Posts

Showing posts from January, 2026

హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్

Image
  హైదరాబాద్ నుమైష్ -2026లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్  హైదరాబాద్, గూఢచారి:  ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమైష్ -2026)లో టీజీపీసీబీ ప్రదర్శన స్టాల్ – కాలుష్య నియంత్రణ పై ప్రజల్లో అవగాహన. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) ప్రజల్లో పర్యావరణ అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ప్రదర్శన స్టాల్ను ఏర్పాటు చేసింది. ఈ స్టాల్లో మునిసిపల్ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశ్రమల నుండి వెలువడే ఉద్గారాలు, పరిశ్రమల వల్ల కలిగే జల కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఈ-వ్యర్థాల (ఈ-వేస్ట్) నిర్వహణ, కాలుష్యం వలన పర్యవరణానికి కలిగే హాని పై సమాచారం అందించారు. వివిధ రకాల పోస్టర్లు ప్రదర్శనల ద్వారా కాలుష్యానికి కారణాలు, దుష్పరిణామాలు మరియు నియంత్రణ చర్యలపై సందర్శకులకు అవగాహన కల్పించారు. “పంటల మిగులు అవశేషాలను (స్టబ్బుల్) కాల్చడం భారతదేశంలో గాలి కాలుష్యాన్ని పెంచుతున్న ప్రధాన సమస్యగా మారింది. పంటల స్టబ్బుల్ను వెర్మీకంపోస్ట్గా మార్చాలి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వినియోగాన్ని ప్రోత్సహించాలి మరియు 15 సంవత్సరాలకు మించిన పాత వాహనాలను ఎలక్ట్రిక్...

శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్

Image
  శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి నిర్వహణ అభివృద్ధి కమిటీ నుండి తప్పుకున్న గుబ్బ శ్రీనివాస్ నల్గొండ:  నల్లగొండ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ కాశి విశ్వేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మంగారీ గుట్ట నిర్వహణ అభివృద్ధి కమిటీ (రిజిస్టర్) మెంబర్గా శ్రీ చింతా హరిప్రసాద్ నన్ను నియమించారనీ ఆయన కీర్తి శేషులు అయినారని, నాకు కొన్ని వ్యక్తిగత కారణముల కమిటినుండి తప్పుకొను చున్నాని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుబ్బ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటినుండి పైన తెలిపిన కమిటీకి నాకు ఎటువంటి సంబంధములు ఉండవని పత్రికా ముఖంగా తెలియ చేయు చున్నానని ఆయన తెలిపారు.

గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు - పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్

Image
 గ్యాస్ ఎజెన్సీ రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు -  పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్  గ్యాస్ సిలిండర్ సరఫరాలో అక్రమాలు ఉపేక్షించే ప్రసక్తే లేదని,గ్యాస్ డెలివరీ బాయ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. గ్యాస్ సిలిండర్ల కు అధిక వసూళ్లపై కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేయగా.. శనివారం నాడు గ్యాస్ సరఫరా చేసే బండ్ల ను  తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ సిలిండర్ల డోర్ డెలివరీకి అక్రమంగా అధికంగా వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారు. గ్యాస్ బండల సరఫరాలో కొందరు డెలివరీ బాయ్ లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు ఫిర్యాదు లు వస్తున్నాయన్నారు. అక్రమ వసూళ్ల కు పాల్పడే వారిపై ఒక్కరు ఫిర్యాదు చేసినా చాలు అని రఘునందన్ సూచించారు. గ్యాస్ కు రశిదు కూడా ఇవ్వటం లేదన్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయని ఆక్షేపించారు. గ్యాస్ ఎజెన్సీ అనుమతి రద్దు కు ఒక్క ఫిర్యాదు చాలు అని హెచ్చరించారు. వినియోగదారుల ను వి ఐ పి లు గా పరిగణించాలని సూచించారు.

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

   *తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల జాబితా*

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ

Image
 జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ   పోలీసులు సంయమనం పాటించాలి! పండుగనాడు భయభ్రాంతులకు గురి చేయడం తగదు! తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి! టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ సంగారెడ్డి:   ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం పత్రికా స్వేచ్ఛను నొక్కివేయడమే అని వారు అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధ మని పేర్కొన్నారు. జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి తగదు. అని అన్నారు.ఏదైనా అంశంపై వివరణ కోరాల్సి ఉంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు ఇవ్వాలి తప్ప, ...

గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
  గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.    హైద్రాబాద్, 13, జనవరి: గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు తాజా వార్తలను భూపతి టైమ్స్, గూఢచారి అందిస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు. పత్రికల అభివృద్ధి కి సహాయ సహకారాలు అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ కు ఎడిటర్ భూపతి రాజు కృతఙ్ఞతలు తెలిపారు.

దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత

Image
 దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత, అనారోగ్యం తో అమీర్పేట్ లోని స్వగృహం లో కన్ను మూసారు

జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC

Image
 జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC  హైదరాబాద్, జనవరి 11, 2026: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జనవరి 12 మరియు 13 తేదీలలో నగరం అంతటా మెగా ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని GHMC కమిషనర్ R.V. కర్ణన్ శనివారం ప్రకటించారు. సురక్షితమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల నుండి ఈ-వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యం. ఈ డ్రైవ్ సమయంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, బ్యాటరీలు, యుపిఎస్ సిస్టమ్లు మరియు పవర్ బ్యాంకులు వంటి అనేక రకాల విస్మరించబడిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరిస్తారు. బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల తొలగింపు యొక్క ప్రాముఖ్యతపై పౌరులకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య సిబ్బంది, నివాసి సంక్షేమ సంఘాలు (RWAs), NGOలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలతో కూడిన అవగాహన ప్రచారాలను GHMC ఇప్పటికే ప్రారంభించింది. ప్రజల ...

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం-పొంగులేటి

Image
  *జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం* *అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు* *గ‌తంలో కంటే ఎక్కువ‌గానే  అక్రిడిటేష‌న్ల మంజూరు*  *ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి* *జ‌ర్న‌లిస్టు సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం* *జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం* *జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్ధ‌లాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం* *14 జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హించిన* ... *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి* *హైద‌రాబాద్‌*:- జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌  ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.       జీవో 252 ప...

*ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు*

Image
  *ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు* - జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఖమ్మం, జనవరి 09: ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుల అంశంలో నెలకొన్న అనిశ్చితిపై న్యాయ సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్  (టిడబ్ల్యూజేఎఫ్- హెచ్-2843) జిల్లా కమిటీ బృందం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.రాజగోపాల్‌ ను ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. రాజగోపాల్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ భేటీలో జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇండ్ల స్థలాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయని జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో న్యాయ నిపుణులు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై చేసిన సూచనలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉ...

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Image
  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి గూఢచారి, సూర్యాపేట, 9 జనవరి :  09.01.2026న, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (ఎం)లోని గనుగబండ (వి) గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎఓ బర్పాటి కృష్ణ, ఫిర్యాదుదారుని నుండి అధికారిక సహాయం కోసం అంటే "ఫిర్యాదిదారుని కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి" రూ. 6,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం మొత్తాన్ని ఎఓ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల కోర్టు గౌరవనీయులైన Ist Addl. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు . కేసు విచారణలో ఉంది.

ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ

Image
 ఏసీబీకి చెక్కిన కాకతీయ యూనివర్సిటీ ఎస్ఐ హన్మకొండ, గూఢచారి, జనవరి 8: హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పేకాట కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా.. కేసును తేలిక చేసి, అతనికి అనుకూలంగా వ్యవహరించేందుకు ఎస్సై శ్రీకాంత్ రూ. 15వేల నగదును డిమాండ్ చేశారు. బాధితుడిని పదేపదే వేధిస్తూ డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో చేసేదేం లేక సదరు వ్యక్తి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్ని గురువారం బాధితుడి నుంచి ఎస్సై శ్రీకాంత్ 15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కేయూ ఎస్సై శ్రీకాంత్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం జి...

జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు

Image
జర్నలిస్టు వద్ద లంచం తీసుకొని  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ అధికారులు గూఢచారి, షాద్నగర్:   ఈదులపల్లి వద్ద నిర్మాణం పనులకు లంచం 2.50 లక్షల లక్ష్యం, లక్షన్నర చెల్లించినా అందని అనుమతులు, ఏసీబీని ఆశ్రయించిన జర్నలిస్ట్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న జిల్లా ఏసీబీ శాఖ డిఎస్పి ఆనంద్.   *షాద్ నగర్ లో సంచలనం*  సింహం పడుకుంది కదా అని దాని తలను దువ్వెనతో దువ్వాలని చూడకూడదు.. తొక్కుతున్నది తోకే కదా అని పాము జోలికి వెళ్ళకూడదు.. అలాంటిది షాద్ నగర్ లో ఒక దిన పత్రికకు పాత్రికేయుడుగా పనిచేస్తున్న వ్యక్తిని నిర్భయంగా లంచం అడిగి, కాగితాలు ఇవ్వకుండా వేధించి చివరికి ఏసీబీ అధికారులకు బుక్ అయ్యారు.. షాద్ నగర్ నియోజకవర్గంలో నందిగామలో సంచలనం ఇది. జర్నలిస్ట్ దెబ్బకు రంగంలోకి దిగిన ఎసిపి శాఖ డిఎస్పి ఆనంద్ లంచం ఆశించిన నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ ధీర్ సింగ్, వీఆర్వో చెన్నయ్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి లంచావతారాలకు తెరదించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..  *జరిగిన కథ..*  షాద్ నగర్ పరిధిలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న జర్నలిస్టు నందిగామ మండలం ఈదులపల్లి పరిధ...

ACB నెట్ లో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్

Image
ACB నెట్ లో  ఎండోమెంట్ ఇన్స్పెక్టర్  గూఢచారి, హైద్రాబాద్ 7 జనవరి :  07.01.2026న, ఎండోమెంట్ శాఖ కమిషనర్ బొగ్గులకుంట హైదరాబాద్‌లోని 2వ అంతస్తులో ఉన్న ఎండోమెంట్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, హైదరాబాద్ తెలంగాణ కార్యాలయం వద్ద నిందితుడైన అధికారి ఆకవరం కిరణ్ కుమార్, ఇన్‌స్పెక్టర్. ఎండోమెంట్ తన కార్యాలయ ప్రాంగణం పక్కన సిటీ రేంజ్-1లోని ACB సిబ్బందికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు, అంటే RC నంబర్ E/944/2021 ప్రకారం, బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి ఫిర్యాదుదారునికి సర్వే నివేదికను జారీ చేయడానికి, ఫిర్యాదుదారుని నుండి రూ. 1.50,000/- లంచం మొత్తాన్ని చెల్లించమని డిమాండ్ చేసి, లంచం మొత్తాన్ని రూ. 50,000/- చెల్లించమని అతను డిమాండ్ చేశాడు. AO వద్ద నుండి తీసుకున్న కళంకిత లంచం మొత్తం రూ. 50,000/- అతని వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తి SPE & ACB కేసుల ముందు హాజరుపరుస్తున్నారు . కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు .

అందరివాడు' కు ఆత్మీయ సన్మానం*

Image
  *'అందరివాడు' కు  ఆత్మీయ సన్మానం* -ఆర్యవైశ్య మహాసభ వేదికగా సేవా సంకల్పం -టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తికి సత్కారం ఖమ్మం, జనవరి 5 ఖమ్మం గుట్టల బజార్‌ లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవ్యాలయం ప్రాంగణంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా కార్యవర్గ సమావేశం, అధ్యక్షులు పసుమర్తి చంద్రరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సమావేశానికి జిల్లా నలుమూలల నుంచి ఆర్యవైశ్య సమాజానికి చెందిన నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావడంతో సభకు విశేష ప్రాధాన్యత లభించింది. ఐక్యతే బలమనే భావన సమావేశమంతా ప్రతిధ్వనించింది. సమావేశంలో ఇటీవల ఎన్నికైన గ్రామపంచాయతీ ఆర్యవైశ్య చైర్మన్లు, వార్డు సభ్యులు, చాంబర్ ఆఫ్ కామర్స్, జూబ్లీ క్లబ్, వివిధ దేవాలయాల పాలకవర్గాలకు ఎన్నికైన ఆర్యవైశ్య ప్రతినిధులను వేదికపై ఘనంగా సత్కరించారు. బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ప్రయోజనాలకంటే సమాజ హితానికే ప్రాధాన్యం ఇవ్వాలని, సమిష్టి కృషితోనే ఆర్యవైశ్య సమాజానికి గౌరవం పెరుగుతుందని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ వర్...

మా ఉద్యమంలో సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్

Image
  *మా ఉద్యమంలో  సమాజం కలిసి రావాలి.- టి. సంతోష్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు, టిడబ్ల్యూజేఎఫ్ *జర్నలిస్టుల నివాస హక్కు కోసం  ఖమ్మంలో టిడబ్ల్యుజెఎఫ్ మోటార్ సైకిల్ ర్యాలీ..* *జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి బర్త్ డే సందర్భంగా అన్నం సేవ ఫౌండేషన్ లో పండ్లు పంపిణీ.* ఖమ్మం | జనవరి 2 అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టుల ఇండ్ల సాధన లక్ష్యంగా సమాజం జర్నలిస్టులకు తోడుగా  కలిసి రావాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్– హెచ్ 2843) ఖమ్మం జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి  పిలుపు నిచ్చారు. శుక్రవారం టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ చక్రవర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి, అన్నం సేవా ఫౌండేషన్ లో అనాధ, అభాగ్యులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ సమాజం జర్నలిస్టులకు తోడుగా నిలబడవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం సానుభూతిగా మాత్రమే కాదని, అది సమాజ స్వీయరక్షణ కోసం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో సత్యాన్ని వెలికి తీయడం, అన్యాయాన్ని ప్రశ్నించడం, పాలకులకు బాధ్యతను గుర్తుచ...

కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి

Image
  కలెక్టర్ ను కలిసిన జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి *అర్హులైన జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలి*  సంగారెడ్డి:  ఆంగ్ల నూతన సంవత్సరాది ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి గురువారం నాడు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త సంవత్సరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం మరింత స్పూర్తివంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో జర్నలిస్టులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు జిల్లా యంత్రాంగానికి సంపూర్ణంగా సహకరిస్తున్నామని అందువల్ల జిల్లా యంత్రాంగం కూడా జర్నలిస్టుల పట్ల అదేవిధంగా సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల కొత్త అక్రిడిటేషన్ పాలసీ వచ్చిందని దానిలో కూడా అనేక మార్పులు చేయాల్సిందిగా తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైసల్.  ఆధ్వర్య...

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం

Image
   అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని  ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ కి హామీ ఇచ్చిన సీఎం గూఢచారి, హైదరాబాద్ జనవరి 1:     ప్రస్తతం జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల అనంతరం ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ద్రుష్టి పెడతానని హామీ ఇచ్చినట్లు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ ఆక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ , సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి <A . రేవంత్ రెడ్డి గారిని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపడానికి కల్సిన సందర్భలో ,ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి TGEJAC నాయకత్వం తీసుకురాగా అయన సానుకూలంగా స్పందించారు.       ఈ సంధర్భంగా తెలంగాణ గజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన బి. శ్యామ్ ను ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల నేతలు పరిచయం చేయగా ఆయనను అభినందించడం జరిగింది . అలాగే పదవి విరమణ చేసిన ప్రధాన కార్యదర్శి A . సత్యనారాయణను ముఖ్యమంత్రి శాలువ తో సత్కరించి ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమములో పాల్గొన్నవా...