Skip to main content

Posts

CDPO అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌!

డైరెక్టర్ ఆఫ్ వుమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ హైదరాబాద్ కార్యాలయం లో CDPO పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్‌!  ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌లో ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ సీడీపీవోగా పనిచేస్తున్న టైమ్‌లో నిధుల గోల్‌మాల్‌ చేసినట్లు గుర్తింపు.! ట్రైబల్‌ పిల్లలకు డిస్ట్రిబ్యూట్‌ చేసే ఆరోగ్యలక్ష్మి మిల్క్‌ స్కీమ్‌లో 65 లక్షల 78 వేలు  అవకతవకలు గుర్తించిన ACB

ఘనంగా శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు

ఘనంగా శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నల్గొండ జిల్లా కేంద్రాల 285  శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను క్లాక్ టవర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి asp నాయక్ మరియు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అభగోని రమేష్ గౌడ్ రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ కొండ జిల్లాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సేవాలాల్ ఆసియా సాధన కోసం కృషి చేయాలని విద్యతోనే రాజ్యాధికారం సాధించవచ్చని తెలియజేశారు కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డిఓ ప్రవీణ్ నాయక్ నల్గొండ ఎమ్మార్వో ఆర్డీవో డిటిడబ్ల్యూ రాజకుమార్ కౌన్సిలర్ ప్రదీప్ డాక్టర్ మాతృ రవి నాయక్ వెంకటేష్ నాయక్ త్రిక చైర్మన్ బిక్కు కమిషన్ నెంబర్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గపు సతీష్ ఇమ్రాన్ భగవాన్ నాయక్ చందులాల్ సురేందర్ నాయక్ మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు  

ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి?

  ఇంటి దగ్గర నుండే PVC ఆధార్ కార్డు ఎలా పొందాలి?  ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణాలో మహాలక్ష్మి పథకం లో మహిళలు rtc బస్ లో ఉచితంగా ప్రయానించాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ.50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. PVC Card పై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది.  పీవీసీ కార్డ్న ఆర్డర్ ఇలా ఆర్డర్ చేసి పొందండి  *యూఐడీఏఐ వెబ్ సైట్ లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. https://uidai.gov.in/ *యూఐడీఏఐ వెబ్సైట్, మీ 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయండి *తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి *ఓటీపీ కోసం Send OTP’పై క్లిక్ చేయండి. *తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట

విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్

 విజ్ఞాన భారతీ ఆధ్వర్యంలో చాయసమేశ్వరాలయం వద్ద వర్క్ షాప్ నల్గొండ ఫిబ్రవరి 27(గూడచారి) నల్లగొండ నగరంలోని స్థానిక పానగల్లో గల ఛాయా సోమేశ్వరాలయం వద్ద మంగళవారం విజ్ఞాన భారతి ఎన్జీవో (NGO) ఆధ్వర్యంలో ఆప్టిక్స్ పై వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డి.ఆర్.డి.ఓ (DRDO) శాస్త్రవేత్తలు G.N.రావు , శ్రీ లక్ష్మీ,G.L.N మూర్తి హాజరై విద్యార్థులకు ఛాయా సోమేశ్వర ఆలయంలో శివలింగంపై ఛాయా ఏ విధంగా పడుతుంది,అలా ఎందుకు జరుగుతుందనే కోణంలో ప్రయోగాత్మకంగా వివరించి విద్యార్థుల చేత అనేక ప్రయోగాలు చేయించడం జరిగింది.అలాగే వారు మాట్లాడుతూ భారతీయ జీవిత విధానం ప్రతిదీ సైన్స్ తో ముడిపడిందని,ప్రతి గుడిలో సైన్స్ ఉందని వారు అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ డీఈవో (DEO) బిక్షపతి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని సైన్స్ లో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలయ్యి దేశానికి సేవ చేయాలని ఆలోచనత్మకంగా మాట్లాడడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్.పి.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ నన్నూరి రాంరెడ్డి, ఎం వి ఆర్ విద్యాసంస్థల చైర్మన్ కొలనుపాక రవికుమార్ , న్యూస్ విద్యాసంస్థల చైర్మన్ గంట్ల అనంత

PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్ - జిల్లా యస్.పి చందనా దీప్తి IPS

 *నకిరేకల్,తిప్పర్తి పోలీస్ స్టేషన్ ల పరిధిలో 35 క్వింటాళ్ల PDS బియ్యం అక్రమ నిల్వ మరియు రవాణా చేస్తున్న నలుగురు నిందితుల అరెస్ట్*  నల్గొండ:   *జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీస్* ..  *--- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి చందనా దీప్తి IPS*    ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ గారు ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.    ఈ రోజు జిల్లా యస్.పి గారి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నకేరేకల్ మరియు తిప్పర్థి పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సమన్వయంతో తాటికల్ గ్రామంలో గల సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య ఇంట్లో అక్రమ నిల్వ ఉంచిన 22 బస్తాలలొ 10 కింటాల్ పిడిఎస్ బియ్యం మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడాల స్టేజ్ వద్ద నుండి బోలోరో వెహికిల్ ద్వార అక్రమ రవాణా చేస్తున్న మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,మొగిలి నాగరాజు తండ్రి

విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల

 విజయ సంకల్పయాత్ర ను జయప్రదం చేయండి - జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల నల్గొండ:  కలిసి కదులుదాం... మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ని గెలిపిద్దాం అనే లక్ష్యంతో తెలంగాణ బిజెపి చేపట్టిన విజయ సంకల్పయాత్ర కృష్ణమ్మ క్లస్టర్ క నల్గొండ జిల్లాలో ఈ నెల 28 నుండి ప్రారంభం కానున్నదని నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజ శేఖర్ రెడ్డి తెలిపారు.ఈ యాత్రను జయప్రదం చేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

అమృత్ భారత్ స్టేషన్ గా నల్లగొండ రైల్వే స్టేషన్

 అమృత్ భారత్ స్టేషన్ గా నల్లగొండ రైల్వే స్టేషన్ నల్లగొండ రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ లో బాగంగా అభివృధి పనులను  ఈ నెల 26న ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదములు తెలిపిన నల్లగొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి,

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాస్ రెడ్డి

  తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా   కే శ్రీనివాస్ రెడ్డి ని నియమిస్తూ   జీవో  నంబర్ 300 ను ఆదివారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చైర్మన్ పదవి కాలం  2 సంవత్సారాలు ఉంటుందని ఆ జీఓ లో పేర్కొన్నారు.  తదనుగుణంగా తదుపరి చర్య లు తీసుకోవాలని  సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ను  ఆదేశించారు.

మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

 *మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు* నల్లగొండ పట్టణం పాత బస్తి హనుమాన్ నగర్ లో ఉన్నటువంటి శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈరోజు మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలలో పట్టణంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.. ఈ కార్యక్రమంలో అర్షకులు వెంకటేశ్వర శర్మ, కార్యక్రమం, నిర్వాహకులు తోగోటి రమేష్ చారి, మరియు దేవాలయం అధ్యక్షులు బైరగోని రాజయ్య మరియు దేవాలయ కమిటీ సభ్యులు ఊట్కూరి శ్రీనివాస్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

  యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండి - ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  @పెరుగుతున్న అంచనాలతో ఖజానా పై అదనపు భారం ఆందోళనకరం @ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి @ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ పక్షాన పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం @ పాత ప్రభుత్వం పద్ధతులు, ఆలోచనలు మానుకోండి @ యాదాద్రి ధర్మల్ పవర్ సంపద రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడాలి @ నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను సహించబోము యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు అధికారుల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ----------------- యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టును సందర్శించి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకు ముందుగా థర్మల్ పవర్ స్టేషన్లో స్థానికుల నుం