Skip to main content

Posts

Showing posts from April, 2024

క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కు సన్మానం

 నల్లగొండ పట్టణంలో సెంటినరి బాప్టిస్ట్ చర్చ్ నందు  జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సు  లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్  నూతనంగా ఎన్నికైన సందర్భంగా వారిని నల్లగొండ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ టీం ఘనంగా సన్మానం చేశారు ఇట్టి సన్మాన కార్యక్రమంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రిస్టియన్ మైనార్టీ వైస్ చైర్మన్,  ఎ అనిల్ థామస్, జయోను ఫెలోషిప్ చైర్మన్ రెవరెండ్ మోహన్ బాబు , జనరల్ సెక్రెటరీ ఎ టి బి సి రెవరెండ్ డాక్టర్ బొంత సామెల్,  హోలీ టెంపుల్ సీనియర్ పాస్టర్ రెవరెండ్ ప్రసాద్ చౌదరి , టిపిసిసి సెక్రటరీ బ్రదర్ హేజ్కెల్ , నల్లగొండ కాంసెన్సీ ఇంచార్జ్ అల్లం ప్రభాకర్ రెడ్డి, గార్లు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించిన వారు దాసరి ప్రీతి ప్రశాంత్  కాంగ్రెస్ క్రైస్తవ నాయకురాలు, యుపిఎఫ్ ప్రెసిడెంట్ రెవరెండ్ కత్తి డేవిడ్ రాజ్ , యుపిఎఫ్ జనరల్ సెక్రెటరీ పాస్టర్ పి సైమన్, యుపిఎఫ్ ట్రెజరర్ రెవరెండ్ రవికుమార్, సి బి సి ప్రెసిడెంట్ బ్రదర్ ఎస్పీ జయప్రకాష్ , జీసస్ క్రైస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ డి ప్రభువరం, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ సీనియర్ పాస్టర్ పీ ఆర్ డేవిడ్ గారు సి

నల్గొండ లోక సభ కు పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయింపు

 నల్గొండ లోక సభ లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయించిన ఎన్నికల అధికారులు ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk

నల్గొండ లోక సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు

  నల్గొండ లోక సభ  ఎన్నికల్లో  నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు THANDU UPENDAR THIRUGUDU RAVI KUMAR NUKALA NARASIMHA REDDY POTHULA PRARDHANA POTHULA YADAGIRI RAMA DEVI PALAKURI LINGALA SRINIVAS SHAIK USMAN BABA NARENDAR SOMAGANI

రూ1,96,70,324/-. పట్టుకు న్న సైబరాబాద్ SOT పోలీసులు*

  *రూ1,96,70,324/-. పట్టుకు  న్న సైబరాబాద్ SOT పోలీసులు*   *ఈరోజు సైబరాబాద్ SOT టీమ్స్ మరియు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి రూ. కింది 8 ప్రదేశాలలో 1,96,70,324/-. పట్టుకోవడం జరిగింది.* *బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 7  వాహనాలలో రూ. 1,81,70,324/-  సరైన క్యూఆర్ కోడ్‌లు మరియు ఎన్నికల సంఘం ఇతర విధానాలు లేకుండా డబ్బు రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది.* *మరియు  మోకిలా  పోలీస్  స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనం లో రూ. 15,00,000/-. అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది* *వివరాలు*  1) SOT మేడ్చల్ టీమ్ - BRINKS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 10 UD 1868 -  నగదు *రూ.74,07,791/-* పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ .  2) SOT శంషాబాద్ టీమ్  - CMS వాహనం సంఖ్య TS 10 UD 6979 -  నగదు *రూ. 34,00,000/-* కొత్తూరు పోలీస్ స్టేషన్ .. 3) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం సంఖ్య TS 09 UD 4042 - నగదు *రూ. 21,74,520/-* మాదాపూర్ పోలీస్ స్టేషన్ . 4) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం నెం TS09UD 4033 - నికర నగదు *రూ.19,26,405/-* చందంగార్ పోలీస్ స్టేషన్ . 5) SOT రాజేంద్రనగ

మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi"

  మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో  లండన్ నగరం లో "Run for Modi" నరేంద్ర మోడీ గెలుపు ను కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో 400 కు పైగా BJP కార్యకర్తలు పాల్గొని మోడీ కి మద్దతు తెలుపారు. కార్యక్రమం అనంతరం energetic FlashMob డాన్స్ లండన్ Tower Bridge దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో OFBJP నాయకులు సురేష్ మంగళగిరి, గుండా షణ్ముఖ, రంజిత్ తణుకు, తులసి, వివేక్ , రాజ్, అశ్విన్, అనుపిండి తదితరులు పాల్గొన్నారు.

*WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*

  *WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు* హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ     గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి  టంగుటూరి రామకృష్ణ   హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా  ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారని ఈ భోజన వసతిని  స్పాన్సర్ చేసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్  తెలిపారు. ఈ కార్యక్రమానికి  టంగుటూరి రామకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్  ఊరబాబు రావు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ, మరియు ఇతర ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నాయకులు పాల్గొని సేవా కార్యక్రమాలలో పాల్గొ

బిజెపి విజయానికి కృషి చేయండి-OFBJPUK జూమ్ మీటింగ్ లో రఘునందన్ రావు

 మెదక్ పార్లమెంటు కు బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు తో (OFBJPUK) ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వారు జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ జూమ్ మీటింగులో ఆయన మాట్లడుతూ UKలో ఉన్న మీరు మెదక్ పార్లమెంటు లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు మరియు తెలంగాణ లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు రోజు కొంత సమయం కేటాయించి బిజెపి కి ఓటు వేయమని అడగాలని బిజెపి విజయానికి కృషి చేసి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. మెదక్ పార్లమెంటు నియోజవర్గ లో కొన్ని ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినదని అలాగే మొత్తం నియోజక వర్గం లో పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న ఎన్నారైలకు మీ సూచన ఏమిటి అన్న ప్రశ్నకు ప్రజలకు మేలు చేయాలని అనుకున్నవారు రాజకీయాల్లోకి రావచ్చని ఇది మంచి plarfarm అని అన్నారు. బిజెపి నాయకులు సురేష్ మంగళగిరి, తులసి, గుండా షణ్ముఖ, భారత్ వాసా, రంజిత్, భూపతి రాజు తదితరులు  సుమారు 80 మంది పాల్గొన్నారు. 

కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదు - జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్

  నల్గొండలో  జరిగిన బీజేపీ దళిత మోర్చ విజయ సంకల్ప సభలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్ మాట్లాడుతూ కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదని అన్నారు.  ఏమన్నారో వీడియోలో చూడండి  

TJU ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం.

 తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జర్నలిస్ట్ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణకి ఘన సన్మానం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో శనివారం రోజున విశ్వకర్మ జర్నలిస్టు సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మా ఆత్మీయ మిత్రుడు సీనియర్ జర్నలిస్టు పి లక్ష్మీనారాయణ మరియు జిల్లా ఉపాధ్యక్షులు కూరెళ్ళ మల్లేష్ కీ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ శానూర్ బాబా  అనంతరం వారు మాట్లాడుతూ విశ్వకర్మ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయాలని ప్రభుత్వ నుండి రావాల్సిన పథకాల ద్వారా స్కీముల ద్వారా విశ్వకర్మ జర్నలిస్టులకు అందించే విధంగా కృషి చేయాలని కోరారు.  విశ్వకర్మ జర్నలిస్టులకు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, సీనియర్ జర్నలిస్టు దాత్రాక్ దయాకర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు గట్టిగప్పుల శ్రీనివాస్ టీ జే యూ సభ్యులు గడ్డమీ సత్యనారాయణ ,శివ తదితరులు

మేడే ను జయప్రదం చేయండి*. పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,

*మేడే ను జయప్రదం చేయండి*.  పల్లా దేవేందర్ రెడ్డి, ఏఐటీయూసీ కార్యదర్శి పిలుపు,  ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చారు. 138వ మేడే దినోత్సవం సందర్బంగా ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా కార్యలయం లో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక పండుగగా మే డేని భావిస్తారని మే 1వ తేదీన అంతర్జాతీయంగా దాదాపు 180 దేశాలు మేడే దినోత్సవాన్ని జరుపుకుంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. 1886 వ సంవత్సరంలో పని గంటల కొరకు చికాగోలో మొదలైన పోరాటంలో కార్మికుల రక్తం నుండి ఉద్భవించిందే ఎర్రజెండా అన్నారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇతర కార్మిక సంఘాలు వారి వారి జండాలను సృష్టించుకున్నారని కేవలం ఎర్రజెండా మాత్రం కార్మికుల రక్తం నుంచి ఉద్భవించిందన్నారు. భారతదేశంలోకి మొదటిసారిగా ఏఐటీయూసీ ద్వారానే ఎర్రజెండా వచ్చిందన్నారు. 104 సంవత్సరాల సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఏకైక సంఘం ఏఐటీయూసీ నే అని ఆయన కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా ఏఐటీయూసీ నాయకులు, కమ్యూనిస్టు నేత సింగారవేలి శెట్టి ఆర్ 1923వ

ఈ నెల 28న వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు

  వామ్ ఆల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో 1000 మందికి ఉచిత భోజనాలు ఈ నెల 28న మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పాటు చేస్తున్నట్లు నేషనల్ అడ్వైజర్ మరియు నెంబర్ వన్ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కౌటికె విటల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ గా కౌటికె విటల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వామ్ గ్లోబల్ ప్రెసిడెంట్ టంగుటూరి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, కార్యక్రమము సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర నిర్వహించబడుతున్నట్లు ఆయన  తెలిపారు.

ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలి-

       లోకసభ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని లోకసభ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ ర్రావు సూర్యవంశి అన్నారు.      శనివారం ఆయన నల్గొండ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కేషరాజుపల్లి, తిప్పర్తి, మాడుగుల పల్లి, కుక్కడం, వేములపల్లి తదితర మండలాలు, గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి కనీస సౌకర్యాలను ,ఇతర అంశాలను పరిశీలించారు.          అనంతరం మిర్యాలగూడలోని లోకసభ ఎన్నికల పంపిణీ రిజిస్ట్రేషన్ కేంద్రాన్ని, స్ట్రాంగ్ రూము తనిఖీ చేశారు.      ఆయా పోలింగ్ కేంద్రాల సందర్శన సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోకసభ ఎన్నికల సందర్భంగా ఎక్కువ పోలింగ్ అయ్యేవిధంగా చూడాలని ,ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ చిట్టిలను పంపిణీ చేయాలని, అదే సమయంలో పోలింగ్ తేదీని సైతం తెలియజేయాలని సూచించారు.          మిర్యాలగూడ ఆర్డిఓ శ్రీనివాసరావు, తహసిల్దార్ హరిబాబు ,ఆయా మండలాల తహసిల్దార్లు ఉన్నారు. ____________________________________  జారీచేసినవారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

నల్గొండలో 25 మంది నామినేషన్లు తిరస్కరణ

  శుక్రవారం నల్గొండ లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన అనంతరం( 25) మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా (31) మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగింది.  అంగీకరించిన నామినేషన్ల అభ్యర్థుల వివరాలు

అలీన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..

  షాద్నగర్.. అలిన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం..  ఫార్మా కంపెనీలో భారీగా చెలరేగిన మంటలు..  రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది..  అగ్నిప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు..  కంపెనీలో చిక్కుకుపోయిన దాదాపు 50 మంది కార్మికులు.. మంటలు వేడి తాళలేక బిల్డింగ్ పైనుంచి దూకిన నలుగురు కార్మికులు..  లోపల ఉన్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం..   తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్ధ నాదాలు..  కార్మికులను బయటకు రప్పిస్తున్న ఫైర్ సిబ్బంది..  నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి బయటికి వస్తున్న కార్మికులు..  ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేదానిపై అధికారులు ఆరా..  మంటలు దాటికి చుట్టుపక్కల వ్యాపించిన పొగ .. పొగతో ఉక్కిరి బిక్కరవుతున్న సానికులు.. *50 మంది కాపాడినబాలుడు*  షాద్నగర్ అగ్ని ప్రమాదంలో ఓ బాలుడి సాహసం 50 మంది ప్రాణాలను నిలబెట్టింది. స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనం పైకెక్కి తాడు కట్టాడు. ఆ తాడు సహాయంతో బిల్డింగ్ లోని కార్మికులు కిందకు దిగారు. లేదంటే వారందరూ అక్కడే సజీవదహనమయ్యేవారు. కాగా వెల్డింగ్ పనుల వల్లే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసులు గుర్తించారు.

మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ

        లోక సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్ , సి విజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోగ్ జీవన్ గాంకర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ,సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.       ఈ సందర్భంగా వారు మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, పెయిడ్ న్యూస్ స్కానింగ్, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్ లను తనిఖీ చేశారు.       అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా పోస్టింగ్ లను పరిశీలన చేశారు. ఆ తర్వాత సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు, సి-విజిల్ యాప్ కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం, తదితర విభాగాల సందర్శన సంద

నల్గొండ లోక్ సభకు దాఖలు అయిన నామినేషన్లు

 నల్గొండ లోక్ సభకు  ఏప్రిల్ 18 నుండి 25 వరకు దాఖలు  అయిన నామినేషన్లు  ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1nMN9Zjhu2NqVeXMQCJr-hGNQnI36uZKQ/view?usp=drivesdk ఈ క్రింది లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1nMN9Zjhu2NqVeXMQCJr-hGNQnI36uZKQ/view?usp=drivesdk

నల్గొండ జిల్లా ఎన్నికల పరిశీలకులు

       పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు ఎన్నికల పరిశీలకులను నియమించింది.            గురువారం నల్గొండ జిల్లాకు లోకసభ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా నియమితులైన (2010) ఐఏఎస్ బ్యాచ్ అధికారి మనోజ్ కుమార్ మానిక్ రావు సూర్య వంశీ జిల్లాకు వచ్చారు. వీరు లోక సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలోనే ఉండి లోకసభ ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు.  జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. 9867383846 సెల్ ఫోన్ నెంబర్లో అందుబాటులో ఉంటారు.        జిల్లాకు పోలీసు పరిశీలకులుగా  (2011 )ఐపిఎస్ బ్యాచ్ అధికారి  ఆమోఘ్ జీవన్ గాంకర్ నియమితులు కాగా, వీరు సైతం జిల్లాకు  చేరుకున్నారు. వీరు పోలీస్ అతిథి గృహంలో ఫోన్ నెంబర్ 8978946757 లో అందుబాటులో ఉంటారు.          కాగా ఇదివరకే జిల్లాకు వ్యయపరిశీలకులుగా కళ్యాణ్ కుమార్ దాస్  ( 2012) బ్యాచ్ ఐ ఆర్ ఎస్ అధికారి  జిల్లాకు  వచ్చారు. ____________________________________  జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

గోమాత సేవలో ఉప్పల

  గోమాత సేవలో ఉప్పల గోమాత సేవలో కాంగ్రెస్ర్ పార్టీ రాష్ట్ర నాయకులు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చెర్మేన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త.

రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి

 *రాయలసీమలో వైసీపీని నేలకూల్చండి* *జగన్ ను ఓటు ఆయుధంతో అధ: పాతాళానికి తొక్కేయండి* *నిర్భయంగా ఓటేయండి.. మీ వెనుక నేనుంటాను* *పెద్దిరెడ్డి ఈ ప్రాంతాన్ని సామంతరాజులా రౌడీయిజంతో పాలిస్తున్నాడు* *సంపద అంతా పెద్దిరెడ్డి కుటుంబం దగ్గరే ఉంది* *పెద్దిరెడ్డి ప్రాంతంలోకి ఎవరూ వెళ్లినా, ప్రశ్నించినా ప్రాణాలు తీస్తున్నారు* *కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు తగిన ప్రాధాన్యం* *కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ' ప్రసాద్ ' స్కీం ద్వారా ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధి*   *రాజంపేట ప్రజాగళం సభలో ప్రసంగించిన  పవన్ కళ్యాణ్* రాజంపేట నుంచి ప్రత్యేక ప్రతినిధి : రాయలసీమలోని ఓ ప్రాంతంలో ప్రజలంతా ఉపాధి కోసం బయట ప్రాంతాలకు, గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తుంటే, ఇక్కడి డబ్బంతా ముగ్గురు దగ్గరే ఉండి పోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు వద్దనే అది ఉండిపోయింది. వాళ్లు ఈ ప్రాంతాన్ని సామంతుల్లా పాలిస్తూ దోపిడీలకు, దౌర్జాన్యాలకు, రౌడీయిజానికి కేరాఫ్ చేశారు. వీళ్లను ఎవరూ ఏమీ అనకూడదు. కనీసం ఈ ప్రాంతంలోకి వచ్చినా దాడులు చేయిస్తార'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. స్థాన

బండి సంజయ్ నామినేషన్

*బండి సంజయ్ నామినేషన్*  *హాజరైన గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి* కరీంనగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర రజనీకాంత్ బాయ్ పటేల్, కేంద్రమంత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, మహిళా నాయకురాలు గండ్ర నళిని, కిరణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బండి సంజయ్ కుమార్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు.  

కీ.శే. సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు గడ్డి వితరణ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ

 కీ.శే. సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు గడ్డి వితరణ చేసిన ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ  స్వర్గీయ సోమవరపు భద్రయ్య జ్ఞాపకార్థం చింతపల్లి సాయిబాబా దేవాలయం గోషాలకు ఒక ట్రాక్టర్ గడ్డి ఇచ్చినట్లు ఆయన కుమారుడు ప్రముఖ హై కోర్టు అడ్వకేటు సోమవారపు సత్యనారాయణ తెలిపారు. మరియు అయన పేరు మీద ఒక ట్రాక్టర్ గడ్డి ఇవ్వడం జరిగింది. 

5వ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 8 మంది 9 సెట్ల నామినేషన్లను

  5వ రోజు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 8 మంది 9 సెట్ల నామినేషన్లను        లోకసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 5 వ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం (8) మంది అభ్యర్థులు (9) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీ అభ్యర్డులు కాగా, మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు.         బి ఆర్ ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి (2) సెట్లు నామినేషన్ దాఖలు చేయగా,ఎస్ జె పి( సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా) తరపున సుంకర లింగయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.          స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్ సంపంగి (1) సెట్, రేళ్ళ పెద్ద నరసింహారావు (1) సెట్, సుంకరి రమేష్ (1) సెట్, అబ్దుల్ మాలిక్ (1) సెట్, కిన్నెర యాదయ్య (1) సెట్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు (1) సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.      స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నెర యాదయ్య ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి, తిరిగి ఈరోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.        నల్గొండ లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన నామినేషన్లను స్వీకరించారు _________________________________ జారీ చేసిన వా