Posts

Showing posts from 2024

సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం

Image
సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ కు సన్మానం హైద్రాబాద్: (గూఢచారి)  ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ సీనియర్ జర్నలిస్టు కోటగిరి చంద్రశేఖర్ ఎడిటర్ నీలగిరి శంఖారావం, ns99channel ని శాలువాతో సత్కరించినారు. మరియు ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ బడ్జెట్ కేటాయించకపోవడం పై మరియు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల గురించి చర్చించారు..

అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి

Image
 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు. పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు. తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ. బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్. తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు. గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం - ఉప్పల శ్రీనివాస్

Image
 ప్రపంచ వ్యాప్తంగా ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం. - TPCC ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఏకం చేయడమే లక్ష్యం అని టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అన్నారు. దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ 11 వ వార్షకోత్సవ వేడుకలు Ramada Hotel Dhena లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ విభాగం ఇన్చార్జి రాజేష్ సోమా ముఖ్యఅతిథిగా అలాగే ప్రముఖ టెక్స్ట్ బిజినెస్ చంద్రశేఖర్ మరియు గోల్డ్ బిజినెస్ వ్యాపారస్తుడు కిషన్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా  మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ అన్ని రంగాల్లో రాణించాలి అని సమిష్ఠ కృషితో

*బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ*

Image
  *బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో బడి పిల్లలకు బ్యాగులు పంపిణీ* *కార్పోరేట్ స్కూల్ కి పోటిగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను తయారు చేయడమే మా లక్ష్యం.*  బెస్ట్ సేవా సొసైటీ వ్యవస్థాపకులు  బుక్కా ఈశ్వరయ్య ...... రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుల కు కావలసిన సమాగ్రిని అన్ని వేళల అందిస్తున్న బుక్కా ఈశ్వరయ్య గారు ఈరోజు ప్రైమరి మరియు హైస్కూల్ విద్యార్థుకు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.*pvpm rao memorial పై pk మేహర్ (USA) గారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నామని ఈ వేదిక ద్వారా మేహర్ గారికి ధన్యవాదాలు తెలుపినారు*.   అనంతరం విద్యార్థుల ఉద్దేశించి వారు ప్రసంగిస్తూ ప్రభుత్వం ఎంతో శ్రమకోర్చి అన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఊరి విడచి ఇతర ప్రాంతంలో గల ప్రైవేట్ స్కుళ్ళకు పిల్లను తల్లిదండ్రులు పంపడం బాదాకరమని అన్ని వసతులు, మంచివిద్యా ఉన్నందున ఎవ్వరు కూడ ఊరు వదలి పోవద్దని ఉద్భోదిస్తూ, మా బెస్ట్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో మీకు కావలసిన స్టేషనరి, ఆటవస్తువులు , బోజన పళ్ళాలు, గ్లాసులు, గతంలో అందించానని, ఇప్పుడు బ్యాగులు కూడ ఇస్తున్

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన వివరాలు

Image
  ఈ రోజు రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.  *పర్యటన వివరాలు* ▪️ఉదయం గం. 10.00 నుండి *నల్గొండ పట్టణంలోని గౌరవ మంత్రిగారి నివాసంలో .  ▪️ఉ. గం. 11.30 నిమిషాలకు *దోనకల్ గ్రామంలో 33/11 కె.వి. సబ్ స్టేషన్* కార్యక్రమంలో పాల్గొంటారు.  ▪️మధ్యాహ్నం గం. 01.00 కు నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న *ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తారు, అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహిస్తారు*.  ▪️మధ్యాహ్నం గం. 03.00 లకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని *మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు*.   ▪️అనంతరం సాయంత్రం గం. 05.00 లకు నల్గొండ నుంచి హైదరాబాద్  బయలుదేరుతారు.

ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్

Image
  ఎసిబి వలలో ఎస్ఐ మరియు సబ్ రిజిస్ట్రార్ –రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కొత్తగూడెం ఎస్ఐ, పరకాలలో సబ్ రిజిస్ట్రార్  (గూఢచారి):   హైదరాబాద్: తెలం గాణలో అవినీతి నిరోధక శాఖ (acb) అధికారుల ఆయా వేర్వేరు ప్రాం తాల్లో వేసిన వలలో ఇద్దరు అధి కారులు (officers) చిక్కారు. ఈ రెండు వేర్వేరు సంఘటనల్లో కూడా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం గమనా ర్హం. *కొత్తగూడెంలో ఎస్ఐ…*… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ అవినీతి ఎస్ఐ (si) ఏసీబీకి చిక్కా డు. పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రా ము ఓ కేసులో నిందితుడికి సాయం చేసేందుకు న్యాయవాది నుంచి రూ.20 వేలు లంచం డి మాండ్ చేశాడు. అయితే ఈ కేసును వాది స్తున్న న్యాయవాది ( advocate) లక్ష్మారెడ్డి ఏసీ బీకి ఫిర్యాదు చే యడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఎస్ఐ రాములు 20 వేలు లం చం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. *ఏసీబీ వ‌ల‌లో పరకాల సబ్ రిజిస్ట్రార్*..వరంగల్ జిల్లా పరకాల సబ్ రిజి స్ట్రార్ ( sub registrar) కందాల సునీత ఇద్దరు అన్న దమ్ముల సేల్ & గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం రూ.80 వేలు లంచం డి మాండ్ చేసింది. అయితే వారు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సునీ త లంచం తీసుకుంటుండగ

గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న ...

Image
 నల్గొండ : బ్రేకింగ్... ప్రకాశం బజార్ లోని పలు దుకాణాల్లో బయటపడ్డ నిర్వహకుల ఘరానా మోసం.... పలు దుకాణాలపై కాపీ రైట్స్ అధికారుల తనిఖీలు... హనుమాన్ ఎలక్ట్రిక్ షాప్ లో గోల్డ్ మెడల్ కంపెనీ పేరు చెప్పి నాణ్యతలేని వైర్లను అమ్ముతున్న నిర్వాహకులు... రూ 22 లక్షల విలువ గల 16 వైర్ బ్యాగులు స్వాధీనం.. పద్మావతి కిరాణం షాపులో రూ 1.70 లక్షల విలువ గల కల్తీ మస్కిటో అగరబత్తులు స్వాధీనం... పలు దుకాణాలపై కొనసాగుతున్న దాడులు...

BHUPATHI TIMES 24th July 2024 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Image
 

బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి

Image
  బదిలీల్లో అన్యాయం జరిగిందని కలెక్టర్ కు మొరపెట్టుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయ ఉద్యోగి నల్గొండ:  ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ జూనియర్ అసిస్టెంట్ బదిలీల్లో నిభందనలు పాటించలేదని దీంతో నాకు అన్యాయం జరిగిందని జిల్లా కలెక్టర్ కు మొరపెట్టు కున్న ఓ మహిళా ఉద్యోగి. మాకు మౌఖికంగా సంప్రదింపులు జరపలేదని, ఫార్మెట్ లో అప్లికేషన్ తీసుకున్నారని తాను పెట్టు కున్న ఆప్షన్ ప్రాంతాలలో నాకు పోస్టింగ్ ఇవ్వలేదని, తాను చిన్న పిల్లల తల్లి గా, కొత్త పోస్టింగ్ స్థలానికి పెరిగిన దూరాన్ని నిర్వహించడం నాకు అత్యంత కష్టం అని ఈ బదిలీ నా మరియు నా కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సవాళ్లను కలిగించిందినీ, నేను సీనియారిటీ లిస్టు లో కూడా ముందు ఉన్నానని, నాకు అన్యాయం జరిగిందని బదిలీల నిర్ణయాలపై సమీక్ష నిర్వహించాలని ఆమె అభ్యర్థించారు. మానవతా దృక్పథంతో మహిళ అని చూసి తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ను కోరింది. ఆమె విజ్ఞాపన పై కలెక్టర్ స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్త్రార్ ను ఆదేశించినట్లు తెలిసింది.

*స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.*

Image
 *స్పీకర్ ఛాంబర్ లో ప్రారంభమైన బీఏసీ సమావేశం.* హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు, బీఆర్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సీపీఐ నుంచి కూనమానేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బలాల.

స్మితా సబర్వాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల

Image
  స్మితా సబర్వాల్ పై నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు*   *మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారిగా ఉండి.. రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు* *స్మితా సబర్వాల్  ఓ దివ్యాంగులకి జన్మనిచ్చి ఉంటే వారి కష్టాలు ఏంటో ఆమెకు తెలిసేవని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు*  *దివ్యాంగులను అవహేళన చేసి.. వారి మనో ధైర్యాన్ని దెబ్బతినేలా కుట్ర చేస్తున్న స్మితా సబర్వాల్ .. మెంటల్ గా అన్ ఫిట్ అని.. IAS గా పనికి రాదని.. వెంటనే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆయన కోరారు* *ఎన్నో ఆటుపోట్లను కష్టనష్టాలను ఎదుర్కొని బాలలత లాంటి ఓ దివ్యాంగ మహిళ IAS కాగలిగారని.. తనతో పాటే ఎంతోమందిని IASలుగా తయారు చేసేందుకు IAS అకాడమీ ద్వారా ఎంతోకృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.* *బాలలత గారి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి దివ్యాంగులనే హేళన చేయడం సరి కాదన్నారు.* *ప్రపంచమే గర్వించదగ్గ ఎంతోమంది దివ్యాంగులు ఉన్నారని, అటువంటి వారిని అవమానించడం సరికాదని ఆయన హితువు పలికారు.*

బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.

Image
 బడ్జెట్ లో ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరిన చైర్ పర్సన్ సుజాత.. హైద్రాబాద్ , (గూఢచారి ప్రతినిధి) :  ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ను కలిసిన రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత.. ఆర్య వైశ్య కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో తగిన విదంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేసిన చైర్ పర్సన్ సుజాత.

సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు

Image
  సెప్టెంబర్ 1న కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు హైద్రాబాద్ : (గూఢచారి ప్రతినిధి) శ్రీ కాశి అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం ఎన్నికలు సెప్టెంబర్ 1న హైద్రాబాద్ లకడికపూల్ వాసవి సేవా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి శ్రీమతి మంజులత వర్మ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ ఎన్నికల్లో అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్, అడిషనల్ జనరల్ సెక్రెటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్ లు ఏడుగురు, ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు) సెక్రటరీలు ఏడుగురు, (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి ముగ్గురు కర్ణాటక నుండి ఇద్దరు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒకరు), అడ్వైజర్లు 19 మంది కి (ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి 13 మంది కర్ణాటక నుండి నాలుగు తమిళనాడు నుండి ఒకరు మహారాష్ట్ర నుండి ఒక్కరు) ఎన్నికలు నిర్వహించబడతాయి. ఆగస్టు 10 న నామినేషన్ పత్రాలు ఇస్తారు, ఆగస్టు 16, 17 తేదీల్లో ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 18వ తేదీ స్

*ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత*

Image
 *ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వాఖ్యలను తీవ్రంగా ఖండించిన బాలలత* హైద్రాబాద్:   ( గూఢచారి ప్రతినిధి):  *బాలలత, మాజీ బ్యూరోక్రాట్*  *స్మిత సబర్వాల్ కి మాజీ బ్యూరోక్రాట్ సవాల్* తనతో సివిల్స్ పరీక్షకు రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ విసిరిన బాలలత ఆమె మాటల్లో... తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని స్మితకి సవాల్ విసిరిన బాలలత స్మిత సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోంది స్మిత సబర్వాల్ మాటలు దురదృష్టకరం అసలు దివ్యంగులం బ్రతకాలా వద్దా? మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా? వద్దా? పని ఉన్నోళ్ళు పని చేస్తారు. ట్వీట్ లు పెడుతూ ఉండరు స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేదు. అసలు స్మిత సబర్వాల్ అర్హత ఎంటి? స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా? తెలంగాణ ప్రభుత్వ విధానమా? స్మిత తన సర్వీసులో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరుగెత్తుతూ పని చేసిందో చెప్పాలి స్మిత ట్వీట్ తాను దివ్యంగుల పట్ల వివక్షతను చూపుతోంది ఐటీ యాక్ట్ కింద స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి రెండు కాళ్ళు పనిచేయవు. కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చ

రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో

Image
 రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో నల్గొండ, ( గూఢచారి ప్రతినిధి) వేలం వడ్లు lifiting కొరకు రాష్ట్రం అంతా  పాడి వెరిఫికేషన్ చేయిస్తున్నా సందర్భంగా నల్గొండ టౌన్ మరియు మండలంలో గల రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లును తహశీల్దార్, RI CS మరియు TA తో కలిసి RDO , DSO & DM CS లు తనిఖీ చేసారు.

తాండూరు లో దొంగ నోట్లు

Image
 తాండూరు లో దొంగ నోట్లు

పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Image
  పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నల్గొండ:  నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పీపుల్స్ ఫ్రెండ్లీ జిల్లా కలెక్టర్ గా ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు సక్రమంగా అందేలా పలు చర్యలు తీసుకుంటున్నారు. గతం లో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ భాద్యతలు నిర్వహించడం తో జిల్లాపై పూర్తి అవగాహన ఉంది. అయన జిల్లా కలెక్టర్ గా భాద్యతలు సేకరించిన నాటి నుండి ప్రజల సమస్యల పై స్పందించడం, ప్రజలకు సేవలందించే పలు విభాగాలను ఆకస్మిక తనిఖీ లు చేస్తూ అధికారులను , ఉద్యోగులను ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు చేపడుతున్నారు.   గత కొన్ని రోజుల క్రింద నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు చర్యలు తీసుకోవడం మే కాకుండా మొత్తం ఆసుపత్రి సేవలు ప్రజలకు సక్రమంగా అనేందుకు జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షించే విధంగా డ్యూటీలు వేశారు.   జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లోని వివిధ కార్యాలయాలను ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైరాజరవుతున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తున్నారు.  శుక్రవారం హా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్ హైద్రాబాద్:  (గూఢచారి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి కార్యవర్గ సమావేశంలో తీర్మానించి నట్లు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు కర్మన్ ఘాట్ వేడుక కన్వెన్షన్ లో జరిగిన సమావేశం లో శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఈ రోజు జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ మీటింగ్ లో మహాసభ ఎన్నికలు నిర్వహించుటకు అమరవాది అంగీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించి నట్లు శ్యామ్ సుందర్ తెలిపారు. రెండు, మూడు నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అయన అన్నారు. ఈ సమావేశం లో మలిపెద్ది శంకర్, కాచం సత్యనారాయణ, ప్రేమ్ గాంధీ,  మొగుళ్లపల్లి ఉపేందర్, యాదా నాగేశ్వర రావు,  మోటూరి శ్రీకాంత్, బొడ్ల మల్లిఖార్జున్, అర్థం శ్రీనివాస్, వందనపు వేణు, పుల్లూరు సత్యనారాయణ, బాలరాజు,  కొండూరు గణేష్, కొండూరు రాజేశ్వరి మరియు పలు జిల్లాల నుండి సుమారు 300 మంది పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో తేలుకుంట్ల శ్రీనివాస్

Image
 రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  లను కలసిన తేలుకుంట్ల శ్రీనివాస్. చిత్రం లో మునిసిపల్ ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్స్ నాయకులు గుమ్మల మోహనరెడ్డి వున్నారు.

తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు నిర్వహిస్తున్న సమావేశానికి తెలంగాణ వివిధ జిల్లాల నుండి ఆర్యవైశ్యుల రాక ప్రారంభం

Image
 తెలంగాణ రాష్ట్ర మహాసభ అధ్యక్ష మార్పు కొరకు  నిర్వహిస్తున్న సమావేశానికి వేడుక కన్వెన్షన్ కు తెలంగాణ వివిధ జిల్లాల నుండి ఆర్యవైశ్యుల రాక ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశానికి పాల్గొన డానికి ఎన్ విలేజి రెస్టారెంట్ కు విచ్చేసిన ఊరే లక్ష్మణ్, ఆగీర్ వెంకటేష్ లు

Image
  తెలంగాణ  రాష్ట్ర మహాసభ కార్యవర్గ సమావేశానికి పాల్గొన డానికి ఎన్ విలేజి రెస్టారెంట్ కు విచ్చేసిన ఊరే లక్ష్మణ్, ఆగీర్ వెంకటేష్ లు

District Fisheries Officer in ACB Net.

Image
District Fisheries Officer, Suryapet in ACB Net. On 03.07.2024, the Accused Officer (A.O.) Sri. Thakoor Roopender Singh, District Fisheries Officer, Suryapet caught red handed when he demanded bribe amount of Rs.25,000/- from the complainant Sri Saragandla Kotaiah, Fisherman-cum-President of Fishermen's Co- Operative Society, Suryapet and accepted from accompanying witness Sri. Endla Suresh, Fisherman-cum-Treasurer of Fishermen's Co- Operative Society, Suryapet to do an official favour i.e. "to issue Fishing Rights Document to their society for fishing". Tainted bribe amount was recovered from the possession of the A.O. Both hand fingers of A.O which came into contact with tainted bribe amount yielded positive result in chemical test. The A.O. performed his duty improperly and dishonestly to obtain undue advantage. Earlier A.O. was trapped by the ACB Officials in the year 2016. Therefore, A.O. is being arrested and produced before the Hon'ble Ist Addl. Special Jud

సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

Image
నల్గొండ: 19 జులై ( గూఢచారి)     ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనందుకుగాను   హాలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సీనియర్ అసిస్టెంట్ ఎస్.సురేందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు విద్య వైద్య రంగాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని,విధుల పట్ల  ఉద్యోగులు నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.       శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా హలియా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.        ముందుగా ఆయన హాలియా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని సిబ్బంది  హాజరు రిజిస్టర్, ఇతర రిజిస్టర్లు, వార్డు ,ల్యాబ్ తదితరాలను పరిశీలించారు. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా, సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన సీనియర్ అసిస్టెంట్ ను జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు.        ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు  ఉప ఆరోగ్య కేంద్రాల ఇన్చార్జిలతో ఆయన సమావేశం నిర్వహించారు.      ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య  కేంద్రాలకు ప్రతిరోజు వస్తున్న

సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం

Image
 సోషలో మీడియాలో నిరసనల హోరు - తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరపాలని ఊపందుకున్న ఉద్యమం  హైద్రాబాద్:  దాదాపు 9 సంవత్సరముల నుండి ఎన్నిక కాకుండా, ఓ 10 మంది తో సొసైటీ ఏర్పాటు చేసుకొని, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నాయకులతో నాదే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అంటూ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్న, అక్రమంగా మహాసభ బిల్డింగ్ లో తిష్టవేసిన వారిని సాగనంపడానికి ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైశ్య నాయకులు గళం వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కు ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించాలంటూ కార్యక్రమం రూపొందించుకున్నారు. అప్రజాస్వామికంగా ఉన్న వారు కర్మంగట్ లో నిర్వహించ దలుచుకున్న సమావేశం దగ్గరకు భారీగా సంఖ్యలో వైశ్యులు తరలివచ్చి ఎన్నికలు నిర్వహించే విధంగా డిమాండ్ చేయాలని, జిల్లా అధ్యక్షుల చప్పట్లతో మరోసారి అధ్యక్ష పదివి కాలాన్ని పొడిగించుకోకుండ ఉద్యమం చేయాలని నిర్ణయించి భారీగా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్ర మహాసభ ఎన్నికల తో పాటు ప్రభుత్వం ఉప్పల్ భాగాయత్ లో కేటాయించిన 5 ఎకరాల స్థలం ట్రస్టు పేరుతో కొంత మంది చేతుల్లోకి పోకుండా ఉండాలని సోషల్ మీడ

ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదు -:రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

Image
           ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలు రెండు లక్షల లోపు రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించిన రాష్ట్రం దేశంలో ఏదీ లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.        రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో మొదటి విడత లక్ష రూపాయల లోపు రుణాల నిధుల విడుదల సందర్బంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలో నిధుల విడుదల కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఇందులో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఎం ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.       ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి ఆయా జిల్లాల లోని రైతులతో రుణమాఫీపై ముఖాముఖి మాట్లాడారు. నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలానికి చెందిన రాజు అనే రైతుతో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి రుణమాఫీ పై మాట్లాడారు       ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప

శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం

Image
 శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం శ్రీశైలంలో చిరుత సంచారం పాతాళగంగా పాత మెట్ల మార్గంలో సంచారం.  డివైడర్‌పై చాలా సేపు కూర్చొని.తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిన చిరుత పులి గతంలోనూ అదే ప్రాంతంలో సంచారం. , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు!.

Image
 కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా PCB RTI విభాగం అధికారుల తీరు! హైద్రాబాద్:  తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరు కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా ఉంది. పీసీబీ  వెబ్సైట్ లో ఆర్టీఐ మెనూ లో పాత సమాచారాన్ని మార్చకుండా ఉంచారని pio మీద ఫిర్యాదు రావడం తో అసలు సమాచారాన్ని అప్డేట్ చేయకుండా ఆ సమాచారాన్ని తొలగించారు. 2019 లో వర్క్ allocation సమాచారం ఉందని, ఆర్టీఐ ఆక్ట్ సెక్షన్ 4(1)(బి)xvii ప్రకారం ప్రతి ఏడాది అప్డేట్ చేసి పబ్లిష్ చేసి వెబ్సైట్ లో పెట్టించడం లో pio విధి నిర్వహణలో విఫలం చెందారని ఫిర్యాదు రావడం తో కొత్త సమాచారాన్ని అప్డేట్ చేయకుండా వర్క్ allocation సమాచారం డెలీట్ చేసి కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలుక ఊసి పోయిన చందంగా పీసీబీ సమాచార హక్కు విభాగం అధికారుల వ్యవహరించిన తీరు.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్

Image
  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్ మహబూబ్నగర్:  ఆర్యవైశ్యుల శ్రేయస్సు నా ఆశయం కొత్తవారికి అవకాశం కల్పించడం మా ఉద్యమం అంటూవనపర్తి జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు గద్వాల జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు నారాయణపేట జిల్లా అధ్యక్షులు వారి కార్యవర్గ సభ్యులు రాష్ట్ర నాయకులు మండల పట్టణ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఆమరవాది లక్ష్మీనారాయణ మహాసభ నుండి దిగి కొత్త వారికి అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు ఈ సమావేశానికి సుమారు 200 మంది ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ పట్టణం వైశ్య హాస్టల్ ల్లో  ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు ఆధ్వర్యంలో మిడిదొడ్డి శ్యామ్ సమక్షంలో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంటనే దిగి మరియొక కొత్త వ్యక్తికి అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలని  కోరిన నాయకులు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి ర

దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్

Image
 ****ఇంత కారుణ్యమేల*  దేవాదాయశాఖలో కారణ్య నియామాకాలలో గోల్ మాల్ - #సర్వీస్ రూల్స్కు విరుద్దంగా పోస్టింగులు #ఆలయ ఉద్యోగ వారసులకు అన్యాయం -కార్యాలయం సిబ్బంది కుటుంబసభ్యులు పెద్దపీట : #ప్రొబేషనరీ పీరియడ్ కాలంలో అర్హత పరీక్షలు ఉతీర్ణత కాకున్నకొనసాగింపు  #విచారణ చేపట్టాలని ఆలయ ఉద్యోగుల డిమాండ్*  * తెలంగాణ దేవాదాయ శాఖలో కారుణ్య నియామాకాలు చర్చనీయాంశంగా మారింది. ఇంటి పెద్ద దిక్కుగా ఉండే ఉద్యోగి చనిపోతే వారిపై ఆధారపడిన అర్హులకు కొలువు ఇవ్వడం పద్దతే. దేవాదాయ శాఖ నిబంధనల్లో ఇదోక భాగమే దీన్ని మానవీయ కోణంలో ఎవ్వరూ వ్యతిరేకించడం లేదు, అయితే ఇందులో వ్యవహరిస్తున్న తీరే అయోమయంగా మారింది. కారుణ్య నియామాకాలలో అనుకూలరుకు ఒక విధంగా... ఇతరులకు మరో విధంగా పోస్టింగ్లు ఇవ్వడం వివాదస్పదంగా మారింది, దేవాలయ ఉద్యోగులు మృతి చెందింతే ఒక తీరుగా, కార్యాలయ సిబ్బంది ఉద్యోగుల వారసులకు మరో విధంగా కారుణ్య నియామాకాలలో పక్షపాత దోరణి అవలంభిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఆలయ ఉద్యోగుల వారసులు ఈఓ గ్రేడ్-3 రావాలంటే సుమారు 20 ఏళ్లుగా పేగా వేచి ఉండాల్సి ఉండగా కార్యాలయ ఉద్యోగులకు మాత్రం నేరుగా కట్టబేడుతున్నారు. దీంతో ఆలయ ఉద్యోగులక

కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామి

Image
 కాంగ్రెస్ డిఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత..! - పగుడాకుల బాలస్వామి రాజ్యాంగాన్ని చేతబట్టి (ప్రదర్శిస్తూ) ఎంపీగా ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రమాణం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాని విలువలను విస్మరించడం రాజ్యాంగం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. "జై సంవిధాన్- జైహింద్" అని చేసిన నినాదాలు హిందూ వ్యతిరేకతను ప్రతిధ్వనించాయి. కులమతాలకు అతీతంగా, సర్వ మానవ శ్రేయస్సు కోసం పనిచేస్తానని జూన్ 25న ప్రమాణం చేసిన రాహుల్ గాంధీ.. జూలై 1న హిందూ సమాజంపై విషం చిమ్మడం రాజ్యాంగ విలువలకే అవమానం. ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల "కుటుంబ ప్రతినిధి"గా రాజకీయాల్లో రాణిస్తున్న రాహుల్ గాంధీ.. ఈ దేశ మెజార్టీ ప్రజలపై, వారి విశ్వాసాలపై మాటల తూటాలతో దాడులకు తెగబడడం అప్రజాస్వామికం. "హిందువులు హింసావాదులు.. విధ్వంస కారులు.. కుట్ర దారులు" అంటూ నిరాధార ఆరోపణలు చేయడం అలౌకికం.!  భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతున్న హిందుత్వంపై హింసవాదులుగా, విధ్వంసకారులుగా ముద్ర వేయడం మూర్ఖత్వం. సాటిలేని దేశ సమగ్రతకు, పరంపరకు రాహుల్ వ్యాఖ

