Posts

మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు

Image
  మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టు గెదర్ లో పాల్గొన్న వామ్ నాయకులు హైదరాబాద్. హోటల్ మారియట్ లో  తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీమతి డా. తమిళిసాయి సౌందరరాజన్‌తో గెట్ టుగెదర్ అయిన వామ్ నాయకులు. వామ్‌ గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ & తమిళనాడు బీజేపీ మీడియా సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రంగనాయకులు పొన్నూరు నేతృత్వంలో ఈ  గెట్ టుగెదర్ జరిగింది. ఈ సమావేశం లో జాతీయ సలహాదారు కౌటికే విఠల్,  వూరబాబు రావు, గ్లోబల్ చైర్మన్,  సిటిజన్ ఫోరం,  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరికొండ నరసింహ, తెలంగాణ కోశాధికారి కొత్త వెంకటేశ్వర్లు, తెలంగాణ రాష్ట్ర సీనియర్ సిటిజన్ ఫోరం కోశాధికారి రాఘవేందర్,  వామ్ నాయకులు సుంకు రమేష్,    మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నుండి శ్రీ మధు  గెట్ టుగెదర్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ మాట్లాడుతూ సమీప ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.

టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త

Image
  టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్గా ‘ఉప్పల శ్రీనివాస్ గుప్త హైద్రాబాద్:  టీపీసీసీ ప్రచారకమిటీ రాష్ట్ర కో-కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా నియమితు లయ్యారు. ఈ మేరకు కన్వీనర్ మధుయాష్కీగౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భం గా మధుయాష్కీగౌడ్ మాట్లాడుతూ.. గత పది సంవ త్సరాలుగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్య క్షుడిగా కొనసాగుతూనే గత ప్రభుత్వంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా సేవలు అందించారన్నారు. ప్రజలతో ఆయనకు ఉన్న సత్సంబంధాలను గుర్తించి పదవిని అప్పగించడం జరిగిందన్నారు. ఉప్పల శ్రీని వాస్ గుప్తా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి తన సేవ లు ఎలా వినియోగించుకోవాలో తెలుసన్నారు. సేవా నిరతి, పార్టీ పట్ల అంకితభావం, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వి జయానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తన నియ మాకానికి సహకరించిన సీఎం రేవంత్రెడ్డి, మధు యాష్కీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామకం పట్ల తెలంగాణ వ్యాప్తంగా పలు ఆర్యవైశ్య సంఘాలు, పలువురు ఆర్యవైశ్యులు, రాజ కీయ ప్ర

కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన

Image
  కేటీఆర్ రోడ్ షోలో హనుమాన్ దీక్ష పరుల నిరసన నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ వద్ద హనుమాన్ దీక్ష పరుల నిరసనకు దిగారు. గత కొన్ని రోజుల క్రితం జై శ్రీరామ్ అనే పదం అన్నం పెడుతుందా అని అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్న దీక్షాపరులు. టీఆర్ కి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నిరసన. దీక్షాపరులకు నచ్చచెప్పిన పోలీసులు.

సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి..

Image
  సీఎం రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి. . ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసిన విశ్వహిందూ పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందుత్వంపై.. హిందూ విశ్వాసాలపై.. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు, సీతామాతలపై విమర్శలు గుప్పించడాన్ని విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోంది. ఇటీవల తుక్కుగూడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరామ జన్మభూమి అక్షింతలను అవమానపరిచారని విశ్వహిందూ పరిషత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. "విశ్వహిందూ పరిషత్ వాళ్లు పంచిన అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి కాదని, అవి కంట్రోల్ బియ్యంతో తయారుచేసి పెంచారు"అని ఆరోపించడాన్ని వ్యతిరేకించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ.. ముస్లిం, క్రైస్తవుల మెప్పు కోసం ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం బి ఆర్ కే భవన్ లో తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజు గారిని కలిసి VHP నేతలు ఫిర్యాదు చేశారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ .. జై శ్రీరామ్ అం

8 crores seized

Image
 8 crores seized @ at jaggayyapeta Krishna district

నామినేషన్ దాఖలు చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.

Image
 వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నిక స్థానానికి చివరి రోజు(9-5-2024) గురువారం బిజెపి పార్టీ అభ్యర్థిగా (4 ) సెట్లు నామినేషన్ దాఖలు చేసిన గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి.         అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, రెవిన్యూ అదనపు కలెక్టర్ ములుగు జిల్లా, సిహెచ్. మహేందర్ జీ కు నామినేషన్ సమర్పణ .

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఖరారు

Image
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి ఖరారు తెలంగాణలో జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.  

12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన

Image
  12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవాలి - జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన  నల్గొండ:  పార్లమెంటు ఎన్నికలలో ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు కార్డుతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని గుర్తుగా చూపించి వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు.         కేంద్ర ఎన్నికల సంఘం అనువర్తించిన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డు ,బ్యాంకు ,లేదా పోస్ట్ ఆఫీస్ లు ఫోటోతో సహా జారీ చేసిన పాస్ బుక్ , కేంద్ర కార్మిక శాఖ ద్వారా జారీ చేయబడిన ఆరోగ్య భీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్జిఐ ఎన్ పి ఆర్ కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్ పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టర్ అండ్ టేకింగ్ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు వారి ఉద్యోగులకు జారీచేసిన ఫోటో గుర్తింపు కార్డు, ఎంపీ ,ఎమ్మెల్యే ,

హిందుత్వం బలపడితే భయమెందుకు..? - విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

Image
 హిందుత్వం బలపడితే భయమెందుకు..? - విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రసార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి పగుడాకుల బాలస్వామి స్టేట్మెంట్ యదావిధిగా ఇస్తున్నాం చదవండి ఈ సాధారణ ఎన్నికల్లో ఒక్క పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో హిందుత్వంపై తీవ్రస్థాయిలో విషం కక్కుతున్నాయి. ఇది ముమ్మాటికి సరికాదు. ఈ దేశ అస్తిత్వాన్ని, మెజారిటీ ప్రజల మనోభావాలను కాల రాసే విధంగా మాట్లాడటం.. వ్యంగంగా చలోక్తులు విసరడం.. తీవ్ర స్థాయిలో హిందుత్వంపై, అయోధ్య రామ మందిర్ పై విమర్శలు గుప్పించడం అనేది దుర్మార్గం. ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేస్తూ.. హిందువుల గుండెలపై గుణపాల దించే స్థాయిలో తీవ్ర పదజాలాలను ఉపయోగించడం ఏమాత్రం భావ్యం కాదు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు.."అసలు హిందుత్వం బలపడితే ఈ నేతలకు భయం ఎందుకు..? " అని హిందూ సమాజం హిందూ విరోధినిధులను ప్రశ్నిస్తోంది. ఇటీవల భువనగిరి బహిరంగ సభలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడుతూ.. అయోధ్య శ్రీరాముడి అక్షింతల పంపిణీ.. ప్రసాదం వితరణ.. శ్రీరామనవమి రోజు కాషాయ జెండాల అలంకరణ.. దేవుడి ఊరేగింపులు.. దేవుడి తీర్థప్రసాదా

13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లు

Image
  నల్గొండ:    వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నిక నామినేషన్లలో భాగంగా 5 వ రోజైన సోమవారం 13 మంది అభ్యర్థులు (16) సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు .ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టపద్రుల నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సిహెచ్ మహేందర్ జి కి వీరు నామినేషన్లను సమర్పించారు.         సోమవారం నామినేషన్లు సమర్పించిన వారిలో తెలుగుదేశం పార్టీ నుండి ముండ్ర మల్లికార్జునరావు 2 సెట్ల నామినేషన్లను, ధర్మ సమాజ్ పార్టీ నుండి బరిగల దుర్గాప్రసాద్ మహారాజ్ 1 సెట్ నామినేషన్, బిఆర్ఎస్ నుండి ఆనుగుల రాకేష్ 1 సెట్, నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థిగా కర్ని రవి 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారు .      స్వతంత్ర అభ్యర్థులుగా పులిపాక సుజాత 2 సెట్ల నామినేషన్లు, చీదల్ల వెంకట సాంబశివరావు 1 సెట్, చీదల్ల ఉమామహేశ్వరి 1 సెట్, తాడిశెట్టి క్రాంతి కుమార్ 2 సెట్లు, అయితగోని రాఘవేంద్ర 1 సెట్, భక్కా జడ్సన్ 1 సెట్,బుగ్గ శ్రీకాంత్ 1 సెట్, పాలకూరి అశోక్ కుమార్ 1 సెట్, దేశ గాని సాంబశివరావు 1 సెట్ నామినేషన్లను దాఖలు చేశారు. __________________________________  జారీ