మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా హైద్రాబాద్: ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పది సంవత్సరాల నుండి చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా అరాచకంగా ఆ స్థానంలో ఉంటూ ఇటీవల కోర్టు తీర్పును సైతం ధిక్కరించి ఇప్పటికీ నేనే అధ్యక్షుడుని అని చింతల్ బస్తీలోని కార్యాలయంలో జాతీయ జెండా ని ఎగురవేయడానికి సిద్ధమైన అమరవాది లక్ష్మీ నారాయణ. ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ నిరసనలతో జెండా ఆవిష్కరించకుండా పక్కకు తప్పుకున్న అమరవాది లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఆర్యవైశ్య మహాసభ ప్రక్షలన కమిటీ ఆధ్వర్యంలో అమరావతి వెంటనే ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పులు అమలు పరచాలని కోరుతూ నిరసన తెలపడంతో అమరవాది జాతీయ జండా ఆవిష్కరించకుండా తప్పుకున్నారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ గణేష్ గుప్తా జెండా ఆవిష్కరించారు. ఈరోజు ఉదయం ప్రక్షణల కమిటీ ఆధ్వర్యంలో అమరవాది దిగిపోవాలి, కోర్టు తీర్పును వెంటనే అమలు పరచి ఎన్నికలు పెట్టాలని అమరవాది అధ్యక్షుడు కాదని నిరసనలు తెలపడంతో...
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా? తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కుల బాంధవుల శ్రేయస్సు, పేద వైశ్యుల అభ్యున్నతే లక్ష్యంగా సాగాల్సిన మహాసభ.. ఇప్పుడు కొన్ని జిల్లాలకే పరిమితమైన “పక్షపాత మహాసభ”గా మారుతోందా అనే అనుమానాలు సగటు ఆర్యవైశ్యుడి మెదడును తొలిచేస్తున్నాయి. ముఖ్యంగా గత 12 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉత్తర తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న చర్చ.. ఇప్పుడు మహాసభ పునాదులను కదిలిస్తోంది. మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, కేవలం తూతూమంత్రంగా జనగాం నుండి మహిళా విభాగంలో ఒకరికి స్థానం కల్పించి చేతులు దులుపుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, అసలు సిసలైన సింహభాగం పదవులన్నీ దక్షిణ తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలకు, కొద్దిమంది ప్రభావశీలురకే కట్టబెడుతున్నారనేది బహిరంగ రహస్యం. కొత్త సీసాలో పాత సారా: ఒకరికే అన్ని పదవులా? ఇటీవల కొండ్రే మల్లికార్జున్ ని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సంఘంలో అ...
ఏసీబీ నెట్లో పంచాయతీ సెక్రటరీ, మధుర నగర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ జిల్లా 10-10-2025న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం, మధుర నగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి AO శ్రీ M. అనిల్, ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కోసం ఫిర్యాదుదారుడి ఫైల్ను ప్రాసెస్ చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ. 10,000/- లంచం డిమాండ్ చేసి స్వీకరించినప్పుడు తెలంగాణ ACB, కరీంనగర్ యూనిట్ వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు తన ప్రజా విధిని అక్రమంగా మరియు నిజాయితీగా నిర్వర్తించాడు. అతని తరపున లంచం మొత్తాన్ని తిరిగి పొందారు. ఏఓ శ్రీ ఎం. అనిల్, పంచాయతీ కార్యదర్శి, మధుర నగర్ గ్రామం, గంగాధర మండలం, కరీంనగర్ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు పంపుతున్నారు. కేసు విచారణలో ఉంది. ******************************************* ACB నెట్లో సబ్-ఇంజనీర్, TGSPDCL, లాలాగూడ విభాగం, సికింద్రాబాద్ 10-10-2025న సికింద్రాబాద్లోని లాలాగూడ సెక్షన్, TGSPDCL, పద్మారావు నగర్ సబ్-డివిజన్, సబ్-ఇంజనీర్ 1/c అసిస్టెంట్ ఇంజనీర్, AO భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి, తెలంగాణ ACB, సిటీ రేంజ్ యూనిట్-2 చేత రెడ్ హ్యాండెడ్...
Comments
Post a Comment