Skip to main content



నామినేషన్ల ప్రక్రియకు రాజకీయ పక్షాలు  సహకారం అందించాలి

     లోక సభ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పక్షాలు పూర్తి సహకారం అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే .శ్రీనివాస్ కోరారు.


          సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నామినేషన్ల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.


         ఏప్రిల్ 18 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాలపై ఆయన

 కూలం కుశంగా వివరించారు.


     లోక సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 18 నుండి 25 వరకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని , 26 నామినేషన్ల పరిశీలన, 29 న ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు.


        నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి ఛాంబర్ లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఉదయం 11 గంటలనుండి మధ్యాహ్న 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,మధ్యాహ్నం 3 తర్వాత నామినేషన్లు స్వీకరించడం జరగదని ఆయన స్పష్టం చేశారు.నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు వారితోపాటు, అనుమతించే వ్యక్తులు, వాహనాలు, తదితర అంశాలను అదనపు కలెక్టర్ వివరించారు .నామినేషన్ వేయడానికి ముందే పోటీ చేసే అభ్యర్థి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కోసం కొత్త ఖాతా తెరవాలని ఆయన తెలిపారు. నామినేషన్ల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 12500 /- రూపాయలు, సాధారణ అభ్యర్థులు 25 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయవలసి ఉంటుంది అన్నారు.


        ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ల సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాజకీయ పార్టీ ల ప్రతినిధులకు ఆయన అవగాహన కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థుల ఖరారు తర్వాత ఎన్నికల ఖర్చుల నిర్వహణ , ఎన్నికల ప్రవర్తన నియమావళి, పాటించవలసిన నియమ నిబంధనలు , ప్రజా ప్రతినిధ్య చట్టం పై వివరంగా తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రచురించే కరపత్రాల విషయంలో ప్రజా ప్రతినిధ్య చట్టంలోని 127 -ఏ నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని తెలిపారు. లోక సభ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు 95 లక్షల కు మించి ఖర్చు చేయకూడదని స్పష్టం చేశారు


       ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ,కాంగ్రెస్ పార్టీ నుండి అశోక్, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి బక్క పిచ్చయ్య, బిజెపి నాయకులు పోతెపాక లింగస్వామి, సిపిఎం నుండి నర్సిరెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ యార శ్రీను తదితరులు హాజరయ్యారు

________________________________

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార శాఖ, నల్గొండ*

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్