Posts

Showing posts from March, 2025

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ

Image
 ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది  మెదక్ ( గూఢచారి) : ఇంటి స్థలం మ్యుటేషన్ లో లంచం డిమాండ్ చేసి బాధితుడి వద్ద నుంచి రూ. 12 వేలు లంచం తీసుకుంటూ మెదక్ మున్సిపల్ రెవెన్యూ అధికారి ఏసీబీకి చిక్కిన ఘటన మంగళవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... మెదక్ పట్టణం కు చెందిన శైలజ కు సర్వేనెంబర్ 505/1/2 లో 605 గజాల ఇంటి స్థలం ఉంది. భూమి మ్యుటేషన్ కోసం గత నెలలో దరఖాస్తు చేసింది. కానీ మ్యుటేషన్ కోసం మున్సిపల్ ఆర్ ఐ జానయ్య ను సంప్రదించగా పని చేయలేదు. దీంతో పలు మార్లు అతని వద్దకు వెళ్లిన ప్రయోజనం కలగలేదు. దీంతో విషయం సోదరుడు ధర్మకారి శివకుమార్ కు చెప్పడంతో మున్సిపల్ ఆర్ ఐ వద్దకు వెళ్లి మ్యుటేషన్ చేయాలని కోరగా అందుకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమండ్ చేసినట్లు తెలిపారు. ఇందుకు రూ.12 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. ప్రభుత్వ అధికారి లంచం అడగడంతో శివకుమార్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వివరాలు సేకరించిన ఏసీబీ అధికారులు ...

మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు

Image
  మహాసభ డాక్యుమెంట్ కాపీలు ఇప్పించమని ఆర్టిఐ దరఖాస్తు చేసిన జర్నలిస్ట్ భూపతి రాజు   హైద్రాబాద్:   తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల ప్రక్రియ బై లాకు మరియు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 కు  విరుద్ధంగా జరుగుతున్నందున,  తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ కు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ డాక్యుమెంట్లు  అట్టేస్ట్  చేసి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం క్రింద రిజిస్టర్ ఆఫ్ సొసైటీ హైదరాబాద్ సౌత్ గారి కార్యాలయం ప్రజా సమాచార అధికారి కి దరఖాస్తు చేసిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్ట్ భూపతి రాజు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఏర్పడి నుండి ఇప్పటివరకు ప్రజాస్వామ్యబద్ధంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001 ప్రకారం గా ఇప్పుడున్న పాలకులు వ్యవహరించారా?  లేదా అనే విషయాన్ని సమగ్రంగా పరిశీలించుట కొరకు దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. బైలా మరి అమెండ్మెంట్లు రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ యాక్ట్ 2001  ప్ర కారం  చేశారా?, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ వారికి ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన డాక్యుమెంట్లు ఇచ్చారా?  అందులో ఏవైనా అక్రమాలు జరిగాయా?  అన్న విషయాన్...

Amruta Pranay Case Judgment

Image
 Amruta Pranay Case Judgment

సిటి సివిల్ కోర్టు లో దాఖలైన కేసులో ఆర్డర్ కొరకు ఏప్రిల్ 4 నాటికి వాయిదా

Image
 హైద్రాబాద్:  సిటీ సివిల్ కోర్టులో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల పై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ, అమరవాది లక్ష్మీనారాయణ, కొండ్లె మల్లిఖార్జున్, రేణుకుంట్ల గణేష్ గుప్త, తొడుపునూరి చంద్రపాల్ లను ప్రతివాదులుగా చేరుస్తూ ఎ. వెంకటేశం సిటి సివిల్ కోర్టులో వేసిన కేసు నంబర్ 6/2025 సంభందించిన కేసులో ఎ. వెంకటేశం దాఖలు చేసిన IA No. 1/2025 & IA No. 2/2025 వాటిపై తేది 4-4-2025 నాటికి ఆర్డర్ ల కొరకు వాయిదా పడింది. ఈ ఆర్డర్ ల పైనే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.

