*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త*
*కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి*
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఘనత కాంగ్రెస్ పార్టీదే.. జాతీయ స్థాయిలో ఆర్యవైశ్యులను ఏకం చేస్తాం - *ఉప్పల*
*కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఉప్పల శ్రీనివాస్ గుప్త*
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాథ్యమని ఆలిండియా జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) జనరల్ సెక్రెటరీ రోహిత్ చౌదరి తెలిపారు.
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్ టీడీసీ) మాజీ చైర్మన్, ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) ఆలిండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ప్రెసిడెంట్, ఉప్పల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా బీఆర్ఎస్ ను వీడి, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
బుధవారం గాంధీ భవన్ లో రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రెటరీ కుమార్ రావుల ఆధ్వర్యంలో *రోహిత్ చౌదరి* సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరగ, రోహిత్ చౌదరి శ్రీనివాస్ గుప్తాకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు....
*ఈ కార్యక్రమంలో*... ఐవీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పబ్బా చంద్రశేఖర్ గుప్త, ఐవీఫ్ కల్చరల్ కమిటీ చైర్మన్ కటకం శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర యూత్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టా రవికుమార్, ట్రెజర్ నరేష్ గుప్తా, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్ గుప్త,మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సాంబు పాండు గుప్తా, వికారాబాద్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ గుప్తా, ఐవీఫ్ రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ లోకేష్ గుప్త, ఐవీఫ్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ వాస రాజేంద్ర ప్రసాద్ గుప్తా, హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుంకు లక్ష్మి నారాయణ, రవిప్రకాష్ గుప్తా, కాపర్తి నాగరాజు, శివ, జయకృష్ణ, ఫణి కుమార్, రాజ్ గుప్తా, సురేందర్ విశ్వనాథం, NRI-VA తాటికొండ సతీష్(చికాగో),
డివిజన్ నాయకులు, 33 జిల్లాల వైశ్య నాయకులు, ఉప్పల యువసేన నాయకులు, వెంకట్, మైనార్టీ నాయకులు మహ్మద్, బాషా, ఆసీఫ్ సహా దాదాపు మూడు వందల మందికి పైగా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అనంతుల శ్యామ్ మోహన్, రామ్ మోహన్ గౌడ్, అమరవాది లక్ష్మినారాయణ, ఉప్పల స్వప్న, ఉప్పల సాయికిరణ్, ఉప్పల సాయితేజ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment