బాలికపై అత్యాచారం

 బాలికపై అత్యాచారం


మల్లప్పురం (కేరళ) : సమాజంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువవుతున్నాయి. చిన్నపిల్లలపై కూడా కొందరు మృగాళ్లు అత్యాచారాలు చేయడం గమనార్హం. కేరళలోని మల్లప్పురం జిల్లాలో పాఠాలు చెప్పే అధ్యాపకుడే ఏడో తరగతి చదువుతున్న 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేయడంతో ఆ బాలిక గర్భందాల్చింది. బాలిక అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లడంతో ఈ ఘోరం బయటకు వచ్చింది. గత రెండు నెలల నుంచి అధ్యాపకుడు  బెదిరించి అత్యాచారం చేసినట్టు బాధితురాలు వెల్లడించింది. దారుణానికి పాల్పడిన అధ్యాపకుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికను వైద్యపరీక్షలకు తరలించి నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు.


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్