ పుర సిద్దిపేట. 6. మహ్మద్ హర్షద్ తండ్రి ఉమన్, వయస్సు 25 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 7. మహ్మద్ ఆరాఫ్ తండ్రి ఇబ్రహీమ్, వయస్సు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. 8. మహ్మద్ జావిద్ తండ్రి బాసిత్, వయసు 30 సంవత్సరములు, సాజిద్ పుర సిద్దిపేట. మరియు ఇతరులు ఈరోజు సాయంత్రం అందాజ 6:30 గంటల సమయమున సిద్దిపేట శివారు  సిరిసిల్ల వెళ్లే బైపాస్ రోడ్ లో పై నిందితులు  ఇటుక బట

కోడిపుంజు అరెస్టు

 జగిత్యాల: హత్యకు కారణమైన కోడిపుంజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి మరణంలో కోడిపుంజు పాత్ర కూడా ఉండడంతో పోలీసులో కస్టడీలోకి తీసుకున్నారు. మనిషి కోసుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా అయితే మీరీ స్టోరీ చదవాల్సిందే మరీ… జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీసులు ఓ కోడి పుంజును అరెస్ట్ చేశారు. స్టేషన్ లోనే దానికి దాన వేస్తూ కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామంలో ఇటీవల కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పందెం రాయుళ్లు. పందెం కోసం సిద్ధం చేసిన కోడి పుంజుకు అమర్చిన కత్తి గుచ్చుకోవడంతో వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్య(45)కు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్తయ్య హత్య కేసును విచారిస్తున్న క్రమంలో ఇందుకు కారణమైన కోడిపుంజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. *నేరాంగీకారం ఎలానో మరి..?*  సాధారణంగా పోలీసులు నేరం జరిగిన తరువాత నిందితుల స్టేట్ మెంట్ రికార్డు చేస్

ఆలస్యంగా వెలుగులోకి

 *ఆలస్యంగా వెలుగులోకి* # జీడిమెట్ల పియస్ పరిధి కుత్బుల్లాపూర్ లో మద్యం మత్తులో తన గొంతు కోసుకున్న నరేష్ (30) అనే వ్యక్తి... # నిన్న మద్యం మత్తులో భార్యతో గొడవపడి తన గొంతు కోసుకున్న భర్త నరేష్... # కేసు నమోదు చేసుకొని ఆసుపత్రికి తరలించిన జీడిమెట్ల పోలీసులు...

ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం

 *DELHI* సాయంత్రం 4:30 కు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నిక కూడా అవకాశం

కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా*

 *హాబీబ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో కోడలి పై అత్యాచారానికి పాల్పడిన మామా* ఓ బట్టల వ్యాపారం కోసం నగరానికి వచ్చిన మామా ,కోడలు గత రాత్రి నాంపల్లిలోని ఓ హోటల్ లో రూమ్ తీసుకొని ఉన్నారు అర్ధరాత్రి అదను చూసుకొని తన భర్త యొక్క తండ్రి తనను అత్యాచారం చేశాడని పోలీసులకు పిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని హాబీబ్ నగర్ పోలీసులు తెలిపారు భరోసా సెంటర్ కు స్టేట్ మెంట్ కు పంపించమని,స్టేట్ మెంట్ రాగానే అతని పై చర్యలు తీసుకుంటామని హాబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ పూసపాటి శివ చెంధ్ర తెలిపారు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం

  *గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్ లకు శిక్షణా కార్యక్రమం* మార్చి 14వ తేదీన జరుగనున్న వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు ప్రిసైడింగ్ మరియు అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండువిడతల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులను ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేస్తారని అన్నారు. పోలింగ్ నిర్వహణ కొరకు సిబ్బంది ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, పోలింగ్ సిబ్బందికి రెండు విడతలలో మార్చి 2 వ తేదీ మరియు 9వ తేదీలలో ఆయా జిల్లా కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్ల ఆధ్వ

స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ.

 నల్గొండ :  ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ స్క్రూట్నీలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్స్ తిరస్కరణ. 74 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించిన రిటర్నింగ్ అధికారి. 26న సాయంత్రం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు గడువు.

నల్గొండ జిల్లా ప్రభుత్వ వెబ్సైట్ లో సమాచారాన్ని అప్డేట్ చేయరా? 2018 నుండి అప్డేట్ జరుగని మీడియా గ్యాలరీ!

