ప్రియాంక రెడ్డి అనే డాక్టర్ పై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడి సజీవ దహనం చేసిన సంఘటన నీ నిరసిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమని, సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించిన నిందితులను కఠినంగా శిక్షించడం తో పాటు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.కార్యక్రమం లో బార్ అసోసియేషన్ కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్,ఉపాధ్యక్షులు గంపా వెంకటేశం , దేవేందర్, మాజీ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజి రెడ్డి , కొండారెడ్డి ,న్యాయవాదులు హనీఫ్ ఖాన్ , రాజకుమార్ , అమర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment