Skip to main content

Posts

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళసూత్రం, మెట్టెలు, విరాళం

  ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో  మంగళసూత్రం, మెట్టెలు,  విరాళం     హైదరాబాద్ లోని వారి నివాసంలో వచ్చి కలిసిన పెళ్లికూతురు బంధువులకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా సతీమణి, ఉప్పల ఫౌండేషన్ కో-ఛైర్ పర్సన్ ఉప్పల స్వప్న  చేతుల మీదుగా మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా పెళ్లి కూతురు కి ఇచ్చారు.  పేద కుటుంబానికి చెందిన అనాధ మహిళ, వివాహం కోసం మంగళ సూత్రం, మెట్టెలు, చీర,గాజులు విరాళంగా ఇచ్చారు.. మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ అంబేద్కర్ కాలనీ కి చెందిన అనిగళ్ల స్వరూప- మల్లేష్ ల కూతురు వివాహానికి విరాళంగా ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ధికంగా వెనుకబడిన, తల్లిదండ్రులు లేని అనాథ మహిళ వివాహన్నీ గుర్తించి, పేదింటి అమ్మాయిని ఆదుకోవాలని సహాయం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు 

జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి - తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

 జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలి -  తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్ : జర్నలిస్టులందరూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఈ నెల 28, 29వ తేదీలలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి వ్యాక్సినేషన్ కేంద్రాలుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్, మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, చార్మినార్ యూనాని ఆసుపత్రి, వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లను జర్నలిస్టులకు ప్రత్యేక కేంద్రాలుగా కేటాయించినట్లు ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టుతోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులందరూ తమ సంస్థ యొక్క గుర్తింపు కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాలలో నమోదు చేసుకొని టీకాలు తీసుకోవాలని కోరారు.  రాష్ట్రంలో దాదాపు 20 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కలిగి ఉన్నారని, వారితోపాటు అక్రిడిటేషన్ లేని జర్నలిస్టులు కూడా టీకాలు తప్పని సరిగా తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా, మండలస్థాయిలో కూడా జర్నలిస్టులకు టీకాలు ఇస్తున్నార

*కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ*

 *కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయం : డిఎస్పీ* - - కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు భోజన వితరణ నల్లగొండ : లాక్ డౌన్ నేపద్యంలో కాచం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ సిబ్బందికి భోజనం అందించారు. అనంతరం మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు భోజన సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి రావడం, ఇతర ప్రాంతాల నుండి వచ్చి విధులు నిర్వహిస్తున్న వారికి ఇబ్బందిగా ఉన్న తరుణంలో కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందించడం ఎంతో అభినందనీయమన్నారు. పోలీసులు లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం కోసం ఇంటికి దూరంగా ఉంటూ ప్రజల కోసం.పని చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలని, అనవసరంగా బయటికి వచ్చి ఇబ్బందులు పడవద్దని కోరారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న తమతో ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనమ్, కాచం ఫౌండేషన్ ప్రతినిధులు

*టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్*

 *టప్పర్ వేర్ పేరుతో మోసాలకు పాల్పడ్డ స్వాతి, పార్వతిలపై పిడి యాక్ట్* నల్లగొండ : పట్టణంలోని శివాజీ నగర్ కు చెందిన స్వాతి టప్పర్ వేర్ ప్లాస్టిక్ ఉత్పత్తుల పేరుతో కోట్ల రూపాయలను పలువురి నుండి తీసుకొని వారిని మోసం చేసిన స్వాతి, ఆమెకు సహకరించిన పార్వతి లపై పిడి యాక్ట్ నమోదు చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ తో పాటు పలు ప్రాంతాలకు చెందిన వారిని మోసం చేసి అధిక లాభాలు చూపిస్తానని చెప్పి మోసం చేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ను సంప్రదించగా కేసు నమోదు చేసి నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో విచారణ చేసి పిడి యాక్ట్ నమోదు చేసి టూ టౌన్ ఎస్.ఐ. నర్సింహులు గురువారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..*

*కోవిడ్ ఎమెర్జెన్సీ పేరుతో సైబర్ నేరగాళ్ల నయా మోసం..* *నకిలీ ఈమెయిల్ ద్వారా 23 లక్షలు కాజేసిన కేటుగాళ్ళు..* హైదరాబాద్ కి చెందిన వీరేంద్ర బండారి అనే వ్యాపారి పేరుతో నకిలీ ఈమెయిల్ క్రియేట్ చేసిన సైబర్ నేరగాళ్లు. తాను కోవిడ్ పొజిటీవ్ తో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నానని.. అర్జెంట్ గా పేరుతో 23 లక్షల 60 వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని నకిలీ ఈమెయిల్ ద్వారా మెయిల్ చేసిన కేటుగాళ్ళు   తమ ప్రమేయం లేకుండానే నకిలీ  లెటర్ ప్యాడ్ పై తన సంతకాన్ని ఫోర్జరీ చేసి.. బేగంపేట యాక్సిస్ బ్యాంక్  మెయిల్ చేసిన.. సైబర్ నేరగాళ్లు. సంతకం టాలీ అవడంతో వారు చెప్పిన మూడు అకౌంట్లకు 23 లక్షలు 60 వేల నగదు ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంకు అధికారులు.  సాయంత్రం అకౌంట్ చెక్ చేసి డబ్బులు తక్కువ ఉండడంతో..తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యాపారి వీరేంద్ర బండారి.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.  *ఇదే తరహాలో మరో మోసం..* *తాను హాస్పటల్ లో ఉన్నాను అని తన అకౌంట్ నుండి 5 లక్షల రూపాయలు అర్జెంటుగా బదిలీ చేయాలని నకిలీ లెటర్ పై సంతకం చే

నిషేధిత గుట్కాలు పట్టివేత

 నల్గొండ.... నల్గొండ పట్టణంలోని ఓల్డ్ కలెక్టరేట్ రోడ్ లో శ్రీ లక్ష్మీ ప్రసన్న ట్రేడర్స్ లో నిషేధిత గుట్కా లు అమ్ముతున్నారనే సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనికీలు...నిషేధిత నికోటిన్, గుట్కా ప్యాకేట్ల పట్టివేత..కేసు నమోదు

కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి పంపిన సిపిఎం

కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచాలని జిల్లా కలెక్టరు కు ఆన్లైన్ లో వినతి    పంపారు యధావిధిగా చదవండి                           *శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ నల్లగొండ గారికి*          *విషయం* :- *(1) కరోనా చికిత్స కు 500 ఆక్సిజన్ బెడ్స్  పెంచుట.*                                                                    *(2)వెంటీలేటర్ బెడ్స్ 100కి పెంచుట,రిపేరులో వున్నవాటికి అవసరమైన మెటీరియల్ తెప్పించుట.*                                  *(౩) కరోన వార్డుల్లో సి.సి కెమారాలు అమర్చుట*                                                                               *( 4) జిల్లా కేంద్రం ఆసుపత్రిలో కరోన టెస్టులు 50 మాత్రమే చేస్తున్నారు,రోజుకి 300 కు పెంచుట మరియు phc ల లో 25 మాత్రమే చేస్తున్నారు 100 వరకు పెంచుట గురించి.*                                     *(5) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇప్పించుట గురించి.*                                     *(6) ప్రతిరోజు కరోన చికిత్సా పైనా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించీ తగు సుాచనలు చేయుట మరియు అవసరమైన నిధులు కేటాయించి వస

కోవిడ్ బులిటీన్ మే 8

 కోవిడ్ బులిటీన్ మే 8

*కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ.

 *Delhi* *కోవిడ్ చికిత్సకుఅందుబాటులోకి కొత్త డ్రగ్*. కీలక ప్రకటన చేసిన భారత రక్షణ శాఖ. *DRDO మరియు Dr Reddy's  laboratories సంయుక్త ఆధ్వర్యంలో 2DG పేరుతో అందుబాటులోకి కొత్త డ్రగ్.* కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న *రోగులను రెండింతల వేగంతో నయం చేస్తున్న 2-deoxy-D-glucose గా పిలువబడే కొత్త డ్రగ్.* *రోగుల ఆక్సిజన్ అవసరాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్న 2DG డ్రగ్.* పౌడర్ రూపంలో లభించే ఈ 2DG డ్రగ్ ను  నీళ్లలో కలుపుకుని తాగవచ్చని రక్షణ శాఖ ప్రకటన. *వైరస్ ద్వారా ప్రభావితమైన కణాల్లో ఈ కొత్త డ్రగ్ చేరి వైరస్ వృద్ధిని నిరోధిస్తుందని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ*. *కేవలం వైరస్ సోకిన క్షణాల్లో మాత్రమె చేరడం ఈ కొత్త డ్రగ్ ప్రత్యేకత అని ప్రకటించిన కేంద్ర రక్షణ శాఖ.* *COVID వ్యతిరేక పోరాటంలో మరో హైదరాబాదీ ఫార్మా కంపెనీ కీలక భాగస్వామ్యం.* DRDO తో కలిసి సంయుక్త పరిశోధన చేసి 2DG డ్రగ్ ను ఆవిష్కరించిన   హైదరాబాద్ కు చెందిన Dr. Reddy's లబోరేటరీస్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్ బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు...*

 *తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా , జిల్లాల వారిగా , పట్టణాల వారిగా , ఆక్సిజన్ బెడ్ ,వెంటి లెటర్  బెడ్ ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో ఈ లింకు ద్వారా తెలుసుకోవచ్చు. https://covidtelangana.com