  నల్గొండ జిల్లా  ప్రభుత్వ వెబ్సైట్ లో సమాచారాన్ని  అప్డేట్ చేయరా?   2018 నుండి అప్డేట్ జరుగని మీడియా గ్యాలరీ! ప్రజలు  ఎక్కడినుండైన  జిల్లా  సమాచారం తెలుసుకోవడానికి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జిల్లాల  వెబ్సైట్ లు నిర్వహిస్తున్నారు.  నల్గొండ జిల్లాకు కూడా వెబ్సైట్ ఉంది. https://nalgonda.telangana.gov.in/te/  ఈ  వెబ్సైట్ ను నిర్వహించుటకు ప్రత్యేకంగా ఒక విభాగం కూడా ఉంది.  సమాచారం update అయినట్లుగా వెబ్సైట్ చివరలో పేరుకొంటున్నారు. వెబ్సైట్ మాత్రం అప్డేట్ కావడం లేదు.  కొంత సమాచారం తెలుగు వెర్షన్ లో కొంత  ఆంగ్లం వెర్షన్ లో అప్లోడ్ చేశారు  రెండు భాషల్లో మొత్తం సమాచారం ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.  ఉదహారణకు డాకుమెంట్ విభాగంలో జిల్లా అధికారులు పేర్ల జాబితా  చూడండి ఎప్పుడో ఉన్న అధికారుల పేర్లు ఉన్నాయి.  అలాగే   మీడియా గ్యాలరీ చూడండి ఎప్పుడో జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నప్పటి 2018 వార్తలు ఫోటోలు, వీడియోలే ఉన్నాయి.  సమాచార శాఖ అధికారులు సమాచారం వెబ్సైట్ నిర్వాహకులకు పంపడలేదా లేదా వెబ్సైట్ నిర్వహుకులు అప్డేట్ చేయడం లేదా అనేది ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు  సమాచారం అప్డేట్ చేసి ప్రభుత్వ  లక్ష్యా

ఈ నెల 25న హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ - రానున్న తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్

  ఈ నెల 25న  హాలియా లో బీజేపీ భారీ బహిరంగసభ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఇంచార్జ్ మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి హాలియలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ నెల 25వ తారీకున జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుక్ రానున్నారని   నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేస్తామని, గతంలో ఉన్న పార్టీలు నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిని ని పట్టించుకోలేదని, 25 తారీకూన నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ లో భారీ చేరికలు వుండబోతున్నాయని ఆయన చెప్పారు...

నామినేషన్ దాఖలు చేసిన TRS ఆభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి

  వరంగల్, ఖమ్మం,నల్గొండ  పట్టభద్రుల నియోజక వర్గ ఎం.ఎల్.సి.ఎన్నికలో  రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు నామినేషన్ దాఖలు చేస్తున్న TRS ఆభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఎన్నికల కోడును ఉల్లంఘించిన టిఆర్ఎస్- ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు నూకల నర్సింహ రెడ్డి

  బ్రేకింగ్.. నల్గొండ.... ఈరోజు టిఆర్ఎస్ అబ్యర్ది పల్లా రాజేశ్వర్ రెడ్డి  నామినేషన్ సందర్బనగా ఎన్నికల కోడును ఉల్లంఘించిన టిఆర్ఎస్ ప్రభుత్వ కార్యాలయాల కు, ప్రభుత్వ ఆస్తులకు టిఆర్ఎస్ జెండాలు, బ్యానర్లు కట్టిన టిఆర్ఎస్ ఎన్నికల కొడు ఉల్లంఘించిన టిఆర్ఎస్ అబ్యర్ది పల్లా రాజేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారి కి పిర్యాదు చేసిన బిజెపి రాష్ట్ర నాయకులు నూకల నర్సింహ రెడ్డి  చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి.. ఎన్నికల కోడును ఉల్లంఘించిన విషయాన్ని, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీఈవో ఆఫ్ తెలంగాణ కు పిర్యాదు చేసిన బిజెపి నాయకులు. దీనితో అధికారులు కట్టిన బ్యానర్లు తోరణాలు తొలగిస్తున్నారు 

5000 లంచం తీసుకుంటూ

  బ్రేకింగ్ న్యూస్...  సూర్యాపేట జిల్లా కోదాడలో 5000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ టి శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ శివవెంకటకృష్ణ 5 వేలు లంచం తీసుకుంటూ దొరికారు..

రాజభవన్ ముట్టడికి బయలుదేరిన న్యాయవాదులు

  వామాన్ రావు న్యాయవాద దంపతుల ను అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ,వారిని రక్షించడం లో విఫలమైన సీపీ సత్యనారాయణ ను సస్పెండ్ చేయాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్ట్ లోని న్యాయవాదులు రాజభవన్ ముట్టడికి బయలుదేరారు

*అన్ని కోణాల్లో దర్యాప్తు నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు* : *సీపీ రామగుండం*

  *అన్ని కోణాల్లో దర్యాప్తు నిందితులు ఎంతటివారైనా వదిలేది లేదు* : *సీపీ రామగుండం*  రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంథని కి 16 కిలోమీటర్లు దూరం లో ఉన్న కల్వచర్ల  వద్ద సుమారు 2:30 గం,, ప్రాంతంలో మంథని నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న హైకోర్టు న్యాయవాదులు  గట్టు వామనరావు గట్టు నాగమణి లు ప్రయాణిస్తున్న కారు ఆపి గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేయడం జరిగింది. వారిని 108 వాహనంలో పెద్దపల్లి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోవడం జరిగింది. *దుండగులను పట్టుకోవడం కొరకు  ప్రత్యేకమైన ఆరు టీమ్లను ఏర్పాటు చేసి  గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహించడం జరుగుతుంది. దుండగులు ఎంతటి వారైనా వదిలేదు అని సీపీ సత్యనారాయణ ఐపీఎస్ గారు తెలిపారు.*

మొక్కలు నాటి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం దొర కు మోర పెట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయుడు రంగా వెంకట్రావ్

  మహబూబాబాద్  కు చెందిన ప్రధానోపధ్యుడు కెసిఆర్  పుట్టిన రోజు పూరస్కరించుకొని  ఉపాధ్యాయులు విధిగా మొక్కలు నాటలని విద్యాశాఖ  అధెశించటం తో తప్పనిసరిగా మొక్కలు మొక్కలు నాటి ఉద్యోగుల  సమస్యలు పరిష్కరించాలని సీఎం దొర కు మోర  పెట్టుకుంటున్న ప్రధానోపాధ్యాయుడు రంగా  వెంకట్రావ్

ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల TRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చిన సీఎం

ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం  జిల్లాల పట్టభద్రుల TRS ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్ ఇచ్చిన సీఎం  

సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి

 సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.  కరీమాబాద్‌లోని రామ్ లక్ష్మణ్ గార్డెన్‌లో పుట్టిన రోజు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. కేక్ కట్ చేస్తుండగా క్యాండిల్ ఒక్కసారిగా పేలింది.  ఆ మంటలు పేపర్లకు అంటుకోవడంతో.. నేతలు అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే నరేందర్, ప్రజాప్రతినిధులు అక్కడే ఉన్నారు.  ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ.

 హైదరాబాద్:…….. • ఎమ్ జీబీ ఎస్ బస్సు స్టెషన్ సమీపంలో ఘర రోడ్డు ప్రమాదం. ఇద్దరు యువకులను బలి తీసుకున్న లారీ.  • అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లిన  మోటర్ సైకిల్. మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు దుర్మరణం.  • లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు విడిచిన యువకులు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.  • మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. • మృతులు చాదర్ ఘాట్ కు చెందిన‌ మోసిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తింపు.

నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు

  నక్కలగండి ప్రాజెక్ట్ ను సందర్శించిన  BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు  భారతీయ జనతా పార్టీ యువ మూర్ఛ చందంపేట మండల ఆధ్వర్యంలో మండలంలోని నక్కలగండి ప్రాజెక్ట్ ను  BJYM నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  నీళ్ళు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణ లో ఏమి లేకుండా అయిందని  ఎన్నికల ముందు మన ముఖ్యమంత్రి గెలిస్తే కుర్చీ ఎస్కొనీ పూర్తి చేస్తా అని చెప్పిన ప్రోజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు కానీ కేవలం నాగార్జున సాగర్ లో ఎన్నికలు ఉన్నాయనే ఉద్దేశంతో నిన్న లిఫ్ట్ లు శంకుస్థాపన చేయడం జరిగింది కానీ ఎపూడో పూర్తి కావాల్సిన ప్రోజెక్ట్ నీ మాత్రం పటిచుకొట్లేదు అని విమర్శించారు.. త్వరగా ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పూర్తి చేయకపోతే త్వరలోనే నీ ప్రగతి భవన్ తో పాటు ఫామ్ హౌస్ నీ బద్దలు కొట్టే రోజులు దగ్గర పడ్డాయి అని విమర్శంచారు...  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పగిల్ళ సాగర్, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, BJYM మండల అధ్యక్షుడు కూరాకుల విష్ణు, పార్టీ మండల అధ్యక్షుడు పత్లవత్ ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, బొ

జీహెచ్ ఎంసీ నూత‌న మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

 జీహెచ్ ఎంసీ నూత‌న మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జీహెచ్ఎంసీ నూతన మేయ‌ర్ గా ఎన్నికైన‌ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి, డిఫ్యూటీ మేయ‌ర్ గా  ఎన్నికైన మోతె శ్రీల‌త‌ శోభ‌న్ రెడ్డిల‌కు  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్ష‌లు  తెలిపారు. హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు

బీజేపీ దే విజయం - బీజేపీ నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, మాదగోని, కంకణాల శ్రీధర్ రెడ్డి

  బీజేపీ దే  విజయం - బీజేపీ నాయకులు గొంగిడి మనోహర్ రెడ్డి, మాదగోని, కంకణాల శ్రీధర్ రెడ్డి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు తీవ్రమైన ఆక్షేపనీయమని, సీఎం మొఖంలో ఆందోళన అబద్రత కొట్టొచ్చినట్టు కనిపించిందిని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గొంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా బిజెపి కార్యాలయం లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ కేసీఆర్ పైకి గాంభీర్యం  ప్రదర్శించారని, ఆయన ప్రసంగం టేప్ రికార్డ్ చెసినట్లు పేలవంగా సాగిందని, నల్గొండ లో ఏం అభివృద్ధి చేశారో చెప్పలేదని విమర్శించారు.సీఎం అహంకారం పరాకాష్ట కు చేరిందని,  ఫీల్డ్ అసిస్టెంట్ లు, గిరిజనులు, విద్యుత్ ఆర్టిజైన్ కార్మికులు ప్లకార్డులు పట్టుకుని  వారిని కుక్కల తో పోల్చడం ఎంత వరకు సమంజసమని,  గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటి సీఎం ఎవరు లేరని అన్నారు.  ఆయన మాట్లాడిన మాటలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గిరిజన భరోసా యాత్ర పెట్టిన తరువాతే కేసీఆర్  గిరిజనుల గురించి మాట్లాడారని, కుర్చీ వేసుకుని ఎస్సెల్బిసి పూర్తి చేస్తా అన్నారని, ఇప్పటికి గతిలేదని నల్గొండ జిల్లా పై సవతి తల్లి ప్రేమ చూపిస్త

495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి

 495 మంది అరెస్టు - జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి కేసీఆర్ సాగర్ పర్యటన సందర్భంగా 495 మంది  బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో  నిర్బంధించారని  జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శ నిమ్మల రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమ అరెస్ట్ లను బీజేపీ ఖండిస్తున్నదని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ ఇంచార్జి శ్రీమతి నివేధిత రెడ్డి పట్ల పోలీసుల అసభ్య ప్రవర్తన ను బీజేపీ జిల్లా కమిటీ ఖండిస్తుందని, మహిళ పోలీసులు లేకుండా నివేధిత పట్ల పోలీసుల ప్రవర్తన సిగ్గుచేటని విమర్శించారు.

ధన్యవాద సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి

  https://youtu.be/IwGG6AlqSZQ నల్లగొండ జిల్లా హాలియలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా తలపెట్టిన *ధన్యవాద సభ* ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి,టి యస్ ఐ ఐ సి చైర్మన్ గ్యాదరి బాలమల్లు,పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ ఎన్నికల ఇంచార్జీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మరో ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ గుప్తా తదితరులు

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్ అరెస్టు

  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా హాలియా పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగాని శ్రీనివాస్ గౌడ్ ను అరెస్టు  చేశారు.