Image
  *దుబ్బ శ్రీనివాస్ ను రిమాండ్ కి తరలించిన పోలీసులు.* ఇంతేజార్గంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపెట శివారులో గల ఎం.హెచ్ నగర్ లోని ప్రభుత్వ భూములలో, వరంగల్, కాశిబుగ్గలోని వివేకానంద కాలనీకి చెందిన దుబ్బ శ్రీనివాస్ అనే అతడు సిపిఎం పార్టీ పేరుతో గుడిసెలు వేసి, వాటిని తన ఆధీనంలోకి తీసుకొని, అమాయకులైన నిరుపేదలకు వాటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు తీసుకుంటూ, ఒకటే ఫ్లాట్ ని ఇద్దరు లేదా ముగ్గురికి అమ్ముతూ అడిగిన వారినీ ఇంకా అదనంగా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తేనే వారికి అట్టి ప్లాట్ ను అప్పగిస్తానని, అలా కాకుండా అతడు డబ్బులు తీసుకున్న విషయం ఎవరికైనా చెప్పితే చెప్పిన వారిని చంపుతానంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడని తేదీ:20.02.2025 న బాధితులు వచ్చి దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసిన ఇంతేజార్గంజ్ పోలీసులు. ఈరోజు అనగా తేదీ 28.02.2025న సదరు దుబ్బ శ్రీనివాసుని ఆధీనంలోకి తీసుకోనీ, అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది అని ఒక ప్రకటనలో మీడియాకు తెలియజేశారు.

ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి

Image
 ఏసీబీ కి చిక్కిన విద్య, సంక్షేమ శాఖ (EWIDC) అధికారి ఆదిలాబాద్‌ విద్య & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమవారం 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. అధికారుల కథనం ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల భవనం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు బిల్లు మంజూరు చేసే విషయంలో ఆదిలాబాద్‌ విద్యా & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (EWIDC) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవర్ శంకర్ సానుకూలంగా వ్యవహరించేందుకు సదరు వ్యక్తి నుండి ముందుగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేసినారు. కాగా సదరు వ్యక్తి అభ్యర్థన మేరకు లక్ష రూపాయలకు తగ్గించి, మొదటి విడతగా 50వేల రూపాయలు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడినట్లు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని అవినీతి నిరోధక శాఖ అధికారులు కోరారు.

భూపతి సుశీలమ్మ కు నివాళులు అర్పించిన కాచం సత్యనారాయణ, వనమా వెంకటేశ్వర్లు

Image
  భూపతి  సుశీలమ్మ  కు నివాళులు అర్పించిన   కాచం సత్యనారాయణ,  వనమా వెంకటేశ్వర్లు నల్లగొండ: భూపతి రవీంద్రనాథ్, భూపతి రాజు, భూపతి లక్ష్మీనారాయణ గార్ల మాతృమూర్తి  కీ.శే.  భూపతి సుశీలమ్మ   12వ రోజు  ఇష్టబంతి కార్యక్రమానికి  హాజరై   నివాళులు   అర్పించిన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ, నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు  వనమా వెంకటేశ్వర్లు, మాజీ ప్రధాన కార్యదర్శులు యామ దయాకర్, బుక్క ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి  లక్ష్మి శెట్టి శ్రీనివాస్,  మాజీ కౌన్సిలర్ గుబ్బ  శ్రీనివాస్,  కాసం  శేఖర్, తల్లం గిరి పాల్గొన్నారు.

