Skip to main content

పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం - కోమటిరెడ్డి

 




*పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం*


*కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు*


*రేవంత్ నాయకత్వంలో టీం వర్క్ గా పని చేస్తున్నాం*


*కాంగ్రెస్ లో ఏకనాథ షిండేలు లేరు*


*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*


*హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్*



*నల్లగొండ*: రాష్ట్రంలో ఈ ఐదేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని హరీష్ రావు, బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంత టీం వర్క్ గా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.

పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని, గ్రూపులు లేవని అన్నారు. ఏక్ నాథ్ షిండే అనే పదం బిజెపి సృష్టించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఎన్సిపి, శివసేనను వేరుచేసి సంతలో పశువులు కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నారని మండిపడ్డారు. అది ఇక్కడ వర్తించదని మంత్రి పేర్కొన్నారు.

 కాంగ్రెస్ లో పది గ్రూపులు ఉన్నాయంటూ మహేశ్వర్ రెడ్డి మాట్లాడం పట్ల మండిపడ్డారు. బిజెపిలో గ్రూపులు లేవా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దింపి కిషన్ రెడ్డిని ఎందుకు అధ్యక్షుడు చేశారో నీకు తెలుసా అని ప్రశ్నించారు.

దళితులను అడ్డం పెట్టుకొని పదేళ్లు ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బట్టి విక్రమార్క అంటే మాకు అపారమైన గౌరవం ఉందన్నారు.ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడం ఇష్టం లేకనే కేసీఆర్ 13 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నాడని విమర్శించారు.ఇప్పటికైనా హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ 14 సీట్లు గెలవడం ఖాయమన్నారు. బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ఒక్క సీటు కూడా గెలవడం కష్టమన్నారు.మహేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ ఐక్యత కోసం జరుగుతున్న ఎన్నికలన్నారు.బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కనివిని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్