బీజేపీ నాయకులు అరెస్టుల పరంపర

ముఖ్యమంత్రి హాలియ పపర్యటన కు నిలసరన తెలిపే అవకాశం ఉన్నదని పోలీసులు  జిల్లా వ్యాప్తంగా  బీజేపీ నాయకులను అరెస్టులు కొనసాగిస్తున్నారు  

కేసీఆర్ మీటింగ్ కు వస్తే డబ్బులు ? అంటూ మైక్ లో వీడియో చూడండి

  కేసీఆర్ మీటింగ్ కు   వస్తే డబ్బులు అంటూ మైక్ లో  సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న  వీడియో చూడండి

జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు అరెస్టులు, గృహానిర్బందాలు

  జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు అరెస్టులు, గృహానిర్బందాలు గత 7 ఏండ్లుగా హామీలు అమలు పర్చలేదని  నాగార్జున సాగర్ కు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పిలుపు నిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా  బిజెపి నాయకులను అరెస్టై చేస్తున్నారు.  గృహ నిర్బందాలు చేస్తున్నారు. నల్గొండలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి ని,  బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డిని, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ ను మాజీ  కౌన్సిలర్  బొజ్జ నాగరాజు ,దాసరి సాయి, పాలకూరి రవిగౌడ్ లని పోలీసులు అరెస్టు చేశారు.

పులిచెర్ల లో జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు, అరెస్టు వారెంటు చూపించమంటున్న కంకణాల నివేదిత

  పులిచెర్ల గ్రామంలో  నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు అరెస్టు వారెంటు చూపించమంటు న్న కంకణాల నివేదిత. ముఖ్యమంత్రి  హాలియ పర్యటన నేపథ్యంలో  జిల్లా  వ్యాప్తంగా అక్రమంగా కార్యకర్తలను అభిమానులను ను అరెస్టు చేయడాన్ని కంకణాల నివేదిక రెడ్డి నాగార్జునసాగర్ ఇంచార్జ్ తప్పుబట్టారు. జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిని  అరెస్టు వచ్చిన  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు మమ్మల్ని ఇలా అక్రమ కేసులతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాత్రంతా ఊర్లో పోలీసు జీపు siren లతో అలజడి ఎలా సృష్టిస్తారని పోలీసులను నిలదీశారు

వీరెల్లి హౌస్ అరెస్ట్

  వీరెల్లి హౌస్ అరెస్ట్ గత 7 ఏండ్లుగా హామీలు అమలు పర్చకుండా   నాగార్జున సాగర్ కు ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి పిలుపు నిచ్చిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా  బిజెపి నాయకులను అరెస్టై చేస్తున్నారు.  గృహ నిర్బందాలు చేస్తున్నారు.  నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేకేర్ ను నల్గొండలో  హౌస్ అరెస్ట్ చేశారు.  వాగ్దానాలు నెరవేర్చకుండా  ప్రజలకు మోసగిస్తున్నారని, ఈ విషయం ప్రజలకు తెలపడానికి మేము ముఖ్యమంత్రి పర్యటనకు శాంతి యుతంగా నిరసనకు పుణుకున్నామని బీజేపీ జిల్లా నాయకుల అక్రమ అరెస్టులు, అర్ధరాత్రి పోలీసులు బీజేపీ నాయకులను అర్రెస్ట్లు చెయ్యడానని    ఖండిస్తున్నానని ఆయన  తెలిపారు.

కార్యకర్తల కోసం సెల్ టవర్ ఎక్కిన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి

కార్యకర్తల కోసం సెల్ టవర్ ఎక్కిన నల్గొండ జిల్లా  బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి నాగర్జునసాగర్ నియోజకవర్గంలో కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని,  ప్రధాన సమస్యలైన పోడు భూముల సమస్య వంద పడకల ఆస్పత్రి నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయకుండా   కేసీఆర్   హాలియా కు వస్తున్న సందర్భంగా   సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలను బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు #కంకణాల_శ్రీధర్_రెడ్డి మరియు నియోజకవర్గ  ఇంచార్జి కంకణాల నివేదితరెడ్డి  వారిని సముదాయించి పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణలో ఇక బలిదానాలు వద్దు మన అందరం కలిసి మన సమస్యలను పరిష్కరించుకుంద్దాం అని నేరుగా జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి టవర్ ఎక్కి వారిని క్రిందకు దించారు.  

కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం

  కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలో గిరిజన భరోసా యాత్రలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండిసంజయ్,   ఎమ్మెల్యే రఘునందన్ రావు తో సహా బీజేపీ రాష్ట్రనేతలు, గిరిజనులపై  అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినందుకు నల్గొండ గడియారం సెంటర్ లో కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు..  ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి  మాధగాని శ్రీనివాస్ గౌడ్,  బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ కంకణాల శ్రీధర్ రెడ్డి  రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్ప ట్టణ అధ్యక్షులు మొరిశెట్టి నాగేశ్వరరావు , రాష్ట్ర, జిల్లా,మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు 

MG యూనివర్సిటీ భూములను తిరిగి యూనివర్సిటీకె కేటాయించాలని ఎబివిపి ఆధ్వర్యంలో వినతి

 నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి(DRO) గారిని కలిసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ భూములను తిరిగి యూనివర్సిటీకె కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందని ABVP మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాయకులు పొట్టిపాక నాగరాజు గారు అన్నారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీ విద్యార్థిని (బాలిక)లకు సరిపడా వసతి గృహం లేని కారణంగా ప్రైవేటు వసతి గృహాల్లో వేలకు వేలు డబ్బులు చెల్లించలేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని దీని కారణంగానే గతంలో ఉన్న ప్రభుత్వం పానగల్ ఎల్లమ్మ గుడి వద్ద 01 ఎకరం స్థలం కేటాయిస్తే దానిని ఖాళీగా ఉంటుందనే సాకుతో బాలికల వసతి గృహం నిర్మించకుండా మార్కెట్ యార్డుకు ప్రభుత్వం కేటాయించడం సమంజసం కాదని అన్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యని కారణంగానే యూనివర్సిటీ బాలికల వసతి గృహం నిర్మాణం జరగలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలకు నిధులు మంజూరు చేసి యూనివర్సిటీ బాలికల వసతి గృహం కోసం కేటాయించిన స్థలంలోనే బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకొని వసతిగృహాన్ని నిర్మించాలని,వేరే అవసరాలకు కాకుండా తిరిగి యూనివర్సిటీకె ఆ స్థలాన్ని కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్

బండి సంజయ్ గిరిజన భరోసా యాత్రలో జన నీరాజనం

 👉గిరిజన భరోసా యాత్రలో  జన నీరాజనం 👉టీఆర్ఎస్ పార్టీ నాయకుల కబ్జాలకు వ్యతిరేకంగా బిజెపి పోరాటం 👉గుర్రంపోడ్ తండాలో గిరిజన భూముల్లో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ పర్యటన 👉"చలో గుర్రంబోడు తండా" కు బయలుదేరిన  బండి సంజయ్ కుమార్ గారు 👉వందల కార్లలో వెంట బయలు దేరిన బిజెపి నాయకలు, కార్యకర్తలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి

   ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలుపు బీజేపీదే --మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి             ప్రభుత్వానికి  అనివర్గాల వారుదూరమైనారని,  ప్రజలంతా అధికార పార్టీ పై,  ప్రభుత్వం పై   ఆగ్రహం తో ఉన్నారని  ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బీజేపీదే నని  ఉమ్మడి  నల్గొండ జిల్లా mlc ఎన్నికల ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జిల్లా బీజేపీ అధ్యక్షుడు  కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్యక్షతన నల్గొండ జిల్లా కార్యాలయంలో    జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల బిజిపి  పోలింగ్ బూత్ కన్వీనర్ వర్క్ షాప్ సమావేశంలో  ఆయన మాట్లాడుతూ బూత్ కన్వీనర్ లు నాయకులు సమిష్టి గా కృషి చేయాలని, గెలుపు బీజేపీదే నని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ పరంపర  మొదలయిందని దుబ్బాక , జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగించిందని, కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గెలుపు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్  పోలింగ్ బూత్ కన్వీనర్ లకు వర్కు షాప్ నిర్వహించారు. మండలాల వారిగా,

ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు

   ఎబివిపి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ యూనివర్సిటి రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయింపు నల్లగొండలోని పానగల్ రోడ్డులో  ఎల్లమ్మ గుడి సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహానికి సంబంధించిన ఎకరం భూమిని ప్రభుత్వం అక్రమంగా తీసుకోవడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో  రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించడం జరిగిందని రిజిస్ట్రార్  ఈ అంశం నా పరిధిలో లేదని విసీ  పరిధిలో ఉందని చేతులు దులుపుకోవడం తో మండిపడ్డ విద్యార్థి నాయకులు విసి చాంబర్లో దుప్పట్ల తో విసీ గారు వచ్చేంత వరకు ఇక్కడే నిద్రపోతాం అని చెప్పి నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్ మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే యూనివర్సిటీ భూములు కబ్జాకు గురవుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ యూనివర్సిటీ నాయకుడు పొట్టిపాక నాగరాజు గారు మాట్లాడుతూ  ఇంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు నిద్రపోతున్నారని, యూనివర్సిటీ భూములను అక్రమంగా ఇతరులకు అప్పగిస్తూన్నారని మండిపడ్డారు. విసి గారు 15 నెలలు గడు

కంట్రీ క్లబ్ లో జింతాక జింతాక డాన్స్

 కంట్రీ క్లబ్ లో  జింతాక జింతాక డాన్స్ లు చేస్తున్న 30 మంది యువకులు,7 గురు  యూవతులను అరెస్ట్ చేసిన taskforce పోలీసులు,పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలింపు...లాస్ట్ నైట్ రైడ్స్

పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‍ఈసీ చర్యలు...

 Andhrapradesh పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‍ఈసీ చర్యలు... పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు హౌస్ అరెస్ట్  చేయాలని డీజీపీని ఆదేశించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్...

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌ని క‌లిసిన వి.బి.జి స‌భ్యులు

  తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌ని క‌లిసిన వి.బి.జి స‌భ్యులు తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ చైర్మ‌న్ ఉప్ప‌ల శ్రీ‌నివాస్ గుప్త‌ని వాస‌వీ బిజినెస్ గ్రూప్ (వి.బి.జి) స‌భ్యులు క‌లిశారు. టూరిజం చైర్మ‌న్‌గా బాద్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మొద‌టిసారి ఆయ‌న్ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి శాలువా క‌ప్పి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో చైర్మ‌న్ టి.ఎస్‌.వి ప్ర‌సాద్‌, ఫౌండ‌ర్లు ఎం.రాజు, శ్రీ‌హ‌రి, కో ఫౌండ‌ర్ ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌, క‌మిటీ స‌భ్యులు వెంక‌టేశ్ గుప్త‌, మారుతి గుప్త‌, శ్రీ‌నివాస్, రాఘ‌వేందర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

బాలిక పై 17 మంది......

 కర్ణాటక రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. చిక్కామంగళూరు జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలికపై 17 మంది కామాంధులు గత ఐదు నెలలుగా అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనపై చిక్కామంగళూరు జిల్లా శ్రీంగేరి పోలీసులకు జిల్లా బాలల సంక్షేమ సంఘం ఛైర్మన్ ఫిర్యాదు చేశారు. స్టోన్ క్రషింగ్ యూనిట్ లో 15 ఏళ్ల బాధిత బాలిక పనిచేస్తుండగా ఈ దారుణం జరిగింది.మొదట బాలికపై బస్సు డ్రైవరు గిరీష్ అత్యాచారం చేశాడు. బస్సు డ్రైవరు అందించిన సమాచారంతో అభి అనే మరో యువకుడు బాలికపై అత్యాచారం చేసి ఆమె అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. అనంతరం అభి స్నేహితులు అశ్లీల ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి వారు కూడా అత్యాచారం చేశారు. బాధిత బాలిక తల్లి మరణించడంతో ఆమె అత్త ఇంట్లో నివాసముంటోంది.

తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం

  తమ ఉనికి కోసం, అల్పానందం కోసం 'రామాయణం' మీదపడి ఏడ్చే తోడేళ్ళమందకి ఈ వ్యాసం అంకితం ఇది చదివినాక మీకు ఇంకా బతికే అర్హత ఉంది అనుకుంటే సిగ్గు,శరం లేకుండా బ్రతికేయొచ్చు...లేదా ఎందులోనైనా దూకి చావండి..మంచివాళ్ళే పోతున్నారు..మీరు చచ్చినంత మాత్రాన భూమికేమి వెలితి కాదు. 'రామాయణము'అంటే రామునియొక్క ప్రయాణము,రాముడు నడిచిన మార్గము...అనగా రాముడు నడిచిన ధర్మ మార్గము...ఆ ధర్మమార్గం ఏమిటో చూద్దాం.. సీతా స్వయంవరం జరుగుతుంది..రాజులు,చక్రవర్తులు ప్రగల్బాలు పలుకుతూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నించి బంగపడుతున్నారు.. రాముడు ధనుర్బంగం చేయగలడు..సామర్ద్యం ఉంది కదా అని వెంటనే బలప్రదర్శన చేయలేదు..గురువు ఆజ్ఞ్య వచ్చేవరకూ ఆగాడు. పెద్దలు,గురువుల ఎదుట అంత వినయంగా ఉండేవాడు.. మిడి,మిడి జ్ఞ్యానంతో మిడిసిపడి గురువులనే గడ్డిపోచలుగా భావించే అసుర సంతానానికి రాముడు నచ్చలేదు. రాముడికి పట్టాభిషేకం అని ప్రకటించారు.కాని పరిస్థితులవల్ల వనవాసానికి వెళ్ళాల్సి వచ్చింది..వెళ్ళకపోతే తండ్రికి అవమానం..తన తండ్రిగారి మర్యాద నిలబెట్టడం కోసం చిరునవ్వుతో రాజవాసాన్ని విడిచి అరణ్యవాసానికి బయలుదేరాడు.. ఆస్తి పంపకా

