రాష్ట్ర డిజిపి కార్యాలయంలో ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు



 రాష్ట్ర డిజిపి కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపి కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. డిజిపి రవిగుప్త, అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐ జి పీ లు స్టీఫెన్ రవీంద్ర, ఎం. రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు.


ఇంటెలిజెన్స్ కార్యాలయంలో....

ప్రభుత్వ సూచనల మేరకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ఇంటెలిజెన్స్ శాఖ కార్యాలయంలోనూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, ఓఎస్డీ శివకుమార్, ఎస్పీలు శ్రీధర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్