*పదేండ్లు రేవంత్ రెడ్డే సీఎం*
*కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవు*
*రేవంత్ నాయకత్వంలో టీం వర్క్ గా పని చేస్తున్నాం*
*కాంగ్రెస్ లో ఏకనాథ షిండేలు లేరు*
*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి*
*హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్*
*నల్లగొండ*: రాష్ట్రంలో ఈ ఐదేళ్లతో పాటు వచ్చే ఐదేళ్లు కూడా రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని రాష్ట్ర రోడ్లు, భవనాలు,సినిమటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని హరీష్ రావు, బిజెపి ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంత టీం వర్క్ గా పని చేస్తున్నామని స్పష్టం చేశారు.
పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్ నాథ్ షిండేలు లేరని, గ్రూపులు లేవని అన్నారు. ఏక్ నాథ్ షిండే అనే పదం బిజెపి సృష్టించిందని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఎన్సిపి, శివసేనను వేరుచేసి సంతలో పశువులు కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నారని మండిపడ్డారు. అది ఇక్కడ వర్తించదని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో పది గ్రూపులు ఉన్నాయంటూ మహేశ్వర్ రెడ్డి మాట్లాడం పట్ల మండిపడ్డారు. బిజెపిలో గ్రూపులు లేవా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దింపి కిషన్ రెడ్డిని ఎందుకు అధ్యక్షుడు చేశారో నీకు తెలుసా అని ప్రశ్నించారు.
దళితులను అడ్డం పెట్టుకొని పదేళ్లు ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు. బట్టి విక్రమార్క అంటే మాకు అపారమైన గౌరవం ఉందన్నారు.ఆయన ప్రతిపక్ష నేతగా ఉండడం ఇష్టం లేకనే కేసీఆర్ 13 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొన్నాడని విమర్శించారు.ఇప్పటికైనా హరీష్ రావు,మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ 14 సీట్లు గెలవడం ఖాయమన్నారు. బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు ఒక్క సీటు కూడా గెలవడం కష్టమన్నారు.మహేశ్వర్ రెడ్డి ఇప్పటికైనా పనికిరాని చిట్ చాట్ లు బంద్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ ఐక్యత కోసం జరుగుతున్న ఎన్నికలన్నారు.బిజెపి మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టాలని రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని కనివిని ఎరుగని రీతిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, పలువురు కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment