Skip to main content

ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌


 ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేం: మంత్రి కేటీఆర్‌ 

 

హైదరాబాద్‌: రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచాను.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు.


స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో పత్రికలు కీలకపాత్ర పోషించాయని కేటీఆర్‌ అన్నారు. షోయబ్‌ ఉల్లా ఖాన్‌ తెలంగాణ జర్నలిస్టులకు ఒక స్ఫూర్తి అని, గోలకొండ పత్రికతో సురవరం పోషించిన పాత్ర మరువలేనిదని చెప్పారు. పత్రికా యాజమాన్యం కంటే తెలంగాణ జర్నలిస్టుల పోరాట స్ఫూర్తి ఎక్కువని చెప్పారు. ఉద్యమ రోజుల్లో పత్రికా యాజమాన్యాలు తెలంగాణకు, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉండేవని గుర్తుచేశారు. జర్నలిజం ముసుగులో ఇప్పటికీ వ్యక్తిగత దూషణలు, బూతులు తిడుతున్నారని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి రాసిన పత్రికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మంత్రి వెల్లడించారు.


టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచింది జర్నలిస్టులే..

యాజమాన్యాలు ఎలా ఉన్న టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడింది తెలంగాణ జర్నలిస్టులేనని చెప్పారు. స్టింగర్ల నుంచి డెస్క్‌ వరకు తమకు సపోర్టుగా నిలబడటంతోనే తెలంగాణ సాధించగలిగామన్నారు. తెలంగాణ జర్నలిస్టులు ఢిల్లీదాక వచ్చి తెలంగాణ కోసం కొట్లాడారని గుర్తుచేశారు. జర్నలిస్టుల ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్‌ ఏనాడు తగ్గించలేదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. 19 వేల అక్రిడేషన్‌ కార్డులున్న జర్నలిస్టులు రాష్ట్రంలో ఉన్నారన్నారు.


మున్సిపల్‌ శాఖ థాంక్‌ లెస్‌ జాబ్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 22 వేల మంది పారిశుధ్య సిబ్బంది రెక్కలు ముక్కలు చేసుకున్నా చిన్న అభినందన రాదని వ్యాఖ్యానించారు. రెండు కాలనీల్లోకి నీళ్లు రాగానే హైదరాబాద్‌ నీట మునిగిందని రాస్తారని విమర్శించారు. అతిశయోక్తి అలంకారం గురించి తనకు తెలుసని, దాన్ని ఎంతలా వాడుకోవాలో అంతే వాడాలని సూచించారు.


మన మన్‌ కీ బాత్‌ మోదీ వింటారా?

పత్రికలు చదవకుంటే ఏమీ తెలియదు.. చదివితే ఏది నిజమో తెలియదన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందన్నారు. భారత ప్రధాని చేసిన ఒత్తిడి వల్ల అదానీకి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంక చెప్పిందన్నారు. అదానీకి ఇచ్చిన ప్రాజెక్టుపై ఏ ఒక్క మీడియా అయినా అక్కడికి వెళ్లి నిజానిజాలు నిగ్గుతేల్చిందా అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్లుగా మోదీ మన్‌ కీ బాత్‌ మనం వినాల్సిందే.. ఆయన మన మన్‌ కీ బాత్‌ వింటారా అని ఆగ్రహంవ్యక్తంచేశారు. నచ్చని జర్నలిస్టులకు చంపేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు.


ఇవేవీ వార్తలు కాదా?

9 బిలియన్‌ డోసుల కరోనా వ్యాక్సిన్లను హైదరాబాద్‌ ఉత్పత్తి చేసిందని, కరోనా వ్యాక్సిన్ల గురించి మన మీడియా ఎందుకు హైలెట్‌ చేయలేదని వాపోయారు. జో బైడెన్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ క్యాబిన్‌ కూడా హైదరాబాద్‌లోనే తయారయిందన్నారు. మిషన్‌ కాకతీయ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడంలేదన్నారు. చెరువు కట్టలు తెగితే వార్తకానీ.. బలంగా ఉంటే వార్త కాదా అని ప్రశ్నించారు. భూగర్భ జలాలు లేకుంటే వార్త కానీ, భూగర్భ జలాలు పెరిగితే ప్రచురణార్హం కాదా అని వ్యాఖ్యానించారు.


‘పాలు, మాంసం, చేపల ఉత్పత్తుల్లో రికార్డులు సృష్టించాం. ఐదు రకాల విప్లవాలతో తెలంగాణ గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ సమతుల్యమైన అభివృద్ధి సాధిస్తున్నది. పల్లె ప్రగతి, పట్టణప్రగతి, అభివృద్ధి, సంక్షేమం ఇవేవీ వార్తలు కాదా?.. హైదరాబాద్‌లో 7 శాతానికి పైగా గ్రీన్‌ కవరేజ్‌ పెరిగింది.. దీనికి పతాక శీర్షిక ఉండదా?. ఏ మీడియాలో అయినా పాజిటివ్‌ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతున్నది. సోషల్‌ మీడియానా లేదా యాంటీ సోషల్‌ మీడియానా అర్థం కావడంలేదు’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్