Skip to main content

Posts

ఆన్ లైన్లో వ్యభి చార దందా

ఆన్ లైన్లో వ్యభి చార దందా చిలకలూరిపేటకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన తెలంగాణ రాచకొండ పోలీసులు అన్ లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ బ పట్టుకున్నారు.  నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడమేగాక పశ్చిమ్ బంగ , కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు . పరారీలో ఉన్న అంజలి ( ప్రధాన నిర్వాహకురాలు ) , ఆమె సహాయ కుడు చిన్నా కోసం గాలిస్తున్నారు. *గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన వంశీరెడ్డి* తో విజయవాడకు చెందిన అంజలి , చిన్నా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. అంతకుముందే వీరికి వివిధ రాష్ట్రాల్లో యువ తులను సరఫరా చేసే దళారులతో పరిచయముంది. వారి సహకారంతో కొంత డబ్బు చెల్లించి పశ్చిమ్ బంగా, కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులను నగరానికి తీసు కొచ్చి బల్కంపేటలోని అద్దె ఇంట్లో ఉంచారు. సామాజిక మాధ్యమాలు , లొకాంటో తదితర వెబ్ సైట్లలో ఈ నలుగురి ఫొటోలను ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు.  నమ్మకం కుదిరాకే మళ్లీ ఫోన్    ఈ వ్యవహారమంతా ఆన్ లైన్ లోనే జరుగుతోంది . విటుల నుంచి ఫోన్ రాగానే నిర్వాహ కులు అప్రమత్తమవు తారు. మీకు ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ తీసి మళ్లీ ఫోన

భారత్‌ కోలుకుంటోంది

భారత్‌ కోలుకుంటోంది. భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది. గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది._  _ఈ రోజు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం దేశంలో  ఈ ఒక్కరోజే అత్యధికంగా 49,310 యాక్టివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో  మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి పెరిగింది. వీరిలో 8,17,209 మంది కోలుకొని డిశ్చార్జి కాగా..  30,601 మంది ప్రాణాలు కోల్పోయారు.  దేశంలో మరణాల రేటు కూడా 2.38శతానికి పడిపోవడం విశేషం. ప్రస్తుతం 4,40,135 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ పరీక్షించారు. దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పర

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..

పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.. చాంద్రాయణగుట్ట police la వేధింపులు తట్టుకోలేక చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్  పోసుకొని ఆత్మహత్య యత్నం చేసిన పాత నెరస్థుడు షబ్బీర్..... షబ్బీర్ ని కాపాడేందుకు యత్నించిన చాంద్రాయణగుట్ట అదనపు సిఐ ప్రసాద్ వర్మ తోటి సిబ్బంది.. క్రైమ్ డి ఐ ప్రసాద్ వర్మ తో పాటు మరో కానిస్టేబుల్ కి స్వల్ప గాయాలు....  కాలిన గాయాలతో నెరస్థుడు షబ్బీర్ ని ఆసుపత్రికి తరలించిన చాంద్రాయణగుట్ట పోలీసులు.... షబ్బీర్ గతం లో 4 కేసులు పై శిక్ష అనుభవించాడు.... విచారణ నిమిత్తం తాజాగా ఓ దొంగతనం కేసులో పిలిపించి చాంద్రాయణగుట్ట పోలీసులు... సెల్ ఫోన్ దొంగతనం కేసు విచారణ నిమిత్తం షబ్బీర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచిన పోలీసులు

ఎస్సారెస్పీ కాలువకు గండి

సూర్యాపేట జిల్లా..పన్ పహడ్ మండలం ధర్మాపురం గ్రామంలో  ఎస్సారెస్పీ కాలువకు గండి భారిగా వృథా అవుతున్న గోదావరి జలాలు.  ఇసుక బస్తాలతో గండి ని పూడ్చి వేస్తున్న అధికారులు.. పరిస్థితిని పరిశీలిస్తున్న పెన్ పహాడ్ ఎంపిపి.

దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.

  దేశంలో కొనసాగుతున్న కరోనా విజృంభణ. 11 లక్షలు దాటిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన మూడు రోజుల్లో లక్షకు పైగా పాజిటివ్ కేసుల నిర్ధారణ. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 40, 425 పాజిటివ్ కేసులు నమోదు కాగా 681 మంది మృతి.  దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 11, 18, 043 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 3, 90, 459 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 7, 00, 087 మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 27, 497 మంది మృతి. నిన్న ఒక్కరోజే కోలుకున్న 22, 664 మంది బాధితులు.

ఏ సి బి దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :పాల్వంచ మండలం  కిన్నెరసాని విఆర్వో పై ఏసీబీ దాడులు ఏడు వేల రూపాయల నగదు స్వాధీనం కొనసాగుతున్న విచారణ.

జూన్ 11 ఏపీ కరోనా సమాచారం

ఏపీ కరోనా బులిటెన్ అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏపీలో 135 కేసులు నమోదవగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే విదేశాల నుంచి వచ్చి 9 మందికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఏపీలో 182 పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో నమోదయ్యాయి. ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఏపీలో నమోదైన మొత్తం 4261 పాజిటివ్ కేసులకు గాను.. 2540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం

జూన్ 10 తెలంగాణ కరోనా సమాచారం క్రొత్త పాజిటివ్ కేసులు 191 ఈ రోజు మృతి చెందినవారు 8 మొత్తం కేసులు 4111 అక్టీవ్ కేసులు 2138 డిశ్చార్జ్ అయినవారు 1817 మృతి చెందినవారు 156

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జులై 30 నాటికి నల్గొండ జిల్లాలో అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మైన త్రాగు నీరు అందిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ప్రకటించారు.రెండు నెలల వ్యవధిలో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయనున్నట్లు  ఆయన వెల్లడించారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు.ఏజెన్సీల నిర్లక్ష్యంతో మిగితా పనులలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే తక్షణ కర్తవ్యమని ఆయన తెలిపారు.మిషన్ భగీరథ పురోగతి పై బుధవారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్  అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షకు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ 40,123 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం చరిత్రాత్మక మైనదన్నారు.ఏడు దశాబ్దాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పటి పాలకులు  త్రాగు నీటి మీద 590 కోట్ల

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మూడు జిల్లాల్లో పర్యటన

తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం  పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌  మూడు జిల్లాల్లో పర్యటన తెలంగాణలో పల్లెప్రగతి కార్యక్రమం అమలుతీరును పరిశీలించేందుకు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. ముందుగా కామారెడ్డికి చేరుకోనున్నారు. జిల్లాలోని రెండు గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. అనంతరం అక్కడి నుండి సంగారెడ్డి జిల్లాకు, ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లాకు వెళతారు. ఆయా జిల్లాల్లోనూ రెండేసి గ్రామాల్లో పనులు జరుగుతున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తారు. ప్రతి నెలా ప్రభుత్వం రూ .308 కోట్లను జిపిలకు విడుదల చేస్తోంది. పర్యటన సందర్భంగా పారిశుధ్యం, డంప్ యార్డులు, శ్మశానవాటిక, నర్సరీ, టికెహెచ్‌హెచ్‌పై సిఎస్ దృష్టి సారించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ ఈ పర్యటన చేపట్టారు. గ్రామ పంచాయతీలు పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతోనే పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది