పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం - బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి నల్గొండ: వచ్చే పార్లమెంట్ ఎన్నికలో 400 సీట్లతో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని నల్లగొండ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి శానం పూడి సైది రెడ్డి అన్నారు. నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి యువత ,మహిళలు ,వృద్దులు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని ఆయన అన్నారు. పిల్లిరామరాజు రాకతో నల్లగొండ నియెజకవర్గ ములో పార్టీకి మంచి పట్టు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పచ్చీస్ పతకాలను అమలుకానీ హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారనీ దుయ్యబట్టారు. నల్లగొండ పార్లమెంట్ నియెజకవర్గ పరిధిలో యువతకు ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని తెలిపారు. ఢిల్లీ లో మోడీ ,నల్లగొండ లో సైదిరెడ్డి రావడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన యువత కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జిల్ల