Posts

జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ

Image
 జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు - టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ   పోలీసులు సంయమనం పాటించాలి! పండుగనాడు భయభ్రాంతులకు గురి చేయడం తగదు! తక్షణమే బేషరతుగా విడుదల చేయాలి! టీయూడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్ సంగారెడ్డి:   ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు చారి, సుధీర్‌లను పోలీసులు అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ టీయూడబ్ల్యూజే(ఐజేయు) తీవ్రంగా ఖండిస్తోందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ పేర్కొన్నారు.విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను నేరస్తుల మాదిరిగా అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేయడం పత్రికా స్వేచ్ఛను నొక్కివేయడమే అని వారు అన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధ మని పేర్కొన్నారు. జర్నలిస్టులపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రభుత్వానికి, పోలీసు యంత్రాంగానికి తగదు. అని అన్నారు.ఏదైనా అంశంపై వివరణ కోరాల్సి ఉంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో నోటీసులు ఇవ్వాలి తప్ప, ...

గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.

Image
  గూఢచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త.    హైద్రాబాద్, 13, జనవరి: గూడచారి, భూపతి టైమ్స్, పబ్లిక్ టివి ల 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను నాగోల్ లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు తాజా వార్తలను భూపతి టైమ్స్, గూఢచారి అందిస్తున్నాయని అన్నారు. ఆవిష్కరణ లో ఎడిటర్ భూపతి రాజు ఉన్నారు. పత్రికల అభివృద్ధి కి సహాయ సహకారాలు అందిస్తున్న ఉప్పల శ్రీనివాస్ కు ఎడిటర్ భూపతి రాజు కృతఙ్ఞతలు తెలిపారు.

దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత

Image
 దివంగత మాజీ సిఎం రోషయ్య సతీమణి శివ లక్ష్మి (86)కన్నుమూత, అనారోగ్యం తో అమీర్పేట్ లోని స్వగృహం లో కన్ను మూసారు

జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC

Image
 జనవరి 12 & 13 రోజుల్లో ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్న GHMC  హైదరాబాద్, జనవరి 11, 2026: స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) జనవరి 12 మరియు 13 తేదీలలో నగరం అంతటా మెగా ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుందని GHMC కమిషనర్ R.V. కర్ణన్ శనివారం ప్రకటించారు. సురక్షితమైన ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించడం మరియు నివాస ప్రాంతాలు, వాణిజ్య సంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల నుండి ఈ-వ్యర్థాలను శాస్త్రీయంగా సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం ఈ ప్రత్యేక డ్రైవ్ లక్ష్యం. ఈ డ్రైవ్ సమయంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, టెలివిజన్లు, బ్యాటరీలు, యుపిఎస్ సిస్టమ్లు మరియు పవర్ బ్యాంకులు వంటి అనేక రకాల విస్మరించబడిన ఎలక్ట్రానిక్ వస్తువులను సేకరిస్తారు. బాధ్యతాయుతమైన ఈ-వ్యర్థాల తొలగింపు యొక్క ప్రాముఖ్యతపై పౌరులకు అవగాహన కల్పించడానికి పారిశుధ్య సిబ్బంది, నివాసి సంక్షేమ సంఘాలు (RWAs), NGOలు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలతో కూడిన అవగాహన ప్రచారాలను GHMC ఇప్పటికే ప్రారంభించింది. ప్రజల ...

జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం-పొంగులేటి

Image
  *జ‌ర్న‌లిజానికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టుల‌కు అండ‌గా ఉంటాం* *అక్రిడిటేష‌న్ కార్డులు త‌గ్గుతాయ‌నే ప్ర‌చారం వాస్త‌వం కాదు* *గ‌తంలో కంటే ఎక్కువ‌గానే  అక్రిడిటేష‌న్ల మంజూరు*  *ఏకార్డుకైనా అన్ని ప్ర‌యోజ‌నాలు వ‌ర్తిస్తాయి* *జ‌ర్న‌లిస్టు సంఘాల సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాం* *జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తాం* *జ‌ర్న‌లిస్టుల ఇండ్ల స్ధ‌లాల కోసం కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తాం* *14 జ‌ర్న‌లిస్టు సంఘాల‌తో స‌మావేశం నిర్వ‌హించిన* ... *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి* *హైద‌రాబాద్‌*:- జర్న‌లిజం గౌర‌వాన్ని నిల‌బెట్టి ఆ వృత్తికి వ‌న్నెతెచ్చే జ‌ర్న‌లిస్టులంద‌రికీ గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌దండ‌గా ఉంటుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార‌, పౌర‌సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఏ ఒక్క‌రి గౌర‌వాన్ని త‌గ్గించాల‌ని గాని, చిన్న‌బుచ్చాల‌నిగాని త‌మ‌  ప్ర‌భుత్వ ఉద్దేశ్యం కాద‌ని స్ప‌ష్టం చేశారు.       జీవో 252 ప...

*ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు*

Image
  *ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి రాజగోపాల్ ను కలసిన, టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) నేతలు* - జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశాన్ని జిల్లా అధ్యక్షులు సంతోష్ చక్రవర్తి ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఖమ్మం, జనవరి 09: ఖమ్మం జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపుల అంశంలో నెలకొన్న అనిశ్చితిపై న్యాయ సహకారం అందించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్  (టిడబ్ల్యూజేఎఫ్- హెచ్-2843) జిల్లా కమిటీ బృందం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి.రాజగోపాల్‌ ను ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రాబోయే సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి జి. రాజగోపాల్ కు ముందస్తు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ భేటీలో జిల్లా అధ్యక్షులు టి. సంతోష్ చక్రవర్తి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మంజూరైన ఇండ్ల స్థలాల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తున్నాయని జడ్జి దృష్టికి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో న్యాయ నిపుణులు జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంపై చేసిన సూచనలు, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఉ...

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Image
  ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి గూఢచారి, సూర్యాపేట, 9 జనవరి :  09.01.2026న, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి (ఎం)లోని గనుగబండ (వి) గ్రామ పంచాయతీకి చెందిన పంచాయతీ కార్యదర్శి ఎఓ బర్పాటి కృష్ణ, ఫిర్యాదుదారుని నుండి అధికారిక సహాయం కోసం అంటే "ఫిర్యాదిదారుని కొత్తగా నిర్మించిన ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి" రూ. 6,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు నల్గొండ రేంజ్ యూనిట్ ఎసిబికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. లంచం మొత్తాన్ని ఎఓ వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు.  అందువల్ల, AO ని అరెస్టు చేసి, హైదరాబాద్‌లోని నాంపల్లిలోని SPE మరియు ACB కేసుల కోర్టు గౌరవనీయులైన Ist Addl. ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నారు . కేసు విచారణలో ఉంది.