తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు


తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 
 ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు



 హైద్రాబాద్, గూఢచారి: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఉద్యోగుల సంఘం 2 జూన్ 2025న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీజీపీసీబీ ప్రధాన కార్యాలయం సనత్నగర్లో సభ్య కార్యదర్శి జి రవి జాతీయ జెండాను ఎగురవేసి సిబ్బందికి, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. . ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది యువకులు చేసిన పోరాటంలో త్యాగం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని అన్నారు.



2014లో ప్రారంభించినప్పటి నుండి, టీజీపీసీబీ పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు.బోర్డులోని ఉద్యోగులందరూ పర్యావరణ పరిరక్షణకు గణనీయమైన సహకారాన్ని అందించారు అని కొనియాడారు. టీజీపీసీబీ పర్యావరణ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి అనేక అవగాహన ప్రచారాలను చేపట్టింది అని తెలియజేసారు. కలిసికట్టుగా మనం సుస్థిరమైన , కాలుష్య రహిత రాష్ట్రాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు.


పిసిబి లో ప్రత్యేకంగా కొలువు దీరిన అమ్మవారు మండపంలో ఉద్యోగులు మరియు సిబ్బంది అధిక సంఖ్యలో హాజరై పూజ కార్యక్రమంలో పాల్గోని ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు.

                

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్