ఇప్పుడు బయటకు రాకపోతే మరి ఎప్పటికీ మన గతి అంతే - నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్

Image
 ఇప్పుడు బయటకు రాకపోతే మరి ఎప్పటికీ మన గతి అంతే - నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్ నల్గొండ: (గూఢచారి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కసరత్తులో భాగంగా జిల్లాల నుంచి కౌన్సిల్ లిస్ట్ కూడా ఇష్టానుసారంగా రాసుకొని ఎన్నికలకు పోవడం జరిగిందని నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ అశోక్ ఆరోపించారు. సరే ఏది ఏమైనా మహాసభకు ఎన్నికలు కావాలని అందరూ ఎన్నికలకు సై అన్నారనీ, కానీ వారు రాసుకున్న కౌన్సిల్ లిస్ట్ పై కూడా వాళ్లకు నమ్మకం లేక దొంగ దారిలో ఇద్దరితో విత్ డ్రా చేయించి శ్యాంసుందర్ నామినేషన్ను నాగర్ కర్నూల్ ఎన్నికలు పెట్టలేదనీ రిజెక్ట్ చేశామని వారు నియమించుకున్న ఎన్నికల కమిటీ చే ప్రకటన చేయించి తెలంగాణ ఆర్యవైశ్య మనోభావాలను కించపరిచినట్టు వ్యవరించడం జరిగిందని ఆయన విమర్శించారు. దీనికి నిరసనగా రేపు మహాసభ ప్రక్షాళన పేరున ఆర్యవైశ్య పెద్దలు హైదరాబాదులోని ఖర్మంఘట్ లో చర్చా కార్యక్రమం అలాగే భవిష్యత్తు కార్యాచరణ జిల్లాల వారీగా ప్రక్షాళన కమిటీలు వెయ్యడానికి రేపు సమావేశం పెట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి నలగొండ జిల్లా మరియు నల్గొండ పట్టణ నుండి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు పాల్గొని తమ తమ...

సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఇదంతా ..... ఒక్కరి స్వార్థం కాదా - తెడ్ల జవహర్ బాబు

Image
  సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఇదంతా ..... ఒక్కరి స్వార్థం కాదా - తెడ్ల జవహర్ బాబు నల్గొండ: ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళనకు నడుం బిగించి ముందుకు వచ్చిన ఆర్యవైశ్య సోదర సోదరీమణులందరికీ నమస్కారం అంటూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సరైన సమయాలలో ఎన్నికలు జరిగినట్లయితే మా నల్లగొండ జిల్లా నుంచి మహాసభ అధ్యక్షులుగా మరియు మహాసభకు మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఎప్పుడో అవకాశం లభించేదని నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు తెడ్ల జవహర్ బాబు అన్నారు  నల్గొండ జిల్లా నుండి మహాసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు, ప్రతిసారి ఈసారి మన జిల్లా కే అవకాశం అని ఎన్నో టర్మ్ లు సంఘాన్ని బలోపేతం చేసిన పెద్దలు కొందరు శివైక్యం చెందినారని, ఆలా సంఘ బలోపేతం కోసం వూరు వాడ తిరిగిన నాయకులకు నిరాశ ఎదురైతుందని ఇదంతా ఒక్కరి స్వార్థం కాదా అని విమర్శించారు.

ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి

Image
 ఆర్య వైశ్యులకు అమరవాది లక్ష్మీనారాయణ క్షమాపణ చెప్పాలి  - ఆర్య వైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా ధర్మపురి, (గూఢచారి), మార్చి 07 :  తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల రమేష్ గుప్తా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ సభ వేదికలో అమరవాది మాట్లాడుతూ ఆర్యవైశ్యులను ఉద్దేశించి పని పాట లేని కొంతమంది వెధవలు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొనడం సరైంది కాదన్నారు. అయ్యా అమరవాధి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిన మీరు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక కూడా మీకు మీరే అధ్యక్షుడిగా ప్రకటించుకొని 10 సంవత్సరాలు కొనసాగావు. అయ్యా మీ సేవలు మా ఆర్యవైశ్యులకు ఇక చాలు, మీకు సెలవు, అని యావత్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులంతా ముక్తకంఠంతో మీ...

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2025.

Image
                                   తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు-2025. హైద్రాబాద్, (గూఢచారి):  మార్చి 8న వచ్చే అంతర్జాతీయ మహిళా దినోత్సవం -2025లో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగుల సంఘం 7-3-2025న సనత్నగర్ బోర్డు కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. టిజిపిసిబి సభ్య కార్యదర్శి జి.రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు సమాజ అభ్యున్నతికి మహిళలు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. నిర్ణయాలు తీసుకోవడంలో మహిళలు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. సమస్యలను పరిష్కరించడంలో మహిళలు చూపిన ఆవిష్కరణలు ఎంతో ప్రశంసనీయం అని కొనియాడారు. ఈ వేడుకల్లో టిజిపిసిబి యొక్క టెక్నికల్, సైంటిఫిక్, అడ్మినిస్ట్రేటివ్ మరియు అకౌంట్స్ నుండి మహిళా ఉద్యోగులు రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ విషయాన్ని తె...

ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్

Image
  ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు - సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్  Hydrabad:  రాష్ట్రం లో ప్రతి పాఠశాల లో రామాయణం పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్కార శిక్షణ విభాగం రాష్ట్ర ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ తెలిపారు. ఈ రోజు శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల బడంగ్ పేట్ లో 7/3/2025 శుక్రవారంరోజున 10 గంటలకు *"జానహిత",సంస్కార శిక్షణ విభాగం* ఆధ్వర్యంలో రామాయణం పరీక్షలు నిర్వహిస్తు ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, నైతిక విలువలు, దేశభక్తి, సంస్కారం అందించాలనే ఉద్దేశ్యం తో తెలంగాణ ప్రాంతం అంతట రామాయణం పరీక్షలు ప్రారంభం చేశామని చెప్పారు. ఈ పరీక్షలలో పాల్గొన్న 251విద్యార్థులలో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థిని విద్యార్థులకు సంస్కార శిక్షణ ప్రాంత ప్రముఖ్ బొడ్ల మల్లికార్జున్ బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమం లో ,శేఖర్ రెడ్డి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులు, అనిల్ కుమార్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసిన అందరికి ధన్యవాదములు తెలియజేసారు.  

Muncipal Commosioner in ACB Net

Image
 Muncipal Commosioner in ACB Net Kandukuri Srinivas, Muncipal Commosioner of Dharmapuri in Jagtial District was caught by Telangana ACB Officials for demanding and accepting the bribe amount of Rs.20,000/- from the complainant for showing an official favour "to send files of different Programmes pertaining to Engg.Section to the Addll.Collector for Sanction, to clear Pending Salary bills of the Complainant and also to forward MOU pertaining to the Services of the Complainant to the Director, Regional Center for Urban Environment Studies, Osmania University, Hyderabad."

21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ

Image
 21 మంది IPS ల బదిలీ @ తెలంగాణ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలీ. బదిలీ ఐన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థాన  చలనం. మిగిలిన 14 మంది ఎస్పీలకు బదిలీ. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం.

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సభలో పాల్గొన్న ఉప్పల

Image
 * *IVF న్యూ ఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త గారికి జరిగిన అభినందన సభలో పాల్గొన్న ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, IVF సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్, TPCC ప్రచార్ కమిటీ కో-కన్వీనర్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో, ఈరోజు ఉదయం, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా కొనసాగి బిజెపి ముఖ్యమంత్రిగా ఆమె ఎంపిక కావడం ఐ వి ఎఫ్ కి ఎంతో గర్వకారణం, కావున ఇంటర్నేషనల్ ఫెడరేషన్ న్యూఢిల్లీ పక్షాన ఆమెకి *అభినందన సభ* ఏర్పాటు చేసి ఘనంగా అంగరంగ  వైభవంగా సన్మానించారు.  👉 *ఈ సందర్భంగా శ్రీ  అశోక అగర్వాల్ గారు ప్రసంగి స్తూ....* ప్రపంచ చరిత్రలో ఒక మహిళ కుల సంఘానికి అధ్యక్షురాలుగా ఉండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయం అని ఆయన అంటూ, వివిధ రాష్ట్రాలలో మహిళలు రాజకీయాల్లో పాల్గొని, మంచి మంచి పదవులు పొందాలని, దీనికి ఐవీఎఫ్ ఎప్పుడు  ముందుంటుందని ఆయన అన్నారు. 👉 *ఈ సందర్భంగా శ్రీఉప్పల శ్రీనివాస్ గారు ఆమెను ఘనంగా సన్...

అనిశా అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.

Image
 అనిశా అధికారుల చేతికి చిక్కిన ఎ.డి.ఇ.  "ఒక ఫార్మా కంపెనీ లో నెట్ మీటర్ ను ఏర్పాటు చేసినందుకు, డి.ఇ.ఆపరేషన్స్ చౌటుప్పల్ చేత అట్టి మీటర్ ను అనుసంధానం చేయడానికి మరియు ఇంకొక ఫార్మా కంపెనీకి సంబంధించి పెండింగులో గల ఫిర్యాదుధారునికి సంబంధించిన బిల్లులను స్వీకరించేందుకు" అధికారికంగా అనుకూలతను చూపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ. 70,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. లో పనిచేస్తున్న ఎ.డి.ఇ. (ఆపరేషన్స్) గాజుల శ్యామ్ ప్రసాద్. “లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

లంచం ట్రాప్ లో దొరికిపోయిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజనీర్

Image
  ఏసీబీ లంచం ట్రాప్ లో దొరికిపోయిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఇంజనీర్ హైదరాబాద్, మార్చి 3: ఏంటీ కరప్షన్ బ్యూరో అరెస్ట్.  దాసార్థ్ ముదిరాజ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (Dy. E. ఈ), క్వాలిటీ కంట్రోల్ డివిజన్-II, GHMC, తదుపరి ప్రాసెసింగ్ కోసం ఫిర్యాదుదారు యొక్క ఫైళ్లను క్లియర్ చేసి ఫార్వార్డ్ చేయడానికి ₹20,000 లంచం డిమాండ్ చేసి, స్వీకరించినందుకు సోమవారం సాయంత్రం 5:00 గంటలకు మిగిలిన మొత్తాన్ని ఆమోదించడానికి ముందు నిందితుడు అధికారి ఇప్పటికే ₹10,000 ముందుగానే తీసుకున్నాడు. అతడి నుంచి లంచం రికవరీ చేయబడింది, మరియు అతని ఎడమ వైపు ఆఫీసు డెస్క్ లోపలి భాగంపై రసాయన పరీక్షల్లో జాడలు నాంపల్లి, హైదరాబాద్, నాంపల్లి, ఏసీబీ కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు అధికారిని అరెస్ట్ చేశారు. 

విద్య తోనే కురుమల బతుకుల్లో వెలుగు : బండారు దత్తాత్రేయ హర్యాన గవర్నర్

Image
 విద్య తోనే కురుమల బతుకుల్లో వెలుగు : బండారు దత్తాత్రేయ హర్యాన గవర్నర్  చదువుతోనే కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతాయని బండారు దత్తాత్రేయ హర్యాన గవర్నర్ అన్నారు కురుమ రిజర్వేషన్ పోరాట సమితి కొండపోచమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదవాలి ప్రతి ఒక్కరు ఎదగాలని చదివే అందరికీ లక్ష్యంగా మారాలన్నారు. కష్టజీవులుగా ఉన్నా మనము కష్టమైనా చదువును వదలొద్దని అదే మనల్ని సరైన లక్ష్యానికి చేరవేస్తుందన్నారు. అందుకు కొమరవెల్లి మల్లికార్జున స్వామి దర్శించుకున్న ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శాలువాతో సన్మానం అనంతరం కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తన పూర్వికుల నుండి కొండపోచమ్మ అమ్మవారిని ఇంటిదేవునిగా పిలుస్తున్నామని గతంలో తెలంగాణ కొరకు ఇక్కడ మొక్కుకున్న మొక్కులను ఆయన గుర్తు చేశారు.కొండపోచమ్మ అమ్మవారి వద్ద టీటీడీ బోర్డు ద్వారా ఫంక్షన్ హాలు గెస్ట్ హౌస్ మంజూరు చేపించాలని స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించారు.మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ కురుమలకు కేంద్ర ప్రభుత్వం సహాయంత...

ఒక చిన్న విశ్లేషణ ఓపెన్ చేసి వినండి

Image
 

ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ కు ఆహ్వానం

Image
 ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఉప్పల శ్రీనివాస్ కు ఆహ్వానం *ఉప్పలకు ఢిల్లీ ఐవీఎఫ్ ఆహ్వానం /-- ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ వైస్ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ పూర్వపు టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ని ఢిల్లీలో జరిగే ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖ గుప్త అభినందన సత్కార కార్యక్రమానికి ఆహ్వానిస్తున్న, ఇంటర్నేషనల్ వైశ్యపరేషన్ న్యూఢిల్లీ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్ జి, చిత్రంలో ఐవిఎఫ్ తెలంగాణ ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలా శ్రీధర్ ఉన్నారు*

*అమరవాది గారు* *బహిరంగ చర్చకు సిద్ధం కండి* *ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షం లో* *శ్యామ్ సుందర్ బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు*

Image
 *అమరవాది గారు* *బహిరంగ చర్చకు సిద్ధం కండి* *ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షం లో* *శ్యామ్ సుందర్ బహిరంగ చర్చకు రెడీ అంటున్నారు* ఆర్యవైశ్యుల అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. పోటీలో ఉన్న అభ్యర్థి శ్యాంసుందర్ చర్చకు సిద్దం అన్నారు. పోటీలో ఉన్న మరో అభ్యర్థి అమరవాది లక్ష్మి నారాయణ కూడ సిద్దం అయితే అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. గతo లో ఉమ్మడి రాష్ట్రం ఎన్నికల్లో తెలంగాణ హక్కు కొరకు పోరాడిన తెలంగాణ గాంధీ స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి తో కలసి నిరాహారదీక్ష లో పాల్గొని తెలంగాణ హక్కు ను సాధించిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సమక్షంలో బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేయండి. అందులో అన్ని విషయాలు చర్చించ వచ్చు. 

రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ అధ్యక్షతన యుపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా

Image
 ఓపిఎస్ నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్... గో బ్యాక్ యుపిఎస్ ఏప్రిల్ 1 న బ్లాక్ డే మే 1 న చలో ఢిల్లీ సెప్టెంబర్ 1 న సామూహిక సెలవు,లక్ష కలాలతో కవాతు ఈరోజు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో తెలంగాణ రాష్ట్ర కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ  అధ్యక్షతన యుపిఎస్ వద్దని యుద్ధభేరి ధర్నా కార్యక్రమం జరిగింది ఈ ధర్నాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్ రాష్ట్ర కోశాధికారి నరేష్ గౌడ్ లు భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇటీవల జనవరి 24న కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గెజిట్ ప్రకారం యుపిఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీం అనేది ఏప్రిల్ 1 2025 నుండి అమలు చేయాలని గెజిట్ లో పేర్కొన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నేడు ధర్నా ను నిర్వహించమన్నారు. ధర్నా లో రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ ఈ యుపిఎస్ విధానం అనేది కార్పొరేట్లకు ధన ప్రవాహం కొనసాగించుటకు కోసమే వచ్చిందన్నారు కేంద్రం ఆర్థిక శాఖ ఈ గెజిటెడ్ తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతే వసూలు చేసిన 10.5 లక్షల కోట్ల రూపాయల్ని అప్పనంగా కార్పోరేట్ చేతుల్లోనికి వెళ్తున్నాయని తెలిప...

కూల్చివేత వ్యర్థాల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించిన TGPCB సభ్య కార్యదర్శి G. రవి,

Image
 కూల్చివేత వ్యర్థాల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించిన TGPCB సభ్య కార్యదర్శి G. రవి, హైద్రాబాద్, (గూఢచారి): TGPCB సభ్య కార్యదర్శి G. రవి, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లో ఉన్న మెస్సర్స్ సోమ శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల పునర్వినియోగ కేంద్రాన్ని సందర్శించారు.  ఈ సందర్శన సందర్భంగా, ప్రతిపాదకులు సభ్య కార్యదర్శికి ప్రాజెక్ట్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చి వివరించారు. సరస్సుల ఆక్రమణలను ఆపడానికి, విలువైన సహజ వనరులను కాపాడటానికి నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను పునఃసంవిధానం చేయడం అవసరాన్ని, ప్రాముఖ్యతను సభ్య కార్యదర్శి నొక్కి చెప్పారు.  నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుందని, బాధ్యతాయుతమైన ప్రతి ఒక్కరూ నిర్మాణ, కూల్చివేత వ్యర్థ నియమాలను అమలు చేయాలని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్శన సందర్భంగా, హైదరాబాద్ జోనల్ కార్యాలయం  JCEE హనుమంత్ రెడ్డి, SEE, నరేందర్ మరియు రంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయం EE, వెంకట్ నర్సు కూడా హాజరయ్యారు.

తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు.

Image
 *తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ను మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు.* *జర్నలిస్ట్ ల సంక్షేమానికీ, అభివృద్ధికి పాటు పడాలని కమిటీ సభ్యులకు గవర్నర్ సూచన*. *Hyderabad 01-03-2025. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు శనివారం రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన JCHSL కమిటీ సభ్యులు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు, దాని కార్యకలాపాలను గవర్నర్ కు సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు వివరించారు. 1964 లో ఏర్పడిన సొసైటీ మూడు కాలనీల ఏర్పాటు, అక్కడ జర్నలిస్టుల సంక్షేమంకోసం సొసైటీ చేస్తున్న పనులను వారికి తెలియజేశారు. ఇంకా ఇండ్ల స్థలాల కోసం సుమారు 950 మంది జర్నలిస్టులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో జర్నలిస్టుల స్థితిగతులు, సుప్రింకోర్టు కేసు, మీడియా పరిస్థితులపై గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్టుల కాలనీ సంక్షేమ, అభివృద్ధికి పాటు పడాలనీ నూతన కమిటీకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు. నూతన కమిటీ చేస్తున్న పనులను అడిగి తెలుసుకుని అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఎం. రవీంద్రబాబు, ఉపాధ్యక...

ప్రభుత్వం నియమించిన కమిటీని రద్దు చేయమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరపున హై కోర్టులో కేసు

Image
  ప్రభుత్వం నియమించిన కమిటీని రద్దు చేయమని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ తరపున హై కోర్టులో కేసు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల కొరకు ప్రభుత్వము ఎన్నికల కమిటినీ నియమించిన  మెమో నం 6395/REGN II/20252 24.02. 2025  మరియు  ఆ కమిటీ నియమించిన ఎన్నికల అధికారి ఇచ్చిన  లేఖ. G/214./2025   సహజ న్యాయ సూత్రాలను విరుద్ధంగా ఉందని, Indian Constitution ఆర్టికల్ 14  మరియు 21 ఉల్లంగించినట్లుగా ఉన్నదని పేర్కొంటూ, రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీ ఆక్ట్ 2001 కు  విరుద్ధంగా ఉన్నదనీ అందువల్ల రెండింటినీ set a side చేయమని కోరుతూ ఆర్యవైశ్య మహాసభ తరుపున హై కోర్టులో  కేసు దాఖలు అయ్యింది కేసు నంబర్ WP 6290/2025. ఈ కేసు మొదటి పిటిషనర్ మహాసభ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రేణుకుంట్ల గణేష్ గుప్త మహాసభ రిప్రసేన్టేటివ్ గా మరియు 2 వ పిటిషనర్ గా కేసు నమోదు అయ్యింది.  ఈ కేసు లిస్టింగ్ డేట్ 3-3-2025 అయ్యింది.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ వేటు.

Image
 ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ వేటు.