Skip to main content

Posts

**నల్గొండ మున్సిపాలిటీ లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్షిస్తున్న ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్**

నల్గొండ మున్సిపాలిటీ లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు పై సమీక్షిస్తున్న ఇంచార్జి కలెక్టర్ వి.చంద్ర శేఖర్

**తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  గవర్నర్**

తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన  గవర్నర్ తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళైసాయి సౌందరరాజన్ ఒక సందేశంలో రాష్ట్ర ప్రజలకు తన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మరియు నూతన సంవత్సర 2020 రాష్ట్రంలోని ప్రజలకు ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ఇస్తుందని ఆకాంక్షించారు.      

**గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్**

గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన  రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్   2019 డిసెంబర్ 31వ తేదీ. సంవత్సరం ఆఖరి రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్  విద్యార్థుల సంక్షేమం లక్ష్యంగా, సిఎం కేసిఆర్ మానస పుత్రికలైన గురుకులాల నిర్వహణ ఆయన ఆలోచన మేరకు గొప్పగా నడవాలన్న సంకల్పంతో  మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని గిరిజన ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కురవి ఏకలవ్య పాఠశాలలో ఉదయం విద్యార్థులు ప్రార్థన చేసే సమయానికి అక్కడికి చేరుకుని ప్రార్థనలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. విద్యార్థుల మార్చ్ సెల్యుట్ ను స్వీకరించారు. డిసెంబర్ 31వ తేదీ జన్మదినోత్సవం ఉన్న విద్యార్థినికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అందరి విద్యార్థులతో కలిపి హ్యాపీ బర్త్ డే పాటను పాడించారు. ఉదయం విద్యార్థులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండడంతో మంత్రి గారు కూడా వారితో కలిసి బాక్సింగ్ చేశారు.  వారికొక ఉత్సాహాన్ని కల్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతులు, గురుకులంలోని మౌలిక సదుపాయాల గుర

**రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్, నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి**

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్, నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమించడం వల్ల స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

**ఉపాధ్యాయులకు  నిష్ట శిక్షణా కార్యాక్రమం**

ఉపాధ్యాయులకు  నిష్ట శిక్షణా కార్యాక్రమం నల్లగొండ లోని గోకుల్ బి.ఎడ్ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు జరుగుచున్న నిష్ట శిక్షణా కార్యాక్రమంలొ భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జి.వేణు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయులకు జువనైల్ జస్టిస్, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం, పోక్సో యాక్ట్, విధ్యా హక్కు చట్టం పై విశదీకరించి  గురువు దైవంతొ సమానమని, గురుతర బాధ్యత ఎంతో ఉందని, బాల, బాలికలపై ఎన్నో అకృత్యాలు జరుగుచున్నవని నేటి రోజులలొ సాంకేతిక విజ్ఞానం పెరిగినా కొద్ది మంచి చెడు నిర్ణయించటం పెను సవాలుగా మారుతుందని, చట్టాలున్నా, విజ్ఞానమున్నా మనుషులలొ మార్పు లేకుంటె నాగరిక సమాజం పొందలేమన్నారు, దేశ భవితను పెంపొందించే రాజ్యాంగ పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఎంతో ఉందని తెలుపుతూ న్యాయ సేవ అధికార చట్టం అమలులోకి వచ్చిన తర్వాత అందరికి అందుబాటులొ న్యాయం అనే సిద్దాంతం ద్వారా న్యాయ సేవలు న్యాయ సేవ సంస్థ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ గౌడ్, ఇంచార్జి చంద్రశేఖర్, రిసోర్స్ పర్సన్స్ యోగీంద్రనాథ్, రాములు పాల్గొన్

**ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  ప్రజలందరికీ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి వైయస్.జగన్ వీడియో చూడండి**

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర  ప్రజలందరికీ సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి  వైయస్.జగన్ వీడియో చూడండి https://youtu.be/24ebJbCDj2w  

**సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  **

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్   సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ పువ్వాడ అజయ్ కుమార్  సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వ్యవసాయానికి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్ హౌస్ల పనులు పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు,  ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు.

**పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. **

విజయవాడ: పోలవరం పనుల పురోగతిపై సీడబ్ల్యూసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఆదివారం క్షేత్ర స్థాయిలో పర్యటించిన సీడబ్ల్యూసీ అధికారులు... సోమవారం పీపీఏ, రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు.  స్పిల్‌వే మినహా ఎలాంటి పనులు జరగడం లేదని ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ అధికారులు వ్యాఖ్యానించారు.  గోదావరి నీటిని కూడా వెనక్కి పంపలేకపోయారన్నారు.  రెండు నెలల సమయాన్ని వృథా చేశారని చెప్పారు.  కాఫర్‌ డ్యామ్‌ వచ్చే జూన్‌ దాకా అయ్యే పరిస్థితి లేదని తెలిపారు.  స్పిల్‌వే, గేట్ల బిగింపు ప్రణాళికకు..క్షేత్రస్థాయి పనులకు పొంతన లేదన్నారు.  ఢిల్లీలో త్వరలో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.  అయితే రాష్ట్ర ఇరిగేషన్ అధికారుల వాదన మరోలా ఉంది.  నిధులు ఇవ్వకపోవడంతో పాటు డిజైన్లకు ఆమోదం తెలపలేదని అందుకే ఆలస్యం అవుతుందని రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

**చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్**

న్యూఢిల్లీ ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది.  ఈ వెబ్​ పోర్టల్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్​ ప్రసాద్ ప్రారంభించారు​.  ఈ ఏడాది సెప్టెంబర్​లో దీన్ని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు. పోగొట్టుకున్న, దొంగలించిన చరవాణిల వివరాలు పోలీసులకు తెలియజేయాటానికి, చరవాణిని బ్లాక్​ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని రవిశంకర్​ చెప్పారు.

**ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం**

న్యూఢిల్లీ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం విధించింది.  నౌకలు, నౌకా నిర్మాణ కేంద్రాల్లో తమ సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా సైట్లు, యాప్‌లు వాడరాదని పేర్కొంటూ ఆదేశాలను జారీ చేసింది.  సైబర్‌ గూఢచర్యం అభియోగాలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టు నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది.