Skip to main content

ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం - కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే


 



ప్రపంచంలో దేశాన్ని అగ్రస్థానంలో నిలపడం ప్రధాని మోదీ లక్ష్యం


అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి కి కృషి


వికసిత్ భారత్ తో ప్రతి గ్రామానికి కేంద్ర పథకాలు


కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే


పులిచర్లలో పర్యటన


జనవరి,19 : భారత దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ది చెందిన దేశంగా నిలబెట్టడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్ష్యం అని కేంద్ర భారీ పరశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే పేర్కొన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అదనపు కలెక్టరు హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందించడం వికసిత్ భారత్ లక్ష్యం అని తెలిపారు. దేశంలో 2.7 లక్షల గ్రామాలలో వికసిత భారత్ వెళ్తుంది అని చెప్పారు. మోడీ హయాంలో తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1000 కోట్ల ఖర్చుతో అఖిల భారత వైద్య విద్య సంస్థ( ఏయిమ్స్) నిర్మించింది అని తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారులు 2500 కిలోమీటరు నుంచి 5000 కిలోమీటర్లు, రైల్వే లైన్లు రెట్టింపు చేసినట్లు వెల్లడించారు. ప్రతి పేద మహిళకు ఉచితంగా ఉజ్జ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చి మహిళల కష్టాలు తొలగించినట్లు పేర్కొన్నారు. 


దేశ వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు లక్షాది కారుల్ని చేయడం ప్రధాని మోదీ లక్ష్యంగా ప్రకటించారన్నారు. అయుష్మాన్ భారత్ కింద పేదలందరికీ రూ. 5 లక్షల వరకు ఉచింతంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. 


కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పథకాల లబ్ది దారులతో ఆయన నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అంతకు ముందు వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. 



వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా ప్రచురించిన కరపత్రాలు, 2024 క్యాలెండర్ ఆవిష్కరుంచారు. పులిచర్ల గ్రామం నుంచి ఎదిగి రగ్బి క్రీడలో జాతీయ స్థాయికి ఎదిగిన షా మినిని ఆయన సత్కరించారు. 


కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజీఎం ప్రశాంత్ కుమార్ బరియార్, రీజనల్ మేనేజర్ అలీముద్దిన్, జిల్లా బ్యాంకు నోడల్ అధికారి శ్రామిక్, నాబార్డు జిల్లా మేనేజర్ వినయ్ కుమార్, ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి కోటేశ్వర్ రావు, డీఆర్డిఓ కాళిదిని, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కొండల రావు , అర్ డీ వో చెన్నయ్య, ఐసీడీఎస్ పీడీ కృష్ణ వేణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్