Skip to main content

Posts

జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు

  జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదు: కప్పర ప్రసాదరావు కేసిఆర్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటి చేసేది మరొక్కటి సునీతమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  హెల్త్ కార్డుల పంపిణీ అందరి జర్నలిస్ట్ లకు ఆరోగ్యం విద్య నివాసం మా లక్ష్యం సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటుచేసిన జిల్లా రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని జర్నలిస్టులపై ద్వంద వైఖరి అవలంబిస్తున్న ప్రభుత్వం పై పోరాటం తప్పదని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ శివశంకర్ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూరో ఆసుపత్రి హెల్త్ కార్డులు డా అనీల్ కుమార్ డా శంకర్ డా శివశంకర్ పంపిణీ చేశారు జర్నలిస్టుల కుటుంబీకులకు ఇందులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు . సమాజానికి ఎంతో మేలు చేసే జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందజేయడం సమాజానికి చేసిన సేవే అని ఈ అవకాశం కల్పించిన తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన పలువురు నాయకులు ప్రభుత్వం జర్నలిస్టుల

వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు

  వైశ్య గర్జనకు IVF & WAM మద్దతు నల్గొండ: నల్గొండ వాసవి భవన్  నుండి కార్పొరేషన్ డిమాండ్ తో  బైక్ ర్యాలీ ప్రారంభ  కార్యక్రమంలో  IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి పసుమర్తి మల్లికార్జున్, కోశాధికారి ఎల్వి కుమార్ మాట్లాడుతూ వైశ్యుల కొరకు 7 డిమాండ్లతో అక్టోబర్ 1న వైశ్య వికాస వేదిక అధ్వర్యంలో నిర్వహిస్తున్న వైశ్య గర్జన మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు.  మద్దతు ప్రకటించిన IVF & WAM  లకు వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు   కాచం   సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.  కార్పోరేషన్ కోరుతూ ఆర్యవైశ్య సంఘాల  సమాఖ్య అధ్వర్యంలో  నేహృగంజ్, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. కలెక్టరేట్ లో జిల్లా కలక్టర్ కు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం  అందజేశారు.  ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షుడు యమా మురళి, వైశ్య వికాస వేదిక అధ్యక్షుడు  కాచం  సత్యనారాయణ, నల్గొండ పార్లమెంట్ కు గత ఎన్నికల్లో  బీజేపీ తరపున పోటీ చేసిన గార్లపాటి జితేంద్ర కుమార్,  IVF రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాదీనం, WAM గ్లోబల్ ప్రధాన కార్యదర్శి

కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా

  కేసీఆర్‌ను నియంత్రిస్తున్న ఒవైసీ - అమిత్ షా తెలంగాణలోని ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన ' రైతు గోస బీజేపీ భరోసా' బహిరంగసభలో కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ.. అవినీతిలో కూరుకుపోయిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో విఫలమైందని విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ ఇష్టానుసారంగా కేసీఆర్ (కె.చంద్రశేఖర్ రావు) ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వంశ పారంపర్య పాలన గా రాజకీయ పార్టీలను షా వర్గీకరించారు: కాంగ్రెస్ నాలుగు తరాల ప్రభుత్వం, BRS రెండు తరాల ప్రభుత్వం మరియు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మూడు తరాల పార్టీ పాలనగా ఆయన అభివర్ణించారు. వంశపారంపర్య పాలన, అవినీతి, పేదల వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు రానున్న ఎన్నికలను ఒక అవకాశంగా ఆయన నొక్కి చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, యువతకు నిరుద్యోగ భృతి, రైతులకు, దళితులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని షా ఆరోపించారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 'రైతు గోస బ

వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

 వైశ్య ద్రోహులుగా మిగలకండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ తేదీ 29 ఆగస్టు 2023 మంగళవారం నాడు నల్లగొండ పట్టణంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన కొరకు ఆర్య వైశ్యులు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ తదనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులొ ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలకు నిజంగా లబ్ధి చేకూరాలని భావించే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు మద్దతు పలికి కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్నికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలుకుతుంటే దురదృష్టకరమైన విషయం కొన్ని *వైశ్య సంఘాలు* వ్యతిరేకిస్తున్నాయి అని సమాచారం నిజంగా వైశ్యుల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేసిన సంఘాలు ఏవి కూడా వైశ్య కార్పొరేషన్ కొరకు చేస్తున్న పోరాటాన్ని వ్యతిరేకించరు అలా వ్యతిరేకిస్తున్నారు అంటే వారు *వైశ్య ద్రోహులుగా పరిగణించవచ్చు* . కార్పొరేషన్ పోరాటాలను వ్యతిరేకించే వైశ్య సంఘాలు వారి స్వార్థం కొరకే సంఘాన్ని ఏర్పాటు చేసుకొని సమాజంలో వారి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కొరకు వైశ్యులను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్న వారే అని అనుకోవాలి. కాబట్టి అలాంటి వారి ప్రకటనలను ఎవరు కూడా పట్టించుకోవద్దు ఇప్పటికే సమాజంలో వైశ్యులలో

కౌటికె విఠల్కు అరుదైన గౌరవం

  కౌటికె విఠల్కు అరుదైన గౌరవం - ఫ్లాగ్ ఫుట్బాల్ ఇండియన్ టీంకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక హైదరాబాద్ వాస్తవ్యులు LIC లో No 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్సు అడ్వైసర్ అయిన కౌటికె విఠల్కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేస్తున్న ఫ్లాగ్ ఫుట్బాల్ టీమిండియా కు ఆయన బ్రాండ్ అంబాసిడర్ నియమితులయ్యారని అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ డాక్టర్ సందీప్ చౌదరి వెల్లడించారు. విఠల్ ఈ నెల 20న నగరంలో జరగనున్న నేషనల్ చాంపియనపు చీఫ్ గెస్ట్ గా హాజరవుతారు. మలేషియాలో ఈ ఏడాది అక్టోబర్ 23 నుంచిజరగనున్న ఆసియన్ చాంపియన్ షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు ప్రత్యేక అతిథిగా, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తారు. - నెదర్లాండ్స్ ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ మాసాల్లో జరగనున్న అంతర్జాతీయ చాంపియన్షిప్లో ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ టీంకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆయన ఇటీవల నియామక పత్రాన్ని అందుకున్నారు.

దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా

 దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా  నల్గొండ (గూడచారి ప్రతినిధి) :   ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబందు, మైనార్టీ బందు బీసీ బందు, గృహలక్ష్మి పథకాలను అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ *నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో అడ్వకేట్ మరియు నల్గొండ పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య   

ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్

ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సంబరాలు - యమా దయాకర్   నల్గొండ : (గూడచారి ప్రతినిధి) : భారత స్వాతంత్ర్య దినోత్సవము తేదీ 15.08.2023 మంగళవారం రోజున భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యాలయంలో( శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం ప్రక్కన.రామగిరి) ఉదయం గం.10.00 లకు జిల్లా అధ్యక్షులు వనమా వేంకటేశ్వర్లు చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ మహోత్సవం జరుప బడునని ప్రధాన కార్యదర్శి యమా దయాకర్ తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ మండల,పట్టణ, జిల్లా నాయకులు బాధ్యులు అందరిని ఆహ్వానించారు.

కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన

 కార్పొరేషన్ సాధనకు లక్ష మందితో వైశ్య గర్జన   హనంకొండ(గూఢచారి ప్రతినిధి) అవోపా భవనంలో వైశ్యులు -ఆత్మగౌరవం అనే అంశంపై వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హక్కుల సాధన చర్చాగోష్టి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కాచం సత్యనారాయణ మాట్లాడుతూ గత రెండు ఎన్నికలలో మేనిఫెస్టోలో ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఇంతవరకు ఇంతవరకు అమలు చేయలేదు వెంటనే కార్పొరేషన్ తో పాటు వైశ్య కమిషన్, పేద విద్యార్థులకు విదేశీ విద్యా నిధి, ఈ డబ్ల్యూ ఎస్ పథకంలో దామాషా ప్రకారం రిజర్వేషన్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం ఐదు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు, మరియు అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వైశ్య బంధు లాంటి పథకాలు అమలు చేయాలని 7డిమాండ్లతో కూడిన తీర్మాన పత్రాన్ని మరియు అక్టోబర్ ఒకటో తేదీ హైదరాబాదులో లక్ష మందితో నిర్వహించబోయే వైశ్య గర్జన గోడ పత్రికను ఆవిష్కరించారు ఈ వేదిక ఉద్దేశించి ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గాంధీ మాట్లాడుతూ మా సంస్థ కూడా గత 11 సంవత్సరాల లో రాస్తారోకోలు అసెంబ్లీ ముట్టడి పాదయాత్రలు వంటి క

సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది

  సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తుంది  ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం ఈరోజు నల్లగొండ దొడ్డి కొమురయ్య భవన్లో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ* మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పాట ద్వారా ఆట ద్వారా ప్రజానాట్యమండలి ప్రజల చైతన్యమే ధ్యేయంగా పనిచేస్తూ నాటి చదువు వెలుగు సాక్షరతా ఉద్యమం మొదలుకొని నేటి మూఢనమ్మకాలు నీరు పారిశుధ్యం ఎయిడ్స్ అనేక రకాల కళారూపాలు పాటలన్నీ తయారుచేసి ప్రజల చైతన్యం కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లాల వ్యాప్తంగా 5000 మంది కళాకారులకు శిక్షణ శిబిరాలు పెట్టి కళాకారుల తయారుచేసిందని ప్రజానాట్యమండలి కళకళ కోసం కాదు కల ప్రజల కోసం ప్రజల చైతన్యం కోసమని ఆయన అన్నారు పల్లె సుద్దులు ఒగ్గు కథ డోలు డప్పు వివిధ కళారూపాలు తయారు చేసింది ఒక సంస్కృతిక ఉద్యమాన్ని నడిపింది ప్రజానాట్యమండలి కొని ఆడారు ఆ సందర్భంలోనే ప్రజానాట్యమండలి 80 వార్షికోత్సవం ఘనంగా నిర్వహించబోతున్నట్టు దానికి కళాకారులు కళాభిమానులు మేధావులు ప

15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్

  ఈ నెల 15న నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం - ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్ నల్గొండ, ఆగస్టు 11,  (గూడచారి ప్రతినిధి) నల్గొండ జిల్లా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 15న  స్థానిక చిన్న వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో జర్గుతున్నదని ప్రోగ్రామ్ వైస్ చైర్మన్ కర్నాటి నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి  రాష్ట్ర అధ్యక్షులు  ఉప్పల శ్రీనివాస్, ముఖ్య అతిథులుగా చైర్మన్, తెలంగాణ శాసనమండలి గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లగొండ శాసనసభ్యులు  కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గార్లు పాల్గొంటారని, అయన తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుడుగా రేపాల భద్రాద్రి, ప్రధాన కార్యదర్శి గా నూనె కిషోర్, కోశాధికారి గా  గోవిందు, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గా తేలుకుంట్ల శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శివగా గౌరు శ్రీనాథ్, జిల్లా కోశాధికారి గా మిర్యాల మహేష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షరాలుగా కొమిరిశెట్టి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వందనపు జ్యోతి, జిల్లా కోశాధికారిగా వనమా శ్రీదేవి గార్లు  ప్రమాణ స్వీకారం చ