*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*



*ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు*


*మట్టి వినాయకులను పూజిద్దాం,పర్యావరణాన్ని కాపాడుదాం- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి*

 

నల్గొండ:


వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

మంగళవారం నాడు మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  

నల్గొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సుమారు 4100  మట్టి వినాయకులను ప్రజలకు ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. వినాయక చవితిని పురస్కరించుకొని ప్రజలందరూ వాతావరణ కాలుష్యం కాకుండా మట్టి వినాయకులను పూజించాలని తెలిపారు. దీనివల్ల వాతావరణ సమతుల్యంతో పాటు,వినాయకులను నిమజ్జనం చేసే చెరువులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయక విగ్రహాలను వాడడం వల్ల అన్ని రకాలుగా హానికరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.


మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్