సెట్విన్ ఆధ్వర్యంలో ఉద్యోగ సమాచారం కోసం వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

  సెట్విన్  ఆధ్వర్యంలో  ఉద్యోగ సమాచారం కోసం వెబ్సైట్ ను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సెట్విన్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి, యువకులకు ఉద్యోగ సమాచారం కోసం  రూపొందించిన వెబ్ సైట్ ను YAT&C శాఖ ముఖ్య కార్యదర్శి  సవ్యసాచి ఘోష్ తో కలసి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సెట్విన్ సంస్థ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల సెట్విన్ శిక్షణ సంస్థ ను ఆధునిక శిక్షణ కేంద్రం గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గతంలో సెట్విన్ హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి జంట నగరాల్లో మాత్రమే సేవలునందించేది కానీ, నేడు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్ర కేంద్రాలలో ఏర్పాటు ను వేగవంతం చేస్తున్నామన్నారు. సెట్విన్ ఆధ్వర్యంలో 7 STEP ద్వారా 24 కేంద్రాలను, ప్రాంఛేజ్ ల ద్వారా 60 శిక్షణ కేంద్రాల లో శిక్షణ తరగతులను 47 అంశాల్లో నిర్వహిస్తున్న మన్నారు.  సెట్విన్ సంస్థ ఉద్యోగులు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా తయారు చ

రాముని ఫోటో తో శాంతియుత ధర్నాలు

  తెలంగాణ రాష్ట్రంలో రామ భక్తుల మీద టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి పోలీస్ లచే అక్రమంగా కేసులు పెడుతూ,బీజేపీ నాయకులను,కార్యకర్తలను బెదిరిస్తూ,రామతీర్థనిధి సేకరణ ను అడ్డుకోవలని కేసీఆర్ చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు 2.2.2022 మంగళ వారం రోజు నల్లగొండ జిల్లాలోని అన్ని మండల రెవిన్యూ ఆఫీసుల ముందు రాముని ఫోటో తో శాంతియుత ధర్నా చేయాలన్న రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా  బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలిని , నల్గొండ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు.

2న సాగర్ రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల

   ఫిబ్రవరి 2 వ తేదీ న రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నాగార్జున సాగర్ కు రానున్నారు.రేపు ఉదయం హైద్రాబాద్ నుండి బయలు దేరి ఉదయం 11 గంటలకు నాగార్జున సాగర్ చేరుకుంటారు.బుద్ధవనం సందర్శించి మధ్యాహ్నం ఒంటి గంటకు విజయ విహార్ లో విలేకరుల సమావేశం లో మాట్లాడుతారు

వరంగల్ జిల్లా ఇష్యూ పై ఈట్ కా జవాబ్ జరూర్ పత్తర్ సే మిలేన్గా అంటున్న ఎమ్మెల్యే రఘునందన్

 వరంగల్ జిల్లా ఇష్యూ పై ఈట్ కా జవాబ్ జరూర్ పత్తర్ సే మిలేన్గా అంటున్న  ఎమ్మెల్యే  రఘునందన్ ఈ క్రింది లింక్ ను టచ్ చేసి  యూట్యూబ్ లో  చూడండి https://youtu.be/0EXuZCYlyp4

కారులో మంటలు.

 రంగారెడ్డి:……. • రాజేంద్రనగర్ చింతల్ మెట్ ఎమ్ ఎమ్ పహాడి వద్ద పార్క్ చేసిన కారులో మంటలు.  • తెల్లవారుజామున కారు లో నుండి ఒక్కసారి గా మంటలు చెలరేగడంతో పోలీసులకు, అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చిన స్థానికులు.  • హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మండలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది.  • అప్పటికే పూర్తిగా అగ్నికి అహుతైన కారు. గత కొన్ని రోజులుగా రోడ్డు పక్కన పార్క్ చేసి వున్న కారు.  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.  మంటలు.