Skip to main content

వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం - ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి


 

నల్గొండ వైద్య కళాశాల లో రోగులకు వైద్య సేవలు అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఆర్&బి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం ప్రభుత్వ ఆసుపత్రి లో క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి భూమి పూజ చేసిన అనంతరం మెడికల్ కళాశాలలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిం డెంట్,విద్యుత్ శాఖ అధికారులతో వైద్య కళాశాలలో సౌకర్యాలు,సమస్యల పై

 సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణం పనులపై సమీక్షించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మెడికల్ కళాశాలకు కావలసిన వైద్య పరికరాలు,మౌలిక సదుపాయాలు ఫిబ్రవరి నెలాఖరు లోగా ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు . మెడికల్ కళాశాలలో ఈ లైబ్రరీ కోసం 40 కంప్యూటర్లు తన సొంత నిధులతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. డెల్ కంప్యూటర్స్ ఏర్పాటుకు నిధులు చెల్లించి వారంరోజుల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నట్టు, అదే విధంగా సర్జరీ చేసిన తర్వాత స్టర్లిలైజ్ చేసే

ఆటో క్లేవ్,బ్లడ్ బ్యాంక్ అభివృద్ది కి తన స్వంత నిధులు మంజూరు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.మెడికల్ కళాశాల కు ల్యాప్రో స్కోపిక్ మెషిన్,ఇతర

సంబంధించిన సమస్యలపై వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్,టి.ఎస్.ఎం.ఎస్. ఐ డి.సి.,ఎండి అర్.వి.కర్ణన్ తో ఫోన్ లో మాట్లాడి అప్పటికప్పుడే సమస్యలు పరిష్కారం కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో వైద్య కళాశాలలో కరెంటు కోతలు లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నల్గొండ నియోజక వర్గం లో కూడా కరెంటు సమస్య లేకుండా నిధులు మంజూరు చేయనున్నట్లు అందుకు కావాల్సిన పనులు ప్రారంభించాలని ఆదేశించారు.మెడికల్ కళాశాల లో

తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులను గుర్తించి తనకు వారి వివరాలు అందించాలని, అటువంటి వారికి తాను ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు.

 ఈ సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజకుమారి,వైస్ ప్రిన్సిపాల్ డా. నిత్యానంద,

 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, ఆసుపత్రి సూపరిoటెండెంట్ డా. లచ్చు, ఎస్పీడీసీఎల్ ఎస్ .ఈ.

చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్