వైస్ చైర్మన్గా దొంతం ఇంద్రసేనారెడ్డి, సభ్యులుగా కందికొండ జానయ్య, చింతకింది శంకరయ్య, ఇస్లావత్ హనుమంతు, దేప అమృతా రెడ్డి, సయ్యద్ ఎజాజ్, పనాస శ్రీనివాస్, రొయ్య సైదులు, మల్లెబోయిన బుచ్చిరాజు, కోండ్ర స్వరూప, గడగోజు సత్యనారాయణ, ఎలిశాల వెంకటేశం, గుండా రమేష్ బాబులను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్! నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.
Comments
Post a Comment