రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


 *రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు  తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి*


“చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండగ” అని ప్రజలకు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో పదేండ్ల చీకటిని పారద్రోలి ప్రజలు వెలుగుల రేఖలను సృష్టించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రజాపాలనపై విషం చిమ్ముతున్న అజ్ఞానులకు.. జ్ఞానదీపం వెలగేలా లక్ష్మీదేవి ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మంత్రి కోరుకున్నారు. 

ఈ దీపావళి పండగ ప్రజల జీవితాల్లో వెలుగురేఖలను ఇనుమడింపచేయాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు. చిన్నారులు టపాసులు కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకొని వెలుగుల పండగను సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం