@ ధాన్యం సేకరణను వేగవంతం చేసిన నల్గొండ జిల్లా యంత్రాంగం
@ 5 లక్షల మె. ట ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటికే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
@ సుమారు 13 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ
@ కొనుగోలు కేంద్రాల సక్రమ నిర్వహణకు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రత్యేక పర్యవేక్షణ
@ రెవెన్యూ అదనపు కలెక్టర్ తో పాటు, పౌరసరఫరాలు, మార్కెటింగ్ ,వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు, తాసిల్దారుల తో ప్రతిరోజు సమీక్ష, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీలు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో దాన్యం సేకరణ వేగవంతంగా జరుగుతున్నది .రైతులు పండించిన దాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 370 కి 370 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది . ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. శనివారం నాటికి 12 కోట్ల 66 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు, మార్కెటింగ్, సహకార, డిఆర్డిఏ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్, తహసిల్దారులు సైతం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టేయంత్రాలు, నీడ ,తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించింది . గన్ని బ్యాగులకు ఎలాంటి కొరత లేకుండా జిల్లా వ్యాప్తంగా కోటి రెండు లక్షల గన్ని బ్యాగులను సిద్ధం చేసింది. ఇందులో 34 లక్షల గన్ని బ్యాగులను కొనుగోలు కేంద్రాలకు పంపించడం జరిగింది. తహసిల్దారులు, డిప్యూటీ తాసిల్దారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడమే కాకుండా వారి పరిధిలో ఉన్న రైస్ మిల్లులను సైతం సందర్శించి అక్కడ ధాన్యం దించుకునేందుకు సరైన సదుపాయాలు ఉన్నది లేనిది పరిశీలించే విధంగా ,హమాలీలు ,వాహనాలు అన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షించి తనకు నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జరిచేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సీఎంఆర్ ను సైతం సకాలంలో చెల్లించాలని మిల్లర్లతో సమీక్షించడం జరిగింది. దీంతోపాటు, ధాన్యం కొనుగోలులో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేకించి జిల్లా స్థాయిలో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో 9963407064 నంబర్ ను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర 2203/- రూపాయలు ,అదేవిధంగా సాధారణ రకానికి 2183/- రూపాయలు పొందేలా అవగాహన కల్పించి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కొనుగోలు కేంద్రాలలో సీరియల్ ఆర్డర్ లో ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏ -2 రిజిస్టర్ను ,ఇతర రిజిస్టర్ల నిర్వహణను పౌరసరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు .ఆర్డీవోలను సైతం వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం సేకరణ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది .జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ఏలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నది.
________________________________
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచారశాఖ, నల్గొండ*
Comments
Post a Comment