**సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  **

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  


సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ పువ్వాడ అజయ్ కుమార్  సందర్శించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. వ్యవసాయానికి చివరి ఎకరా వరకు సాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్ హౌస్ల పనులు పరిశీలించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారు,  ఎంపీ శ్రీమతి మాలోతు కవిత గారు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ గారు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఉన్నారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్