Skip to main content

హిందువులంతా సంఘటితం కావాలి VHP సమావేశంలో స్వామీజీల పిలుపు


 

హిందువులంతా సంఘటితం కావాలి 

VHP సమావేశంలో స్వామీజీల పిలుపు


హిందూ సమాజంపై దుర్మార్గమైన దాడి జరుగుతోందని.. అటు క్రైస్తవులు, ఇటు ముస్లింలు హిందూ సమాజాన్ని పీక్కుతింటున్నారని సాదు సంతులు ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక రుగ్మతల ఆధారంగా.. నిరక్షరాస్యత, పేదరికం కారణంగా మతమార్పిడి మహమ్మారి హిందుత్వం పై భీకరమైన దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు మఠాలు పీఠాల సాధువులు సంతులు ప్రముఖులతో సమావేశం నిర్వహించింది. కాచిగూడ లోని శ్రీ శ్యాం బాబా మందిర్ లో నిర్వహించిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి 110 మంది ప్రముఖ స్వామీజీలు హాజరయ్యారు.

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సాధువులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం ఐదు గంటల దాకా సుదీర్ఘంగా కొనసాగింది. 

స్వామీజీలు అందరూ హిందూ ఐక్యత కోసం కట్టుబడి పని చేయాలని ప్రతిన భూనారు.

ప్రముఖంగా ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు. 


1) మతమార్పిడిని తీవ్రంగా ప్రతిఘటించడం.


2) ఆదర్శ హిందూ కుటుంబ జీవనాన్ని ప్రోత్సహించడం.


3) ప్రతి దేవాలయం హిందువులకు కేంద్రంగా చేయాలి.


4)ప్రభుత్వ ఆధీనంలోని దేవాలయాలను హిందువులకు అప్పగించి, స్వతంత్రత ప్రకటించడం.


5) గ్రామీణ ప్రాంతాల్లో సాధుసంతులు విరివిగా పర్యటన చేసి హిందూ బంధువులకు భరోసానింపడం.


6)ప్రతి హిందువుకు హనుమాన్ చాలీసా పై అవగాహన పెంచి, హనుమాన్ చాలీసా పరాయణం చేయించడం.


ఈ ఆరు తీర్మానాలను స్వాములు, విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు, పెద్దలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.


గ్రామీణ ప్రాంతాల్లో స్వామీజీల పరిటన వల్ల సురక్ష, సేవ, సంస్కార్ ఈ మూడు గుణాలు అలవడితే హిందూ సమాజం బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మతం మారుతున్న సమాజాన్ని జాగృతం చేసి హిందూ సమాజ ఐక్యత కోసం తీవ్రంగా కృషి చేయాలన్నారు. మతం మారిన హిందూ సోదరులను సాధారంగా హిందుత్వంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి స్వామీజీపై ఉందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి పై దాడి చేస్తున్న విదేశీ సంప్రదాయాల్ని రూపుమాపాలని చెప్పారు. పప్పు ,ఉప్పు, బియ్యానికి 10,000 రూపాయలకు మతం మారుస్తున్న మిషనరీల భాగోతం ప్రపంచానికి తెలియజేయాలని స్వామీజీలు అభిప్రాయపడ్డారు. ప్రతి దేవాలయం కేంద్రంగా హిందూ సమాజం సంగటితమై స్వావలంబన సాధించాలని సూచించారు. కులాల పేరుతో, వర్గాల పేరుతో ఎవరికి వారుగా జీవిస్తున్న హిందూ సమాజం మనసులో హిందుత్వాన్ని బలంగా నాటాలని చెప్పారు. దేవాలయాల భూములు, హిందువుల ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాల భరతం పట్టాలన్నారు. ఎవరికివారుగా ఉండడం వల్లే నేడు అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని... దానివల్ల హిందూ సమాజం అనేక గాయాలకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నేడు హిందూ సమాజం పొరపాట్లను చేయకుండా భవ్యమైనటువంటి భారతీయ సంప్రదాయాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు ప్రతి స్వామీజీ ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు శ్రీ సంగ్రామ మహారాజ్, యోగానంద సరస్వతి, కమలానంద భారతి, దుర్గాప్రసాద్, సోమాయప్ప స్వామి, చైతన్యానంద మహారాజు, విశ్వహిందూ పరిషత్ నేతలు నాగరాజన్, రాఘవులు, సత్యం జీ, యాదిరెడ్డి, పుప్పాల వెంకటేశ్వరరావు, రామరాజు, జగదీశ్వర్, భాను ప్రసాద్, యాదగిరి రావు, శశిధర్, వెంకటేశ్వర రాజు, రమేష్, పగుడాకుల బాలస్వామి, శివ రాములు, వెంకట్ తది

తరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్