Posts

Showing posts from May, 2026

రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి!

Image
  రాజకీయం కాదు: వ్యవస్థల మీద నమ్మకం ఉంచండి! ​ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, ప్రజాస్వామ్యంలో విలువలు ఎంత వేగంగా పతనమవుతున్నాయో అర్థమవుతోంది. కేవలం రాజకీయ వ్యతిరేకతను ప్రదర్శించడానికి కొందరు వామపక్ష భావజాలం ఉన్నవారు మరియు ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని అత్యంత తక్కువ స్థాయికి (చిల్లర రాజకీయాలు) దిగజార్చడం శోచనీయం. వారి చర్యలు సమస్యను పరిష్కరించకపోగా, వారి సొంత విలువలను వారే పోగొట్టుకునేలా చేస్తున్నాయి. ​ రాజకీయ కోణం.. పిల్లలకు అన్యాయం ​ఒకరిని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే విధానపరంగా పోరాడాలి. కానీ, ఇద్దరు పిల్లల జీవితాలను, వారి స్నేహాన్ని లేదా వ్యక్తిగత విషయాలను రచ్చకీడ్చి వారి భవిష్యత్తును అంధకారం చేయడం ఏ రకమైన రాజకీయం? తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో కేసు పెట్టారో, వారి మధ్య ఉన్న అసలు విషయం ఏమిటో విచారణలో తేలకముందే సోషల్ మీడియాలో తీర్పులు ఇవ్వడం విచారకరం. ​ ముఖ్యమంత్రి నిర్ణయం - 'సిట్' (SIT) ఏర్పాటు ​ఈ కేసులో ఉన్న సున్నితత్వాన్ని మరియు ప్రాముఖ్యతను గుర్తించిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో పారదర్...

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు!

Image
 దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇంధన ధరల పెంపు: 'ఆత్మనిర్భర భారత్' దిశగా మోదీ సర్కార్ అడుగులు! న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల పెరుగుదల మరియు గ్లోబల్ సప్లై చైన్ సమస్యల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను ₹3, సిఎన్జీ ధరను ₹2 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇది తక్షణ భారంగా అనిపించినా, విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వయంసమృద్ధి సాధించే దిశగా మోదీ ప్రభుత్వం చేస్తున్న భారీ ప్రణాళికలో ఇది ఒక భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకు ఈ నిర్ణయం? - వాస్తవాలు ఇవే: అంతర్జాతీయ అనిశ్చితి: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చమురు సంస్థలు నష్టాల్లోకి వెళ్లకుండా కాపాడటం దేశ ఆర్థిక భద్రతకు అత్యవసరం. కోల్ గ్యాసిఫికేషన్ (Coal Gasification) - మోదీ మాస్టర్ ప్లాన్: విదేశీ చమురు మరియు సహజ వాయువు దిగుమతులను తగ్గించేందుకు ప్రధాని మోదీ 'నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్' ను ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. భారతదేశంలో అపారంగా ఉన్న బొ...

ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ

Image
ఏసీబీకి చిక్కిన ‘అవినీతి’ రాంబాబు: రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఆర్‌ఐ వరంగల్ (గూఢచారి ప్రతినిధి): వరంగల్ జిల్లా దుగ్గొండి మండల తహసీల్దార్ కార్యాలయంలో గురువారం భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. పూర్వీకుల ఆస్తి మ్యుటేషన్ కోసం ఒక సామాన్యుడిని వేధించి, లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) గట్టికొప్పుల రాంబాబును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   అసలేం జరిగిందంటే? దుగ్గొండి మండలానికి చెందిన ఒక వ్యక్తి తన పూర్వీకుల ఆస్తికి సంబంధించి మ్యుటేషన్ ప్రక్రియ కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే, ఈ ఫైల్‌ను ముందుకు కదిలించడానికి, ఫీల్డ్ ఎంక్వయిరీ నిర్వహించి సానుకూల నివేదిక సమర్పించడానికి ఆర్‌ఐ రాంబాబు రూ. 10,000 లంచం డిమాండ్ చేశారు. అధికారి వేధింపులు భరించలేక సదరు బాధితుడు వరంగల్ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.   మెరుపు దాడి.. పక్కా స్కెచ్ బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పక్కా ప్రణాళికతో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిఘా పెట్టారు. బాధితుడి నుంచి రాంబాబు రూ. 10,000 లంచం తీసుకుం...

అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా!

Image
  అరే పొరగాల్లా రా… జర భద్రంగా ఉండండ్రా! ఇప్పటి కాలం “ఫ్రెండ్‌షిప్” అన్న మాటతో మొదలై… “కేసు” దగ్గర ముగిసే పరిస్థితులు వస్తున్నయ్‌. ఒక్క చిన్న తప్పు… ఒక్క అజాగ్రత్త… ఒక్క అర్ధం కాని రిలేషన్… జీవితాంతం మచ్చగా మారుతోంది. ముఖ్యంగా ఇప్పుడు బయట పడుతున్న కొన్ని కేసులు చూసాక తెలంగాణ పొరగాల్లు గుబులు పడుతున్నరు. ఎవరు నిజం… ఎవరు తప్పు… అది కోర్టులు తేల్చాల్సిన విషయం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ — అవగాహన లేకుండా అడుగు వేస్తే… లైఫ్ మొత్తం జైలు గోడల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తది. “ఏజ్” అనేది చిన్న విషయం కాదు రా! “ఆమె ఒప్పుకుంది…” “మేము ప్రేమించుకున్నాం…” “ఇద్దరం కలిసి తిరిగాం…” అన్న మాటలు చట్టం ముందు చాలాసార్లు పనికిరావు. ముఖ్యంగా మైనర్ విషయంలో అయితే చట్టం చాలా కఠినంగా ఉంటది. పొరగాల్లు “ఫన్”, “లవ్”, “టైమ్‌పాస్” అనుకుని తిరిగేది… తర్వాత పెద్ద కేసులుగా మారుతున్నయ్‌. సోషల్ మీడియా ఫ్రెండ్‌షిప్‌లు – ప్రమాదకర మలుపులు ఇన్‌స్టాగ్రామ్‌లో రిక్వెస్ట్… వాట్సాప్‌లో చాట్… బైక్‌పై షికార్లు… రాత్రి వీడియో కాల్స్… ఇవి ఇప్పుడు చాలామందికి కామన్ అయిపోయినయ్‌. కానీ ఎవరి వయసెంత? ఎవరి ఉద్దేశ్యం ఏంటి? తర్వాత ఏం జరుగు...

మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం

Image
  బండి భగీరథ్ వ్యవహారం: స్నేహం నుంచి కేసుల వరకు… అసలు నిజాలు వెలుగులోకి రావాల్సిందే మీడియా ట్రయల్ కంటే న్యాయ విచారణే ముఖ్యం హైదరాబాద్:  కేంద్ర సహాయ మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Bandi Sai Bhagirath పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు, మీడియా మరియు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే కేసు చుట్టూ బయటకు వస్తున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రజల్లో అనేక సందేహాలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం బయటకు వస్తున్న సమాచారం ప్రకారం, భగీరథ్ మరియు ఫిర్యాదు చేసిన యువతి మధ్య పరిచయం ఒక్కరోజులో ఏర్పడినది కాదని తెలుస్తోంది. ఇద్దరూ స్నేహితులుగా తిరిగిన సందర్భాలు ఉన్నాయని, కుటుంబ సభ్యులకు కూడా పరిచయం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇరువురి కుటుంబాల మధ్య కూడా సాన్నిహిత్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బండి భగీరథ్‌ను కేసు పెట్టిన యువతి ఇంటికి రానివ్వడం, కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవేళ ఇవన్నీ నిజమైతే, తరువాత అకస్మాత్తుగా తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదు కా...

బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ!

Image
  బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? జిహెచ్‌ఎంసి ప్లానింగ్ సెక్షన్‌లో 'సమాచార' సంకటంలో ఆర్టిఐ! హైదరాబాద్: సామాన్యుడికి ఆయుధంగా మారాల్సిన సమాచార హక్కు చట్టం (RTI), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ప్లానింగ్ విభాగంలో మాత్రం పక్కదారి పడుతోంది. పారదర్శకతకు నిలువుటద్దంలా ఉండాల్సిన అధికారులు, అడిగిన ప్రశ్నలకు నిర్లక్ష్యపు సమాధానాలిస్తూ కాలయాపన చేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఎక్కడ? అంటే... కింద ఎక్కడో ఉందో? ప్లానింగ్ సెక్షన్‌లో సమాచార హక్కు చట్టానికి సంబంధించిన వివరాల బోర్డు (RTI Disclosure Board) ఎక్కడ ఉందో తెలపాలని ఒక అర్జీదారుడు కోరగా, దానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (PIO) ఇచ్చిన సమాధానం విస్తుగొలుపుతోంది. "ఎక్కడో కింద ఎక్కడో ఉంది" అంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా, వెటకారంగా సమాధానం ఇచ్చారని బాధితుడు వాపోతున్నాడు. చట్ట ప్రకారం కార్యాలయంలో స్పష్టంగా కనిపించాల్సిన బోర్డుల గురించే స్పష్టత లేకపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఫైళ్ల కదలికలో 'నత్తనడక' అర్జీదారుడి ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 29న దరఖాస్తు చేయగా, అది ఏప్రిల్ 30...

చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం

Image
  *చిట్యాల చెక్‌పోస్టు వద్ద 60 గోవుల అక్రమ రవాణా భగ్నం*   *కబేళాకు తరలిస్తుండగా పోలీసుల మెరుపు దాడి*   *లారీ డ్రైవర్ అదుపులో: ముఠా కోణంలో దర్యాప్తు* *నల్లగొండ, గూఢచారి:* జిల్లాలోని చిట్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ గో అక్రమ రవాణాను భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌లోని కబేళాకు తరలిస్తున్న సుమారు 60 గోవులను పోలీసులు పట్టుకున్నారు. లారీలో కిక్కిరిసిన స్థితిలో గోవులను అత్యంత అమానవీయంగా తరలిస్తుండగా, చెక్‌పోస్టు వద్ద అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. లారీలో ఊపిరాడని స్థితిలో ఉన్న 60 గోవులను గుర్తించి డ్రైవర్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గోవుల రవాణాకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులు కీలక వివరాలపై డ్రైవర్‌ను గట్టిగా విచారిస్తున్నారు. ఈ అక్రమ రవాణా వెనుక ఏదైనా ముఠా హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గోవులను సురక్షితంగా చింతపల్లి గోశాలకు తరలించి, వాటికి పశువైద్యులతో చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చిట...

జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్

Image
 *జీవో నెం.17 రద్దు చేయాలి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్ల డిమాండ్*   *చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి*   *కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా & నిరసన* *కరీంనగర్, గూఢచారి:* రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 17ను వెంటనే రద్దు చేసి, చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి కొంకటి శేఖర్, అక్కనపల్లి శిరీష, మేకల రవీందర్, జన్ను స్వరూప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.17ను తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని విద్యా సంస్థలలో అవకాశం లేకుండా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. *గుజరాత్ కంపెనీకి కట్టబెడుతున్నారు*   "ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందవలసిన వాటాను వాళ్లకు కేటాయించకుండా గుజరాత్ రాష్ట్రంలోని మఫ్ఫత్‌లాల్ ...

*తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*

Image
  *తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు*   *ఈ నెల 18 నుంచి 22 వరకు తీవ్ర వడగాలులు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*   *వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం: వాతావరణ శాఖ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడు భగభగలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నిన్న నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది వేడి నుంచి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. *47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు*   ముఖ్యంగా ఈ నెల 18 నుంచి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరక...

*"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’* *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?* *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్*

Image
 *"ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్" - అడ్మినిస్ట్రేషన్ ‘వండర్’*   *అధికారి ఆవేదన: తప్పు చేయకున్నా శిక్షేనా?*   *న్యాయం కోసం కోర్టుకెళ్తానంటున్న డిప్యూటీ తహసీల్దార్* గూఢచారి:* "ఫస్ట్ మెమో.. నెక్స్ట్ సరెండర్.. ఇదే అడ్మినిస్ట్రేషన్ వండర్" అంటూ ఓ ప్రభుత్వ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేయకపోయినా, వివరణ ఇచ్చినా సరెండర్ చేయడమేంటని  నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ ప్రశ్నిస్తున్నారు. *అసలేం జరిగింది?*   డీటీగా విధులు నిర్వహిస్తున్న రఘునందన్‌కు ఒకరోజు ఉన్నతాధికారి నుంచి పిలుపు వచ్చింది. "ఏమయ్యా.. నీ ఫోన్ ఎందుకు బంద్ ఉంది? ఫోన్ లేప్తలేడు, ఫీల్డ్‌లో లేడు అని ఆ మేడం నీపై ఫిర్యాదు చేసింది. ప్యాడీ సెంటర్లకు పోవడం లేదని కంప్లైంట్ ఇచ్చింది. వెళ్లి సారీ చెప్పి, అటెండెన్స్ సర్టిఫికెట్ తెచ్చుకో. లేకపోతే ఈ నెల జీతం ఆగుతది" అని హెచ్చరించారు. దానికి రఘునందన్ "సార్.. నా ఫోన్ డ్యామేజ్ అయ్యింది. రిపేర్‌కు ఇచ్చాను. నేను నౌకరీ చేసేది ఇక్కడ. అక్కడి నుంచి అటెండెన్స్ ఎట్లా తేవాలి?" అని ప్రశ్నించగా, "ఏయ్.. ఎక్కువ మాట్లా...

*తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*

Image
 *తెలంగాణ అభివృద్ధికి కేంద్రం బాసట: రూ.9,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం*   *హైటెక్స్‌లో ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్*   *రాష్ట్ర ప్రగతికి డబుల్ ఇంజన్ సర్కార్ హామీ* *హైదరాబాద్, గూఢచారి:* తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. భాగ్యనగరంలోని హైటెక్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సుమారు రూ.9,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎం వెండి నంది విగ్రహాన్ని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శ్రీరాముడి ప్రతిమను ప్రధానికి బహూకరించారు. *ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవే*   తెలంగాణలో మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి, రవాణా, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టేలా ప్రధాని పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. 1. రూ.3,180 కోట్లతో చేపట్టే రహదారి ప...

*అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?*

Image
  *అంగన్‌వాడీల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల సప్లైలో భారీ కుంభకోణం?* *హైస్పీడ్ ఫ్యాన్ల టెండర్‌లో 10 లక్షల కుంభకోణం బట్టబయలు*  *నాసిరకం సామాను సరఫరా: సప్లయర్, అధికారులపై వేటుకు డిమాండ్* *  *20 లక్షల టెండర్‌లో 10 లక్షలు స్వాహా? *సప్లయర్, అధికారులపై విచారణకు డిమాండ్* *నల్గొండ, గూఢచారి:* చిన్నారులకు ఎండ తాపం తగలకూడదని జిల్లా కలెక్టర్ తలపెట్టిన పుణ్యకార్యంలో దోపిడీ దొంగలు పడ్డారు. డిపార్ట్‌మెంట్ నుంచి బడ్జెట్ రాకున్నా, మినరల్ ఫండ్స్ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మంచి మనసుతో నిర్ణయించానట్లు తెలిసింది.  క్రాంప్టన్ HS Plus  హై స్పీడ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 20 వాట్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ 4 ఫీట్ల ట్యూబ్‌లైట్లకు టెండర్ పిలిచి ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. అసలు  కుంభకోణం జరిగింది మాత్రం సప్లైలోనే.  టెండర్‌లో పేర్కొన్న క్రాంప్టన్ HS Plus హై స్పీడ్ ఫ్యాన్లకు బదులు నాసిరకం నార్మల్ సీవిండ్ ఫ్యాన్లు, ఫిలిప్స్ 3 ఇన్ వన్ ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లకు బదులు నార్మల్ ఫిలిప్స్, కొన్నిచోట్ల క్రాంప్టన్ నార్మల్ ట్యూబ్‌లైట...

*CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*

Image
  *CURE ప్రాంతానికి కొత్త ఊపిరి: హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తాం - సీఎం రేవంత్*   *భవిష్యత్ తరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధ అభివృద్ధి*   *పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సీఎం వెల్లడి* *హైదరాబాద్, గూఢచారి:* ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సవివరంగా ఆవిష్కరించారు. *ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ లక్ష్యం*   పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉ...

*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*

Image
*ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది*   *పేదింటి ముగ్గురు ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీరెలు పంపిణీ*   *కులాలకు అతీతంగా ఉప్పల దంపతుల సేవలు* *నాగోల్, గూఢచారి:* సమాజ సేవలో తనదైన ముద్ర వేసుకుంటున్న ఉప్పల ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుకుంది. నాగోల్‌లోని ఉప్పల క్యాంపు కార్యాలయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, ఐవీఎఫ్ ప్రథమ మహిళ ఉప్పల స్వప్న దంపతులు ముగ్గురు పేదింటి ఆడపిల్లల వివాహాలకు పుస్తెమెట్టెలు, చీర, గాజులు అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కులమతాలకు అతీతంగా సాయం అందిస్తున్న ఉప్పల దంపతులు ఈసారి ముదిరాజ్, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన మూడు కుటుంబాలకు అండగా నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం సిరసముందర్‌కు చెందిన నీరడి సాత్విక, షామీర్‌పేటకు చెందిన రాపాని లలిత, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన ఎడ్ల శివాని వివాహాలకు కావాల్సిన మంగళసూత్రాలు, నూతన వస్త్రాలను అందించారు. శివాని తండ్రి పక్షవాతంతో మంచాన పడగా, తల్లి కూలీ పనులతో కుటుంబాన్ని పోషిస్తున్న దీనస...

*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*

Image
*ఐవీఎఫ్ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు జన్మదిన శుభాకాంక్షలు* - కోటగిరి దైవాధీనం*  *హైదరాబాద్:* ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) కేంద్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన వేడుకలను ఐవీఎఫ్ నాయకులు ఘనంగా నిర్వహించారని ఐవీఎఫ్ తెలంగాణ మీడియా కమిటీ చైర్మన్ కోటగిరి దైవాధీనం  తెలిపారు. మే 5వ తేదీన శ్రీనివాస్ గుప్తా పుట్టినరోజు కాగా, ఆ రోజు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది, గత రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారని  పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఐవీఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రేపాల భద్రాద్రి ఆధ్వర్యంలో జిల్లా కోశాధికారి గోవిందు బాలరాజుతో కలిసి హైదరాబాద్‌లో శ్రీనివాస్ గుప్తాను కలిసి కేక్ కటింగ్ చేసి, శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ రాష్ట్ర కోశాధికారి నారాయణ, యువజన విభాగం కోశాధికారి నరేష్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు తూముకుంట నర్సిరెడ్డి, ఐవీఎఫ్ నాయకులు...

*మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*

Image
 *మోదీ సభను విజయవంతం చేయండి - బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపు*   *మే 10న పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ*   *రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు* *హైదరాబాద్:* తెలంగాణ అభివృద్ధి రథసారథి, ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేవైఎం నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఐతరాజు సిద్దు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తూ రూ. 7,823 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు వస్తున్న ప్రధానికి ఘన స్వాగతం పలకాలని కోరారు.  తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా కాజీపేట-విజయవాడ మూడవ రైల్వే లైన్, మహబూబ్‌నగర్ ప్రాంతంలో రూ. 3,175 కోట్ల నేషనల్ హైవే పనులు, మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రగతి కానుకలను ప్రధాని మోదీ మోసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం రూ. 12 లక్షల కోట్లు కేటాయించిందని, సుమారు 3.40 క...

*భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*

Image
   *భారత ఏరోస్పేస్, రక్షణ రాజధానిగా హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి*   *హైదరాబాద్‌లో 30% వార్షిక వృద్ధి - ఎగుమతుల్లో 103% సీఏజీఆర్*   *2030 నాటికి రూ.3 లక్షల కోట్ల ఉత్పత్తి లక్ష్యం* *హైదరాబాద్:* భారత రక్షణ రంగంలో హైదరాబాద్ దేశానికి 'నరాల కేంద్రం'గా ఎదిగిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో ఏరోస్పేస్, రక్షణ రంగం ఏటా 30% పైగా వృద్ధి నమోదు చేస్తోందని, 2024 నుంచి 2026 మధ్య ఎగుమతులు ఏకంగా 103% సీఏజీఆర్‌తో దూసుకుపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని ఏరోస్పేస్, రక్షణ సరఫరా వ్యవస్థలో ఇప్పటికే 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు క్రియాశీలంగా ఉన్నాయని వెల్లడించారు. ఎంఎస్ఎంఈ స్పార్క్ 3.0 సదస్సులో కీలకోపన్యాసం చేసిన మంత్రి, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు స్థాయి నుంచి 100కు పైగా దేశాలకు రక్షణ పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని గుర్తుచేశారు. ఈ వృద్ధికి కాంగ్రెస్ పాలన తొలి సంవత్సరాల నుంచే రక్షణ వ్యవస్థ అభివృద్ధిపై పెట్టిన ప్రత్యేక దృష్టే కారణమని అన్నారు. వరుస ప్రభుత్వాల కృషి వల్ల దేశ రక్షణ అవసరాల్...

*రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*

Image
   *రిటైర్డ్ డీజీపీ ఇంట్లో భార్య దారుణ హత్య - నేపాలి గ్యాంగ్ పనేనన్న సీపీ సజ్జనార్*   *హైదరాబాద్:* రిటైర్డ్ డీజీపీ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన భార్య తనూజ గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాథమికంగా ఇది నేపాలి గ్యాంగ్ పనిగా అంచనా వేస్తున్నామని, కొన్ని కీలక క్లూస్ లభించాయని, వాటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేని సమయంలో దుండగులు వెనుక గేట్ నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, పిల్లలు ఇద్దరూ పై అంతస్తులో ఉన్నారు. దుండగులు ఆమె చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసి, అనంతరం వెనుక మార్గం గుండానే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పనిచేసే కల్పన అనే మహిళ బయటి వ్యక్తులతో కాంటాక్ట్ పెట్టుకొని ఈ నేరానికి సహకరించినట్లు సీపీ వెల్లడించారు. మాజీ డీజీపీ తన తల్లి అనారోగ్యం కారణంగా ఇటీవల హైదరాబాద్ వచ్చారు. ఆమె మరణించడంతో మృతురాలు తనూజ అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఎంత బంగారం, నగదు చ...

ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం

Image
 ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా కౌటికే విఠల్ నియామకం హైద్రాబాద్, గూఢచారి డెస్క్:  ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా ప్రముఖ చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారు, సేవా కార్యక్రమాల నిర్వాహకుడు కౌటికే విఠల్‌ను సంస్థ గ్లోబల్ చైర్మన్ టీ.జీ. వెంకటేష్ ప్రత్యేక సమావేశంలో నియమించారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాట్లాడిన టీ.జీ. వెంకటేష్, కౌటికే విఠల్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతదేశంలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని తెలిపారు. తమ పాలసీదారుల జన్మదినోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వెయ్యిమందికి ఉచిత అన్నదానం నిర్వహించడం, చలికాలంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం, ఎండాకాలంలో వేలాది మందికి ఉచితంగా నీటి బాటిళ్లు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో విశేష గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజపట్ల అంకితభావాన్ని గుర్తించి ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. అనంతరం కౌటికే...

*"మిర్యాలగూడ మున్సిపల్‌లో ఏసీబీ పంజా - అవినీతి గుట్టు రట్టు!"*

Image
 *"మిర్యాలగూడ మున్సిపల్‌లో ఏసీబీ పంజా - అవినీతి గుట్టు రట్టు!"*   *డీఎస్పీ జగదీష్ చందర్ సారథ్యంలో మెరుపు దాడులు - రికార్డులు సీజ్*   *భవన అనుమతులు, పన్నుల వసూళ్లలో 'కమీషన్ల కుంభకోణం'?*   *ఉద్యోగుల్లో వణుకు - మధ్యవర్తుల్లో పరుగులు* *మిర్యాలగూడ:* అభివృద్ధి పేరుతో అందినకాడికి దండుకుంటున్న మున్సిపల్ అవినీతిపై ఏసీబీ కొరడా ఝళిపించింది. గురువారం ఉదయం మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో మెరుపు దాడులు నిర్వహించారు. అధికారుల ఆకస్మిక ఎంట్రీతో కార్యాలయంలో కలకలం రేగింది. *ఎందుకు దాడులు?*   భవన నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు, అభివృద్ధి పనుల బిల్లులు, కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా అవినీతి జరుగుతోందనే పక్కా సమాచారంతో ఏసీబీ రంగంలోకి దిగింది. 'అనుమతి కావాలంటే చేతులు తడపాల్సిందే' అనే స్థాయికి మున్సిపల్ వ్యవస్థ దిగజారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. *గంటల తరబడి తనిఖీలు - రికార్డుల గాలం*   ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ బృందం వివిధ విభాగాల్లో కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించింది. కొంతమంది ఉద్యోగులను పక్కకు తీసు...

*పర్యావరణ రక్షణకు 'గ్రీన్ సెల్యూట్' - టీజీపీసీబీ ఉత్తమ అవార్డులు ప్రకటన*

Image
*పర్యావరణ రక్షణకు 'గ్రీన్ సెల్యూట్' - టీజీపీసీబీ ఉత్తమ అవార్డులు ప్రకటన*   *జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున అవార్డుల ప్రదానం*   *9 కేటగిరీల్లో విజేతలకు సత్కారం - పాఠశాలల నుంచి పరిశ్రమల వరకు*  *"గూఢచారి" గ్రీన్ డెస్క్*   *హైదరాబాద్:* పరిశుభ్రమైన, పచ్చని తెలంగాణ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న సంస్థలకు, వ్యక్తులకు 'గ్రీన్ సెల్యూట్' చెప్పేందుకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) సిద్ధమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'రాష్ట్ర ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డులు-2026'ను ప్రకటించింది. *ఎవరెవరికి అవార్డులు?*   పర్యావరణ పరిరక్షణ, సుస్థిరత కోసం విశేష కృషి చేసిన వారిని గుర్తించి గౌరవించడమే ఈ అవార్డుల లక్ష్యం. ముఖ్యంగా 4 రంగాల్లో అద్భుత పనితీరు కనబరిచిన వారికి ఈ అవార్డులు దక్కనున్నాయి:   1. *కాలుష్య నియంత్రణ చర్యలు*   2. *సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన*   3. *ఘన & ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ*   4. *సుస్థిర అభివృద్ధి ఉత్తమ పద్ధతులు* *9 కేటగిరీల్లో పోటీ:*   టీజీపీస...

*భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*

Image
*"చెట్టు పేరుతో కోట్ల దోపిడీ.. అడవి తల్లిని అమ్ముకుంటున్న అధికారులు!"*   *భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, డీఆర్వో కృష్ణయ్య రూ.3.5 లక్షల లంచంతో రెడ్‌హ్యాండెడ్*   *"కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు" - కాంట్రాక్టర్‌తో బేరం*   *అటవీ శాఖలో అవినీతి కుళ్ళు - ఏసీబీ దెబ్బకు బట్టబయలు* *భద్రాద్రి కొత్తగూడెం:* అడవులను కాపాడాల్సిన అటవీ శాఖ అధికారులే అడవి తల్లిని అమ్ముకుంటున్నారు. చెట్లు నరికితే కేసులు పెట్టాల్సిన వాళ్లే, లంచం కోసం కేసులు ఎత్తేస్తున్నారు. భద్రాచలంలో ఏసీబీ దాడులతో అటవీ శాఖలో పేరుకుపోయిన అవినీతి కంపు మరోసారి బయటపడింది. *అసలు ఏం జరిగింది?*   చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో బీటీ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. పనుల్లో భాగంగా పొరపాటున కొన్ని చెట్లకు నష్టం జరిగింది. ఇదే అదనుగా భావించిన భద్రాచలం ఎఫ్‌డీవో సుజాత, కేసు నమోదు చేయకుండా ఉండేందుకు కాంట్రాక్టర్‌తో బేరానికి దిగింది. *"10 లక్షలు ఇస్తే సెటిల్ చేస్తా" - ఎఫ్‌డీవో బెదిరింపు*   చెట్లు దెబ్బతిన్నాయనే సాకుతో ఎఫ్‌డీవో సుజాత ఏకంగా రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.3.5 లక్షలకు బేరం కుదిరింది. గు...

*"కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు - ప్రశ్నించిన బండి సంజయ్"* *"వ్యక్తిగత దూషణలకు దిగిన కౌశిక్ రెడ్డి - ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు"*

Image
*"కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు - ప్రశ్నించిన బండి సంజయ్"*   *"వ్యక్తిగత దూషణలకు దిగిన కౌశిక్ రెడ్డి - ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు"*   *"ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత - పోలీసుల అదుపు"* *"గూఢచారి" పొలిటికల్ బ్యూరో*   *కరీంనగర్, తేదీ: 07-05-2026 *కరీంనగర్:* రాష్ట్ర రాజకీయాల్లో డ్రగ్స్ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, దమ్ముంటే డ్రగ్ టెస్టుకు రావాలని కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజా జీవితంలో ఉన్నవారు వివాదాలకు అతీతంగా ఉండాలని, అనుమానాలు వస్తే నిరూపించుకోవాలని బండి సంజయ్ సూచించారు. *కౌశిక్ రెడ్డి వ్యక్తిగత దూషణ:*   బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, స్థాయి మరచి వ్యక్తిగత దూషణలకు దిగారు. "బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నాడు, ఆయనే టెస్టుకు రావాలి" అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక కేంద్ర మంత్రిపై, ఎంపీపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడంపై బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. *కార్యకర్తల న...

దేవరకొండలో నూనె మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు

Image
  దేవరకొండలో నూనె మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు * అనుమతులు లేని మూడు సంస్థలపై చర్యలు.. ఆయిల్ నమూనాల సేకరణ దేవరకొండ, ప్రతినిధి: ప్రజారోగ్యంతో చెలగాటమాడే వ్యాపార సంస్థలపై నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ విభాగం కొరడా ఝళిపించింది. గురువారం దేవరకొండ పట్టణంలోని పలు నూనె విక్రయ కేంద్రాలు, మిల్లులలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు: బస్టాండ్ ప్రాంగణంలోని శివ గంగా ట్రేడర్స్, తిరునాల రోటరీ ఆయిల్ మిల్ మరియు నందిని సంస్థలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఉల్లంఘనలను గుర్తించారు: లైసెన్స్ లేని వ్యాపారం: కనీస ఫుడ్ లైసెన్స్ లేకుండానే సదరు సంస్థలు వ్యాపారం సాగిస్తున్నట్లు నిర్ధారించారు. లూజ్ ఆయిల్ విక్రయాలు: 15 లీటర్ల టిన్ల నుండి గానుగ యంత్రాల ద్వారా విడి నూనెలను (Loose Oils) విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నమూనాల సేకరణ: నాణ్యతపై అనుమానం రావడంతో మూడు రకాల ఆయిల్ నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. నిర్వాహకులకు హెచ్చరిక: ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి శివ శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. ...

నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు

Image
  నల్లగొండ కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆందోళన ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యంపై విమర్శలు గూఢచారి ప్రత్యేక వార్త నల్లగొండ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న ధాన్యం కొనుగోలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు జిల్లా కలెక్టరేట్ వద్ద వినతి పత్రం సమర్పించారు. బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు గోలి మధుసూధన్ రెడ్డి నేతృత్వంలో నాయకులు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్‌ను కలిసి రైతుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై కావాలనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తోందని విమర్శించారు. రైతుల వద్ద నిల్వ ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని, వెంటనే అన్ని కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు...

