Skip to main content

సీఎం అభీష్టం మేరకే జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సోసైటీ కమిటీ రద్దు


 నిజాంపేట సొసైటీ కార్యాలయానికి నోటీసు అంటించిన సహకార శాఖ అధికారులు శ్రీమతి రమాదేవి , వెంకటరెడ్డి ల దృశ్యం


సీఎం అభీష్టం మేరకే జెఎన్‌జే కమిటీ రద్దు

ఫిబ్రవరి 4న అడ్‌హక్‌ బోర్డు ఎన్నిక

నోటీస్‌ జారీ చేసిన సహకార శాఖ

హైదరాబాద్‌, జనవరి 20 - జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్ట్‌ హౌజింగ్‌ సోసైటీ డైరెక్టర్‌ పోస్టులకు ఎన్నికలు నిర్వహించేందుకు అడ్‌హక్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సహకార శాఖ నిర్ణయించింది. ఈమేరకు జిల్లా సహకార అధికారి(రిజిస్ట్రార్‌) డి.రమాదేవి శనివారం నోటీసు జారీ చేశారు. రమాదేవితో పాటు డిఫ్యూటీ రిజిస్ట్రార్‌ వెంకట్‌రెడ్డి... నిజాంపేట్‌లోని జేఎన్‌జే కార్యాలయానికి వెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే నోటీసు జారీ చేశారు. 2024 ఫిబ్రవరి 4న జేఎన్‌జే సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు రమాదేవి నోటీసులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 4న ఉదయం 11.30 గంటలకు నిజాంపేట్‌లోని జేఎన్‌జే స్థలంలోనే సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అడ్‌హక్‌ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. ఈ సమావేశానికి సహకార శాఖ డిఫ్యూటీ రిజిస్ట్రార్‌ సికింద్రాబాద్‌ను కన్వీనర్‌ గా వ్యవహరిస్తారు. ఈ బోర్డు జేఎన్‌జే మ్యాక్‌ హౌజింగ్‌ సోసైటీకి 5 డైరెక్టర్‌ పోస్టులకు ఎన్నికలు నిర్వహిస్తుంది. నెలరోజుల్లోగా ఎన్నిక ప్రక్రియను ఈ బోర్డు పూర్తి చేయాల్సి ఉంటుంది. 


జేఎన్‌జే స్వయం ప్రకటిత కమిటీని రద్దు చేసుకుని తన వద్దకు వస్తే పేట్‌బషీరాబాద్‌ లోని 38 ఎకరాల భూమి స్వాధీనం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. టీంజేఎన్‌జే ఈ మేరకు పోరాటం చేసి విజయం సాధించింది. 2023 డిసెంబర్‌ 21న రవీంద్రభారతిలో జరిగిన జేఎన్‌జే సమావేశం స్ఫూర్తి ఎన్నికలకు దోహదం చేసింది. 


సీఎంకు టీమ్‌జేఎన్‌జే కృతజ‍్ఞతలు

ఎంతోకాలంగా జేఎన్‌జే హౌజింగ్‌ సోసైటీకి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని టీంజేఎన్‌జే చేసిన పోరాటానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి టీంజేఎన్‌జే కృతజ్ఞతలు తెలిపింది. టీం జేఎన్‌జే గత కొన్నేళ్లుగా స్వయం ప్రకటిత కమిటీని రద్దు చేయాలని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాల ఇళ్ల స్థలాలను అప్పగించాలని ఆనాటి ప్రతిపక‌్ష పార్టీ అధినేత, ఈనాటి సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నోసార్లు కలిసి విన్నవించింది. టీంజేఎన్‌జే పోరాట ఫలితంగా స్వయం ప్రకటిత సోసైటీ మేనేజింగ్‌ కమిటీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సభ్యలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అడ్‌హక్‌ బోర్డును ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల జేఎన్‌జే వ్యవస్థాపక సభ్యులు పి.వి.రమణారావు సంతోషం వ్యక్తం చేశారు. సభ్యులంతా ఫిబ్రవరి 4న జరిగే సర్వసభ్య సమావేశంలో తప్పనిసరిగా పాల్గొని బోర్డు ఎంపికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

......................................................

photo wrightups

1.అధికారులు జారీ చేసిన నోటీస్

2...................................

Comments

Popular posts from this blog

టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!

 టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ సస్పెండ్!  నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖలో పలు అవినీతి అక్రమాలు జరిపినట్లు ఆరోపణ. సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేసిన వ్యవసాయ శాఖ కమిషనర్. NFSM స్కీమ్ కు సంభందించి 11,90,651-00 రూపాయల చెల్లింపులకు సంభందించి రికార్డులు నిర్వహించలేదని, రికార్డులు అప్పగించ లేదని సస్పెన్షన్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై గుట్టు చప్పుడు కాకుండా సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు. నిన్న ఉదయం జిల్లా వ్యవసాయ శాఖకు అందిన సస్పెండెన్స్ ఉత్తర్వులు. ఇంకా యూనియన్ ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఒకే సెక్షన్ లో దాదాపు 8 సంవత్సరముల నుండి ఈ కార్యాలయం లో భాద్యతలు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి సంభందించిన రికార్డులు క్యాష్ బుక్ లు, లెడ్జెర్ లు పరిశీలిస్తే ఎన్నో కుంభకోణాలు బయట పడుతాయని పలువురు ఆ శాఖ ఉద్యోగులు గుస గుస లాడుతున్నారు.

ఇద్దరు విద్యుత్ డీఈలకు ఛార్జి మెమోలు

  ఇద్దరు విద్యుత్ డీఈల పై చర్యలు గచ్చిబౌలి, మిర్యాలగూడ డీఈలు  లకు ఛార్జి మెమోలు ఎల్ సీలు తీసుకోవడం, నిరంతర సరఫరాలో గచ్చిబౌలి  డీఈ నిర్లక్ష్యం చేశారని ప్రధాన కార్యాలయానికి బదిలీ. వ్యవసాయ విద్యుత్ సరఫరా విషయంలో  మిర్యాలగూడ డీఈ నిర్లక్ష్యం   ఐటీ పరిశ్రమలకు కేంద్రమైన గచ్చిబౌలి  దీర్ఘ కాలంగా కొనసాగుతున్న డీఈ ఆయన పై ఫిర్యాదులు వెల్లువ దక్షిణ డిస్కం సిఎండి కఠిన చర్యలు. వారి ఇచ్చే  సమాధానాలు పరిశీలించిన తరువాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని  cmd తెలిపారు.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పాట - మాట ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి పై

 పాట మాట ఈ క్రింద టచ్ చేసి ఆడియో వినండి 1వ ఆడియో  పాట 2వ ఆడియో  అర్దం శ్రీనివాస్ ది 3వ ఆడియో మునగాల కాంతారావు ది ఈ విషయం పై మీ అభిప్రాయాలు మాట పూర్వకంగా లేదా వ్రాత పూర్వకంగా లేదా వీడియో అయిన 9848490545 కు పం పండి. నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు తెడ్ల జవహర్ బాబు అభిప్రాయం పసుమర్తి శ్రీనివాస్ అభిప్రాయం ఎలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం 🌎మాజీ ధర్మకర్త*.🙏.*9912876820*..🌱 అభిప్రాయం *శ్రీయుత గౌరవనీయులైన ఆర్యవైశ్య పెద్దలు మరియు ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నేను యలగందుల శ్రీధర్ రామప్ప దేవాలయం మాజీ ధర్మకర్త మీ అందరికీ తెలియపరచున్నది విషయం ఏమనగా గ్రేటర్ వరంగల్ మహానగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం గురించి*.... 1) *పట్టణ సంఘం ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు*.. 2) *మిగతా జిల్లాలలో మరియు మండలాలలో ఎన్నికలు నిర్వహించారు కానీ మన వరంగల్ మహానగరంలో ఉన్న పట్టణ ఆర్యవైశ్య సంఘానికి నాకు తెలిసినప్పటినుండి దాదాపు 15 సంవత్సరాలు నుండి ఎన్నికలు నిర్వహించడం లేదు* ..? 3) *పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఎన్నో లక్షల రూపాయలు కిరాయిలు మరియు ఎన్నో పరపతి సంఘం లు నడుస్తున్నాయి ఇంత పెద్ద సంఘానికి ఎన్