20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు

Image
 20 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన ఏస్ ఐ, జర్నలిస్టు మెదక్ జిల్లా: (గూఢచారి ప్రతినిధి) రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ ఆనంద్, జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ అరెస్టు. మెదక్ జిల్లా, కొలిగడ్డకు చెందిన పూల గంగాధర్ నుండి కామారెడ్డి జిల్లా కు చెందిన జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించిన చిక్కిన హవేలి ఘన్ పోలీసు స్టేషన్ ఎస్ ఐ   ఆనంద్.  ఫిర్యాదు దారు యొక్క టిప్పర్ వాహనము పోలీస్ స్టేషన్ నుండి విడుదల చేయుట కొరకు లంచం డిమాండ్ చేసి జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ ద్వారా 20 వేలు లంచం డిమాండ్ చేసి అంగీకరించంచిన ఎస్ ఆనంద్, లంచం డబ్బులు జర్నలిస్టు మహ్మద్ మస్తాన్ నుండి స్వాధీన పరుచుకొని ఇద్దరని అరెస్టు చేసి ఏసీబీ జడ్జి ముందు హాజరు పరిచామని, కేసు విచారణలో ఉందని తెలిపిన ఏసీబీ అధికారులు.  ఎవరైనా ప్రభుత్వ అధికారి, ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, లంచం డిమాండ్ చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం

Image
 *ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమం* నల్లగొండ పట్టణం వీటి కాలనీ కాకతీయ కాలేజ్ గ్రౌండ్ ఘనంగా జడ కొప్పు కోలాటం ప్రదర్శన*నిర్వహించడం జరిగింది. గత 40 రోజుల నుండి 50 మంది మహిళలు మాస్టర్ తోగొటీ రమేష్ చారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పూర్తి అయిన తర్వాత, ఆదివారం సాయంత్రం ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మహిళలకు చీరలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో 33 వ వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు కోలాటం నేర్చుకోవడం వలన శారీరకంగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు, ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా నేర్పించిన రమేష్ మాస్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు, ఇటువంటి శిక్షణా తరగతులు మరిన్ని నిర్వహించాలని వారు కోరారు. స్థానిక నాయకులు రేగట్టే లింగస్వామి సహకారంతో కోలాటం బృందం సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేసుకోకలిగామని తోగోటి రమేష్ చారి అన్నారు. ఈనెల 15వ తేదీ నుండి కాకతీయ కాలేజ్ మైదానంలో మరొక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు ఈ అవకాశాన్ని ప

యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

Image
 యునెస్కో గుర్తింపులో మన గొంగడి ఉండడం గర్వకారణం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  యునెస్కో గుర్తింపులో మన రాష్ట్రానికి చెందిన మూడు వస్త్రాలు ఉండడం గర్వకారణమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగి స్వామి గొంగడితో సహాయ మంత్రికి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యునెస్కో గుర్తింపు పొందిన గొంగడి నేత కార్మికులకు శుభాకాంక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా ఇతర రాష్ట్రాలకు వచ్చే మరమగ్గాలను మన రాష్ట్రానికి వచ్చేలాగా కృషి చేస్తానని గొంగడి నేత కార్మికుల సమస్యలను కేంద్ర మంత్రిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.మన రాష్ట్రం నుండి పురాతన వస్త్రంగా గొంగడి ఉన్నందుకు KRPS అధ్యక్షులు బింగి స్వామిని శాలువాతో సహాయ మంత్రి సన్మానించారు. నల్లగొర్రెల ఊలుతో నేసే గొంగళ్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కురుమ ఇళ్లలో పురుడు పోసుకునే గొంగడి సామాజికవర్గం వారసత్వ సంప్రదాయంగా, కురుమల జీవితంలో అంతర్భాగంగా మారాయని. యునస్కో మన రాష్ట్రానికి చెందిన వస్త్రాన్ని గుర్తించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూ

*కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.*

Image
 *BREAKING* *కాంగ్రెస్ లోకి గద్వాల బీఆరెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.* *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి.* *జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం.* *పాల్గొన్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్*

BHUPATHI TIMES 6th July 2024

Image