*"డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*

Image
*"డబ్బులు ఇవ్వలేదని సరెండర్ చేశారు - డీఎస్‌ఓపై సీఎస్‌కు డిప్యూటీ తహసీల్దార్ సంచలన ఫిర్యాదు"*   *"సెల్ రిపేర్‌లో ఉంది... ఫోన్ ఎత్తలేదనే నెపంతో వేటు: బాధితుడు మాచన రఘునందన్ ఆవేదన"* "గూఢచారి" క్రైమ్ బ్యూరో*   *నల్లగొండ:* "లంచం ఇవ్వలేదనే అకారణంగా సరెండర్ చేశారు" అంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి - డీఎస్‌ఓపై పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సంచలన ఆరోపణలు చేశారు. తన సరెండర్ ఉత్తర్వులు రద్దు చేసి యథావిధిగా విధుల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. *ఫిర్యాదులో ఏముంది?*   "నా సెల్ ఫోన్ రిపేర్‌లో ఉండటంతో గత నెల 21న డీఎస్‌ఓ ఫోన్ చేస్తే మాట్లాడలేకపోయాను. కానీ 22న నాకు మెమో ఇచ్చారు. నేను మునుగోడు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో విధుల్లో ఉన్నానని వివరణ ఇచ్చాను. అయినప్పటికీ 30న ఆకస్మికంగా నన్ను సరెండర్ చేశారు" అని రఘునందన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. *"చాలాసార్లు డబ్బులు అడిగారు"*   "డీఎస్‌ఓ చాలాసార్లు నన్ను డబ్బులు అడిగారు. నేను ఇవ్వలేనని చెప్పా...

హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Image
 హైడ్రా ప్రజావాణికి 4 వారాల విరామం పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు హైదరాబాద్: ప్రజావాణి కార్యక్రమానికి తాత్కాలికంగా 4 వారాల విరామాన్ని ప్రకటించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇటీవల భారీగా వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వేలాదిగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను క్లియర్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యమని, ఈ విరామ కాలంలో వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. అయితే అత్యవసర సమస్యలతో ఉన్న ఫిర్యాదుదారులు కార్యాలయానికి నేరుగా వచ్చి కమిషనర్‌ను కలుసుకోవచ్చని సూచించారు. అలాగే ముఖ్యమైన అంశాలపై నేరుగా ఫిర్యాదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి

Image
 హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు ఆమోదం కోరిన సీఎం రేవంత్ రెడ్డి – కేంద్ర భాగస్వామ్యం కోరుతూ విజ్ఞప్తి 📍 న్యూ ఢిల్లీ | తేదీ: 06-05-2026, గూఢచారి:  తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం న్యూ ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కలుసుకుని హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్–2 ప్రాజెక్టుకు తక్షణ ఆమోదం ఇవ్వాలని కోరారు. ఫేజ్–2కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని సీఎం తెలిపారు. ఈ దశలో మొత్తం 7 కారిడార్లతో 122.9 కిలోమీటర్ల పొడవున మెట్రో నిర్మాణం చేపట్టనున్నట్లు, దానికి సుమారు ₹38,595 కోట్ల వ్యయం అవుతుందని వివరించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కావాలంటే కేంద్రం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్‌గా భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు పెరుగుతున్నాయని, మెట్రో నెట్‌వర్క్ విస్తరణ అత్యవసరమని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే ఫేజ్–1 ప్రాజెక్టును ఎల్ & టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేస...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల భూమిపై అటవీ శాఖ హక్కు – సుప్రీంకోర్టు తుది తీర్పు

Image
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 600 ఎకరాల భూమిపై అటవీ శాఖ హక్కు – సుప్రీంకోర్టు తుది తీర్పు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వివాదాస్పదంగా ఉన్న సుమారు 600 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందుతుందని భారత సుప్రీంకోర్టు తుది తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసు కరకగూడెం మండలంలోని కల్వల నాగారం గ్రామం సర్వే నంబర్ 81లో ఉన్న భూమికి సంబంధించినది. ఈ భూమిని రిజర్వ్ ఫారెస్ట్‌లో చేర్చేందుకు ప్రభుత్వం 1950 ఫిబ్రవరి 6న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిటిషనర్లు ఈ భూమి తమకు నిజాం కాలంలో (1931–33 ఫస్లీ) మంజూరు అయిందని వాదిస్తూ, అటవీ పరిమితుల నుంచి మినహాయింపు కోరారు. అయితే, తమ యాజమాన్యాన్ని నిరూపించే సరైన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. దీనితో, ఖమ్మం జాయింట్ కలెక్టర్ 2003 మే 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ భూమి అధికారిక రికార్డుల్లో “అటవీ భూమి”గా నమోదు అయిందని పేర్కొంటూ వారి అభ్యర్థనను తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్లు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సింగిల్ జడ్జి పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, తరువాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును రద్దు చేస్తూ ప్రభుత్వ వాదనను సమర్థించింది. దీనిపై పిటిషనర్లు స...

అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్

Image
 అవినీతి బారిన నిజామాబాద్‌లో ఎస్ఐ … ఏసీబీ వలలో పట్టుబడి అరెస్ట్ గూఢచారి ప్రత్యేకం | తేదీ: 06-05-2026 నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ చితన్నోజు భాస్కర చారి ఏసీబీకి చిక్కారు. అధికారిక విధుల్లో సహాయం చేస్తానని చెప్పి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఫిర్యాదుదారుడి సోదరుడి కుమారుడిని క్రిమినల్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ, ఫిర్యాదుదారుడి అభ్యర్థనపై రూ.7,000కి తగ్గించారు. ఈ మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలోనే ఏసీబీ అధికారులు బోధన్ పోలీస్ స్టేషన్‌లో దాడి చేసి పట్టుకున్నారు. ఎస్ఐ వద్ద నుంచి రూ.7,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రత కారణాల రీత్యా గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవినీతి ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగిన పక్షంలో ప్రజలు వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచ...

వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో

Image
🚨 వెల్జల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలలో రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జల్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎం. శరత్ కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ➡️ ఫిర్యాదుదారుని పని కోసం మొదట రూ.30,000 లంచం డిమాండ్ చేయగా, చర్చల తర్వాత రూ.20,000కు తగ్గించి తీసుకున్నట్లు సమాచారం. ➡️ సైట్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం, “నో డ్యూ సర్టిఫికేట్” మరియు “ప్రాపర్టీ వాల్యుయేషన్ సర్టిఫికేట్” జారీ చేయడానికి లంచం తీసుకున్నాడు. 💰 అధికారులు ఆయన వద్ద నుంచి రూ.20,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ⚖️ నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 📢 లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులపై ఫిర్యాదు చేయండి: 📞 టోల్ ఫ్రీ: 1064 🔐 ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

బెంగాల్ ఆడబిడ్డల ఘన విజయం: అణచివేతపై ప్రజాస్వామ్య సమరం!

Image
  బెంగాల్ ఆడబిడ్డల ఘన విజయం: అణచివేతపై ప్రజాస్వామ్య సమరం! గూఢచారి: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయం లిఖించబడింది. సామాన్య మహిళలు, బాధితులుగా మిగిలిపోకుండా, ప్రజాస్వామ్య ఆయుధంతో అన్యాయంపై పోరాడి చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. అధికార మదం, అరాచకాలు మరియు వేధింపులకు వ్యతిరేకంగా బెంగాల్ ఆడబిడ్డలు అందించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఎన్నికల గెలుపు మాత్రమే కాదు, సామాన్యుడి ఆత్మగౌరవ విజయం. ఈ విజయం వెనుక ఉన్న ముగ్గురు మహిళల స్ఫూర్తిదాయక కథనాలు ఇవి: 1. రేఖా పాత్ర: సందేశ్‌ఖాలీ బాధితురాలి నుండి ప్రజాప్రతినిధి వరకు సందేశ్‌ఖాలీలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘోరానికి బలై, టీఎంసీ (TMC) గూండాల చేతిలో నరకం చూసిన బాధితురాలిగా రేఖా పాత్ర నిలిచారు. కానీ, ఆమె భయపడి వెనకడుగు వేయలేదు. అదే టీఎంసీ అభ్యర్థిపై ఎన్నికల బరిలో నిలిచి, 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బాధితురాలిగా ఉన్న ఆమె, ఇప్పుడు బాధితుల గొంతుకగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఇది అన్యాయంపై బాధితులు సాధించిన నిఖార్సైన గెలుపు. 2. రత్న దేబ్‌నాథ్: ...

నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు సిద్ధం – అభివృద్ధి దిశగా మే 10 కీలక అడుగు

Image
  నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు సిద్ధం – అభివృద్ధి దిశగా మే 10 కీలక అడుగు హైదరాబాద్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 10న తెలంగాణలో పర్యటించనుండటం రాష్ట్రానికి శుభ సూచకంగా మారింది. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలి తెలంగాణ పర్యటన కావడంతో అభివృద్ధి ఆశలు మరింత పెరిగాయి. ఈ పర్యటనలో భాగంగా రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగాలకు కొత్త ఊపిరి పోసేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ సిటీ ప్రారంభం తెలంగాణ పరిశ్రమల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఆటోమొబైల్, తయారీ రంగాలు వేగంగా విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి G. Kishan Reddy వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉందని ఈ పర్యటన స్పష్టంగా తెలియజేస్తోంది. గత పదేళ్లలో జాతీయ రహదారులు, రైల్వేలు, మౌలిక వ...

*"చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల సమస్య - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ"*

Image
  *"చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల సమస్య - సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ"*  *"రూ.430 కోట్లతో కొత్త టర్మినల్... కానీ రోడ్లు లేక రాకపోకలకు అంతరాయం"* "గూఢచారి" *తేదీ: 04-05-2026* *హైదరాబాద్:* నగరంలో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లకు అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ సౌకర్యాల కోసం అవసరమైన భూమి కేటాయించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. *లేఖలోని కీలక అంశాలు:* * చర్లపల్లి టర్మినల్‌కు రోడ్డు కష్టాలు:*  హైదరాబాద్‌లోని కాచిగూడ, సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే టెర్మినళ్లపై భారం తగ్గించేందుకు నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.430 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త రైల్వే టర్మినల్‌ను అభివృద్ధి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 6 జనవరి 2025న దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కొత్త టర్మినల్ ప్రారంభం తర్వాత రోజుకు కొన్ని పదుల సంఖ్యలో రైళ్లు చర్లపల్లి నుంచి సేవలు అందిస్తున...