Skip to main content

నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి - బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్*-



*బిఆర్ఎస్, కాంగ్రెస్ లో బీసీలకు రాజకీయంగా తీరని అన్యాయం*

 

*నల్గొండలో బిజెపి బీసీ అభ్యర్థి మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించాలి.


*బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్*


*నల్గొండ నవంబర్ 25*


*గత 70లుగా బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ లో బీసీలకు సీట్ల కేటాయింపులో తీరని అన్యాయం జరిగిందని బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అన్నారు.*


 *శనివారం నల్గొండలోని బీసీ సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జాతీయస్థాయిలో ఓబిసి కమిషన్ పెట్టి బీసీలకు పెద్దపీట వేశారని, ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీ బిల్లు కోసం చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా గత మూడు నెలల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డతోపాటు బిజెపి అగ్ర నేతలను కలిసి R. కృష్ణయ్య బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరడంతో ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తానని స్వయంగా బిజెపి అగ్రనేతలు ప్రకటించడం హర్షనీయమన్నారు. అందుకోసం నల్గొండ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి అయిన మాధగోని శ్రీనివాస్ గౌడ్ ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బిజెపిలో ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగితే గతకుండేలుగా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించడంతోపాటు ఆదుకుంటున్న నేత మాధగోని శ్రీనివాస్ గౌడ్ అని, కలెక్టరేట్ ముట్టడిలో పోలీసుల నిర్బంధాన్ని తట్టుకొని నమ్ముకున్న వారి కోసం పోరాటం చేసి జైలుకెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రజల గుండెచప్పుడుగా నిలుస్తున్న మాధగోనిని ఆదరించాలని బీసీ సీఎం ఉంటేనే పార్లమెంటులో బీసీల సమస్యలపై కొట్లాడే పరిస్థితి ఉంటుందని వివరించారు. బిజెపిలో బీసీ సీఎంగా ఈటెల రాజేందర్ అయినా బండి సంజయ్ అయినా మరెవరైనా బీసీ అయితే బీసీ బిల్లు పార్లమెంటులో పాస్ చేయించేందుకు పోరాటం సులభం అవుతుందన్నారు. 70 ఏళ్ల చరిత్రలో బీసీని సీఎం చేస్తానని ఏ పార్టీ చెప్పలేదని ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే అధికంగా బీసీలకు బిజెపి అధిక సీట్లు కేటాయించిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో దళితుడిని సీఎం అని మాట తప్పిన కేసీఆర్ తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. గ్రూప్స్ నిర్వహణ, డీఎస్సీ ఇతర పరీక్షలను నిర్వహించడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, నీళ్లు, నిధులు, నియామకాల లో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా నిర్వీర్యమయ్యాయని, బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక యువత నిర్వీర్యం అవుతుందని, టిఆర్ఎస్ ను బొంద పెట్టాల్సిన బాధ్యత బీసీలంతా తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిజెపి బలపరిచిన బీసీ అభ్యర్థులను గెలిపించాలని, బీసీ వాదంతో ముందుకెళ్తున్న బీసీ వాదులను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు బీసీలను మోసం చేస్తూ వస్తున్నాయని, బీసీలంతా గమనించి రాజ్యాధికారం కోసం బిజెపి బీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.నల్గొండలో మాదగోని శ్రీనివాస్ గౌడ్ ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అన్ని కోరడం జరిగింది.*


   *ఈ సమావేశంలో బీసీ నాయకులు ఏరుకొండ హరి, ఖమ్మంపాటి శంకర్ దుర్గ, లోకేష్, సతీష్ కుమార్, జయేందర్, మోదాల శ్రీనివాస్ యాదవ్, వల్ల కీర్తి శ్రీనివాస్, శివ ముదిరాజ్ బిట్టు తదితరులు పాల్గొన్నారు.*

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్